-
అప్రమత్తంగా ఉండాలి
పుట్టపర్తి టౌన్: అగ్ని విపత్తుల సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని అగ్ని మాపక అధికారి నాగరాజునాయక్ పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాల నివారణ వారోత్సవాల్లో భాగంగా గురువారం గుంతపల్లి వద్దున్న నిషా డిజైన్స్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికులకు అవగాహన కలిగించారు. డీఎఫ్ఓ నాగరాజునాయక్ మాట్లాడుతూ మీరు పనిచేస్తున్న ఫ్యాక్టరీల్లో ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, ప్రతి ఒక్కరూ అవగాహణ కలిగి ఉండాలన్నారు. అగ్ని ప్రమాదం జరిగినప్పు ఎలా కాపాడుకోవాలో డెమో ద్వారా వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే సకాలంలో సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది విజయకుమార్, నరసింహులు, రామాంజనేయులు, దేవలానాయక్, వెంకటరెడ్డి రామాంజనేయులు, దామోదర్, తేజేశ్వర్రెడ్డి, ఎస్ఎస్ నాయుడు పాల్గొన్నారు. సజావుగా ప్రీ పీహెచ్డీ పరీక్షలు అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ప్రీ పీహెచ్డీ గురువారం ప్రారంభమయ్యాయి. ఎస్కేయూ క్యాంపస్లోని పరీక్ష కేంద్రాలను వీసీ డాక్టర్ కె.హుస్సేన్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవీ లక్ష్మయ్య పర్యవేక్షించారు. పరీక్ష కేంద్రాల్లోని వసతులను ఆరా తీశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎ.కృష్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు. యువజన విభాగం ‘పురం’ అధ్యక్షుడిగా సల్మాన్ఖాన్పుట్టపర్తి అర్బన్: వైఎస్సార్సీపీ అనుబంధ యువజన విభాగం హిందూపురం నియోజకవర్గ అధ్యక్షునిగా సల్మాన్ఖాన్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు నవీన్నిశ్చల్ నియామక పత్రం అందజేశారు. తన మీద నమ్మకం ఉంచి అధ్యక్షునిగా ఎంపిక చేసినందుకు సల్మాన్ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడి పనిచేసి వైఎస్సార్సీపీ గెలుపునకు కృషి చేస్తానని చెప్పారు. -
‘తమ్ముళ్ల’ నిరుత్సాహం
సాక్షి, పుట్టపర్తి ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టంలోనే టీడీపీ కథ తేలిపోయింది. మాజీ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీతకు తొలిరోజే షాక్ తగిలింది. రాప్తాడు బరిలో ఉంటానని ముందుగానే ప్రకటించిన ప్రొఫెసర్ రాజేష్ స్వతంత్ర అభ్యర్థిగా తొలిరోజే నామినేషన్ దాఖలు చేశారు. ఆయన రాప్తాడు టీడీపీ టికెట్ ఆశించిన సంగతి తెలిసిందే. ఇక మరో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోడలు పల్లె సింధూరారెడ్డి గురువారం నామినేషన్ పత్రాలు సమర్పించగా, జనం కరువయ్యారు. జనంలేక..నానా హంగామా.. భారీ జనసమీకరణతో ఆర్భాటంగా నామినేషన్ వేయాలని భావించిన ‘పల్లె’ కుటుంబ సభ్యులకు కార్యకర్తలు ఝలక్ ఇచ్చారు. భోజన వసతి ఏర్పాటు చేసి.. మద్యం, డబ్బు ఎరగా వేసి ఆహ్వానించినా జనం పెద్దగా స్పందించలేదు. ఓడిపోయే వారి వెంట ఎందుకు నడవాలని కార్యకర్తలూ రాలేదు. దీన్ని కవర్ చేసుకునేందుకు తెలుగు ‘తమ్ముళ్లు’ మద్యం మత్తులో పుట్టపర్తి రోడ్ల వెంట ఓవరాక్షన్ చేస్తూ.. సామాన్యులను ఇబ్బందులకు గురి చేశారు. బైక్ల సైలెన్సర్లు తీసేసి పెద్దపెద్ద శబ్ధాలతో హడావిడి చేశారు. అనంతరం కొందరు తెలుగు తమ్ముళ్లు మద్యం మత్తులో పుట్టపర్తి ఎమ్మెల్యే కార్యాలయం ముందుకు వెళ్లి హంగామా చేశారు. ప్రచారం రథం ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. వెంటనే అర్బన్ సీఐ కొండారెడ్డి అక్కడకు చేరుకుని వారిని చెదరగొట్టారు. ‘పరిటాల’కు రెబల్స్ బెడద.. రాప్తాడు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పరిటాల సునీతను అధిష్టానం ఖరారు చేసింది. అయితే ధర్మవరం టికెట్ ఆశించి.. పొత్తులో భాగంగా బీజేపీకి ఇవ్వడంతో ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ రాప్తాడు నుంచి పోటీ చేస్తారని ప్రచారం చేస్తున్నారు. దీంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. రోజుకొకరిని అభ్యర్థిగా ప్రకటిస్తే.. పార్టీలో ఎక్కడా నాయకులే లేరా? పరిటాల కుటుంబానికే టికెట్ ఇవ్వాలా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాప్తాడు టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ ప్రొఫెసర్ రాజేష్.. తొలిరోజే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తల నుంచి స్పందన కరువు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా.. టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం రాలేదు. ఆయా నియోజకవర్గాల అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత కారణంగా కార్యకర్తలెవరూ పెద్దగా స్పందించడం లేదు. చాలా చోట్ల అభ్యర్థులను మార్చాలని అధిష్టానానికి విన్నవించినా.. చంద్రబాబు – నారా లోకేశ్ వినకుండా.. వారినే బరిలో దింపడాన్ని చాలామంది సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో టీడీపీలో కొందరు నాయకులు కొనసాగుతున్నా.. తమ అనుచరులందరినీ అధికార పార్టీ వైపు పంపిస్తున్నారు. హిందూపురం పార్లమెంటు వ్యాప్తంగా రోజుకు సగటున వంద పైగా కుటుంబాలు వైఎస్సార్సీపీ గూటికి చేరుకోవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. నామినేషన్ల తొలిరోజే వెలవెల పల్లె సింధూర నామినేషన్కు జనం కరువు ఫలించని మాజీ మంత్రి పరిటాల సునీత ప్లాన్ రాప్తాడు నుంచి ప్రొఫెసర్ రాజేష్ నామినేషన్ తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ కొత్తచెరువు: ‘పల్లె’ నామినేషన్ అనంతరం గురువారం సాయంత్రం మండలంలోని కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన కమ్మ, బోయ సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జయప్ప నాయుడు, బోయ రామాంజి పుట్టపర్తిలో జరిగిన ‘పల్లె’ సింధూర నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పార్టీలో తాము గొప్ప అంటే తాము గొప్ప అంటూ ఘర్షణ పడ్డారు. అనంతరం జయప్ప నాయుడు అక్కడినుంచి వెళ్లిపోయాడు. దీంతో రామాంజి పుట్టపర్తి, భైరాపురంలోని తన బంధువర్గాన్ని ఓ ఆటోలో తీసుకుని కమ్మవారిపల్లి వెళ్తున్నాడు. అయితే బండ్లపల్లి క్రాస్ సమీపంలో జయప్ప ఎదురుపడటంతో అతనిపై దాడికి దిగారు. వెంటనే అక్కడకు చేరుకున్న జయప్ప నాయుడు వర్గీయులు సైతం రామాంజి బంధువులపై దాడులు చేశారు. ఒకానొక దశలో ఆటోకు సైతం నిప్పుపెట్టాలని చూడగా... కొత్తచెరువుకు చెందిన ఓ టీడీపీనేత ఇరువర్గాలకు సర్దిచెప్పారు. ఈ ఘటనలో భైరాపురం గ్రామానికి చెందిన యువకులు గాయపడినట్లు తెలుస్తోంది. -
అన్ని రకాల మందులిస్తున్నారు
గతంతో పోలిస్తే ప్రభుత్వాస్పత్రులు ఎంతో మారాయి. గతంలో సరైన వైద్యం అందేది కాదు. మందులు దొరికేవి కావు. కానీ ఇప్పుడు అలా లేదు. నాకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో నాలుగు రోజులుగా హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నా. ఇక్కడ వైద్య సేవలు చాలా బాగున్నాయి. మందులు అందిస్తున్నారు. ప్రస్తుతం నా ఆరోగ్యం సైతం కుదుటపడింది. ప్రైవేటు ఆస్పత్రి చికిత్స చేయించుకుని ఉంటే రూ.వేలల్లో ఖర్చయ్యేది. ప్రభుత్వాస్పత్రిలోనే నాకు ఉచితంగా మెరుగైన వైద్యం అందింది. – నారాయణస్వామి, వీవర్స్కాలనీ, హిందూపురం -
వైభవంగా సీతారాముల రథోత్సవం
వజ్రకరూరు: శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని వజ్రకరూరు మండలం గూళ్యపాళ్యంలో గురువారం సాయంత్రం సీతారాముల రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఉదయం స్థానిక ధర్మప్ప దేవాలయంలో సీతారాముల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రత్యేకంగా అలంకరించిన రథంపై అధిష్టింపజేశారు. అనంతరం రథానికి పూజలు నిర్వహించి... జై శ్రీరామ్ అంటూ ఆలయం నుంచి గురుదేవా ఆశ్రమం వరకూ లాగారు. అనంతరం యథాస్థానానికి చేర్చారు.బైక్ అదుపుతప్పి.. ఒకరి మృతి పావగడ: అడవిపందుల గుంపు తగిలి బైక్ అదుపుతప్పి కిందపడటంతో పావగడ తాలూకా బెళ్లి బట్లు గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు, గ్రామ పంచాయతీ సభ్యుడు బోయ కృష్ణప్ప(40) మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. బోయ కృష్ణప్ప తన భార్య గుండమ్మతో కలిసి బుధవారం రాత్రి 9 గంటల సమయంలో బంధువుల ఊరు అచ్చమ్మనహళ్లికి బయల్దేరాడు. శైలాపురం – కోటగుడ్డ మధ్య మద్రేనహళ్లి అటవీ ప్రాంతంలో అడవిపందుల గుంపు రోడ్డుకు అడ్డంగా వచ్చి బైకును తోశాయి. అదుపుతప్పి కిందపడటంతో కృష్ణప్ప తలకు తీవ్రగాయమైంది. గ్రామస్తులు గమనించి వెంటనే ఆయన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. పరిస్థితి విషమించి కృష్ణప్ప మృతి చెందారు. ఇదే ప్రమాదంలో భార్య గుండమ్మ స్వల్ప గాయాలతో బయటపడింది. -
రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు ధర్మవరం బాలలు
ధర్మవరం అర్బన్: ఈ నెల 19 నుంచి 22 వరకు కృష్ణాజిల్లా నూజివీడులో జరిగే రాష్ట్రస్థాయి 9వ జూనియర్ బాస్కెట్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి అనంతపురం జిల్లా జట్లకు ధర్మవరం బాల బాలికలు ఎంపికయ్యారని ధర్మాంబ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు. బాలికల విభాగంలో నీఖ్య, సల్మా, కిరణ్మయి, బాలుర విభాగంలో తరుణ్ ఎంపికయ్యారని చెప్పారు. క్రీడాకారులను ధర్మాంబ బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మేడాపురం రామిరెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయ్తుల్లా, కోచ్ సంజయ్ తదితరులు అభినందించారు. వ్యక్తి అనుమానాస్పద మృతి హిందూపురం అర్బన్: తూమకుంట గ్రామానికి చెందిన నారాయణప్ప(42) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈయన రెండు రోజులుగా కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు తెలిసిన చోట్లల్లా వెదుకుతున్నారు. ఈ క్రమంలో గురువారం కర్ణాటక సరిహద్దున ఉన్న పెట్రోల్ బంక్ ఎదురుగా ఓ కాలువలో నారాయణప్ప మృతదేహం లభ్యమైంది. గౌరీబిదనూరు పోలీసులు కేసు నమోదు చేసి.. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నారాయణప్పకు భార్య గంగమ్మ, కుమారులు రోహిత్కుమార్, అఖిల్ ఉన్నారు. -
తిమ్మంపల్లిలో సూరీడు వర్ధంతి
యల్లనూరు: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, దివంగత కేతిరెడ్డి సూర్యప్రతాప్రెడ్డి వర్ధంతి సందర్భంగా గురువారం యల్లనూరు మండలం తిమ్మంపల్లిలోని ఆయన ఘాట్ వద్ద పలువురు ఘనంగా నివాళులర్పించారు. సూరీడు సతీమణి కళావతమ్మ, తాడిపత్రి, ధర్మవరం ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ప్రభుత్వ విద్య సలహాదారు ఆలూరి సాంబశివారెడ్డి, యువ నాయకులు హర్షవర్థన్రెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే సోదరుడు కృష్ణారెడ్డి, కుటుంబసభ్యులు హాజరయ్యారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు బొప్పే పల్లి రామాంజులరెడ్డి, సజ్జలదిన్నె రాజు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. -
అభ్యర్థుల ఖర్చులు నిశితంగా పరిశీలించాలి
● ఎన్నికల వ్యయ పరిశీలకులు వినాయక్ హిందూపురం: ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలన్నీ నిశితంగా పరిశీలించాలని హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు వినాయక్ అధికారులకు సూచించారు. గురువారం ఆయన హిందూపురం అసెంబ్లీ నియోజక నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల నియమ నిబంధన పరిశీలన కమిటీ, వ్యయ పరిశీలన కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. అభ్యర్థులు వ్యయాన్ని పక్కాగా లెక్కించడంతోపాటు, నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే విషయాలను నిశితంగా పరిశీలించి వాటికి సంబంధించిన రికార్డులు భద్రపర్చాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారికి నోటీసులు జారీచేయాలని సూచించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకూ అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. చింతపండు క్వింటా రూ.15 వేలు హిందూపురం అర్బన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో చింతపండు క్వింటా ధర గరిష్టంగా రూ.15 వేలు పలికింది. మార్కెట్కు గురువారం 2,107 క్వింటాళ్ల సరుకు రాగా, ఈ–నామ్ పద్ధతిలో వేలం వేసినట్లు మార్కెట్ కార్యదర్శి చంద్రమౌళి తెలిపారు. అందులో కరిపులి రకం క్వింటా గరిష్టంగా రూ.15 వేలు, కనిష్టంగా రూ.8 వేలు, సగటున రూ.11 వేల ప్రకారం ధర పలికిందన్నారు. అలాగే ప్లవర్ రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.8,500, కనిష్టంగా రూ.4 వేలు, సగటున రూ.5 వేల ప్రకారం క్రయ విక్రయాలు జరిగినట్లు ఆయన వెల్లడించారు. మండుతున్న భానుడు పుట్టపర్తి టౌన్: భానుడు భగభగ మండిపోతున్నాడు. వడగాల్పుల తీవ్రత కూడా పెరగడంతో జనం అల్లాడిపోతున్నారు. గురువారం చెన్నేకొత్తపల్లిలో 42.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, మిగతా ప్రాంతాల్లో 39 నుంచి 42 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. ఇక గాండ్లపెంటలో 22.3 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత నమోదుకాగా, మిగతా ప్రాంతాల్లోనూ 23 నుంచి 28 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి. రొద్దం, నల్లమాడ, కదిరి, అమరాపురం, అమడగూరు మండలాల్లో గాలివేగం 8 నుంచి 12 కిలోమీటర్లు ఉండగా, మిగతా ప్రాంతాల్లో గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో గాలి వీచింది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు వెళ్లవద్దని వైద్యులు సూచిస్తున్నారు. -
అభివృద్ధికి రహదారి
పుట్టపర్తి అర్బన్: జిల్లాలో రహదారుల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. జాతీయరహదారులతో పాటు రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీరాజ్, పీఎంజీఎస్వై, జాతీయ ఉపాధి హామీ పథకం, ఎంపీపీ, జెడ్పీ నిధుల కింద రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. ఇందులో చాలా వరకూ పూర్తయ్యాయి. వీటి కోసం ప్రభుత్వం ఏకంగా రూ.6,057 కోట్లు వెచ్చిస్తోంది. జిల్లాలో మొత్తం 1,529 కిలోమీటర్ల మేర రోడ్లు ఏర్పాటు చేసింది. వందేళ్ల నుంచి తారు రోడ్డుకు నోచుకోని గ్రామాలకు సైతం రోడ్డు నిర్మాణాలు చేపట్టడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల పురోగతి ఇలా... జిల్లా పరిధిలో 250 కిలోమీటర్లకు పైబడి జాతీయ రహదారులు నిర్మిస్తున్నారు. వచ్చే రెండేళ్లలో పూర్తి చేయాలనే సంకల్పంతో పనులు చేస్తున్నారు. ఈ రోడ్లతో బెంగళూరు, హైదరాబాద్, కడప, కర్నూలు, చిత్తూరు ప్రాంతాలకు కనెక్టవిటీ పెరుగుతుంది. 80 కిలోమీటర్లు 342వ జాతీయరహదారి నిర్మించేందుకు రూ.1,745 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 90.58 కిలోమీటర్లు 716జీ జాతీయ రహదారి నిర్మాణం కోసం రూ.1648.70 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇక జిల్లా మీదుగా 75 కిలోమీటర్లు వెళ్లే గ్రీనఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కోసం భూ సేకరణ పూర్తయ్యింది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. ఇందు కోసం రూ.850 కోట్లు ఖర్చు చేయనున్నారు. ● రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 32 మండలాల పరిధిలో 804 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాలకు రూ.366 కోట్లు వెచ్చిస్తున్నారు. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో 233 కిలోమీటర్ల రోడ్లు వేసేందుకు రూ.350 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ● పీఓంజీఎస్వై కింద 131.18 కిలోమీటర్లకు పైగా రోడ్ల నిర్మాణాలకు రూ.52.55 కోట్లు ఖర్చు పెట్టారు. 12.58 కిలోమీటర్ల కదిరి బైపాస్ రోడ్డుకు రూ.220.66 కోట్లు, 7.7 కిలోమీటర్ల ముదిగుబ్బ బైపాస్కు రూ.116.81 కోట్లు ఖర్చు చేస్తోంది. 20.04 కిలోమీటర్ల హిందూపురం– పరిగి రోడ్డుకు రూ.98.16 కోట్లు, 42.37 కిలోమీటర్ల మడకశిర–శిరరోడ్డుకు రూ.207.79 కోట్లు, 33 కిలోమీటర్ల బత్తలపల్లి–ముదిగుబ్బ రోడ్డుకు రూ.401.72 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పరిశ్రమల రాకకు మార్గం సుగమం.. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. జాతీయ రహదారులతో పాటు పలు పరిశ్రమలు ఒకదానితో ఒకటి పోటీ పడి వస్తున్నాయి. మెరుగైన రవాణా సౌకర్యం, ప్రభుత్వ సహకారం, నీటి వసతి, అనుకూలమైన వాతావరణం ఉండడంతో పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ఆధ్వర్యంలో 3,257 ఎకరాల భూమి సేకరించి అభివృద్ధి చేయంతో పలు పరిశ్రమలు వస్తున్నాయి. ఇప్పటి వరకు 1,138 యూనిట్ల కోసం భూమిని సిద్ధం చేశారు. 249 యూనిట్లు నెలకొల్పడానికి ప్లాట్లు కేటాయించారు. శరవేగంగా రోడ్ల నిర్మాణం గ్రామీణ నుంచి జాతీయ రహదారుల వరకు అభివృద్ధి అన్ని ప్రాంతాల రాకపోకలకూ మార్గం సుగమం శ్రీసత్యసాయి జిల్లా అభివృద్ధి దిశగా పయనిస్తోంది. గడిచిన ఐదేళ్లలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు సంక్షేమ పథకాల అమలుతో పాటే అభివృద్ధి పనులపైనా దృష్టి సారించింది. రహదారుల నిర్మాణాలతో జిల్లా రూపురేఖలు పూర్తిగా మారాయి. అన్ని ప్రాంతాలకూ రాకపోకలు, రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి. -
రైల్వేస్టేషన్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి
హిందూపురం అర్బన్: రైల్వే ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రైల్వే సెంట్రల్ బోర్డు మెంబర్ అనిల్కుమార్ కండేవాల్ పేర్కొన్నారు. గురువారం హిందూపురం రైల్వే స్టేషన్ను తనిఖీ చేసి మౌలిక సదుపాయాలపై ఆరాతీశారు. రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్ళు వెళ్లే ట్రాక్, అక్కడికి చేరుకొనేందుకు ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు, అలాగే రైల్వే ప్లాట్ ఫాం డిజిటల్ కోచ్ స్టాపింగ్ బోర్టుల ఏర్పాటు, వాహనాల పార్కింగ్ సదుపాయాలు పరిశీలించారు. స్టేసన్లో ఎలెక్ట్రిక్ డిజిటల్ బోర్టు, సిబ్బంది పనితీరుపై ఆరాతీశారు. రూ.15 కోట్లతో చేపడుతున్న రైల్వే ప్రధాన ద్వారం వద్ద, ఇతర చోట్ల చేపడుతున్న ఆధునికీకరణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు వందే భారత్ రైళ్లు హిందూపురంలో ఆపాలని, కొన్ని ఎక్స్ప్రెస్ వాహనాలు ఇక్కడ ఆపడం లేదని, వాటిని కూడా ఆపేలా చూడాలని, ఆధునికీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని, బెంగళూరు – హిందూపురం ప్యాసింజర్ రైలు గుంతకల్లు వరకు నడిచేలా చూడాలని, అడిగారు. త్వరలోనే అవి కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకుంటామని అనిల్కుమార్ కండేవాల్ తెలిపారు. స్టేషన్లో రాత్రి వేళ లైట్లు వెలిగేలా చూస్తామన్నారు. రైల్వే అధికారుల విశ్రాంతి భవనం ఆవరణలో సెంట్రల్ బోర్డు మెంబర్, డీఆర్ఎంలు మొక్కలు నాటారు. ఆయన వెంట డీఆర్ఎం యోగేష్ మోహన్, సీనియర్ డీసీఎం కృష్ణ ఛైతన్య, సీనియర్ డీవైఎం కృష్ణారెడ్డి, స్టేసన్ మాస్టర్ రామచంద్ర, ఎస్డబ్ల్యూ ఆర్ఎంయూ నాయకుడు కిరణ్, సోమప్ప, ఆనంద్ తదితరులు వారి వెంట ఉన్నారు. -
మాత్రల పంపిణీలో నవశకం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో సర్కారీ వైద్య వ్యవస్థ కనీవినీ ఎరుగని రీతిలో బలోపేతమైంది. గతంలో తమిళనాడు, కేరళ ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థలను ఉదాహరణకుగా చెప్పుకునే వారు.. కానీ వైఎస్సార్ సీపీ సర్కారు వచ్చాక ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను ఉదహరిస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో ఉమ్మడి అనంతపురం జిల్లా పరిస్థితిని చూస్తే గతానికి నేటికీ పోలికే లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాన్పులు మొదలు ఎలాంటి చికిత్సకై నా మందులు లేవన్న మాటే వినిపించలేదు. 2019కి ముందు ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లుంటే మందులుండవు.. మందులుంటే డాక్టర్లుండవు అనేలా దుస్థితి ఉండేది. కనీసం కట్టుకు దూదీ, సూదీ కూడా ఉండేవి కావు. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారింది. పేదలకు మెరుగైన వైద్యం అందుతోంది. చిన్న ఆస్పత్రికి వెళ్లినా వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. ఏటా రూ.30 కోట్లు మందులకే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వాసుపత్రికి వెళ్లి చూపించుకుంటే, మందులు బయట తీసుకోవాలని డాక్టర్లు చిట్టీలు రాసి పంపేవారు. కానీ నేడు ఏటా ఉమ్మడి అనంతపురం జిల్లాకు రూ.30 కోట్ల విలువైన మందులు సరఫరా చేస్తున్నారు. ఒక్క సర్వజనాసుపత్రికే ఏటా రూ.3 కోట్ల విలువ కలిగిన మందులు పైగా వినియోగమవుతున్నట్టు అంచనా. అత్యవసర జాబితాలోని మందులు కూడా అందుబాటులో ఉంటున్నాయి. అదనపు జాబితాలోని మందులు అవసరాన్ని బట్టి కొనుగోలు చేస్తున్నారు. 600 రకాల పైగా మందులు సర్వజనాసుపత్రిలోనూ, జిల్లా ఆస్పత్రి (హిందూపురం)లోనూ అందుబాటులో ఉంటున్నాయి. ఖరీదైన గుండె, క్యాన్సర్ జబ్బులకూ మందులు ఉండటం విశేషం. పీహెచ్సీలకూ వెల్లువ.. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లోనూ వందల రకాల మందులు ఉంటున్నాయి. గతంలో 60 రకాలు మందులుంటే గొప్ప. కానీ, నేడు 176 రకాల మందులు అందిస్తున్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లోనూ 176 రకాల మందులు దొరుకుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్లలో 90 రకాల మందులు అందుబాటులో ఉంచుతున్నారు. పీహెచ్సీ స్థాయి నుంచే పాముకాటు, కుక్కకాటు నియంత్రణా మందులు అర్ధరాత్రి వెళ్లినా వేయడానికి వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారు. గడిచిన నాలుగున్నరేళ్లలో జిల్లాలో మందుల పంపిణీ ప్రక్రియ స్వరూపమే మారిపోయినట్టు వైద్యులే చెబుతున్నారు. సర్కారీ ఆస్పత్రుల్లో ఫుల్లుగా మందుబిళ్లలు ఐదేళ్లుగా మందుల్లేవన్న మాట వినిపించని పరిస్థితి ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఏటా సగటున రూ.30 కోట్ల విలువైన మాత్రలు డ్రగ్స్తో పాటు సర్జికల్ ఉపకరణాలూ సరఫరా సర్వజనాసుపత్రికి 600 రకాల పైగా మందులు, సర్జికల్ వస్తువులు పీహెచ్సీలలో 176 మందులకు తక్కువ కాకుండా అందుబాటులో గతంలో ఎన్నడూ లేని విధంగా బలోపేతమైన ప్రభుత్వాస్పత్రులు -
తొలిరోజు ఏడు నామినేషన్లు
పుట్టపర్తి అర్బన్: సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. గురువారం ఉదయం జిల్లాలోని ఒక పార్లమెంట్, ఆరు అసెంబ్లీ స్థానాలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అరుణ్బాబు నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ వెంటనే పుట్టపర్తి, హిందూపురం, కదిరి, ధర్మవరం, పెనుకొండ, మడకశిర అసెంబ్లీ స్థానాలతో పాటు హిందూపురం పార్లమెంట్ స్థానానికి నామినేషన్ల దాఖలు ప్రారంభమైంది. తొలిరోజు హిందూపురం పార్లమెంట్ స్థానానికి ఒకటి, అసెంబ్లీ స్థానాలకు ఆరు నామినేషన్లు దాఖలు అయ్యాయి. అంతకుముందు కలెక్టర్ అరుణ్బాబు మాట్లాడుతూ...నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈనెల 25 వరకు ఉంటుందన్నారు. 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 29వ తేదీ ఆఖరన్నారు. మే 13వ తేదీన పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. నామినేషన్ దాఖలు సమయంలో అభ్యర్థులు చెక్లిస్ట్ ప్రకారం నామినేషన్తో డాక్యుమెంట్లు జతపరచాలన్నారు. అసంపూర్తిగా ఉన్న నామినేషన్లు తిరస్కరిస్తామన్నారు. అందువల్ల అభ్యర్థులు నామినేషన్ పత్రాలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలని సూచించారు. 7 నామినేషన్లు దాఖలు ● హిందూపురం పార్లమెంట్ నియోజక స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థి జోలదరాశి శాంత తరఫున హిందూపురానికి చెందిన లక్ష్మీనారాయణరెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన కలెక్టరేట్లోని జిల్లా ఎన్నికల అధికారి అరుణ్బాబుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ● వైఎస్సార్సీపీ ధర్మవరం నియోజకవర్గ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆర్ఓ వెంకటశివరామిరెడ్డికి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ● పుట్టపర్తి అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి, పల్లె రఘునాథరెడ్డి, పల్లె వెంకటకృష్ణ కిషోర్రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. పుట్టపర్తి ఆర్డీఓ కార్యాలయానికి అనుచరులతో కలిసి వెళ్లి ఆర్ఓ భాగ్యరేఖకు నామినేషన్లు అందజేశారు. ● హిందూపురం అసెంబ్లీ స్థానానికి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి శ్రీరాములు నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జేసీ అభిషేక్ కుమార్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ● రాప్తాడు నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా ప్రొఫెసర్ రాజేష్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఆర్ఓ కార్యాలయాల వద్ద 144 సెక్షన్.. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారి కార్యాలయాల వద్ద 144 సెక్షన్ పక్కాగా అమలు చేశారు. హిందూపురం పార్లమెంట్ స్థానానికి కలెక్టరేట్లో నామినేషన్లు స్వీకరిస్తున్నందున కలెక్టరేట్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇతరులను ఎవరినీ అనుమతించలేదు. కలెక్టరేట్ అధికారులను కూడా గుర్తింపు కార్డులు చూపిన తర్వాతే లోనికి అనుమతించారు. అలాగే ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రధాన రహదారుల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి ర్యాలీలను నిషేధించారు. అభ్యర్థుల వాహనాలను కూడా ఆర్ఓ కార్యాలయానికి వందమీటర్ల ముందే నిలిపివేశారు. అభ్యర్థితో పాటు నలుగురిని మాత్రమే నామినేషన్ దాఖలుకు అనుమతించారు. ఎస్పీ మాధవరెడ్డి, అడిషనల్ ఎస్పీ విష్ణు ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కలెక్టర్ 11 గంటలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం ఆర్ఓ కార్యాలయాల వద్ద పోలీస్ బందోబస్తు పార్లమెంట్కు ఒకటి, అసెంబ్లీకి ఆరు నామినేషన్లు ధర్మవరంలో ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేసిన కేతిరెడ్డి -
అన్ని స్థానాల్లో గెలుస్తాం
చిలమత్తూరు: ‘‘ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా పథకాలు వర్తింపజేశారు. అన్ని వర్గాలకు న్యాయం చేశారు. అందుకే మేం ఈ ఎన్నికల్లో ధైర్యంగా ఓటు అడుగుతున్నాం.. ప్రజాభిమానంతో జిల్లాలోని అన్ని స్థానాల్లో గెలిచి తీరుతాం’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు నవీన్ నిశ్చల్ అన్నారు. గురువారం ఆయన పార్టీ నేత వేణురెడ్డితో కలిసి స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తాము మంచి చేశాం కాబట్టి దాన్ని వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నామని, టీడీపీ హయాంలో ఏం చేయలేకపోయారు కాబట్టే ఆ పార్టీ నేతలు వారు చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు చెప్పుకోలేక..తమపై విమర్శలు చేస్తున్నారన్నారు. వారి మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. హిందూపురంలో బీసీ మహిళ దీపికకు జగనన్న అవకాశం ఇచ్చారని, తప్పకుండా భారీ మెజార్టీతో పురంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేస్తామన్నారు. 24న టీఎన్ దీపిక నామినేషన్.. వైఎస్సార్ సీపీ నాయకులు మాట్లాడుతూ, ఈ నెల 24న తమ పార్టీ హిందూపురం అభ్యర్థి టీఎన్ దీపిక నామినేషన్ వేస్తున్నారని తెలిపారు. సమావేశంలో ఎంపీపీ పురుషోత్తమరెడ్డి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ రాజారెడ్డి, ఎంపీటీసీ జగన్మోహన్రెడ్డి, అన్సర్ అహ్మద్, రాఘవేంద్రరెడ్డి, సుందరరాజు, గోవిందరెడ్డి, అమరనాథ్రెడ్డి, బాబే నాయక్, అంజన్రెడ్డి, శంకరప్ప, నయీముల్లా పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు నవీన్ నిశ్చల్ -
జగనన్నకు అండగా నిలవండి
రొద్దం: టీడీపీ అధినేత చంద్రబాబు మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని, ఆయన పరిపాలనకు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనకు ఎంత తేడా ఉందో గమనించాలని మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీచరణ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని కంబాలపల్లి, తురకలాపట్నం, ఆర్ కుర్లపల్లి, రెడ్డిపల్లి గ్రామాల్లో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వల్ల ప్రతి ఒక్కరికీ లబ్ధి చేరుకూరిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు జన్మభూమి కమిటీలు పెట్టి ఆ పార్టీ నాయకులకే పథకాలు అందించారని విమర్శించారు. పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్న జగనన్నకు అందరూ మళ్లీ అండగా నిలవాలన్నారు. ఈనెల 25న తన నామినేషన్ కార్యక్రమం ఉంటుందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరవాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాసులు, స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బి.నారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బి.తిమ్మయ్య, నాయకులు మారుతీరెడ్డి, నరసింహులు, రాజ్గోపాల్రెడ్డి, అక్కులప్పయాదవ్, లక్ష్మినారాయణరెడ్డి, వజీర్బాషా, ఎన్ నారాయణరెడ్డి, కేపీ శ్రీనివాసులు, రాజారెడ్డి, వినయ్రెడ్డి, ఉజ్జినప్ప, సి.నారాయణరెడ్డి, నరేంద్రరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. మంత్రి ఉషశ్రీచరణ్ -
జిల్లాకు ఎన్నికల వ్యయ పరిశీలకులు
పుట్టపర్తి అర్బన్: అసెంబ్లీ, పార్లమెంట్ నియోజక వర్గాల పర్యవేక్షణ నిమిత్తం బుధవారం పలువురు ఎన్నికల వ్యయ పరిశీలకులు జిల్లాకు విచ్చేసినట్లు కలెక్టర్ అరుణ్బాబు తెలిపారు. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అమిత్ కుమార్, మడకశిర, హిందూపురం, పెనుకొండ అసెంబ్లీ నియోజక వర్గాలకు వినాయక్, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి అసెంబ్లీ నియోజకవర్గాల వ్యయాన్ని రిథమ్ భజ్వా పరిశీలించనున్నట్లు ఆయన వెల్లడించారు. గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అనంతరం ఖర్చు చేసే ప్రతి రూపాయిని అభ్యర్థుల ఖర్చు కింద చూపనున్నట్లు చెప్పారు. అసెంబ్లీ నియోజక వర్గానికి పోటీ చేసే అభ్యర్థి ఖర్చు రూ.40 లక్షలు, పార్లమెంట్ నియోజక వర్గానికి పోటీ చేసే అభ్యర్థి ఖర్చు రూ.95 లక్షలకు మించరాదన్నారు. ప్రతి వాహనాన్నీ తనిఖీ చేయాలి ● పుల్లట్ల కనం చెక్పోస్టును పరిశీలించిన ఎస్పీ మాధవరెడ్డి తాడిమర్రి: చెక్పోస్టుల వద్ద ప్రతి వాహనాన్నీ తనిఖీ చేయాలని ఎస్పీ మాధవరెడ్డి పోలీసులను ఆదేశించారు. బుధవారం ఆయన మండలంలోని దాడితోట సమీపంలో పుల్లట్ల కనంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ.. విధుల్లో ఉంటున్న సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన వసతులు, సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, తనిఖీల్లో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా విధులు నిర్వహించాలన్నారు. అధిక మొత్తంలో డబ్బు, బంగారు, వెండి ఆభరణాలు, ఇతర వస్తువులు లభిస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎప్పటికప్పుడు చెక్ పోస్టును పర్యవేక్షించాలని ఎస్ఐ నాగస్వామిని ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ టి.శ్రీనివాసులు, ముదిగుబ్బ రూరల్ సీఐ హెచ్.కృష్ణంరాజు నాయక్, ఎస్ఐ ఎం.నాగస్వామి, సిబ్బంది పాల్గొన్నారు. వాహనాలకు అనుమతి తప్పనిసరి పుట్టపర్తి టౌన్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురువారం నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండగా పోలీసుశాఖ అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నామినేషన్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. అభ్యర్థులు కూడా ఎన్నికల నియమావళిని పాటించాలని ఎస్పీ మాధవరెడ్డి సూచించారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల నామినేషన్ సందర్భంగా రిటర్నింగ్ అఽధికారి (ఆర్ఓ) కార్యాలయానికి 100 మీటర్లు దూరం వరకు మాత్రమే వాహనాలకు అనుమతి ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు ర్యాలీగా వచ్చి నామినేషన్లు వేయాలనుకుంటే పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. ఆర్ఓ కార్యాలయానికి గరిష్టంగా 3 వాహనాలు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు తెలిపారు. ఆయా వాహనాలకు కూడా ఆర్ఓ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. అనుమతి లేని వాహనాలను అనుమతించబోమన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్ట్రాంగ్ రూంలకు పటిష్ట భద్రత కదిరి టౌన్: ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలకు పటిష్ట భద్రత కల్పించాలని కలెక్టర్ అరుణ్బాబు ఆదేశించారు. బుధవారం ఆయన కదిరిలో పర్యటించారు. అసెంబ్లీ నియోజకవర్గం, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన బాలుర పాఠశాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, స్ట్రాంగ్ రూంల వద్ద భద్రత పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు. ఆర్డీఓ వంశీకృష్ట్ర, పలువురు తహసీల్దార్లు పాల్గొన్నారు. -
రమణీయం.. రాములోరి కల్యాణం
పుట్టపర్తి టౌన్: శ్రీరామ నామస్మరణతో జిల్లా మార్మోగిపోయింది. ఆధ్యాత్మిక శోభతో అలరారింది. జగదానంద కారుకుని కల్యాణంతో ప్రతి లోగిలీ కాంతులీనింది. శ్రీరామనవమి వేడుకలు బుధవారం జిల్లా వ్యాప్తంగా వైభవంగా జరిగాయి. గ్రామగ్రామానా శ్రీరామ కల్యాణోత్సవాలు కమనీయంగా సాగాయి. నీలిమేఘ శ్యాముడు రామచంద్రుడు సర్వాభరణ భూషితుడై కల్యాణ వేదికపై కొలువుదీరగా... సుగుణాల తల్లి సీతమ్మతో వేదపండితులు కల్యాణం జరిపించారు. ఈ పరిణయాన్ని కళ్లారా తిలకించిన భక్తజనం పులకించింది. చాలా ప్రాంతాల్లో నిర్వాహకులు పానకం, పెసరపప్పు తీర్థ ప్రసాదంగా భక్తులకు పంచిపెట్టారు. పలు ప్రాంతాల్లో ఉట్ల పరుష నిర్వహించడంతో యువకులు కేరింతలు కొట్టారు. మరికొన్ని ప్రాంతాల్లో స్వామి విగ్రహాలు ఊరేగింపులు, రథోత్సవాలు నిర్వహించారు. అలాగే హనుమాన్ దేవాలయాలకు కూడా భక్తులు పోటెత్తారు. ప్రశాంతి నిలయంలోనూ వేడుకలు.. ప్రశాంతి నిలయం: శ్రీ రామ నవమి వేడుకలు ప్రశాంతి నిలయంలోనూ ఘనంగా జరిగాయి. బుధవారం ఉదయం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత వేడుకలు వేదపఠనంతో ప్రారంభమయ్యాయి. సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన వేదపండితులు.. సాయికుల్వంత్ సభా మందిరంలోని సత్యసాయి మహాససమాధి వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం సీతారాముల కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు కల్యాణోత్సవ ఘట్టాన్ని తిలకించి పరవశించారు. సాయంత్రం జరిగిన వేడుకల్లో ప్రముఖ నేపథ్యగాయని గాయత్రి నారాయణన్ సత్యసాయిని కీర్తిస్తూ సంగీత కచేరీ నిర్వహించారు. -
బెడిసికొట్టిన మంత్రాంగం
హిందూపురం అర్బన్: ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు టీడీపీ అడ్డదారులన్నీ తొక్కుతోంది. ముఖ్యంగా హిందూపురంలో ఈ సారి ఓటమి ఖాయంగా తేలడంతో బాలకృష్ణ కోసం ఆ పార్టీ నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. చివరకు వైఎస్సార్ సీపీ నేతలను ఆకట్టుకునేందుకు ప్లాన్ వేశారు. ఇందుకోసం వైఎస్సార్ సీపీ నుంచి ఇటీవలే టీడీపీలో చేరిన ఇక్బాల్ను ప్రయోగించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన కొడికొండ చెక్పోస్టు సమీపంలో బస చేసి హిందూపురానికి చెందిన వైఎస్సార్ సీపీ మైనార్టీ నాయకులు, కొందరు కౌన్సిలర్లను పిలిపించారు. మేం మీలా కాదు ఇక్బాల్.. హిందూపురం నేతలతో పరామర్శల తర్వాత ఇక్బాల్.. మైనార్టీలకు వైఎస్సార్సీపీలో సరైన గౌరవం లేదని టీడీపీలో చేరితే మంచి అవకాశాలు ఇప్పిస్తానంటూ చెప్పబోయారు. అప్పటివరకూ సార్ అంటూ గౌరవంతో పిలిచిన వైఎస్సార్ సీపీ నాయకులు వెంటనే ఏకవచనంతో ఆయన్ను కడిగిపారేశారు. ‘‘మేం మీలా కాదు.. స్వార్థం కోసం రోజుకో పార్టీ మారలేం.. మా నాయకుడు మాకు ఎప్పుడూ అన్యాయం చేయరు. మీకు కూడా వైఎస్సార్ సీపీలో ఎంతో గౌరవం ఇచ్చారు. అయినా మీరు అన్యాయంగా ప్రవర్తించారు. ఇందుకోసమే మమ్మల్ని పిలిపించి ఉంటే అది తప్పు. ఇక వస్తాం’’ అంటూ అక్కడి నుంచి వచ్చేశారు. ఇంతలా ఎదురుదాడి ఊహించని ఇక్బాల్ అవమాన భారంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన హిందూపురానికి రాలేకపోయారని టీడీపీ నేతలే చెబుతున్నారు. పార్టీ ఫిరాయించిన వారికీ అవమానం.. ఇక్బాల్ మాటలు నమ్మి చిలమత్తూరుకు చెందిన ఒకరిద్దరు టీడీపీలో చేరినా వారికి అక్కడి నేతలతో పొసగడం లేదు. ఇన్నాళ్లూ తమను తిట్టి ఇప్పుడు తమ పంచనే చేరారంటూ టీడీపీ నేతలు చులకనగా మాట్లాడుతున్నారని పార్టీ ఫిరాయించిన ఓ నేత అనుచరులతో వాపోయినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల టీడీపీలో చేరిన చిలమత్తూరు మహిళా నేత ఇటీవల బాలకృష్ణ సతీమణి వసుంధరతో కలిసి ప్రచారం చేసేందుకు ప్రయత్నించగా... స్థానిక టీడీపీ మహిళా నేతలు ఆమెను ప్రచారవాహనంపైకి కూడా ఎక్కనివ్వలేదు. దీంతో పరువుపోయినట్లు భావించిన ఆమె కన్నీటిపర్యంతమవుతూ... అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. విచ్చలవిడిగా నగదు తరలింపు.. హిందూపురం టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ ఈ నెల 19వ తేదీన నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో జనసమీకరణకు ఆ పార్టీ నేతలు విచ్చలవిడిగా ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు. హిందూపురంలోని వివిధ వార్డులతో పాటు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి జనాన్ని తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం భారీగా నగదు తరలిస్తున్నారు. అయితే సామాన్యుల వాహనాలను తనిఖీ చేసే పోలీసులు టీడీపీ నేతల వాహనాలను మాత్రం తనిఖీ చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. -
Ananthapur: పరిటాల డర్టీ పాలిటిక్స్
♦ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల ఆత్మకూరుకు చెందిన ఓ వార్డు మెంబర్ వైఎస్సార్సీపీలో చేరాడు. ఈ క్రమంలోనే అదే రోజు సాయంత్రం సదరు వ్యక్తి ఇంటి వద్దకు బాలాజీ వెళ్లాడు. ఏదో చెప్పి టీడీపీ కండువా వేసి వచ్చారు. కానీ ఆ వార్డు మెంబర్ మాత్రం టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. వైఎస్సార్సీపీ కార్యక్రమాలు, సమావేశాలకు హాజరవుతున్నారు. ♦ ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి వద్దకు ఈ నెల 15న టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత సోదరుడు బాలాజీ వెళ్లాడు. ఏదో మాట్లాడుతూనే అతనికి బలవంతంగా టీడీపీ కండువా కప్పారు. వారు గడప దాటిన మరుక్షణమే సదరు వ్యక్తి టీడీపీ కండువా పక్కకు పడేశాడు. అతని కుమారుడు ఆ కండువాకు చెప్పు చూపించడమే కాకుండా నిప్పు పెట్టాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ♦ కొన్ని రోజుల క్రితం ఆత్మకూరుకు చెందిన నాయీ బ్రాహ్మణులు, కురుబ కులస్తులు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరారు. దీన్ని జీర్ణించుకోని టీడీపీ నాయకులు అదే రోజు రాత్రి వారి ఇళ్ల వద్దకు వెళ్లారు.అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ నమ్మబలికి టీడీపీ కండువాలు వేశారు. అనంతపురం: ఎమ్మెల్యే, మంత్రి పదవులను అనుభవించినా రాప్తాడు నియోజకవర్గ అభివృద్ధికి పరిటాల కుటుంబీకులు చేసిన కృషి శూన్యం. పైగా, నమ్మి ఓట్లేసిన పాపానికి ప్రజల్నే వేధించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా దోపిడీలు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అధికారం మాటున వందల కోట్లు వెనకేసుకున్నారు. వారి ఆగడాలతో విసిగిపోయిన ప్రజలు గత ఎన్నికల్లో గుణపాఠం చెప్పారు. ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా, బుద్ధి నేర్వని వారు మళ్లీ నేడు ఎన్నికలు వచ్చాయని ప్రజల్లోకి వెళ్తూ నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారు. పచ్చటి పల్లెల్లో చిచ్చు.. ప్రచారం పేరుతో గ్రామాల్లోకి వెళ్తున్న పరిటాల కుటుంబీకులు ఆ మాటున యథేచ్ఛగా ప్రలోభాలకు దిగుతున్నారు. అధికారంలోకి రావడానికి ఏం చేయడానికైనా రెడీ అంటూ హల్చల్ చేస్తున్నారు. సామాన్య ప్రజలు, వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఇళ్ల దగ్గరకు వెళ్లి తమ వైపు తిప్పుకునేందుకు యత్నిస్తున్నారు. ఏ పని కావాలన్నా చేసి పెడతాం లేదా డబ్బు ఎంత కావాలన్నా ఇస్తాం అంటూ ఎర వేస్తున్నారు. పైగా గ్రామీణులను కులాల పేరిట విడగొట్టి సమావేశాలు నిర్వహిస్తూ ఆఫర్లు ఇస్తున్నారు. రాత్రి సమయాల్లో ఒక్కో రోజు ఒక్కో వర్గం వారిని కలుస్తూ ఏ కులంలో ఎంత మంది ఉన్నారంటూ తెలుసుకొని డబ్బు ముట్టజెబుతూ వల వేస్తున్నారు. ఓట్ల కోసం పచ్చటి పల్లెల్లో చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు మళ్లీ బీజం వేస్తున్నారు. సొంత పార్టీ నాయకులకూ తాయిలాలు.. పరిటాల కుటుంబం సొంత పార్టీ కేడర్ను కూడా నమ్మడం లేదు. వారికి కూడా తాయిలాల ఎర వేస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల ప్రచారం చేస్తే ఆ రోజంతా ప్రచారంలో పాల్గొనే వారికి మందు, ఖర్చులకు డబ్బుతో పాటు రవాణా ఖర్చులకు కూడా ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ సీపీ వారిని, ఆ పార్టీ సానుభూతిపరులను టీడీపీలో చేర్పించి ఎంత కావాలన్నా తీసుకోండి అంటూ కమీషన్లు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో గ్రామాల్లో టీడీపీకి చెందిన వారినే సునీత, శ్రీరాం దగ్గరకు తీసుకెళ్లి పార్టీ కండువాలు వేయిస్తూ నాయకులు కమీషన్లు తీసుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. బయటకొచ్చాక పారవేస్తున్నారు.. భయపెట్టో, ప్రలోభ పెట్టో తమ వైపు జనాన్ని తిప్పుకోవాలన్న పరిటాల కుటుంబ పాచికలు ఏ మాత్రమూ పారడం లేదు. టీడీపీ కండువాలు కప్పుకున్న వారు బయటకు వచ్చాక వాటిని అక్కడే పడేసి వెళ్లిపోతున్నారు. తమ ఇంటికే వచ్చి పార్టీ కండువాలు వేసి వెళ్లాక వాటిని పారవేస్తున్నారు. కొంతమందైతే తగులబెడుతున్నారు. ఎన్ని రకాలుగా వల పన్నుతున్నా ప్రజలు లొంగకపోవడం చూసి పరిటాల సునీత డీలా పడినట్లు తెలుస్తోంది. ఓడిపోతామన్న భయంతోనే.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందాయి. రూపాయి కూడా లంచం తీసుకోకుండా అర్హతే ప్రామాణికంగా లబ్ధి చేకూర్చారు. ఒక్క రాప్తాడు నియోజకవర్గంలోనే ప్రజలకు రూ. వేల కోట్లు ప్రభుత్వం అందించింది. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎమ్మెల్యేగా గెలిచిన కొన్ని నెలల్లోనే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేరూరు డ్యాంను నీటితో నింపారు. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు. రూ. వేల కోట్లతో నియోజకవర్గవ్యాప్తంగా అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతో ప్రజలు ఈ సారి కూడా వైఎస్సార్ సీపీకి జై కొట్టేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి వెళ్తున్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇదంతా గమనించి మళ్లీ ఓటమి తప్పదని గుర్తించిన పరిటాల సునీత ఎలాగైనా, ఏం చేసైనా ఓటర్లను తన వైపు తిప్పుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. బలవంతంగా టీడీపీ కండువాలు కప్పుతూ అపహాస్యం పాలవుతున్నారు. అంతా గమనిస్తున్న ప్రజలు లోలోనే నవ్వుకుంటున్నారు. -
నేటి నుంచి నామినేషన్ల ఘట్టం
పుట్టపర్తి అర్బన్: సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 18న గురువారం విడుదల కానుంది. ఉదయం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయగానే... జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అరుణ్బాబు జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఆ వెంటనే ఉదయం 11 గంటల నుంచే నామినేషన్లు స్వీకరించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎంపీ స్థానానికి కలెక్టరేట్లో నామినేషన్ల స్వీకరణ.. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల నామినేషన్ల స్వీకరణ ఆయా నియోజకవర్గాల కేంద్రాల్లో ఉంటుంది. పార్లమెంట్ నియోజకవర్గానికి మాత్రం కలెక్టరేట్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ నామినేషన్ కేంద్రంలో 5 నుంచి 9 వరకూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థితో పాటు నలుగురికి మాత్రమే నామినేషన్ కేంద్రంలోకి అనుమతి ఉండడంతో కేంద్రం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అభ్యర్థి వెంట వచ్చే కార్యకర్తలు, వాహనాలు ఆర్ఓ కార్యాలయానికి వంద మీటర్ల దూరంలోనే ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. కేంద్రం సమీపంలో పోలీస్ డిటెక్టర్ను ఏర్పాటు చేసి లోనికి వెళ్లే ప్రతి ఒక్కరినీ చెక్ చేసి పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో అభ్యర్థికి నాలుగు సెట్ల వరకూ అవకాశం.. అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సక్రమంగా పూర్తి చేసి సంబంధిత రిటర్నింగ్ అధికారికి అందజేయాల్సి ఉంటుంది. ఏవైనా తప్పులుంటే మరోసారి నామినేషన్ దాఖలు చేయవచ్చు. ఒక్కో అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు అందజేయవచ్చు. వివిధ పార్టీల తరఫున పోటీ చేసే వారికై తే నలుగురు, స్వతంత్ర అభ్యర్థులకై తే పది మంది బలపరిచే వ్యక్తులు అదే నియోజక వర్గానికి సంబంధించిన వారై ఉండాలి. నామినేషన్లో ఏవైనా పొరపాట్లు జరిగితే నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. అఫిడవిట్లో వివరాలు తప్పుగా నమోదు చేసి ఎన్నికల్లో విజయం సాధించినా... ప్రత్యర్థులు కోర్టులను ఆశ్రయించి ధ్రువీకరిస్తే పదవి కోల్పోయే ప్రమాదం ఉంది. అందువల్ల నామినేషన్ పత్రాల్లో వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకే స్వీకరణ.. నామినేషన్ల ప్రక్రియ 18వ తేదీ ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతుంది. 25వ తేదీ వరకూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. ఉపసంహరణకు ఈ నెల 29వ తేదీ వరకూ గడువు ఉంటుంది. ఓటింగ్ డే మే 13న ఉంటుంది. 144 సెక్షన్ అమలు నామినేషన్లు దాఖలు చేసే అన్ని ఆర్ఓ కార్యాలయాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు నలుగురికి మాత్రమే కేంద్రంలోని అనుమతి ఇస్తాం. వాహనాలన్నీ నామినేషన్ కేంద్రం వంద మీటర్ల అవతలే నిలిపి వేయాలి. 3 వాహనాలకు మాత్రం అనుమతి ఉంటుంది. – అరుణ్బాబు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ -
108లో ఉద్యోగాలకు దరఖాస్తులు
అనంతపురం మెడికల్: 108 వాహనాల్లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ), డ్రైవర్, తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు 108 జిల్లా మేనేజర్ సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జీఎన్ఎం, బీఎస్సీ లైఫ్ సైన్సెన్, బీ ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ తదితర కోర్సులు చేసిన వారు ఈఎంటీ పోస్టుకు, పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణత, హెవీ లైసెన్స్, 35 ఏళ్లలోపు వయసు కల్గి ఉన్న వారు డ్రైవర్కు అర్హులని తెలిపారు. ఆసక్తి కల్గిన వారు ఈ నెల 19వతేదీ లోపు అనంతపురం సర్వజనాస్పత్రిలోని 108 కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. అందుబాటులో హాల్టికెట్లు అనంతపురం ఎడ్యుకేషన్: ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఈనెల 25న నిర్వహించే రాత పరీక్షకు సంబంధించిన హాల్టికెట్లు అందుబాటులో ఉన్నాయి. 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలకు ఏపీఆర్ఎస్ క్యాట్–2024 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, జూనియర్, డిగ్రీ కళాశాలల ప్రవేశాలకు ఏపీఆర్జేసీ,డీసీ సెట్–2024 పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. విద్యార్థుల ఐడీ, పుట్టిన తేదీ ద్వారా https:// aprs. apcfss. in వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. పరీక్ష కేంద్రానికి గంటముందే చేరుకోవాలని సూచించారు. -
ఓటమి భయంతోనే ఆరోపణలు
రొద్దం: ఓటమి భయంతోనే టీడీపీ అభ్యర్థి సవిత తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి, వైఎస్సార్సీపీ పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. తనను నాన్లోకల్ అంటూ ప్రచారం చేస్తున్న సవిత ముందు టీడీపీలో పరిస్థితి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. హిందూపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలకృష్ణ లోకలా... నాన్లోకలా? మంగళగిరలో పోటీ చేస్తున్న లోకేష్ ... లోకలేనా..? వీటికి సమాధానం చెప్పిన తర్వాత తన గురించి మాట్లాడితే బాగుంటుందన్నారు. మంగళవారం రొద్దం మండలం కలిపి, పెద్దమంతూరు, చెరుకూరు, చిన్నమంతూరు, నల్లూరు, చోళేమర్రి, సానిపల్లి తదితర గ్రామ పంచాయతీల్లో మంత్రి పర్యటించారు. ఈ నెల 25న తన నామినేషన్ కార్యక్రమం ఉంటుందని, నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక జగనన్న ముఖ్యమంత్రిగా ప్రజలకు చేసిన మేలు ఇంటింటికీ తెలపాలని సూచించారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రతి గడపకూ వివరించాలన్నారు. వార్డు మెంబర్గా కూడా కాని సవితపై సీబీఐ కేసులు ఎందుకు వచ్చాయో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఎవరు సేవ చేయగలరో ప్రజలు నిర్ణయిస్తారన్నారు. వైఎస్సార్సీపీలో చేరిక .. మండలంలోని శేషాపురం, పెద్దమంతూరు గ్రామ పంచాయతీల్లో పలువురు కార్యకర్తలు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరారు. వారందరికీ మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బోయ తిమ్మయ్య, నాయకులు అక్కులప్పయాదవ్, మారుతీరెడ్డి, ధనుంజయ, సి.నారాయణరెడ్డి, వినయ్రెడ్డి, రాజారెడ్డి, చిన్నమంతూరు రాము, రాజ్గోపాల్రెడ్డి, ఎన్ నారాయణరెడ్డి, నరేంద్రరెడ్డి, బోయ నరసింహులు, లక్ష్మీనారాయణరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. జగన్తోనే సామాజిక సాధికారత.. గోరంట్ల: సామాజిక సాధికారత జగన్ పాలనలోనే సాధ్యమైందని మంత్రి ఉషశ్రీచరణ్ పేర్కొన్నారు. టీడీపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకోవడం తప్ప ఆయా వర్గాలకు ఒరగబెట్టిందేమీలేదని ఎద్దేవా చేశారు. మంగళవారం గోరంట్ల మండలం ఖాజాపురం, మందలపల్లి, కరావులపల్లితండా, కరావులపల్లి, జావుకులదిన్న గ్రామాల్లో మంత్రి పర్యటించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటే చిన్నచూపన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు పాలే జయరాంనాయక్, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ లక్ష్మీనరసప్ప, మందలపల్లి, కరావులపల్లి తండా సర్పంచులు ప్రమీలమ్మ, రమాదేవి, జిల్లా సహకార బ్యాంక్ డైరెక్టర్ పాటూరి శంకరరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఆర్.వెంకటరెడ్డి, మాజీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గంపల వెంకటరమణారెడ్డి, జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు లక్ష్మీనరసప్ప, సుబ్బారెడ్డి, నార్శింపల్లి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సవితపై సీబీఐ కేసులున్నాయి ప్రజలంతా ఆలోచించి ఓటేయాలన్న మంత్రి ఉషశ్రీచరణ్ -
20న లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్రెడ్డి రాక
పుట్టపర్తి అర్బన్: రెండు రోజుల పర్యటన నిమిత్తం లోకాయుక్త జస్టిస్ పి. లక్ష్మణ్రెడ్డి ఈనెల 20వ తేదీన జిల్లాకు విచ్చేయనున్నట్లు డీఆర్ఓ కొండయ్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 20వ తేదీ ఉదయం 10 గంటలకు ధర్మవరానికి విచ్చేయనున్న జస్టిస్ పి.లక్ష్మణ్రెడ్డి అక్కడి పోలీస్ గెస్ట్ హౌస్లో బస చేస్తారన్నారు. అనంతరం రెండు రోజుల పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు వెల్లడించారు. 21వ తేదీ సాయంత్రం 4 గంటలకు కర్నూలుకు వెళ్తారన్నారు. 24, 25 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ పుట్టపర్తి అర్బన్: ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఇతర పోలింగ్ అధికారులు ఈనెల 24, 25 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ అరుణ్బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫారం–12డీ దరఖాస్తులను పూర్తి చేసి ఆయా తేదీల్లో సంబంధిత రిటర్నింగ్ అధికారికి అందజేయాలని సూచించారు. ఒక్క ఓటరూ స్వేచ్చగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు● ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించిన కలెక్టర్ పుట్టపర్తి అర్బన్: వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అరుణ్బాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డికి వివరించారు. మంగళవారం తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పనులు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై సీఎస్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్బాబు మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నీటితో నింపుతున్నామని తెలిపారు. అలాగే తాగునీటి ఎద్దడి తలెత్తిన 153 గ్రామాలకు 415 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని వివరించారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టిన నీటి సంరక్షణ పనులు పూర్తి చేస్తున్నామన్నారు. కూలీలు పని చేసే ప్రదేశంలో నీడకోసం టెంట్లు, తాగునీరు అందుబాటులో ఉంచామని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సైతం అందిస్తున్నామన్నారు. వీసీలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మల్లికార్జున, డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎంటెక్ ఫలితాల విడుదల అనంతపురం: జేఎన్టీయూఏ పరిధిలో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో నిర్వహించిన ఎంటెక్ ఆర్–21 ఒకటి, మూడో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. అలాగే ఆర్–17 ఒకటి, మూడో సెమిస్టర్ సప్లిమెంటరీ, ఆర్–21, ఆర్–17 రెండో సెమిస్టర్ సప్లిమెంటరీ, డిసెంబర్, జనవరి నెలలో నిర్వహించిన ప్రీ పీహెచ్డీ (వింటర్ సెషన్) పరీక్ష ఫలితాలూ విడుదలయ్యాయి. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ ఈ.కేశవరెడ్డి, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ బి.చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఫలితాలను జేఎన్టీయూఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వివరించారు. చల్లని కబురు● 20, 21 తేదీల్లో వర్ష సూచన బుక్కరాయసముద్రం: భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాస్త్రవేత్తలు చల్లని కబురు చెప్పారు. ఈ నెల 20, 21 తేదీల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో చిరు జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు రేకులకుంటలో ఉన్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సహదేవరెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 40.6 – 42.5 డిగ్రీల మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 27.1–27.6 డిగ్రీల మధ్య నమోదు కావచ్చన్నారు. గాలిలో తేమ శాతం ఉదయం 48–56 శాతం, మధ్యాహ్నం 23–28 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. -
వైఎస్సార్సీపీలోకి చేరికల వెల్లువ
కదిరి టౌన్: వైఎస్సార్సీపీలోకి చేరికలు వెల్లువెత్తుతున్నాయి. వేలాదిమంది ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి గుడ్బై కొడుతున్నారు. విశ్వసనీయత, రాజకీయ విలువలు కలిగిన వైఎస్సార్సీపీలోకి వస్తున్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్డిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో మంగళవారం చేరికల కార్యక్రమాలు జరిగాయి. కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాషా ఆధ్వర్యంలో దాదాపు వెయ్యి మంది ఆయన అనుచరవర్గం టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. అత్తార్ రెషిడెన్షియల్ లాడ్జిలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వీరికి మంత్రితో పాటు కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి బీఎస్ మక్బూల్ అహ్మద్, హిందూపురం ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన వారిలో మాజీ కౌన్సిలర్ అల్లాబకాష్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు శంకర్, మండి మహబూబ్ బాషా, సూరి, బాలచంద్ర, బాబురెడ్డి, రాజా, రియాజ్, అశోక్నాయుడు, హైదర్వలి, మస్తాన్, మధు, బాదల్, రామచంద్ర, మహమ్మద్, కిషోర్, జావీద్, అమృద్దీన్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు బోయ శాంతమ్మ, మక్బూల్ అహ్మద్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు సైనికుల్లా పనిచేస్తామని ప్రతినబూనారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఎన్నికల అసెంబ్లీ ఇన్చార్జ్ పూల శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్రెడ్డి, జిల్లా అధ్యక్షులు నవీన్ నిశ్చల్ పాల్గొన్నారు. ● అలాగే కదిరి బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ వేణుగోపాల్రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జ్ పూల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి.. ఎన్పీకుంట: పెడబల్లి పంచాయతీ ఎన్జీపీ తండా, పెడబల్లి గ్రామాలకు చెందిన 82 కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి చేరాయి. పెడబల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త ముసల్రెడ్డి గారి హరీష్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి బీఎస్ మక్బూల్ అహ్మద్, హిందూపురం ఎంపీ బోయ శాంతమ్మ సమక్షంలో పెడబల్లి కి చెందిన 22 కుటుంబాలు, ఎన్జీపీతండాకు చెందిన 60 కుటుంబాలు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కేశవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాషా, పార్టీ సీనియర్ నాయకులు బాలకృష్ణనాయుడు, మాజీ ఎంపీపీ సోమిరెడ్డి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి దేశాయ్ భారతీరెడ్డి, ఎం.పుల్లారెడ్డి, ఎం.మహేశ్వరరెడ్డి, ఉమాశంకర్రెడ్డి, తిరుమలనాయుడు తదితరులు పాల్గొన్నారు. తేనీటి విందు.. పాపన్నగారిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు ఆవుల బాలకృష్ణనాయుడు స్వగృహంలో ఏర్పాటు చేసిన తేనీటి విందులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి బీఎస్ మక్బూల్ అహ్మద్, ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మ, నాయకులు పూల శ్రీనివాస్రెడ్డి, అత్తార్ చాంద్బాషా పాల్గొన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆవుల శ్రీదేవి, జేసీఎస్ కన్వీనర్ ఆదినారాయణరెడ్డి, ఎంపీటీసీ తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నుంచి వేలాదిగా వైఎస్సార్సీపీలోకి మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో చేరికలు వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ప్రతిన -
అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం
పుట్టపర్తి టౌన్: విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరమని డీఎఫ్ఓ నాగరాజునాయక్ పేర్కొన్నారు. అగ్ని మాపక వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఎనుములపల్లి జిల్లా పరిషత్, వాసవీ ఇంగ్లిష్ మీడియం పాఠశాలల విద్యార్థులకు ప్రమాదాల నివారణపై అవగాహనతోపాటు మాక్డ్రిల్ నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఏవిధంగా బయటపడాలో తెలిపే కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు వంట పూర్తి చేసిన వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేయాలన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫైర్ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డీఎఫ్ఓ నాగరాజు నాయక్ కొనసాగుతున్న అగ్నిమాపక వారోత్సవాలు మాక్ డ్రిల్తో అవగాహన కల్పిస్తున్న అధికారులు -
12.6 కిలోమీటర్లు, రూ.18 కోట్ల వ్యయం
రహదారులు నాగరికతకు చిహ్నాలంటారు. రోడ్డు సౌకర్యం ఉన్న ప్రతి పల్లెలోనూ ప్రగతి పరుచుకుంటుంది. కానీ గత టీడీపీ పాలకులు రహదారుల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. కొన్ని గ్రామాలకూ కాలిబాటలే దిక్కయ్యాయి. ఎన్నో పల్లెలు ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండిపోయాయి. కనీసం అంబులెన్స్ కూడా వెళ్లలేని స్థితిలో ఎందరో గ్రామీణుల ప్రాణాలు గాల్లో కలిశాయి. ఇతర గ్రామాలకు వెళ్లే అవకాశం లేక బాలికలు చదువులకు దూరమయ్యారు. కానీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్మోహన్రెడ్డి పల్లెలకు ప్రగతి బాటలు వేశారు. గ్రామాల్లో అంతర్గత రహదారులతో పాటు పల్లెలను పట్టణాలకు కలుపుతూ తారు రోడ్లు వేశారు. అలాగే రూ.కోట్లు ఖర్చు చేసి అంతర్రాష్ట్ర రహదారులతో పాటు జాతీయ రహదారులను అభివృద్ధి చేశారు. అర్ధరాత్రి వేళ కూడా మారుమూల పల్లెలకూ వెళ్లే సౌకర్యం కల్పించారు. ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్లినా తళతళమంటూ మెరిసే తారు రోడ్లు, పల్లెపల్లెనా సిమెంట్ రోడ్లు దర్శనమిస్తున్నాయి. – సాక్షి నెట్వర్క్ -
పరమటివీరన్నకు భారీగా పన్నారపు బండ్లు
బత్తలపల్లి: మూగజీవాల పట్ల కరుణచూపే ఆరాధ్యదైవం పరమటివీరన్నకు శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని మంగళవారం బత్తలపల్లి, తాడిమర్రి, ధర్మవరం, అనంతపురం ప్రాంతాల నుంచి భారీగా పశువులు, పన్నారపు బండ్లు తరలివెళ్లాయి. తాడిమర్రి మండలం ఆత్మకూరు సమీపంలో వెలసిన పరమటివీరన్నకు మొక్కుకుంటే పశువులకు కీడు జరగదన్నది ప్రజల విశ్వాసం. దీనిని పాటించే రైతులు తమ ఆవులు, గేదెలు ప్రసవించిన మొదటి రోజున పాలను ఆయనకు సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. రైతులు పన్నారపు బండ్లు, పశువులు, ట్రాక్టర్లను అందంగా అలంకరించుకుని వెళ్లి ప్రదక్షిణలు చేశారు. ప్రతి ఇంటి నుంచి తీసుకెళ్లిన పిడికెడు బియ్యం, బేడలు, బెల్లం సమర్పించారు. టీడీపీ ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగి కంబదూరు: మండలంలోని మర్రిమాకులపల్లి పంచాయతీలో ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు తనయుడు చేపట్టిన కార్యక్రమంలో అచ్చంపల్లికి చెందిన రమేష్ అనే ప్రభుత్వ ఉద్యోగి పాల్గొన్నారు. ఈయన శ్రీసత్యసాయి జిల్లా అమరాపురం ప్రభుత్వ పాఠశాలలో రికార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. టీడీపీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనడం చర్చానీయాంశమైంది.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబు పై గాడిద సామెత
"నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది.." ఫుల్ జోష్ లో వంగా గీత
వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
బుల్లితెర నటి పర్సనల్ వీడియో లీక్
బేర్ పంజా..భారీ నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
బఠానీల ఉచిత దిగుమతి గడువు పెంపు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
రైతులను ఉద్దేశించి సీఎం జగన్ అద్భుత ప్రసంగం
తప్పక చదవండి
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement