-
కూటమి చర్యలు అనైతికం
నెల్లూరు (దర్గామిట్ట): కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్నికల వేళ అక్రమాలకు పాల్పడుతున్నాయని నెల్లూరు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ అభ్యర్థి వి.విజయసాయిరెడ్డి అన్నారు. బుధవారం నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ నాయకులు విజయసాయిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో కొందరు కూటమి పార్టీ నాయకులు పోలింగ్ బూత్లోకి ప్రవేశించి నిబంధనలు ఉల్లంఘించారని చెప్పారు.టీడీపీ సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణ అనుచరుడు పట్టాభిరామిరెడ్డి లాంటి వ్యక్తులు పోలింగ్ జరిగే చోటుకు వెళ్లారని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్లో కొందరు బీఎల్ఓలు నిబంధనల్ని ఉల్లంఘించారని తెలిపారు. కొందరు అధికారులు కూటమికి కొమ్ము కాస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో నెల్లూరు రిటరి్నంగ్ అధికారి వికాస్ మర్మత్కు ఆధారాలతో ఫిర్యాదు చేశామని చెప్పారు. ఏడుగురు సిబ్బందిపై ఫిర్యాదు చేస్తే ఒకరి మీద చర్య తీసుకున్నారని ఆయన వెల్లడించారు. ఈ ఎన్నికల్లో అక్రమాలకు కొమ్ముకాస్తున్న అధికారులపై ఆధారాలను సేకరిస్తున్నామన్నారు. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, రూప్కుమార్ యాదవ్ రౌడీలని.. వీరికి కొందరు పోలీసులు కొమ్ము కాస్తున్నారని చెప్పారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా ఆయనకు తనవంతు సాయం అందిస్తున్నారన్నారు. డబ్బులతో గెలవచ్చనుకుంటున్నారు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో చంద్రబాబు డబ్బున్న వాళ్లకే టిక్కెట్లు ఇచ్చారని మండిపడ్డారు. డబ్బులతో గెలవ వచ్చని వాళ్లు భావిస్తున్నారన్నారు. ఓటుకు రూ.5 వేలు ఇచ్చి దాంతో గెలుస్తానని నారాయణ ధీమా వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల కోసం 1,200 మంది రౌడీలను, నారాయణ సిబ్బంది, విజయవాడ, హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారన్నారు. -
కౌంటింగ్ కేంద్రంలో పరిశీలన
నెల్లూరు(దర్గామిట్ట): కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ ఆదేశించారు. కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్రూమ్ను బుధవారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈవీఎంలను భద్రపర్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాలని ఆదేశించారు. నెల్లూరు సిటీ ఆర్వో, కమిషనర్ వికాస్ మర్మత్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ మలోల, నెల్లూరు నగర, రూరల్ తహసీల్దార్లు వెంకటేశ్వర్లు, సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఐటీఐల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం నెల్లూరు(అర్బన్): ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా కన్వీనర్, ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రిన్సిపల్ శ్రీధర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాసైన వారు గురువారం నుంచి జూన్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకొని వారికి కేటాయించిన సంఖ్యను గుర్తుంచుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వారికి సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో ఈ నెల 10 నుంచి వచ్చే నెల పది వరకు తమ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ను చేయించుకోవాలని సూచించారు. కౌన్సెలింగ్ తేదీలను మెసేజ్ రూపంలో తెలియజేయనున్నామన్నారు. వివరాలకు వెంకటేశ్వరపురంలోని బాలుర ఐటీఐ కళాశాలను సంప్రదించాలని సూచించారు. జిల్లాకు ట్రెయినీ ఐపీఎస్లు నెల్లూరు(క్రైమ్): సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు 163 మంది ట్రెయినీ ఐపీఎస్లను రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు కేటాయించారు. ఈ క్రమంలో జిల్లాకు మయాంక్ మిశ్రా, సిద్ధార్థ్ రామ్కుమార్, ప్రతీక్ సింగ్, ఖుష్మిశ్రా, సూరజ్, అభినవ్ ద్వివేది, జామాసోనర్, అషిమా వశ్వాణి, అపర్ణను కేటాయించారు. వీరందరూ జిల్లాకు బుధవారం చేరుకున్నారు. ఎన్నికల నిర్వహణ, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు చేపడుతున్న చర్యలను ఎస్పీ పర్యవేక్షణలో వీరు తెలుసుకోనున్నారు. ఎన్నికలు ముగిసేంత వరకూ వీరు ఇక్కడే ఉండనున్నారు. సమాజ సేవకు అంకితమవుదాం నెల్లూరు(అర్బన్): క్షతగాత్రులు, ప్రకృతి వైపరీత్యాల్లో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నవారికి స్వచ్ఛందంగా సేవలందిస్తూ.. సమాజ అభివృద్ధికి అంకితమవుదామని రెడ్క్రాస్ సొసైటీ జిల్లా సెక్రటరీ మస్తానయ్య పేర్కొన్నారు. ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మద్రాస్ బస్టాండ్ సమీపంలోని రెడ్క్రాస్ కార్యాలయంలో పలువురు సభ్యులు బుధవారం రక్తదానం చేశారు. తొలుత ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని నిర్వహించారు. హెన్రీడ్యూనాట్ చిత్రపటానికి నివాళులర్పించారు. తలసేమియా రోగులకు ఆటపాటలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. బ్లడ్ బ్యాంక్ కన్వీనర్ అజయ్బాబు, ఎమ్సీ మెంబర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్లు సీత, హరిత, రమ్య తదితరులు పాల్గొన్నారు. రవీంద్రుడి రచనలు మధురమైనవి నెల్లూరు(బృందావనం): రవీంద్రుడి రచనల్లో బాలల ప్రపంచం ఎంతో మధురంగా ఉంటుందని ప్రముఖ రచయిత్రి డాక్టర్ చంద్రలత పేర్కొన్నారు. నగరంలోని పురమందిరంలో రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సభను బుధవారం నిర్వహించారు. అడ్వొకేట్, రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సభ పోషక వ్యవస్థాపకుడు రమణారెడ్డి స్మృత్యర్థం నెల్లూరు వర్ధమాన సమాజ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గాయని చేజర్ల వినయ, గూడూరులోని డీఆర్డబ్ల్యూ కళాశాల విశ్రాంత తెలుగు అధ్యాపకురాలు లక్ష్మీసుహాసిని, బాలభవన్ డైరెక్టర్ గోవిందరాజు సుభద్రాదేవి, శ్రీనివాసులురెడ్డి, వర్ధమాన సమాజ కార్యదర్శి మజ్జిగ ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. -
జగన్ అంటే చంద్రబాబు, పవన్కు భయం
● వైఎస్సార్సీపీ నగరాధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచలరెడ్డి నెల్లూరు(బృందావనం): ‘సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు భయం. ఎన్నికల్లో ఓటమి భయంతో ఆ ఇద్దరూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు’ అని పార్టీ నెల్లూరు నగరాధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచలరెడ్డి అన్నారు. నగరంలో స్టోన్హౌస్పేట రేబాలవారి వీధిలో ఉన్న తన కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు సూపర్సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడన్నారు. ఆయన్ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. ఓటమి అంచున ఉన్న కూటమి నేతలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అబద్ధాలను ప్రచారం చేస్తున్నారన్నారు. నెల్లూరు పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేస్తున్న వేణుంబాక విజయసాయిరెడ్డికి ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. జిల్లా అభివృద్ధి కోసం ఆయన ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేశారన్నారు. ప్రస్తుతం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్రెడ్డి ఈ ఐదేళ్లపాటు ఎంపీగా జిల్లా ప్రగతికి ఎంతగానో కృషి చేశారన్నారు. జగన్మోహన్రెడ్డిపై చంద్రబాబు, పవన్ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆ ఇద్దరికీ ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. -
మట్టి తవ్వకం.. వెంచర్లకు పంపకం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మైపాడులో కోట్లాది రూపాయల విలువజేసే మట్టిని కొల్లగొట్టేందుకు స్కెచ్ వేసిన భూబకాసురుడు దువ్వూరు కల్యాణ్రెడ్డి.. దాన్ని చేజిక్కించుకోవడంలో సఫలీకృతులయ్యారు. పేరుకు ఇరిగేషన్, రెవెన్యూ నుంచి అనుమతులు పొంది.. పరిమితులను పక్కనబెట్టి యంత్రాల సాయంతో రాత్రీ, పగలనే తేడా లేకుండా ఇష్టానుసారంగా మట్టిని తవ్వించారు. ఆపై తీర ప్రాంతంలోని రియల్ ఎస్టేట్ వెంచెర్లకు వీటిని విక్రయించి భారీగా సంపాదించారు. అనుకూలంగా మార్చుకొని.. వాస్తవానికి మైపాడు చెరువు నుంచి మైపాడు, కొరుటూరు తదితర గ్రామాల్లోని పొలాలకు సాగునీరందుతోంది. దీంతో ఈ చెరువులో మట్టిని తవ్వి మరమ్మతులు చేపడితే నీటి నిల్వతో భూగర్భ జలాలు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ తరుణంలో తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. నిబంధనల మేరకు తవ్విన మట్టిని రైతుల అవసరాలకే వినియోగించుకోవాలి. అయితే దీన్ని తనకు అనుకూలంగా మార్చుకొని మైపాడుకు చెందిన దువ్వూరు కల్యాణ్రెడ్డి భారీగా వెనుకేసుకున్నారు. ఇలా దాదాపు రూ.రెండు కోట్లకుపైగా అక్రమంగా సంపాదించారు. భారీగా గుంతలు ఆయకట్టును దృష్టిలో ఉంచుకొని ఈ తవ్వకాలను చేపట్టాల్సి ఉంది. అయితే దీనికి విరుద్ధంగా భారీగా చేపట్టారు. చెరువు నుంచి బయటకు తీసుకెళ్లడం సులభంగా ఉండటంతో వీరి ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండాపోయింది. ఈ క్రమంలో 30, 40 అడుగుల లోతులో భారీ గుంతలు ఏర్పడ్డాయి. చెరువులో పాడి రైతులు పశువులను మేపుతుంటారు. ఈ తరుణంలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్కు దారి పంచాయతీ పరిధిలోని సుమారు 20 ఎకరాల్లో లేఅవుట్ను వేశారు. ప్రధాన రహదారి నుంచి ఈ లేఅవుట్కు వెళ్లాలంటే ఎనిమిది అడుగుల దారి మాత్రమే ఉంది. దీంతో కల్యాణ్రెడ్డిని సదరు యజమానులు కలిసి నగదును ముట్టజెప్పడంతో సుమారు 40 అడుగుల మేర దారిని లేఅవుట్కు కల్పించారు. శివాలయ భూమిలో ఈ దారిని ఏర్పాటు చేసినా చైర్మన్ కనుపూరు సురేంద్ర నోరు మెదపలేదు. ఆయనకూ నగదును ముట్టజెప్పారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మట్టిని అమ్ముకొని డబ్బును సంపాదించడంపైనే దృష్టి పెట్టిన కల్యా ణ్రెడ్డి.. గ్రామాభివృద్ధిపై దృష్టి పెట్టలేదని స్థానికులు పేర్కొంటున్నారు. బెదిరించి.. ఆపై ఆక్రమించి ప్రకృతి వనరులను కొల్లగొడుతూ కొందరు భూబకాసురులు రాజ్యమేలుతున్నారు. దోపిడీకి కాదేదీ అనర్హమనే రీతిలో చెలరేగిపోతూ మైపాడు చెరువులో కోట్లాది రూపాయల విలువజేసే మట్టిని మింగేశారు. దీన్ని రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలించి భారీగా సొమ్ము చేసుకున్నారు. బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారి భూములను లక్ష్యంగా చేసుకొని ఈ దమనకాండకు తెరదీశారు. ఊళ్లో పెద్ద మనిషిగా చెలమణీ అయ్యే కల్యాణ్రెడ్డి కనుసన్నల్లో ఈ అక్రమాలు అడ్డూఅదుపులేకుండా సాగాయి. మైపాడులో భూబకాసురుడు కల్యాణ్రెడ్డి కనుసన్నల్లో భారీగా అక్రమాలు పరిమితుల్లేకుండా చెరువులో యథేచ్ఛగా తవ్వకాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయం బడుగు, బలహీనవర్గాల భూముల్లో దౌర్జన్యంచెరువులో కొద్దిపాటి పొలంలో నిరుపేదలు వ్యవసాయం చేసుకొని కాలం గడుపుతుంటారు. అయితే వీరిని లక్ష్యంగా చేసుకొని దౌర్జన్యంగా పొలాలను అక్రమంచి లోతుగా తవ్వేశారు. దీనిపై ప్రశ్నిస్తే కల్యాణ్రెడ్డి అనుచరులు దౌర్జన్యానికి తెగబడుతున్నారు. ఊళ్లో పెద్ద మనిషి కావడంతో ఎదురు మాట్లాడలేకపోతున్నారు. తమ పొట్టగొట్టొద్దని కోరినా ఆయన కనికరించడంలేదు. ఈ చెరువు మట్టిని కల్యాణ్రెడ్డి అనుచరుడు, మత్స్యకార నేత నరసింహ తమ అవసరాలకు తరలించారు. -
టీడీపీకి వరుస షాకులు
కందుకూరు: ఎన్నికలు సమీపించే కొద్దీ టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు వరుసగా గుడ్బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, నెల్లూరు పార్లమెంట్ ఇన్చార్జి చెన్నారెడ్డి వెంకటరమణ, తెలుగు మహిళా జిల్లా నాయకురాలు చెన్నారెడ్డి సరసమ్మ టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. బుడగ జంగాల నియోజకవర్గ నేత లక్కే మాల్యాద్రి వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కండువాలు కప్పి పార్టీ కందుకూరు అభ్యర్థి బుర్రా మధుసూదన్యాదవ్ సాదరంగా ఆహ్వానించారు. వీరితో పాటు చెన్నారెడ్డి వెంకటేశ్వర్లు, చెన్నారెడ్డి విజయమ్మ, మాలకొండయ్య, మాల్యాద్రి, యలమంద, నంబూరు వెంకయ్య, మరో 40 కుటుంబాలు పార్టీలో చేరాయి. -
నిరంతరం మమేకం
జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎనిమిది మండలాలతో అతి పెద్ద వైశాల్యం గల ప్రాంతంగా పేరు గడించింది. విలక్షణ తీర్పునివ్వడం ఇక్కడి ప్రజల ప్రత్యేకత. గడిచిన ఆరు ఎన్నికల సరళిని పరిశీలిస్తే ఇక్కడి ఓటర్లు ఎక్కువగా మేకపాటి కుటుంబం వైపే మొగ్గు చూపారు. నాటి నుంచి 2019 ఎన్నికల వరకు కేవలం రెండుసార్లే టీడీపీ విజయం సాధించింది. ఈ క్రమంలో సీఎంగా జగన్మోహన్రెడ్డి అందించిన సంక్షేమ, అభివృద్ధి పాలన.. మేకపాటి కుటుంబానికి ఉన్న ఆదరణతో ఈ ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. మేకపాటి చంద్రశేఖర్రెడ్డి ఉదయగిరి: ఈ ఎన్నికల్లోనూ ఉదయగిరిధారణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సమర్థ పాలన.. పేదల ఆర్థికాభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి చర్యలు.. పదవుల్లో బడుగు, బలహీనవర్గాలకు పెద్దపీట.. ఇలా సీఎం జగన్మోహన్రెడ్డి తన ఐదేళ్ల పాలనను సాగించారు. మరోవైపు ఉదయగిరి నియోజకవర్గంలో 40 ఏళ్లుగా మేకపాటి కుటుంబానికి పట్టుంది. పై రెండు కారణాలతో ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్రెడ్డికే విజయం వరించే అవకాశాలు మెండుగా మారాయి. సైకిల్కు అన్నీ మైనస్సులే.. ఉదయగిరిలో టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కాకర్ల సురేష్ ఎన్నారై. రాజకీయ అనుభవలేమి.. పార్టీ నేతల మధ్య కొరవడిన సఖ్యత.. చంద్రబాబు మాటలను ప్రజలు విశ్వసించకపోవడం.. గ్రూపు తగాదాలు.. వెరసి కాకర్లకు మైనస్సుగా మారాయి. కేవలం డబ్బునే నమ్ముకొని విజయ తీరాలకు చేరాలని ఆయన చేస్తున్న యత్నాలు ఫలించేలా కనిపించడంలేదు. కాకర్ల ట్రస్ట్ పేరిట కొన్ని కార్యక్రమాలను చేపట్టినా.. టికెట్ వచ్చేంత వరకు ప్రజలతో సత్సంబంధాల్లేకపోవడం ఆయనకు ఇబ్బందికరంగా పరిణమించింది. టీడీపీ టికెట్ ఖరారయ్యాక సైతం ప్రజల్లో తిరిగేందుకు తగిన సమయం లేకపోవడంతో సుడిగాలి పర్యటనలకే పరిమితమయ్యారు. మేకపాటి కుటుంబానికి సడలని పట్టు ఉదయగిరి రాజకీయ ముఖచిత్రంలో మేకపాటి కుటుంబానికి దీర్ఘకాలంగా మంచి పట్టుంది. మేకపాటి కుటుంబానికి చెందిన రాజమోహన్రెడ్డి 1982లో రాజకీయ ప్రవేశం చేశారు. నాటి నుంచి నేటి వరకు ఉదయగిరి ప్రజల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉన్నారు. 1985లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఈయన గెలుపొందారు. తదుపరి 2004, 2009లో మేకపాటి చంద్రశేఖర్రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం అనంతరం తన ఎమ్మెల్యే పదవి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన 2012 ఉప ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసి ఘన విజయం సాధించారు. అనంతరం 2019 ఎన్నికల్లో మరోసారి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ఉదయగిరి ప్రజలతో నిత్యం సత్సంబంధాలను కొనసాగిస్తుండటంతో మేకపాటి కుటుంబీకులు మన్ననలను పొందగలిగారు. 16 ఎన్నికల్లో రెండు సార్లే.. 1955లో ఉదయగిరి నియోజకవర్గం ఆవిర్భవించింది. ఇప్పటి వరకు 16 సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒకసారి జనతా పార్టీ, మరోసారి బీజేపీ, రెండుసార్లు స్వతంత్రులు, రెండుసార్లు టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. మిగిలిన అన్నిసార్లు కాంగ్రెస్, వైఎస్సార్సీపీకే విజయాలే దక్కాయి. 1999లో కంభం విజయరామిరెడ్డి.. 2014లో బొల్లినేని వెంకటరామారావు స్వల్ప మెజార్టీతో టీడీపీ తరపున విజయం సాధించారు. దీన్ని బట్టి వైఎస్సార్సీపీ విజయం నల్లేరుపై నడకేననే సంకేతాలు వెలువడుతున్నాయి. బొల్లినేని రామారావు వైఎస్సార్సీపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డికే మెండుగా విజయావకాశాలు ఆది నుంచి ఈ కుటుంబానికే పట్టు ఈ దఫా ఫ్యాన్ హవానేనంటున్న విశ్లేషకులు నియోజకవర్గ ఆవిర్భావం నుంచి రెండుసార్లే టీడీపీ విజయం మిగిలిన అన్ని సార్లు ఇతర పార్టీలకే జై ఈ సారి బరిలో ఇద్దరూ కొత్తవారే ఫ్యాన్కే జై.. ఉదయగిరి బరిలో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులూ కొత్తవారే కావడం విశేషం. అయితే వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్రెడ్డికి కుటుంబ బలం, ప్రజల్లో ఆదరణ ఎక్కువగా ఉండటంతో విజయావకాశాలు ఆయనకే మెండుగా కనిపిస్తున్నాయి. 20 ఏళ్లుగా జరిగిన సార్వత్రిక ఎన్నికలను పరిశీలిస్తే నియోజకవర్గంలోని ఉదయగిరి, వింజమూరు, జలదంకి, కలిగిరి మండలాలు టీడీపీయేతర పార్టీలకే అనుకూలంగా ఫలితాలిస్తున్నాయి. ప్రస్తుతం ఈ నాలుగు మండలాలతో పాటు సీతారామపురంలోనూ వైఎస్సార్సీపీకే స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తోంది. కొండాపురం, వరికుంటపాడు, దుత్తలూరు మండలాల్లో హోరాహోరీ తప్పేలా లేదు. ఉదయగిరి కోటలో వైఎస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తొమ్మిది నెలలుగా వైఎస్సార్సీపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గంలోని ప్రతి ఊరు, గడపకూ వెళ్లి సీఎం జగనన్నను ఆశీర్వదించాలని కోరారు. తమ పార్టీకి అండగా ఉండాలంటూ విస్తృత ప్రచారం చేయడం.. ప్రజలతో మమేకమవ్వడం ఆయనకు కలిసొచ్చే అంశం. -
పేదలకు అండగా సీఎం జగనన్న
● నెల్లూరు సిటీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ నెల్లూరు(స్టోన్హౌస్పేట): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్లపాటు పేదలకు అండగా నిలిచి సంక్షేమ పథకాలను అందించారని వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ అభ్యర్థి ఎండీ ఖలీల్ అహ్మద్ తెలిపారు. నగరంలోని 4వ డివిజన్ న్యూకాలనీ, 47వ డివిజన్ గుప్తా పార్కు సెంటర్, కంసాలి వీధి, ములుముడి బస్టాండ్ సెంటర్, చిన్నబజారు మెయిన్రోడ్డు, 13వ డివిజన్ బాలాజీ నగర్ గ్యాస్ గోదాము సెంటర్, ఓల్డ్ బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ రోడ్డు, గౌడ హాస్టల్ సెంటర్, వేపదొరువు, 43వ డివిజన్ జెండావీధి, బడేసాహెబ్వీధి, బొందిలివీధి తదితర ప్రాంతాల్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలంతా వైఎస్సార్సీపీ వైపే ఉన్నట్లు చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పోలంరెడ్డి లక్ష్మీప్రత్యూష, పొట్లూరి రామకృష్ణ ఆచారి, ఊటుకూరు నాగార్జున, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ మీరామొహిద్దీన్, నాయకులు ఆనం జయకుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీతోనే ప్రజలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంటే ప్రజలు ఉన్నారని పార్టీ కావలి నియోజకవర్గ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సాక్షి బుధవారం నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్మోహన్రెడ్డి చేపట్టిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, రామాయపట్నం పోర్టుతో కావలి అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందని చెప్పారు. రానున్న రోజుల్లో యువతకు ఉద్యోగావకాశాలను కల్పించనున్నామని వెల్లడించారు. ప్రతిపక్షాల అసత్యాలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధిలో కావలి నియోజకవర్గం పరుగులు యువతకు భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలు ప్రతిపక్షాలను పట్టించుకోని ప్రజలు ‘సాక్షి’ ఇంటర్వ్యూలో రామిరెడ్డి -
పోలింగ్కు పూర్తిస్థాయిలో సన్నద్ధం
నెల్లూరు(దర్గామిట్ట): ఈ నెల 13న నిర్వహించనున్న పోలింగ్కు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ ఆదేశించారు. పోలింగ్ ఏర్పాట్లపై కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ను బుధవారం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పోలింగ్ను సజావుగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని తీసుకెళ్లేందుకు గానూ ఈ నెల 12వ తేదీ ఉదయం ఆరు గంటలకు 255 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామని చెప్పారు. ఎంపిక చేసిన రూట్మ్యాప్ మేరకే బస్సులను నడపాలని సూచించారు. జీపీఎస్ ఉన్న వాహనాల్లోనే ఈవీఎంలు జీపీఎస్ ఉన్న వాహనాల్లోనే ఈవీఎంలను తరలించాలని కలెక్టర్ సూచించారు. ఇబ్బందులు తలెత్తకుండా రిజర్వ్లో మరిన్ని వాహనాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. 85 ఏళ్లుపైబడిన వృద్ధులు, దివ్యాంగుల కోసం ఆటోలను ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులెవరూ ఈ నెల 11వ తేదీ సాయంత్రం ఆరు తర్వాత జిల్లాలో ఉండకూడదని స్పష్టం చేశారు. అన్ని లాడ్జీల్లో తనిఖీలను చేపట్టాలని సూచించారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, జనాలు గుమికూడొద్దని కోరారు. మీడియా ధ్రువీకరణ పత్రాలున్న వారినే పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించాలని, ఒకేసారి ఎక్కువ మందిని కాకుండా పరిమితి మేరకే పంపాలని సూచించారు. ఓటింగ్ కంపార్ట్మెంట్ వద్ద వీడియో చిత్రీకరణ, ఫొటోలకు అనుమతిలేదని తెలిపారు. ఫిర్యాదులొస్తే వెంటనే స్పందించాలి నిబంధనల అతిక్రమణపై ఏమైనా ఫిర్యాదులోస్తే వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని, విచారణ అనంతరమే సమాచార శాఖ ద్వారా పూర్తిస్థాయి ప్రకటన ఇవ్వాలన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులపై ఏమైనా కేసులుంటే, ఆ సమాచారాన్ని పత్రికల ద్వారా ప్రచురించాలని, ఇప్పటికీ ప్రచురించని అభ్యర్థులకు నోటీసులను జారీ చేయాలని ఆర్వోలను ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని నివేదికలను అభ్యర్థులు త్వరితగతిన అందజేయాలని కోరారు. పూర్తి స్థాయిలో వసతులు పోలింగ్ కేంద్రాల్లో కుర్చీలు, టెంట్లు, మంచినీటి సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. దివ్యాంగులు, వయోవృద్ధులకు ఇబ్బందుల్లేకుండా వీల్చైర్లను ఏర్పాటు చేయాలన్నారు. రెండు యూత్.. రెండు వృద్ధులు.. రెండు మోడల్ పోలింగ్ కేంద్రాలను ప్రతి నియోజకవర్గంలో సుందరంగా ముస్తాబు చేయాలన్నారు. ఓటరు స్లిప్పులను త్వరగా పంపిణీ చేయాలని సూచించారు. డీఆర్వో లవన్న, ట్రెయినీ కలెక్టర్ సంజనాసిన్హా, నోడల్ అధికారులు బాపిరెడ్డి, సాల్మన్రాజు, చందర్, పద్మావతి, కన్నమనాయుడు, రాజశేఖర్, సదారావు తదితరులు పాల్గొన్నారు. పొరపాట్లకు తావులేకుండా అన్ని ఏర్పాట్లు కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ -
నెల్లూరు రూరల్ను శ్రీధర్రెడ్డి అభివృద్ధి చేయలేదు
● వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్రెడ్డి నెల్లూరు సిటీ: ‘2014 నుంచి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి శూన్యం. అందుకే నాపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నాడు. దౌర్జన్యాలు చేసే శ్రీధర్రెడ్డి కావాలా? అభివృద్ధి చేసే నేను కావాలా?.. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి’ అని వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్రెడ్డి అన్నారు. రూరల్ నియోజకవర్గ పరిధిలోని 36వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ పిండి శాంతి, డివిజన్ ఇన్చార్జి పిండి సురేష్ తదితరులతో కలిసి బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు ఒక్క అవకాశం ఇస్తే వందల కోట్ల రూపాయలు తెచ్చి రూరల్ను రాష్ట్రంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్ది చూపిస్తానన్నారు. కార్యక్రమంలో మేయర్ స్రవంతి, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ జూనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడు మలిరెడ్డి కోటారెడ్డి, రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు మాళెం సుధీర్కుమార్రెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు మల్లు సుధాకర్రెడ్డి, నాయకులు లంకా రామశివారెడ్డి, సీహెచ్ హరిబాబు యాదవ్, ఏసునాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఐఐటీ చదవాలన్నదే ధ్యేయం
పాలిసెట్ ఫలితాల విడుదల నెల్లూరు(అర్బన్): పాలిటెక్నిక్ కళాశాలల్లో వివిధ సాంకేతిక కోర్సుల్లో ప్రవేశానికి గత నెల్లో నిర్వహించిన పాలిసెట్ ఫలితాలను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. నెల్లూరు, కావలి, ఆత్మకూరులోని ఎనిమిది కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 3325 మంది దరఖాస్తు చేసుకోగా, 2995 మంది ఉత్తీర్ణత సాధించారు. 90.08 శాతంగా ఉత్తీర్ణత నమోదైందని పాలిసెట్ జిల్లా కన్వీనర్ విజయకుమార్ తెలిపారు. నగరానికి చెందిన మునిసాయి ప్రీతమ్ 160, సాయికిరణ్ 177, సాయిసాత్విక్ 183 ర్యాంకులను సాధించారు. నన్ను తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. 160వ ర్యాంక్ను సాధించడం ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో కష్టపడి ఐఐటీ చదవాలన్నదే నా ధ్యేయం. – మునిసాయి ప్రీతమ్, నెల్లూరు నూతన ఆవిష్కరణలకు కృషిపాలిసెట్లో మంచి ర్యాంక్ను సాధించడం సంతోషంగా ఉంది. బాగా కష్టపడి చదివి ఐఐటీలో సీటు సాధిస్తా. నూతన ఆవిష్కరణలు చేసి సమాజానికి ఉపయోగపడాలనేదే నా ఆశయం. – సాయిసాత్విక్, నెల్లూరు -
మళ్లీ గడప వద్దకే పింఛన్లు చేర్చండయ్యా
● ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్రెడ్డిని కోరిన పెన్షన్దారులుసోమశిల: ‘సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గడప దాటకుండానే ఐదేళ్లపాటు పింఛన్ అందించారు. చంద్రబాబు కుట్రలు చేసి వలంటీర్లు నగదు తెచ్చి ఇవ్వకుండా అడ్డుకున్నాడు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక మా గడప వద్దకే మళ్లీ పెన్షన్ చేర్చండి’ అని పలువురు పింఛన్దారులు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డిని కోరారు. అనంతసాగరంలో బుధవారం ఉదయం ఆయన నాయకులు, కార్యకర్తలతో కలిసి పలు కాలనీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు వృద్ధులు, దివ్యాంగులు ఎమ్మెల్యేతో మాట్లాడారు. ఎలాంటి కష్టం లేకుండా మాకు జగన్మోహన్రెడ్డి వలంటీర్ల ద్వారా పింఛన్లు అందించారు. మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వస్తేనే పెన్షన్ కష్టాలు తప్పుతాయని తెలిపారు. ఈ సందర్భంగా విక్రమ్రెడ్డి మాట్లాడుతూ రానున్నది జగనన్న సంక్షేమ ప్రభుత్వమేనని, లబ్ధిదారులు గడప దాటకుండానే పింఛన్తోపాటు సంక్షేమ పథకాలను అందజేస్తారని హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీకి ఓట్లు వేయాలని కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్, జెట్పీటీసీ సభ్యుడు రాపూరు వెంకటసుబ్బారెడ్డి, సీనియర్ నాయకుడు ఉరిబిండి ప్రభాకర్రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ అక్కలరెడ్డి అంకిరెడ్డి, సర్పంచ్ శోభ, బట్రెడ్డి జనార్దనరెడ్డి, సడ్డా రవీంద్రారెడ్డి, వైస్ ఎంపీపీ అల్లంపాటి సుధాకర్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
మద్యం బాటిళ్లు, టీడీపీ ప్రచార సామగ్రి స్వాధీనం
ఆత్మకూరు: అనుమతి లేకుండా తెలుగుదేశం పార్టీ ప్రచార సామగ్రిని కారులో తరలిస్తుండగా బుధవారం మున్సిపల్ పరిధిలోని నెల్లూరుపాళెం సెంటర్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. అందులోనే తెలంగాణకు చెందిన తొమ్మిది మద్యం బాటిళ్లను గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి. స్పెషల్ స్క్వాడ్, ఆత్మకూరు పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో ఓ కారును ఆపగా అందులో టీడీపీ ప్రచార సామగ్రి ఉంది. దీని తరలింపునకు అనుమతి పత్రాల్లేవు. అలాగే మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీ నం చేసుకున్నారు. వాటిని తరలిస్తున్న ఓ యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.ముత్యాలరావు తెలిపారు. 12 మద్యం బాటిళ్లు మనుబోలు: మండలంలోని బద్దెవోలు క్రాస్రోడ్డు పోలీస్ చెక్పోస్టు వద్ద బుధవారం తనిఖీలు చేస్తుండగా తమిళనాడు ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు అక్రమంగా తరలిస్తున్న పుదుచ్చేరికి చెందిన 12 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని సెబ్ అధికారులకు అప్పగించి సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు. -
స్వగ్రామానికి వెళ్తుండగా..
● రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి ఆత్మకూరు: మున్సిపల్ పరిధిలోని వెంకట్రావుపల్లి అడ్డరోడ్డు సమీపంలో నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై మోటార్బైక్పై వెళ్తు న్న యువకుడిని ఎదురు నుంచి లారీ ఢీకొనడంతో మృతిచెందిన ఘటన బుధవారం సా యంత్రం జరిగింది. ఎస్సై ముత్యాలరావు కథనం మే రకు.. అనంతసాగరం మండలం దేవరాయపల్లి గ్రా మానికి చెందిన వెంకటేష్ (24) సొంత పని నిమిత్తం బైక్పై ఆత్మకూరుకు వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం సమీపంలోని వారు నెల్లూరుకు తరలిస్తుండగా మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. కాగా వెంకటేష్ తండ్రి కొంతకాలం క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి ఆ యువకుడు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
చిన్నారిపై లైంగికదాడికి యత్నం
నెల్లూరు(క్రైమ్): అభంశుభం తెలియని ఏడేళ్ల చిన్నారిపై గుర్తుతెలియని దుండగుడు లైంగికదాడికి యత్నించిన ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. కోటమిట్టలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఏడేళ్ల కుమార్తె ఉంది. రెండు రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తి చిన్నారిపై లైంగికదాడికి యత్నించాడు. బాలిక అతడి నుంచి తప్పించుకుని ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. వారు చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి నగర డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డి బాధిత తల్లిదండ్రులను విచారించారు. నిందితుడిని పట్టుకునేందుకు సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. -
టీడీపీ ఓడిపోవడం ఖాయం
● వైఎస్సార్సీపీ ఉదయగిరి అభ్యర్థి రాజగోపాల్రెడ్డి జలదంకి: ‘ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టిస్తుంది. టీడీపీ ఓడిపోవడం ఖాయం’ అని వైఎస్సార్సీపీ ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్రెడ్డి అన్నారు. మండలంలోని గోపన్నపాళెం, అన్నవరం, కొత్తపాళెం, జలదంకి, సోమవరప్పాడు, కమ్మవారిపాళెం, బ్రాహ్మణక్రాక పంచాయతీల్లో బుధవారం కావలి మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్రెడ్డితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజగోపాల్రెడ్డి మాట్లాడుతూ జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు అందించారన్నారు. చంద్రబాబు మాత్రం మోసం చేయడంలో దిట్ట అన్నారు. అలాంటి వ్యక్తికి అధికారం ఇస్తే నట్టేట ముంచేస్తాడన్నారు. పేదలకు మరింత మేలు చేసేలా జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టోను ప్రకటించారన్నారు. మేం గెలిస్తే జగన్ అంతు చూస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటున్నారని, ప్రజలకు ఏమి చేస్తారో చెప్పడం లేదన్నారు. కాటంరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ ఐదేళ్ల పాలన స్వర్ణయుగంలా సాగిందన్నారు. పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందాయన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు పాలవల్లి మాలకొండారెడ్డి, సొసైటీ చైర్మన్ కేతిరెడ్డి రవీంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వంటేరు రామచంద్రారెడ్డి, నాయకులు చేవూరు శ్రీనివాసులురెడ్డి, తమ్మినేని సతీష్నాయుడు, గొట్టిపాటి శ్యామ్ సుందరనాయుడు, రావి ప్రసాద్నాయుడు, ఇస్కా మదన్మోహన్రెడ్డి, తిప్పారెడ్డి ఇందిరమ్మ, సురె వెంకటశేషారెడ్డి, కోర్శిపాటి రామిరెడ్డి, గండు వెంకారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకు అలవాటే
● కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డికొడవలూరు: ‘అబద్ధాలు చెప్పడం చంద్రబాబు నాయుడికి అలవాటే. ఎన్నికల నేపథ్యంలో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడు. ఎవరూ ఆయన్ను నమ్మొద్దు’ అని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి విమర్శించారు. మండలంలోని నాయుడుపాళెం, గౌతమ్నగర్, గండవరంలలో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు రైతు, పొదుపు రుణమాఫీ చేస్తానన్నాడు. ఇంకా నిరుద్యోగులకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చాక అందర్నీ మోసం చేశాడన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాబులా మోసకారి కాదన్నారు. దివంగత వైఎస్సార్ పథకాలను కొనసాగించి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదలకు మంచి చేస్తుంటే ఓర్వలేక అన్ని పార్టీలు ఏకమై జగన్ను సీఎం పదవి నుంచి దించాలని చూస్తున్నాయన్నారు. పొరపాటున కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు సంక్షేమ పథకాలు, సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలను రద్దు చేసి పేదలకు అన్యాయం చేస్తాడని చెప్పారు. తాజాగా పలు పథకాల నగదు లబ్ధిదారులకు అందకుండా నిలిపి వేయించడాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. బీసీ, మైనారిటీ వర్గాలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారని పార్టీ మారిన వేమిరెడ్డి దంపతులు పేదలకు ఏం మేలు చేస్తారో ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. జగన్కు పేదల ఆశీర్వాదం ఉందని తెలిపారు. గౌతమ్నగర్కు చెందిన ఓ నాయకుడిని కుటుంబసభ్యుడిలా చూసి గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేయిస్తే రూ.15 లక్షలకు అమ్ముడుబోయి టీడీపీలో చేరాడన్నారు. అలాంటి వారిని తిరిగి వైఎస్సార్సీపీలో చేర్చుకునేది లేదని స్పష్టం చేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి నెల్లూరు ఎంపీగా వేణుంబాక విజయసాయిరెడ్డిని, కోవూరు ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, ఎంపీపీ జి.జ్యోతి, ఎంపీటీసీ పెనాక శ్రీనివాసులురెడ్డి, వైఎస్సార్సీపీ, సచివాలయాల మండల కన్వీనర్లు గంధం వెంకటశేషయ్య, కొండా శ్రీనివాసులురెడ్డి, నాయకులు నల్లపరెడ్డి రాజేంద్రనాఽథ్రెడ్డి, మారంరెడ్డి నారసింహారెడ్డి, అడపాల మోహన్కృష్ణ, మాగుంట గిరిధర్రెడ్డి, కె.కమలాకర్రెడ్డి, నాగిరెడ్డి రమేష్, ఆర్.రాజేష్రెడ్డి, చింత చలపతి, ఎం.ప్రతాప్రెడ్డి, బండ్ల మోహన్, ఉమామహేశ్వరరావు, రాజ్కుమార్, జనార్దన్ పాల్గొన్నారు. -
ఈఎంఆర్ఎస్లో ఇంటర్లో చేరికకు దరఖాస్తుల ఆహ్వానం
కొడవలూరు: మండలంలోని చంద్రశేఖరపురం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ కళాశాలలో సీబీఎస్ఈ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరేందుకు దరాఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ టి.విష్ణుప్రియ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ గ్రూపులో బాలురకు 4, బైపీసీలో బాలురకు 11, హెచ్ఈపీలో బాలురకు 10, బాలికలకు 25 సీట్లు ఉన్నాయన్నారు. ఈనెల 18వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. యానాది, ఎరుకుల, నక్కల, సుగాలి తదితర గిరిజన కులాలకు చెందిన విద్యార్థులే అర్హులన్నారు. పదో తరగతి సీబీఎస్ఈ, స్టేట్ బోర్డు సిలబస్లో చదివి ఉండాలన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలు, దివ్యాంగులకు మొత్తం సీట్లలో 10 శాతం రిజర్వేషన్ ఉంటుందని తెలిపారు. పదో తరగతిలో మార్కుల ఆధారంగా విద్యార్థులకు సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు 90101 75322, 94909 57261 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
అండగా ఉన్నాం.. మరో అవకాశమివ్వండి
● రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిమనుబోలు: ‘ఐదేళ్లపాటు పేదలకు అండగా నిలిచా.. రాష్ట్ర బంగారు భవిష్యత్ కోసం మరోసారి వైఎస్సార్సీపీకి అవకాశం ఇవ్వండి’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రమైన మనుబోలులో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సభలో మాట్లాడుతూ మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుని అధికారంలోకి రావడం ఆపై ప్రజలను వంచించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యన్నారు. సూపర్ సిక్స్ అంటూ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యాడన్నారు. పింఛన్లు అందకుండా వృద్ధులు, దివ్యాంగులను హింసించిన పాపం బాబును వెంటాడుతుందన్నారు. ఈ ప్రభుత్వంలో రైతులకు సకాలంలో సాగునీరు అందించామన్నారు. వారికి అవసరమైన పనిముట్లు, ఎరువులు, విత్తనాలను ఆర్బీకేల ద్వారా సకాలంలో ఇచ్చామన్నారు. రాష్ట్ర ప్రజల బాగు కోసం సీఎం జగన్ వందలసార్లు బటన్లు నొక్కాడని, ఇప్పుడు ఎమ్మెల్యేగా తనను, తిరుపతి ఎంపీగా గురుమూర్తిని గెలిపించేందుకు రెండు బటన్లు నొక్కాలని ఓటర్లను కోరారు. అభివృద్ధి చేశాం గురుమూర్తి మాట్లాడుతూ జగనన్న నాయకత్వంలో కేంద్రం నుంచి ఈ ఐదేళ్లలో నిధులు తెప్పించి తిరుపతి పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి పనులు చేశానన్నారు. ఉప ఎన్నికల్లో సర్వేపల్లిలో తనకు అత్యధిక మెజారిటీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గుండాల వజ్రమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు చిట్టమూరు అనితమ్మ, సర్పంచ్ కంచి పద్మమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు రాజేశ్వరమ్మ, సేవానాథం ట్రస్ట్ ఫౌండర్ మాచిరెడ్డి శ్రీనాథ్రెడ్డి, నాయకులు బొమ్మిరెడ్డి హరగోపాల్రెడ్డి, మధుసూదన్రెడ్డి, కడివేటి చంద్రశేఖర్రెడ్డి, చిట్టమూరు అజయ్రెడ్డి, ముంగర రవీందర్రెడ్డి, దాసరి భాస్కర్గౌడ్, ఏడెం మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
No Headline
నెల్లూరు(దర్గామిట్ట): రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీని పాస్టర్లు దీవించి ఆదరించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి కోరారు. మంగళవారం నగరంలోని ఎంసీఎస్ కల్యాణ మండపంలో పాస్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో పాస్టర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పర్వతరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల అభివృద్ధి కోసం మహోన్నతమైన నవరత్నాల పథకాలను ప్రవేశ పెట్టారన్నారు. దీంతో పాటు కరోనా కష్టకాలం సైతం అధికమించి పథకాలన్నీ సజావుగా అందజేశారన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా పాస్టర్లకు భరోసా కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిదేనన్నారు. జిల్లాలో పాస్టర్లు వైఎస్సార్సీపీ దీవించి పార్లమెంట్ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డితో పాటు సిటీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ను గెలిపించేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున, 51వ డివిజన్ వైఎస్సార్సీపీ ఇన్చార్జి సురేష్, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
సర్వేపల్లి ఉద్దండ నేతల బరి
● చిన్న గ్రామం పేరుతో నియోజకవర్గం ఏర్పాటు ● 2009లో మారిన నియోజకవర్గ స్వరూపం పొదలకూరు : జిల్లా రాజకీయ చిత్రపటంలో సర్వేపల్లి నియోకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. 1955లో సర్వేపల్లి నియోజకవర్గం ఏర్పడింది. అప్పట్లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి అనే గ్రామాన్ని నియోజకవర్గ కేంద్రంగా ఎంపిక చేశారు. ఇప్పటికీ 5 వేల మంది జనాభా కలిగిన మైనర్ పంచాయతీ నియోజకవర్గ కేంద్రంగా విరాజిల్లుతోంది. నియోజకవర్గంలో పొదలకూరు, ముత్తుకూరు, తోటపల్లిగూడూ రు, వెంకటాచలం, మనుబోలు మండలాలు ఉన్నాయి. 2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఈ నియోజకవర్గంలో మనుబోలు, పొదలకూరు మండలాలు లేవు. ఎమ్మెల్యేగా ఉద్దండులు పోటీ 1955లో నియోజకవర్గం ఆవిర్భవించింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో డాక్టర్ బెజవాడ గోపాల్రెడ్డి ఆత్మకూరు, సర్వేపల్లి నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం సర్వేపల్లి స్థానానికి గోపాల్రెడ్డి రాజీనామా చేశారు. ఈ క్రమంలో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నేత సోమిరెడ్డి పెదనాన్న సోమిరెడ్డి ఆదినారాయణరెడ్డి, టీపీ గూడూరుకు చెందిన వంగల్లు కోదండరామిరెడ్డి పోటీ పడ్డారు. 7 వేల ఓట్ల మెజారిటీతో కోదండరామిరెడ్డి విజయం సాధించారు. ● 1962 ఎన్నికల్లో టీపీగూడూరు మండలం పాపిరెడ్డిపాళేంకు చెందిన వేమారెడ్డి వెంకురెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే కోదండరామిరెడ్డిపై 86 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ● 1967లో సర్వేపల్లి ఎస్సీలకు రిజర్వ్ అయ్యింది. ఇందుకూరుపేట మండలం పల్లెపాడుకు చెందిన స్వర్ణ వేమయ్య ఇండిపెండెంట్ అభ్యర్థి జోగి శంకరరావుపై 266 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ● 1972 ఎన్నికల్లో అల్లూరు మండలం ఇస్కపల్లికు చెందిన మంగళగిరి నానాదాసు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 23 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో స్వర్ణ వేమయ్యపై గెలుపొందారు. ● 1978లో సామాన్య రైతు కుటుంబం నుంచి చిత్తూరు వెంకట శేషారెడ్డి (సీవీ శేషారెడ్డి) బరిలోకి దిగారు. మడమనూరు, పంటపాళేం సర్పంచ్గా పని చేశారు. ఆయన ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా తన రాజకీయ గురువు ఆనం భక్తవత్సలరెడ్డి, ఉద్దండుడైన గునపాటి రామచంద్రారెడ్డితో తలపడ్డారు. 21,962 ఓట్ల మెజారిటీతో శేషారెడ్డి విజయం సాధించారు. ● 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలో టీపీ గూడూరు మండలం రావూరువారి కండ్రికకు చెందిన న్యాయవాది చెన్నారెడ్డి పెంచలరెడ్డి టీడీపీ అభ్యర్థిగా 15,277 ఓట్ల మెజారిటీతో సీవీ శేషారెడ్డిపై విజయం సాధించారు. ● 1985లో జరిగిన ఎన్నికల్లో ముత్తుకూరుకు చెందిన వ్యవసాయ పట్టభద్రుడు ఈదూరు రామకష్ణారెడ్డి టీడీపీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కోటారెడ్డి విజయకుమార్రెడ్డిపై 21,566 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ● 1989లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన సీవీ శేషారెడ్డి టీడీపీ అభ్యర్థి పూండ్ల దశరథరామిరెడ్డిపై 13,148 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ● 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సీవీ శేషారెడ్డిపై సోమిరెడ్డి 33,775 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ● 1999 ఎన్నికల్లో కూడా సోమిరెడ్డి రెండో పర్యాయం శేషారెడ్డిపై పోటీ చేసి 16,902 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ● 2004లో ఆదాల ప్రభాకర్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగి సోమిరెడ్డి దూకుడు కు కళ్లెం వేశారు. 2004 ఎన్నికల్లో సోమిరెడ్డిపై 7,599 ఓట్ల మెజారిటీతో విజయం సాధించా రు. 2009 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్రెడ్డి, టీడీపీ అభ్యర్థి సోమి రెడ్డిపై వరుసగా రెండో పర్యాయం 10,256 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ● 2014 ఎన్నికల బరిలో నెల్లూరు జెడ్పీచైర్మన్గా పని చేసిన సొంత నియోజకవర్గానికి చెందిన కాకాణి గోవర్ధన్రెడ్డి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డిపై 5,451 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వరుసగా రెండో పర్యాయం కాకాణి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలో నిలిచి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డిపై 14 వేల ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. – రాజకీయ చిత్రపటంలో ప్రత్యేక స్థానం పాతకాపుల మధ్యే పోటీ సర్వేపల్లిలో పాతకాపుల మధ్యే పోటీ నెలకొంది. వైఎస్సార్సీపీ అభ్యర్థి మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సర్వేపల్లి బరిలో ఉన్నారు. ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనేందుకు సిద్ధంగా ఉన్నారు. సోమిరెడ్డి వరుసగా సర్వేపల్లి నుంచి నాలుగు పర్యాయాలు ఓటమి చెందడం, రాజకీయ చతురత ప్రదర్శించడంలో వెనకబడడం ఆయన గెలుపునకు పెద్ద ఆటంకంగా ఏర్పడింది. కాకాణి వరుసగా రెండు పర్యాయాలు గెలుపొందడం, రాజకీయ చాణక్యుడిగా పేరు ఉండడంతో పాటు సర్వేపల్లిని ఊహించని విధంగా అభివృద్ధి చేసి గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. -
పోస్టల్ బ్యాలెట్ @ 94.24 శాతం
నెల్లూరు(దర్గామిట్ట): ఎన్నికలను పురస్కరించుకొని మూడు రోజులుగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఓటింగ్ శాతం 94.24గా నమోదైంది. నియోజకవర్గం మొత్తం ఓట్లు పోలైనవి శాతం నెల్లూరు సిటీ 2419 2315 95.7 ఆత్మకూరు 2352 2220 94.3 సర్వేపల్లి 1332 1255 94.2 ఉదయగిరి 2336 2207 94.4 కావలి 2933 2757 93.9 నెల్లూరు రూరల్ 4809 4335 90.0 కోవూరు 2715 2576 94.8 కందుకూరు 1635 1580 96.6 -
అప్రతిహత విజేత ‘ఆదాల’
నెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్ స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆదాల రాజకీయ ఆరంగేట్రం చేసినప్పటి నుంచి అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి మంత్రిగా, ఒక ఎంపీగా గెలిచారు. రాజకీయ దురందుడు అనే పేరు కూడా ఉంది. ప్రధానంగా నెల్లూరు రూరల్ నుంచి గతంలో వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో చేరిన కోటంరెడ్డి ప్రస్తుతం ఆదాలకు ప్రత్యర్థిగా బరిలో ఉన్నారు. అయితే ప్రస్తుతం కోటంరెడ్డి టీడీపీ నుంచి బరిలో ఉండడమే ఇక్కడ వైఎస్సార్సీపీకి మొదటి ఫ్లస్గా చెప్పొచ్చు. రెండోది టీడీపీ అభ్యర్థి కావడం, ఆ పార్టీపై ప్రజల్లో విశ్వసనీయత లేదు. టీడీపీకి ఓటమి భయం 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో జనాభా ప్రాతిపదికన నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఏర్పడింది. ఇక్కడ నుంచి పోటీ చేయడానికి టీడీపీకి ఓటమి భయం వెంటాడుతోంది. ఇప్పటికి మూడు దఫాలు ఎన్నికలు జరిగితే ఒంటరిగా పోటీ చేయడానికి టీడీపీ వెనుకాడుతోంది. ఈ నియోజకవర్గ పరిధిలో ఆ పార్టీ క్షేత్రస్థాయిలో బలహీనంగా ఉంది. మొదటి సారి వైఎస్ రాజశేఖరరెడ్డి, రెండు దఫాలు వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిష్మాకు ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. ● 2009లో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో దివంగత ఆనం వివేకాందరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్తో పాటు ప్రజారాజ్యం పార్టీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ కూటమి తరఫున సీపీఎం పోటీ చేశాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చరిష్మాతో కాంగ్రెస్ విజయం సాధించగా, రెండో స్థానంలో పీఆర్పీ నిలిచింది. ఇక టీడీపీ మద్దతు ఇచ్చిన సీపీఎం అయితే డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. ● 2014లో ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కూడా టీడీపీ ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తరఫున బీజేపీకి కేటాయించింది. ఆ ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోరాడినా వైఎస్సార్సీపీ అభ్యర్థి దాదాపు 24 వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. ● 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి మరోసారి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పోటీ చేయగా, టీడీపీ అనివార్య పరిస్థితుల్లో ఒంటరిగానే పోటీ చేసింది. గడిచిన రెండు దఫాల ఎన్నికల్లో ఓటమికి భయపడే పొత్తు పెట్టుకున్న పార్టీలకు ఇచ్చేసి చేతులు దులుపుకుంది. ఆ ఎన్నికల్లోనూ టీడీపీపై వైఎస్సార్సీపీ సుమారు 23 వేల ఓట్ల తేడాతో విజయం సాధించింది. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో మొన్నటి వరకు ఈ దఫా విజయం ఖాయమనే ధీమాతో ఉన్న టీడీపీకి ఇప్పుడు వెన్నులో వణుకు ప్రారంభమైంది. ప్రధానంగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి చేసిన అవినీతి, అరాచకాలు మితిమీరడంతోనే వైఎస్సార్సీపీ ఆయన్ను పక్కన పెట్టింది. దీంతో ఆయన టీడీపీలో చేరారు. రెండు గెలిచిన కోటంరెడ్డి ఈ దఫా టీడీపీ నుంచి గెలుస్తాడంటూ ఊదరగొట్టేసింది. కోటంరెడ్డిని బరిలో నిలబెడితే ఆయన చేసిన అవినీతి, అరాచకాలతో ఆయన్ను ప్రజలు ఓడించడం ఖాయమనే సంకేతాలు ఉండడంతోనే వైఎస్సార్సీపీ దూరం పెట్టింది. వైఎస్సార్సీపీకి పనికి రాని పువ్వు.. టీడీపీలో విరబూస్తుందా? అని స్థానిక ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈ దఫా వైఎస్సార్సీపీ వివాదారహితుడు, అజాత శత్రువు, రాజకీయ దురందుడు అయిన ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డిని బరిలో నిలబెట్టడంతో వార్ వన్సైడ్గా మారిపోయింది. ఆదాల,వైఎస్సార్సీపీ బలం.. విజయం ఖాయం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ క్షేత్రస్థాయిలో మొదటి నుంచి బలంగా ఉంది. గడిచిన ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2,81,008 మంది ఓటర్లు ఉంటే.. ప్రతి కుటుంబానికి రెండు.. అంతకు మించిన సంక్షేమ పథకాలు అందాయి. ప్రధానంగా రూ.లక్షల విలువైన ఇంటి స్థలాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించింది. దీంతో వైఎస్సార్సీపీ పాలనపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ ఓటు బ్యాంక్ను మరింతగా పెరిగిందని రాజకీయ విశ్లేషకుల అంచనా. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్రెడ్డి వ్యక్తిగత ప్రతిష్ట, 10 నెలల్లో రూరల్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు గెలుపు లాంఛనమే అని విస్పష్టంగా వ్యక్తమవుతోంది. మరో వైపు కోటంరెడ్డి సోదరులు సాగించిన అరాచకాలు కూడా వైఎస్సార్సీపీకి అనుకూల వాతావరణంగా కనిపిస్తోంది. ప్రజలు ఈ సారి కూడా స్పష్టమైన నిర్ణయాన్ని తమ ఓటు ద్వారా చెప్పనున్నారు. నెల్లూరు రూరల్లో ఎగిరే జెండా వైఎస్సార్సీపీదే! నెల్లూరురూరల్ నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ‘వైఎస్’ కుటుంబ చరిష్మాదే విజయంగా మారింది. ఈ నియోజకవర్గంలో టీడీపీకి స్థానం లేదని గత మూడు దఫాల ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. ఆ పార్టీ సైతం ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సాహసించలేక పొత్తు పెట్టుకున్న పార్టీలకు కేటాయించి చేతలు దులుపుకుంది. గత ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకపోవడంతో ఒంటరిగా పోటీ చేస్తే 22,776 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఈ దఫా కూడా ఇక్కడ వైఎస్సార్సీపీదే విజయమని రాజకీయ పండితుల అంచనాలు. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్రెడ్డికి అప్రతిహత విజేతగా, రాజకీయ దురందుడుగా పేరుదొంది. వైఎస్సార్సీపీ ఐదేళ్లలో ప్రజలకు అందించిన సంక్షేమం, అభ్యర్థి క్రెడిబులిటి ఆ పార్టీ విజయం లాంఛనమే అని స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల లబ్ధి మూడు దఫాల ఎన్నికల్లో ‘వైఎస్’ చరిష్మాదే విజయం 2019 తొలిసారిగా ‘సైకిల్’ సింబల్తో టీడీపీ పోటీ చేసి ఓటమి అంతకు ముందు కూటమికి మద్దతిచ్చినా ఓట్ల శాతానికి ఆమడ దూరం -
అదుపుతప్పిన బొలెరో
● ఇంజినీర్ దుర్మరణం హుకుంపేట: అదుపుతప్పి బొలెరో బోల్తాపడటంతో ఇంజినీర్ మృతి చెందిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు.. అరకు – పాడేరు ప్రధాన రహదారిపై కొట్నాపల్లి నుంచి హుకుంపేట వైపు వస్తున్న బొలెరో గడుగుపల్లి సమీపాన తాడిపుట్టు జంక్షన్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో హైవే అథారిటీలో పనిచేస్తున్న ముత్తుకూరుకు చెందిన ఇంజినీర్ వలసంగారి పవన్ (28) అక్కడికక్కడే మృతి చెందారు. వాహనం వెనుక కూర్చున్న ఆఫీస్ బాయ్ స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్సై సతీష్ ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి కారణమైన బొలెరో డ్రైవర్ పొన్నం సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
టీడీపీకి రెండు సార్లే విజయం
● ఇప్పటి వరకు మానుగుంట, దివి కుటుంబాలే ఆధిపత్యం ● టీడీపీ ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు ఎన్నికలు ● వైఎస్సార్సీపీ ఆవిర్భావంతో పూర్తిగా మారిన రాజకీయ ముఖచిత్రం ● కేవలం రెండు దఫాలే టీడీపీకి విజయం దశాబ్దాల పాటు కేవలం రెండు కుటుంబాల ఆధిపత్యం సాగిన కందుకూరులో మొదటి సారిగా ఆ రెండు కుటుంబాలు ఎన్నికల బరిలో లేకుండా 2024 ఎన్నికలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో రాజకీయాన్ని శాసించిన మానుగుంట, దివి కుటుంబాలు కాదని, రెండు ప్రధాన పార్టీ లు కొత్త తరం అభ్యర్థులను బరిలోకి దించాయి. వరుస ఓటములతో 2014 ఎన్నికల తర్వాత నుంచి దివి కుటుంబ రాజకీయ ప్రస్థానం ముగించింది. అయితే మానుగుంట కుటుంబం కొన్ని రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రస్తుతం ప్రత్యక్ష ఎన్నికల్లో లేకపోయినా తమ పార్టీ అభ్యర్థి విజయానికి పోరాడుతోంది. ప్రస్తుత ఎన్నికలతో కొత్త తరం రాజకీయ చరిత్రకు నాంది పలికినట్లు అయింది. ఆనవాయితీ ప్రకారం మరో సారి టీడీపీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఇంటూరి నాగేశ్వరరావుకు టికెట్ ఇస్తే, వైఎస్సార్సీపీ మాత్రం బీసీ వర్గానికి చెందిన బుర్రా మధుసూదన్ యాదవ్కు కేటాయించింది. వైఎస్సార్సీపీకి కంచుకోట అయిన కందుకూరులో మరోసారి టీడీపీకి ఓటమి తప్పదనే అంచనాలు ఉన్నాయి. ● హ్యాట్రిక్ విజయం దిశగా దూసుకెళ్తున్న పార్టీ ● 2024 ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని రంగంలోకి దించిన వైఎస్సార్సీపీ కందుకూరు నియోజకవర్గ మ్యాప్ కందుకూరు: రాష్ట్ర రాజకీయాల్లో కందుకూరు నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆది నుంచి ఇక్కడ రాజకీయాల్లో రెండు సామాజికవర్గాల్లోని రెండు కుటుంబాలదే ఆధిపత్యంగా సాగింది. మానుగుంట, దివి కుటుంబాలకు చెందిన వ్యక్తులే నియోజకవర్గంలో రాజకీయాన్ని శాసించారు. నలమోతు చెంచురామానాయుడు మూడు దఫాలు ఎమ్మెలేగా ఎన్నికై నా.. ఆ తర్వాత ఆ కుటుంబం రాజకీయంగా తెర వెనుకకు వెళ్లిపోయింది. 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఆవిర్భావించిన కందుకూరు, ఆ తర్వాత , 1957 నుంచి ఏక సభ్య నియోజకవర్గంగా మారింది. ఆ నాటి నుంచి మానుగుంట, దివి కుటుంబాలే కందుకూరు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం దివి కుటుంబం రాజకీయాలకు దూరం కాగా, మానుగుంట కుటుంబ మాత్రం కందుకూరు రాజకీయాన్ని శాసించే స్థితిలోనే ఉంది. మానుగుంట కుటుంబానిదే ఆధిపత్యం కందుకూరు నియోజకవర్గాన్ని అత్యధికంగా మానుగుంట కుటుంబమే శాసించిందని చెప్పారు. ఈ నియోజకవర్గం ఆవిర్భవించినప్పటి నుంచి 15 దఫాలు ఎన్నికలు జరిగితే.. మానుగుంట ఆదినారాయణరెడ్డి మూడు దఫాలు, ఆయన తనయుడు మహీదర్రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆది నుంచి మానుగుంట కుటుంబం అన్ని వర్గాల ప్రజలకు దగ్గరగా ఉండేది. ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు తక్కువే అయినా తొలి నుంచి ఆదినారాయణరెడ్డికి ప్రజలతో పెనవేసుకున్న అనుబంధం ఆ కుటుంబానికి పట్టం కట్టుతూ వచ్చింది. ఈ నియోజకవర్గంలో దివి కుటుంబం రాజకీయాన్ని శాసించినా.. నిలదొక్కుకోలేకపోయింది. కందుకూరు 1957లో ఏకసభ్య నియోజకవర్గంగా మారాక రాజకీయ ఆరంగేట్రం చేసిన దివి కొండయ్య చౌదరి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించినా.. ఆ తర్వాత మరో 21 ఏళ్ల పాటు అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయారు. 1978లో మరో సారి దివి కొండయ్య చౌదరి గెలిచారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న దివి శివరామ్కు కూడా అంత తేలికగా విజయ దక్కలేదు. పన్నెండేళ్ల తర్వాత 1994లో తొలిసారిగా గెలిచారు. 1999 ఎన్నికల్లోనూ ఆయనే మరోసారి గెలిచినా.. ఆ తర్వాత నుంచి ఆయన్ను వరుస ఓటములు వెంటాడాయి. దీంతో రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలిగారు. ఈ నియోజకవర్గంలో మరో నేత నలమోతు చెంచు రామానాయుడు గురించి చెప్పుకోవాలి. మానుగుంట, దివి కుటుంబాల కంటే ముందు రాజకీయాల్లోకి వచ్చిన చెంచురామానాడు 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు తొలిసారిగా పోటీ చేసి విజయ సాధించారు. ఆ తర్వాతి ఎన్నికల్లో ఓటమి పాలైనా.. 1962, 1967లో జరిగిన రెండు ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. ఇలా మూడు దఫాలు చెంచురామానాయుడు ఎమ్మెల్యేగా ఎన్నికై నా ఆ కుటుంబం ప్రస్తుతం రాజకీయంగా తెరమరుగైంది. వైఎస్సార్సీపీ ఆవిర్భావంతో మారిన ముఖచిత్రం దశాబ్దాల పాటు రెండు కుటుంబాల ఆధిపత్యానికి కేంద్రంగా ఉన్న కందుకూరు రాజకీయం వైఎస్సార్సీపీ ఆవిర్భావంతో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. రాష్ట్ర విభజనతో నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2014లో ఎన్నికలకు మానుగుంట మహీధర్రెడ్డి దూరంగా ఉన్నారు. ఆ ఎన్నికల్లో పోతుల రామారావు వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేయగా, టీడీపీ నుంచి దివి శివరాం పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో దివి శివరాం ఓడిపోవడంతో రాజకీయానికి శాశ్వతంగా ఫుల్ స్టాప్ పడింది. వరుస ఓటములతో 2019 ఎన్నికల్లో దివి శివరామ్కు టీడీపీ అధిష్టానం టికెట్ నిరాకరించి, వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరి న పోతుల రామారావుకు టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి మానుగుంట మహీధ రెడ్డి బరిలో నిలిచి ఘన విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికల్లో కొన్ని రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బీసీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ అధిష్టానం బుర్రా మధుసూదన్ యాదవ్కు అవకాశం కల్పించింది.టీడీపీ సైతం కొత్త అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావుకు టికెట్ ఇచ్చింది. దాదాపు ఐదు దశా బ్దాల పాటు నియోజకవర్గ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన దివి, మానుగుంట కుటుంబాలు బరిలో లేకుండా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. నియోజకవర్గ ఆవిర్భావం నుంచి ఇప్పటికే వరకు ఓసీ వర్గానికి చెందిన వ్యక్తులే రాజకీయాన్ని శాసిస్తుండగా వైఎస్సార్సీపీ మొదటి సారి ఓ బీసీ అభ్యర్థికి అవకాశం కల్పించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కందుకూరు నియోజకవర్గ రాజకీయ చరిత్రలో టీడీపీకి కేవలం రెండు సార్లు మాత్రమే విజయం దక్కింది. ఆ పార్టీ నియోజకవర్గంలో ఎంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుందో అర్థం చేసుకోవచ్చు. 1983లో టీడీపీ ఆవిర్భావం తర్వాత 9 సార్లు ఎన్నికలు జరిగాయి. 1994, 1999 ఎన్నికల్లో మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది. మిగిలిన అన్ని సందర్భాల్లో ఆ పార్టీ ఓడిపోయింది. ప్రస్తుతం ఎన్నికల్లో మరోసారి ఓటమి తప్పదనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున బీసీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్, టీడీపీ నుంచి ఇంటూరి నాగేశ్వరరావు పోటీలో ఉన్నారు. బీసీ అభ్యర్థి కాన్సెప్ట్తో పాటు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు, నియోజకవర్గ అభివృద్ధి ఈ ఎన్నికల్లో బుర్రాకు కలిసి వస్తాయని భావిస్తుండగా, అంతర్గత కుమ్ములాటలతో టీడీపీ పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో వరుసగా మూడోసారి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ గెలిచి హ్యాట్రిక్ సాధిస్తుందని విశ్లేషనలు వెలువడుతున్నాయి. మాట్లాడుతున్న జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి వైఎస్సార్సీపీని దీవించండి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సికింద్రాబాద్–ఖుర్దారోడ్ మధ్య స్పెషల్ రైళ్లు
అవినీతి శ్రీశైలం కొండంత
బీజేపీ అభ్యర్థిపై ‘ఆప్’ ఆంక్షలు.. తగ్గేదే లేదన్న క్యాండిడేట్!
చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి
జిల్లాలో 14,162 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం
సింహగిరి.. భక్త ఝరి
ఎన్నికల విధుల్లో ట్రైనీ ఐపీఎస్ అధికారులు
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
రేపే అప్పన్న చందనోత్సవం
రాజకీయ పోరు
తప్పక చదవండి
- PK: 'పులుసు కారుతోంది'..!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- Lok Sabha Election 2024: ఎన్నికల చరిత్రలో ఏకగ్రీవాలు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
Advertisement