-
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (గురువారం) మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల మే 9 వ తేదీ షెడ్యూల్ను వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ బుధవారం విడుదల చేశారు.సీఎం జగన్.. గురువారం ఉదయం 10 గంటలకు కర్నూలు పార్లమెంట్ పరిధిలోని కర్నూలు సిటీ వై ఎస్సార్ సర్కిల్లోని ఎస్వీ కాంప్లెక్స్ రోడ్డులో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు అనంతపురం పార్లమెంట్ పరిధిలోని కళ్యాణ దుర్గం నియోజకవర్గం కొల్లపురమ్మ టెంపుల్ రోడ్డులో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట పార్లమెంట్ పరిధిలో రాజంపేట నియోజకవర్గంలో కోడూరు రోడ్డులో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు. -
Banaganapalle: ఓటమి భయంతో దాడులకు తెగబడిన బీసీ జనార్ధన్రెడ్డి
కోవెలకుంట్ల: ఓ వైపు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటం.. మరో వైపు ప్రజల్లో సరైన ఆదరణ కనిపించకపోవడంతో టీడీపీ అభ్యర్థుల్లో ఓటమి భయం వెంటాడుతోంది. ఈ క్రమంలో బనగానపల్లె నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బీసీ జనార్ధన్రెడ్డి ఎలాగైనా ఓటర్లను నయానో.. భయానో తమ వైపు మళ్లించుకునేందుకు ప్రధాన అస్త్రాలను బయటకు తీస్తున్నాడు. ఇప్పటికే రెండు నెలల నుంచి విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నాడు. వీటి ద్వారా గెలుపుసాధ్యం కాదని భావించి తాజాగా భౌతిక దాడులకు దిగాడు. మంగళవారం బనగానపల్లె పట్టణంలో కూరగాయల మార్కెట్ వద్ద బీసీ జనార్ధన్రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ సమక్షంలో టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. రౌడీయిజం ప్రదర్శిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులపై కర్రలు, రాడ్లతో దాడిచేశాయి. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎన్నికల వేళ ఓటమి భయంతో బరితెగింపు చర్యలకు పాల్పడటంతో ఓటర్లు భయాందోళన చెందుతున్నారు. వ్యాపారవేత్తగా భూకబ్జాలతో కోట్లాది రూపాయలు గడించిన బీసీ జనార్దన్రెడ్డి 2014 సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ ప్రవేశం చేశాడు. ఈ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. మొదటిసారి ఎమ్మెల్యే కావడంతో నియోజకవర్గంలోని వివిధ వర్గాల ప్రజలపై విశ్వరూపం చూపాడు. ప్రభుత్వ ఉద్యోగులకు నరకం చూపించాడు. ఐదేళ్లపాటు నీరు– చెట్టుపేరుతో కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును దోచుకున్నాడు. దీంతో 2019 ఎన్నికల్లో నియోజకవర్గ ఓటర్లు బీసీకి బుద్ధి చెప్పి ఓడించారు. ఈ నెల 13వ తేదీన 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉండటంతో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో డబ్బులు, ప్రలోభాలు, భౌతిక దాడులను ఎన్నికల అ్రస్తాలుగా ఎంచుకున్నాడు.ప్రజా బలం లేక.. 2019లో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమం, అభివృద్ధితో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేశారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసి నవరత్న పథకాల్లో మహిళలకే అధిక ప్రాధాన్యత కలి్పంచి పేదరిక నిర్మూలను కృషి చేశారు. పేదలు, పెత్తందారుల మధ్య జరుగుతున్న ఎన్నికల్లో పెత్తందారులు టీడీపీ వైపు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల పక్షాన పోరాటం చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్సార్సీపీ బనగానపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రామిరెడ్డికి గ్రామాల్లో వస్తున్న ఆదరణను ఓర్వలేక ఈ ఎన్నికల్లో మరలా ఓటమి తప్పదని భావించాడు. ఎలాగైనా గెలవాలన్న కుతంత్రంతో బరి తెగింపు చర్యలకు పాల్పడుతున్నాడు. నియోజకవర్గంలో ఆ పారీ్టకి ప్రజాబలం లేకపోవడంతో డబ్బును ప్రధాన అస్త్రం చేసుకుంది. అరకొరగా నిర్వహిస్తున్న ప్రచారానికి సైతం అద్దె కార్యకర్తలపై ఆధార పడాల్సి రావడంతో ఆ పార్టీ శ్రేణులను కలవర పరుస్తోంది. సొంత నేతలకు వడ్డీ లేని రుణాలు..ఓటర్లకు టోకెన్లు ఎన్నికలు సమీపిస్తుండంతో గెలుపుకోసం బీసీ కుయుక్తులకు తెరలేపాడు. పారీ్టలో చేరిన వైఎస్సార్సీపీ గ్రామ నాయకులకు కేడర్ను బట్టి రూ. 3 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు డబ్బులు ముట్టజెప్పాడు. ఇందులో ఎక్కువభాగం కొలిమిగుండ్ల మండలంలోని పలు గ్రామాల్లో టీడీపీలో చేరిన వైఎస్సార్సీపీ నాయకులకు డబ్బులు అందజేశాడు. అలాగే టీడీపీలో కొనసాగుతున్న నాయకులకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నాడు. ఒక్కో నాయకుడికి రూ. 5 లక్షల నుంచి రూ. 20 లక్షలవరకు వడ్డీలేని రుణాలు ఇచ్చాడు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఓటర్లకు ఓటరుస్లిప్లు అందజేస్తున్నారు. ‘బాబు ష్యూరిటీ– భవిష్యత్ గ్యారెంట్’ పేరుతో ఓటరు స్లిప్కు మరోవైపు టోకన్ ముద్రించిన స్లిప్లు పంపిణీ చేశారు. త్వరలో పట్టణ ప్రాంతాల్లో ఓటుకు రూ. 3 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 2 వేల చొప్పున డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. డబ్బులు పంపిణీ చేసే రోజు ఓటర్స్లిప్కు ఉన్న టోకెన్ చూపించిన వారికి డబ్బులు అందజేయనున్నారు. టీడీపీ సానుభూతి పరులైన ఓటర్లు, తటస్ట ఓటర్లకు స్లిప్లు పంపిణీ చేశారు. హత్యాయత్నం కేసులో జైలు..మొదటి నుంచి బీసీ జనార్ధన్రెడ్డికి క్రూరస్వభావం ఉంది. ప్రతి చిన్న విషయంలో జోక్యం చేసుకుని అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెట్టే నైజం. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఆ పారీ్టకి అనుకూలంగా ఉన్నాడన్న నెపంతో బనగానపల్లె పట్టణానికి చెందిన ఎస్టీ వర్గానికి చెందిన కోనేటి దుర్గ అనే వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ కేసులో బీసీ నెల రోజులపాటు కటకటాలపాలైన విషయం తెలిసిందే. ఆ క్రూరత్వాన్ని మళ్లీ ప్రదర్శిస్తున్నాడు. సామ, వేద, దండోపాయాలు ప్రదర్శించి ఎన్నికల్లో గెలవాలని కుతంత్రం చేస్తున్నాడు. ఎన్నికలకు ముందే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న బీసీ రాబోయే రోజుల్లో మరెంత బరి తెగిస్తాడని బనగానపల్లె ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వ్యక్తికి త్వరలో జరగబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఓటర్లు నిర్ణయించుకున్నారు. -
నేతన్నపై శీతకన్ను
నేతన్న నేస్తం లబ్ధి వివరాలు‘‘ఈమె పేరు మహాలక్ష్మి. నందవరం గ్రామం. భర్త అకాల మరణం పొందడంతో కుటుంబ భారమంతా ఆమైపెనే పడింది. మగ్గం ఆడితే తప్పా ఇంటిల్లిపాదికి మూడుపూటలా పెట్టే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలన వరమైంది. నేతన్న నేస్తం కింద రూ.24 వేల చొప్పున ఐదేళ్లలో రూ.1.20 లక్షలు అందుకుంది. అమ్మఒడి ద్వారా రూ.55 వేలు పొంది తన పిల్లలను చదివిస్తోంది. ప్రతి నెలా వితంతు పింఛన్ అందుకుంటోంది. మోడిబారిన మగ్గం బతుకులకు సంక్షేమ రంగులు అద్దిన మహానుభావుడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి’’ అంటూ మహాలక్ష్మి మహానందంతో చెబుతోంది. నేతన్న నేస్తం ద్వారా మరో ఐదేళ్లపాటు చేనేతలకు మేలు చేస్తానంటూ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం సంతోషంగా ఉందని అంటోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చేనేత కుటుంబాలు 4,148 ఏటా నేతన్న నేస్తం కింద ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ.24 వేలు ఐదేళ్లలో ఒక్కో కుటుంబం అందుకున్నది రూ.1.20 లక్షలు జిల్లాలోని చేనేతలు పొందిన లబ్ధి రూ.47.58 కోట్లు ఎమ్మిగనూరు: ప్రజాసంకల్ప పాదయాత్ర ద్వారా అణగారిన చేనేత బతుకులను కళ్లారా చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి వారికి చేయూతనిచ్చేందుకు సంకల్పించారు. చేనేత కార్మికుల కోసం ఐదేళ్లుగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని మేలు చేస్తున్నారు. ఐదేళ్లపాటు బడ్జెట్లో చేనేతల కోసం ప్రత్యేకంగా రూ.1000 కోట్లు కేటాయించి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లారు. నేతన్న నేస్తం ద్వారా అర్హులైన చేనేత కుటుంబాలకు ఏటా రూ.24వేలు చొప్పున వారి అకౌంట్లలోనే జమ చేస్తుండటంతో నేతన్నలకు ఆర్థిక భరోసా లభించింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చేనేత కుటుంబాలకు రూ.47.58 కోట్లు లబ్ధి చేకూరింది. అందులో ఎమ్మిగనూరు నియోజకవర్గానికే రూ.24.52కోట్ల లబ్ధి చేకూరడం విశేషం. ఈ పథకం ద్వారా జిల్లాలో 4,148 కుటుంబాలకు మేలు జరిగింది. ఐదేళ్లపాటు ఒక్కో చేనేత కుటుంబానికి రూ.1.20లక్షల ఆర్థిక తోడ్పాటు అందింది. ప్రభుత్వ చేయూతతో చేనేతల్లో ఆత్మస్థైర్యం పెరిగింది. మరో ఐదేళ్లపాటు నేతన్న నేస్తం కొనసాగిస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడంతో నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో నేతన్న నేస్తం ప్రస్తావన చేయకపోవడంతో బాబొస్తే నేతన్న నేస్తం రద్దవుతుందని ఆందోళన చెందుతున్నారు. బాబు పాలనలో దుర్బర జీవితం అగ్గిపెట్టెలో చీరను ఇమర్చే నైపుణ్యం ఒకప్పుడు ఎమ్మిగనూరు చేనేతల సొంతం. ఇక్కడి చీరలు అంతర్జాతీయ ఖ్యాతిని పొందాయి. మారుతున్న సంస్కృతి, పాశ్చాత్య సంప్రదాయాల మూలంగా చేనేతలకు ఆదరణ తగ్గింది. వారి సంక్షేమార్థం నెలకొల్పిన సంఘాలు, క్లస్టర్లు సైతం అవినీతి ఊబిలో కూరుకుపోయాయి. మాటల గారడితో చేనేతలను ఐదేళ్లు మభ్యపెట్టిన గత పాలకులు పలాయనం చిత్తగించారు. నేసిన నూలు చీరలకు గిట్టుబాటు దక్కక చేనేతలు గద్వాల పట్టు చీరలవైపు మొగ్గుచూపారు. గద్వాల చీరలకు వన్నెలద్ది గిట్టుబాటు సరిచూసుకుంటున్న తరుణంలో ముడి సరుకు అందడం ఆగిపోయింది. దీంతో తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాణ్యమైన పట్టును అందించి చీరలను నేయించుకునే మాస్టర్ వీవర్స్ కాలానుగుణంగా నాణ్యతలేని (టెస్టెడ్) జెరిని అందిస్తున్నారు. ఈ చీరను నాలుగు రోజుల్లో పూర్తి చేస్తే వచ్చే రూ. 800ల కూలి రూ.400లకు పడిపోయింది. చేనేతలు తామె ముడిసరుకును తీసుకుని తయారు చేసిన చీరలను మాస్టర్ వీవర్స్ వద్ద విక్రయానికి పోతే తక్కువ ధరకు కొనుగోలు చేసి చేనేతల కష్టాన్ని కాజేసేశారు. చేనేతల కోసమంటూ బాబు పాలనలో రెండు పర్యా యాలు ఎన్నికలకు ముందు అప్పెరల్ పార్కుకు పునాదిరాళ్లు వేసి మమ అనిపించారు. ‘‘చేనేతల సంక్షేమానికి పెద్దపీట వేస్తామంటూ ఎమ్మిగనూరు సభలో ప్రగల్భాలు పలికిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోమారు చేనేతల చెవిలో పూలు పెట్టారు. టీడీపీ–జనసేన ప్రకటించిన ఉమ్మడి మేనిఫెస్టోలో చేనేతల బతుకుల్లో మార్పులు తెచ్చిన ‘నేతన్న నేస్తం’ ప్రస్తావన లేకపోవడంతో చేనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటిలాగే అబద్ధపు హామీలు.. ఆపై విస్మరించడం అలవాటైన బాబుకు ఈసారి ఎన్నికలకు ముందుగానే నేతనలకు మొండి చేయి చూపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐదేళ్లపాటు నేతన్న నేస్తంతో చేనేతలకు అండగా నిలిచారు. చేనేతలకు నేతన్న నేస్తం ద్వారా మరింత మేలు చేస్తానని మేనిఫెస్టోలో చేర్చి చేనేతల పక్షపాతిగా మారారు.’’ చేనేతల చెవిలో చంద్రన్న పూలు టీడీపీ మేనిఫెస్టోలో‘ నేతన్న నేస్తంకు దక్కని చోటు అప్పెరల్ పార్కు తరహాలో మరోసారి మోసం నేతన్న నేస్తంతో ఆదుకున్న జగన్ ఏటా రూ.24 వేల ఆర్థిక సాయం వైఎస్సార్సీపీ పాలనలో ఇలా వైఎస్సార్సీపీ పాలనలో నేతన్న నేస్తం ద్వారా చేనేతలకు జిల్లాలో 47.58కోట్ల లబ్ధి చేకూరింది. చేనేత క్లస్టర్ల ద్వారా 90శాతం సబ్సిడీతో చేనేతలకు అధునాతన యంత్ర సామగ్రి అందజేసింది. ఎమ్మిగనూరు, ఆదోని క్లస్టర్లలో రూ.90లక్షలతో యంత్రసామగ్రి పంపిణీ చేసింది. ప్రభుత్వ చొరవ.. చేయూతతో చేనేత ఉత్పత్తుల వ్యాపారం విస్తరించి నేతన్న కుటుంబాల్లో వెలుగులు నిండాయి. -
నంద్యాలలో గాలివాన బీభత్సం
నంద్యాల(అర్బన్): నంద్యాలలో మంగళవారం రాత్రి గంటన్నర పాటు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రెండు నెలలుగా ఎండవేడిమి, ఉక్కపోతతో అల్లాడిన జనానికి కాస్త ఉపశమనం కలిగింది. నంద్యాల మొత్తం తడిసి ముద్దయ్యింది. ఉన్నఫలంగా పెద్ద శబ్దాలతో ఉరుములు, మెరుపులు రావడంతో పట్టణ ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు సాహసించలేక పోయారు. పలు ఇళ్ల ముందు ఉన్న పైకప్పుల రేకులు ఎగిరిపోయాయి. బైరవాణికుంటలో 4 కేజీల వడగండ్ల వాన దేవనకొండ: మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. బైరవాణికుంటలో సుమారు 4 కేజీల వడగండ్లు లభ్యమయ్యాయి. గ్రామంలో పిడుగుపాటుకు 20 మేకలు మృత్యువాత పడ్డాయి. సుమారు రూ.2 లక్షలు నష్టపోయినట్లు బాధితుడు తెలిపాడు. అలాగే నేలతలమరి, గుండ్లకొండ గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. వడగండ్ల వాన కర్నూలు (అగ్రికల్చర్): కొద్ది రోజులుగా ఎండలు, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు కొంత ఉపశమనం లభించింది. మంగళవారం సాయంత్రం నుంచి కర్నూలు సహా వివిధ పట్టణాల్లో పెనుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. కర్నూలు, కల్లూరు, చిన్నటేకూరు, పెద్దటేకూరు, ఉలిందకొండ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. కర్నూలు, కల్లూరు మండలాల్లోని వివిధ గ్రామాల్లో వడగండ్లు పడ్డాయి. ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. -
బాబుకు మతి భ్రమించింది
పాణ్యం: ఆధారాలతో నిరూపించినా తనపై కబ్జాల ఆరోపణలు చేస్తున్న చంద్రబాబుకు మతి భ్రమించిందని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం పాణ్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏ పార్టీ అయినా సొంత నిర్ణయాలు, మేనిఫెస్టో, విధి విధానాలుంటాయి.. అయితే టీడీపీలో మాత్రం ఇతర పార్టీల నుంచి కాపీ చేసినవే ఉంటాయి.. ప్రస్తుత ఎన్నికల్లో చిన్న పార్టీలు కూడా సొంతంగా మేనిఫెస్టో రూపొందించుకున్నాయి.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం సొంత మేనిపెస్టో తయారు చేసుకోలేని దద్దమ్మ అని విమర్శించారు. మీకు లబ్ధి చేకూరి ఉంటేనే ఓటు వేయండని చెప్పిన దమ్మున్న నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. అలా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో బాబు ఒక్కనాడైనా అలా చెప్పగలిగాడా అని ప్రశ్నించారు. ఇంట్లో ఆడవారితో రాజకీయమా.. అసెంబ్లీలో తన కుటుంబ సభ్యులను అన్నారని ఆపాదించుకొని మీడియా ముందుకు వచ్చి ఏడ్చి ఇంట్లో ఆడవాళ్లతో రాజకీయం చేశాడన్నారు. నాయకుడు ఆదర్శంగా ఉండాల్సింది పోయి నీచ రాజకీయ సంస్కృతికి తెరలేపారని మండిపడ్డారు. మీ కుటుంబ సభ్యుల కబ్జాలు తెలసుకోండి.. తరచూ తనపై కబ్జాలు అంటూ ప్రచారం చేసే టీడీపీ వాళ్లు వారి కుటుంబ సభ్యుల కబ్జాల గురించి తెలుసుకోవాలని హితవు పలికారు. నంద్యాల ఎంపీ అభ్యర్థి శబరి.. నీ తండ్రి కబ్జాలు ప్రజలందరికీ తెలుసన్నారు. నీ తండ్రి.. మైదుకూరుకు చెందిన వారి ప్లాట్ను లాక్కొని ఇంటిని నిర్మించున్నారన్నారని గుర్తు చేశారు. టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి భర్త, బంధువు కబ్జాల గురించి తెలుసుకుంటే బాగుంటుందన్నారు. కబ్జరాయుళ్లను పక్కనబెట్టుకొని తిరుగుతున్నది నీవే బాబు అని ఎద్దేవా చేశారు. తాను ఆధారాలతో నిరూపించినా బాబు మతిభ్రమించి ఆరోపణలు చేస్తున్నాడన్నారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సద్దల సూర్యనారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు పీవి బద్రీనాథ్రావు, ఉప సర్పంచ్ పాలం చంద్రశేఖర్రెడ్డి, గగ్గటూరు శ్రీనివాసరెడ్డి, రామలక్ష్మయ్య పాల్గొన్నారు. సొంతమేనిఫెస్టో తయారు చేసుకోలేని నాయకుడు చంద్రబాబు ఆధారాలతో నిరూపించినా తనపై పదేపదే కబ్జాలంటూ దుష్ప్రచారం శబరి తండ్రి చేసిన కబ్జాలు కనిపించడం లేదా? గౌరు చరిత భర్త, బంధువుల ఆగడాలు ఎవరికి తెలియవు? విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కాటసాని
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తెలంగాణ: మళ్లీ భారీ వర్షం కురిసే ఛాన్స్
శతక్కొట్టిన ఆటపట్టు.. టీ20 వరల్డ్కప్ క్వాలిఫయర్ ఛాంపియన్గా శ్రీలంక
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్
హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?
సీవీడ్తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
మిస్టర్ బీస్ట్ బర్త్డే గిఫ్ట్ : ఖరీదైన టెస్లా కారు కావాలా నాయనా?
కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్’ (ఫొటోలు)
బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement