-
అర్ధరాత్రి వరకుగిడ్డి ఈశ్వరి ప్రచారం
కొయ్యూరు: పాడేరు టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అర్ధరాత్రి వరకు ప్రచారం నిర్వహిస్తూ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు. మంగళవారం కంఠారం, బాలారం, పాత బాలారం గ్రామాల్లో ఆమె రాత్రి పొద్దు పోయే వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మన్యంలో సాయంత్రం ఐదు దాటిన తర్వాత ప్రచారం చేయరాదు. అయినా నిబంధనలను ఉల్లంఘించారు. పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల కిందట టీడీపీ నుంచి పోటీ చేస్తారని మొదట ప్రకటించిన రమేష్నాయుడు వేళ దాటేక ప్రచారం చేస్తే రెండు కేసులు నమోదు చేశారు. ఇప్పుడు మౌనం వహించడాన్ని అందరూ ఆక్షేపిస్తున్నారు. నిబంధనలు కొందరికేనా అని ప్రశ్నిస్తున్నారు. -
అల్లూరికి ఘన నివాళి
సాక్షి.పాడేరు: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు శత వర్థంతి సందర్భంగా మంగళవారం ఆయన చిత్రపటానికి పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పూలమాలవేసి నివాళులర్పించారు. తన క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గిరిజన చరిత్రలో అల్లూరి సీతారామరాజుకు ఉన్న ప్రాధాన్యంతోనే సీఎం జగన్మోహన్రెడ్డి ఆయన పేరుతో జిల్లాను ఏర్పాటు చేశారన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ తమర్భ నరసింగరావు,చింతపల్లి ఎంపీపీ, జడ్పీటీసీలు కోరాబు అనుషాదేవి, పోతురాజు బాలయ్యపడాల్, మండల అధ్యక్షుడు మోరి రవి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్నదొర, మార్కెట్ కమిటీ చైర్మన్ కూతంగి సూరిబాబు, ఎంపీటీసీ నరసింహమూర్తి,సర్పంచ్ గబ్బాడ చిట్టిబాబు పాల్గొన్నారు. -
డోలీ కష్టాలు లేనట్టే..
ఒకప్పుడు గిరి శిఖరంలో ఉన్న ఆ గ్రామాలకు దట్టమైన అటవీ ప్రాంతంలో కాలినడకన వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రూ.9.17 కోట్లతో చేపట్టిన రింగ్ రోడ్డు, బ్రిడ్జి నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. కొద్దిరోజుల్లో వినియోగంలోకి రానుండటంతో లంగుపర్తి పంచాయతీలోని తొమ్మిది గ్రామాల గిరిజనుల్లో ఆనందం నెలకొంది.అనంతగిరి: మండలంలోని లంగుపర్తి పంచాయతీ పరిధిలోని రాళ్లవలస, కరకవలస, కుంభర్తి, దింశవలస, చీడివలస, ఎగువపట్టి, దిగువపట్టి, ఎగువపాడు లంగుపర్తి గ్రామాలు కొండల మీద ఉన్నాయి. ఇవి మండల కేంద్రానికి పంచాయతీ కేంద్రమైన లంగపర్తి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి ఈ పంచాయతీ పరిధిలో శివారు గ్రామాలన్నీ సుమారు 10 కిలోమీటర్ల దూరంలో కొండల మీద ఉన్నాయి. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో దట్టమైన అటవీ ప్రాంతంలో కాలినడకన వెళ్లాలి. రూ.7 కోట్లతో రోడ్డు నిర్మాణం.. అత్యవసర పరిస్థితుల్లో డోలీలపై ఆధారపడాల్సిందే. వీరి సమస్యను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. ప్రధా నమంత్రి గ్రామ సడక్ యోజన పథకంలో గిరి శిఖర గ్రామాలకు 10.5 కిలోమీటర్ల మేర రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.7 కోట్లు మంజూరు అయ్యాయి. ఈ నిధులతో రెండేళ్ల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. ఇదే మార్గంలోని లుంగపర్తి గెడ్డపై 2.17 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. ఈ పనులు చివరి దశకు చేరుకున్నాయి. పంచాయతీరాజ్ ప్రాజెక్ట్స్ అధికారులు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. కొద్ది రోజుల్లో నిర్మాణ పనులు పూర్తి కానుండటంతో తొమ్మిది గిరి శిఖర గ్రామాల పరిధిలోని సుమారు 15వేల మంది గిరిజనుల్లో ఆనందం నెలకొంది.నాణ్యత ప్రమాణాలతో నిర్మాణం రోడ్డు, బ్రిడ్జి నిర్మాణానికి రెండేళ్ల కిత్రం నిధులు మంజూరయ్యాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వెంటనే పనులు ప్రారంభించాం. నాణ్యత ప్రమాణాలతో పనులు జరుగుతున్నాయి. నిత్యం పర్యవేక్షిస్తున్నాం. ఈ రోడ్డు, బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయితే శిఖర గ్రామాల ప్రజలకు అవస్థలు తప్పనున్నాయి. – విజయ్, ఏఈ, పీఆర్ ప్రాజెక్ట్స్లంగుపర్తి సమీపంలోని గెడ్డపై రూ.2.17 కోట్లతో నిర్మించిన వంతెన లంగుపర్తి పంచాయతీ కొండల్లోని గ్రామాలకు రింగ్ రోడ్డు సౌకర్యం రూ.9.7 కోట్లతో నిర్మాణం చివర దశలో పనులు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో నిధులు మంజూరు 15 వేల మంది జనాభాకు తప్పనున్న అవస్థలు మేలు చేసిన ప్రభుత్వం రోడ్డు లేకపోవడం వల్ల శివారు గ్రామాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణాలమీదకు వస్తే డోలీలో మోసు కుని రావాల్సిందే. ప్రభుత్వం చొరవతో రోడ్డు, బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి. పనులు చురుగ్గా జరుగుతున్నాయి. తమ పంచాయతీలోని గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మేలు చేసింది. మేమంతా సీఎం జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటాం. – జన్ని సన్యాసిరావు, సర్పంచ్, లంగుపర్తి -
ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ
సాక్షి,పాడేరు: జిల్లాలో పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్ ప్రక్రియ మంగళవారం ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో నిర్వహిస్తున్న ఈ ప్రక్రియలో ఇప్పటివరకు పాడేరు, అరకు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 7,512 మంది ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత తెలిపారు. పాడేరులో 2,297 మంది, అరకులోయ నియోజకవర్గంలో 2,242 మంది, రంపచోడవరంలో 2,973 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో పాల్గొన్నారని ఆమె పేర్కొన్నారు. హోం ఓటింగ్ను మంగళవారం జిల్లాలో 202 మంది వయో వృద్ధులు, దివ్యాంగులు సద్వినియోగం చేసుకున్నారని ఆమె పేర్కొన్నారు. ఓటింగ్ ప్రక్రియ పరిశీలన రంపచోడవరం: స్థానిక ఏపీఆర్ బాలికల పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను కలెక్టర్ ఎం. విజయ సునీత మంగళవారం పరిశీలించారు. రంపచోడవరం ఆర్వో ప్రశాంత్కుమార్, చింతూరు పీవో చైతన్యతో కలిసి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అరకులోయ రూరల్: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మంగళవారం 987 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కును వినియోగించుకున్నారని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అభిషేక్ తెలిపారు. 7,512 మంది ఉద్యోగులు వినియోగం కలెక్టర్ విజయసునీత -
బీజేపీ అభ్యర్థులను ఓడించండి
● సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ అరకులోయ రూరల్: బీజేపీ అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో మంగళవారం అరకు పార్లమెంట్ సీపీఎం అభ్యర్థి అప్పలనరస, అరకు అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి శెట్టి గంగాధరస్వామి ఆధ్వర్యంలో ప్రచారర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె పార్టీ శ్రేణలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇండియా కూటమి అభ్యర్థుల విజయంతోనే గిరిజన హక్కులు చట్టాలను పరిరక్షించు కోగలమన్నారు. రాష్ట్రంలో, దేశంలో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే హింసాకాండ మొదలు అవుతుందన్నారు. ఈ సమావేశంలో సీపీఎం నేతలు లోకనాథం, సురేంద్ర, బాలదేవ్ పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్
కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి
నర్రెడ్డి నాటకాలు చాలు
థ్యాంక్స్ టూ మనీష్ మల్హోత్రా.. సమ్మర్ 2024 స్పెషల్ డిజైన్స్ (ఫొటోలు)
సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
టీ20 వరల్డ్కప్ 2024 కోసం మరో జట్టు ప్రకటన
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్
‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
హైదరాబాద్లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్!
తప్పక చదవండి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement