-
'హీరామండి' వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్ : హీరామండి: ది డైమండ్ బజార్ (వెబ్సిరీస్)నటీనటులు: మనీషా కొయిరాలా,అదితిరావు హైదరీ,రిచా చద్దా, సోనాక్షి సిన్హా,షర్మిన్ సెగల్, సంజీదా షేక్, తదితరులునిర్మాణ సంస్థలు: భన్సాలీ ప్రొడక్షన్స్దర్శకత్వం: సంజయ్ లీలా భన్సాలీసంగీతం: సంజయ్ లీలా భన్సాలీ,బెనెడిక్ట్ టేలర్,నరేన్ చందావర్కర్కథ: మొయిన్ బేగ్జానర్: చారిత్రక నాటకంఎపిసోడ్స్: 8 భాషలు: తెలుగుతో పాటు మొత్తంగా 14 భాషల్లో స్ట్రీమింగ్'హీరామండి: ది డైమండ్ బజార్' మే 1న నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ పెద్ద సంచలనమే రేపుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా హీరామండి టాపిక్ నడుస్తూనే ఉంది. కథ నిడివి విషయం పక్కన పెడితే ఈ సిరీస్కు ఎక్కువగా పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి. బాలీవుడ్లో టాప్ డైరెక్టర్గా ముద్ర వేసిన సంజయ్ లీలా భన్సాలీ మొదటిసారిగా ఒక వెబ్సిరీస్ను తెరకెక్కించడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ బిగ్ ప్రాజెక్ట్ను తన నిర్మాణ సంస్థ నుంచే రూ. 200 కోట్ల బడ్జెట్తో నిర్మించాడు. పీరియాడిక్ డ్రామా చిత్రాలకు పేరుగాంచిన సంజయ్ లీలా భన్సాలీ నుంచి ఇప్పటికే పద్మావత్, బాజీరావ్ మస్తానీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన తొలి వెబ్సిరీస్ 'హీరామండి' సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం.కథేంటంటే... బ్రిటీష్ పాలన సమయంలో లాహోర్లో ఉన్న వేశ్యావాటిక 'హీరామండి'లో ఎలాంటి ఆధిపత్య పోరు జరిగింది. ఈ క్రమంలో అక్కడ ఎలాంటి సంఘర్షణ జరిగింది..? హీరామండిలో ఆధిపత్యం చెలాయించేందుకు ఎవరెన్ని కుట్రలు చేశారు..? స్వాతంత్య్ర ఉద్యమంలో వారి పాత్ర ఎంత..? ఈ కథలోకి వెళ్లాలంటే ముందుగా పాత్రల గురించి పరిచయం తప్పనిసరి. హీరామండిలో ఉండే షాహీ మహల్ నిర్వహణ మొత్తం మల్లికా జాన్ (మనీషా కొయిరాలా) చేతిలో ఉంటుంది. ఆ ప్రాంతంలోని నవాబులంతా ఆమె కనుసన్నలలోనే ఉంటారు. అయితే అదే ప్రాంతంలో ఖ్వాభాగ్ అనే మరో మహల్ ఉంటుంది. అక్కడ ఫరీదాన్ (సోనాక్షి సిన్హా) ఉంటుంది. దీంతో వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఈ సిరీస్లో మరో మూడు పాత్రలు కీలకంగా ఉంటాయి. వహీదా (సంజీదా షేక్) మల్లికా జాన్కు సోదరి. బిబోజాన్ (అదితిరావ్ హైదరి), ఆలంజేబు (షర్మిన్ సెగల్) ఇద్దరూ కూడా మల్లికా జాన్కు కుమార్తెలు. లజ్జో (రిచా చద్దా) మల్లికా జాన్ దత్తత తీసుకున్న కూతురు.హీరామండిలో తన మాటకి తిరుగులేదనే స్థాయిలో మల్లికా జాన్ (మనీషా కొయిరాలా) రాజ్యమేలుతూ ఉంటుంది. ఆమె కనుసన్నల్లో ఉన్న వేశ్యలపై ఆధిపత్యం చెలాయిస్తూ.. ఎవరైనా ప్రేమలో పడితే ప్రమాదంలో పడినట్టే అనే మాటతో హెచ్చరిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో వేశ్యలుగా ఉంటూనే మల్లికా జాన్ మాట వినిపించుకోకుండా 'జొరావర్' అనే నవాబుతో లజ్జో, ఫిరోజ్ అనే నవాబుతో వహీదా, వలీ ఖాన్ అనే నవాబుతో బిబోజాన్ ప్రేమలో పడతారు. కానీ, మల్లికా జాన్ చిన్న కుమార్తె ఆలంజేబును కూడా వేశ్యలా మార్చాలని చూస్తుంది. అయితే, ఆమె బాలోచి నవాబు తాజ్దార్ (తాహా షా బహదూర్ షా)తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం మల్లికా జాన్తో పాటు తాజ్దార్ తండ్రికి నచ్చదు. ఆయన ఆంగ్లేయులకు బానిసగా ఉంటాడు. వారి నుంచి విముక్తి కోసం తాజ్ దార్ పోరాడుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఆలంజేబును పెళ్లి చేసుకోవాలనే తాజ్ దార్ నిర్ణయాన్ని అతని తండ్రి వ్యతిరేకిస్తాడు. వేశ్య తమ ఇంటికి కోడలిగా రాలేదని తేల్చి చెబుతాడు. మరోవైపు కూతురు ప్రేమ వివాహాన్ని మల్లికా జాన్ కూడా వ్యతిరేఖిస్తుంది. ఈ క్రమంలో మల్లిక వ్యవహారశైలి నచ్చని తన సోదరి వహీదా ఆమెకు గుణపాఠం చెప్పాలని అనుకుంటుంది. దీంతో తన అక్కకు శత్రువుగా ఉన్న ఫరీదాన్ (సోనాక్షి సిన్హా)తో చేతులు కలుపుతుంది. ఇలా హీరామండిలో అనేక సంఘటనలు జరుగుతుండగా బిబోజాన్ (అదితిరావ్ హైదరి) బ్రిటీషర్లకు వ్యతిరేకంగా జరిగే స్వాతంత్య్ర పోరాటంలో గూఢచారిగా ఉంటుంది. ఒక వేశ్యగా ఉన్న ఆమె ఈ పోరాటం ఎందుకు చేస్తుంది..? బ్రిటీషర్లతో సత్సంబంధాలు పెంచుకుని వారి రహస్యాలను ఎందుకు తెలుసుకుంటుంది..? ఫైనల్గా బిబోజాన్ ఒక గూఢచారి అని తెలిసిన తర్వాత బ్రిటీష్వాళ్లు ఏం చేశారు..? ఇదే సమయంలో షాహీ మహల్కు పెద్ద దిక్కుగా ఉన్న మల్లికా జాన్న్ అనచివేసేందుకు ఫరీదాన్ ఎలాంటి కుట్రలకు తెరలేపింది..? వేశ్య కుటుంబానికి చెందిన ఆరుగురు స్త్రీల చుట్టూ.. నవాబులు, బ్రిటీష్ పోలీస్ అధికారులు, తిరుగుబాటుదారుల మధ్య ఎలాంటి సంఘటనలు జరిగాయనేది తెలియాలంటే హీరామండి సిరీస్ చూడాల్సిందే..ఎలా ఉందంటే..పీరియాడిక్ డ్రామా చిత్రాలను డిఫరెంట్గా తెరకెక్కించడంలో డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు. స్వాతంత్య్రానికి ముందు అంటే 1930, 1940ల కాలం బ్యాక్డ్రాప్లో హీరామండి వెబ్ సిరీస్ను తెరకెక్కించాడు. 'హీరామండిలో తెల్లదొరల పెత్తనం కాదు.. మల్లికా జాన్ నాణేలు మాత్రమే చెలామణి అవుతాయి' అని మనీషా కొయిరాలా చెప్పిన ఒక్క డైలాగ్ చాలు.. ఈ సిరీస్ డెప్త్ ఏంటో చెప్పడానికి బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఎందరో మహిళలు ఎన్నో పోరాటాలు చేశారు. కానీ కొందరు చరిత్ర పుటల్లో కలిసిపోతే.. మరికొందరు మాత్రం నేటికి కూడా వినికిడిలో ఉన్నారు. లాహోర్ నగరంలోని హీరామండి ప్రాంతంలో పడుపు వృత్తి నిర్వహించే మల్లికా జాన్కు, బ్రిటీష్వాళ్లతో మొదలైన వైరాన్ని సంజయ్లీలా చక్కగా చూపించాడు. స్వాతంత్య్ర పోరాటంలో 'హీరామండి' పాత్ర ఎంతవరకు ఉందో చెప్పడానికి భారీగానే డైరెక్టర్ ప్లాన్ చేశాడు. మొత్తం 8 ఎపిసోడ్స్లలో తన విజువల్ ఫీస్ట్తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. హీరామండిలో వేశ్యలుగా ఉన్న వారి జీవితాలను తెరపైన అద్బుతంగా క్రియేట్ చేశాడు. వేశ్యావృత్తితో సమాంతర వ్యవస్థను నడుపుతున్న ఆ మహిళలు స్వతంత్ర సంగ్రామంలోకి ఎందుకు దూకాల్సి వచ్చిందో అదిరిపోయే రేంజ్లో చూపించాడు. ఆంగ్లేయులపై తిరుగుబాటు జరిపి వాళ్ల వెన్నులో వణుకు పుట్టించిన వేశ్యలుగా వారందరినీ తెరపై చూపించి అద్భుతాన్ని ఆవిష్కరించడంలో సంజయ్లీలా భన్సాలీ సూపర్ సక్సెస్ అయ్యాడు.తన టేకింగ్, విజువల్ ఫీస్ట్తో ప్రతి ప్రేక్షకుడినీ హీరామండి ప్రపంచంలోకి తీసుకెళ్లారు. ఆ కాలంనాటి డిజైన్లను దృష్టిలో పెట్టుకుని అందంగా తీర్చిదిద్దిన భారీ సెట్లతో పాటు చక్కని ఫొటోగ్రఫీ తోడు కావడం ఆపై ప్రతి పాత్రకు సంబంధించిన కాస్ట్యూమ్స్ ఈ సిరీస్కు ప్రధానమైన బలంగా నిలిచాయని చెప్పచ్చు. ముఖ్యంగా పాటల చిత్రీకరణ మరిన్ని మార్కులు కొట్టేస్తుంది. ఒక వెబ్ సిరీస్ అంత భారీ స్థాయిలో పాటలు అవసరమా అనేలా ఉంటాయి. ప్రారంభంలో రెండు, మూడు ఎపిసోడ్స్లలో కథ పరంగా కాస్త నెమ్మదించినా చివరి రెండు ఎపిసోడ్స్ మాత్రం దుమ్మురేపుతాయి. మల్లికా జాన్ పాత్ర పరిచయం చేసిన ఒక ఎపిసోడ్ కూడా మెప్పిస్తుంది. సొంత కుమార్తెలతో సహా ఎవరిపైనా దయాదాక్షిణ్యాలు లేని కఠినాత్మురాలిగా ఆ పాత్రను క్రియేట్ చేసిన విధానం అందరినీ మెప్పిస్తుంది. వేశ్యల జీవితాల చుట్టూ తిరిగే కథనే అయినప్పటికీ, ఎక్కడా అభ్యంతరకరమైన సన్నివేశాలు కనిపించవు. ఈ వీకెండ్లో చక్కగా కుటుంబ సభ్యులతో కలిసి చూసి ఎంజాయ్ చేసేలా ఈ సిరీస్ ఉంటుంది. బ్రిటీష్ పాలనను దిక్కరించిన హీరామండి చరిత్ర పుటల్లో పెద్దగా కనిపించదు. అలా కనుమరుగైన ఒక చాప్టర్ను 'హీరామండి'గా సంజయ్లీలా తీసుకొచ్చాడు.ఎవరెలా చేశారంటేరూ. 200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సిరీస్లో టాప్ హీరోయిన్లను దర్శకుడు సెలక్ట్ చేసుకున్నాడు. మనీషా కొయిరాలా,అదితిరావు హైదరీ,రిచా చద్దా, సోనాక్షి సిన్హా,షర్మిన్ సెగల్, సంజీదా షేక్ వంటి స్టార్స్ ఇందులో ఉన్నారు. ఈ సిరీస్కు ప్రధాన బలం వారే అని చెప్పవచ్చు. షాహీమహల్కు పెద్ద దిక్కుగా మల్లికాజాన్ పాత్రలో మనీషా కొయిరాలా దుమ్మురేపిందని చెప్పవచ్చు. తన కడుపున పుట్టిన కూతుర్లను కూడా వేశ్యలుగా మార్చే అంత కఠినాత్మురాలిగా ఆమె చూపించిన నటన అద్భుతమని చెప్పవచ్చు. మరోవైపు ఫరీదాన్గా సోనాక్షి సిన్హా నెగెటివ్ పాత్రలో మెప్పించింది. వీరందరికీ ఏమాత్రం తగ్గకుండా అదితిరావు హైదరీ ఎలివేషన్ మామూలుగా ఉండదు. వేశ్యగా కనిపిస్తూనే గూఢచారిగా తన సత్తా ఎంటో చూపించింది. నటనలో ఆమె ఎక్కడా తగ్గలేదు. తన పాత్రకు వంద శాతం న్యాయం చేసిందని చెప్పవచ్చు. ఈ సిరీస్కు ప్రధాన బలం విజువల్స్, కాస్ట్యూమ్స్,సినిమాటోగ్రఫీ. ఇవన్నీ కూడా ఓటీటీ స్థాయికి మించి ఉన్నాయి. కానీ, ఇందులో ఎక్కువగా యుద్ధ ఘట్టాలు లేకున్నా ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఆనాటి చరిత్రకు.. సమాజంలోని స్థితిగతులకు దర్పణం పట్టేలా సీన్స్ ఉన్నాయి. కాస్త నిడివి తగ్గించి ఉంటే బాగుండు అనే కామెట్లు కూడా వినిపిస్తున్నాయి. -
'ది ఇండియన్ స్టోరీ' సినిమా రివ్యూ
ఈ వారం థియేటర్లలోకి ఐదుకి పైగా సినిమాలు వచ్చాయి. వీటిలో 'ఆ ఒక్కటి అడక్కు', 'ప్రసన్నవదనం' చిత్రాలు ఉన్నంతలో కాస్త అంచనాలతో రిలీజయ్యాయి. వీటితోపాటు వచ్చిన మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ 'ది ఇండియన్ స్టోరీ'. రాజ్ భీమ్ రెడ్డి, జరా ఖాన్ హీరో హీరోయిన్. రాజ్ భీమ్ రెడ్డి నిర్మించారు. సమాజంలో మత సామరస్యం ఉండాలనే కాన్సెప్ట్తో దర్శకుడు ఆర్. రాజశేఖర్ రెడ్డి తీశారు. ఇంతకీ మూవీ ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?మత విద్వేషాలు రగిలే రాష్ట్రంలో హిందూ వర్గానికి శ్రీరామ్ (రామరాజు), ముస్లిం వర్గానికి కబీర్ ఖాన్ (ముక్తార్ ఖాన్) నాయకత్వం వహిస్తుంటారు. ఒకరిపై మరొకరు ప్రతీకార దాడులు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి టైంలో వైజాగ్ నుంచి రెహమాన్ (రాజ్ భీమ్ రెడ్డి) వస్తాడు. ఇతడి దగ్గర బంగారు బిస్కెట్లు ఉంటాయి. అవి అమ్మడానికి స్నేహితుడు ఫేకు (చమ్మక్ చంద్ర) సాయం తీసుకుంటాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో కత్తిపోట్లకు ఎదురెళ్లి కబీర్ ఖాన్ని రెహమాన్ కాపాడతాడు. అనంతరం కబీర్ వర్గంలో ఓ నాయకుడిగా మారతాడు. కబీర్ కూతురు డాక్టర్ ఆయేషా (జరా ఖాన్)తో ప్రేమలో పడతారు. ఓ సంఘటన వల్ల రెహమాన్పై కబీర్ దాడి చేస్తాు. అసలు దీనికి కారణమేంటి? శ్రీరామ్, కబీర్ గతమేంటి? మతం పేరుతో ఈ ఇద్దరు.. ప్రజల మధ్య ఎలా చిచ్చు పెడుతున్నారు? చివరకి ఏమైందనేదే సినిమా.(ఇదీ చదవండి: ‘శబరి’ మూవీ రివ్యూ)ఎలా ఉందంటే?మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటే అని చెప్పే సినిమా ఇది. మతం పేరుతో జరుగుతున్న దాడుల గురించి ప్రజలకు కనువిప్పు కలగజేసే మూవీ ఇది. హీరో, చమ్మక్ చంద్ర క్యారెక్టర్స్ మధ్య మంచి కామెడీతో ఈ సినిమా సరదాగా మొదలవుతుంది. ఆ తర్వాత ముస్తాఫా, రవి, రహీం హత్యలతో ఒక వర్గంపై మరో వర్గం దాడులు చేసుకుంటున్న టైమ్ లో ముస్లిం లీగ్ పార్టీ పేరుతో కబీర్ ఖాన్, శక్తి సేన పార్టీ పేరుతో శ్రీరామ్ రాజకీయ రంగంలోకి దిగుతారు. ఇక్కడి నుంచి మతం పేరుతో జరిగే రాజకీయ క్రీడను దర్శకుడు ఆర్ రాజశేఖర్ రెడ్డి ఇంట్రెస్టింగ్గా తీశారు. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. ఫస్టాఫ్లో వచ్చిన సందేహాలకు సెకండాఫ్లో ఒక్కొక్కటిగా సమాధానం దొరుకుతుంది. క్లైమాక్స్ ఆసక్తికరంగా అనిపిస్తుంది.హీరోగా రాజ్ భీమ్ రెడ్డి ఆకట్టుకున్నాడు. హీరో హీరోయిన్స్ మధ్య లవ్ ఎమోషన్ ఉంటుంది. ఫైట్లు బాగానే తీశారు. హీరోయిన్ జరా ఖాన్ ఉన్నంతలో పర్వాలేదనిపించింది. శ్రీరామ్గా రామరాజు, కబీర్ ఖాన్గా ముక్తార్ ఖాన్ ఓకే. టెక్నికల్ విషయాలకొస్తే నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, సంగీతం, దర్శకత్వం ఇలా అందరూ తమ తమ పనికి పూర్తి న్యాయం చేశారు.(ఇదీ చదవండి: సుహాస్ 'ప్రసన్న వదనం' రివ్యూ.. మరో హిట్ పడినట్టేనా?) -
‘శబరి’ మూవీ రివ్యూ
టైటిల్: శబరినటీనటులు: వరలక్ష్మీ శరత్ కుమార్, గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, బేబీ నివేక్ష తదితరులునిర్మాత: మహేంద్ర నాథ్రచన-దర్శకత్వం: అనిల్ కాట్జ్సంగీతం: గోపి సుందర్సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ, నాని చమిడిశెట్టిఎడిటర్: ధర్మేంద్ర కాకరాలవిడుదల తేది: మే 3, 2024కథేంటంటే...సంజన(వరలక్ష్మి శరత్ కుమార్), అరవింద్(గణేష్ వెంకట్ రామన్) ప్రేమించి పెళ్లి చేసుకొని ముంబై వెళ్తారు. కొన్నాళ్ల తర్వాత ఓ కారణంతో అరవింద్ని వదిలేసి కూతురు రియా(బేబీ నివేక్ష)తో కలిసి విశాఖపట్నం వచ్చేస్తుంది. ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది. చివరకు తన కాలేజ్ ఫ్రెండ్, లాయర్ రాహుల్(శశాంక్) సహాయంతో ఓ కార్పొరేట్ కంపెనీలో జుంబా డ్యాన్స్ ట్రైనర్గా ఉద్యోగం సంపాదిస్తుంది. సిటీకి దూరంగా ఓ ఫారెస్ట్లో సింగిల్గా ఉన్న ఇంట్లోకి షిఫ్ట్ అవుతుంది. కూతురిని మంచి స్కూల్లో జాయిన్ చేస్తుంది. ఓ సారి తన బంధువుల ఇంటికి వెళ్లగా.. తన కోసం సూర్య (మైమ్ గోపి) అనే ఓ క్రిమినల్ వచ్చాడని, అడ్రస్ చెప్పమని బెదిరించారనే విషయం తెలుస్తుంది. అదే భయంతో ఇంటికి వెళ్లగా.. నిజంగానే సూర్య తనను వెంబడిస్తాడు. అతని నుంచి తప్పించుకునే క్రమంలో గాయాలపాలవుతుంది. మరోసారి రాహుల్ ఇంటికి వెళ్లి వస్తుండగా.. సూర్య కనిపిస్తాడు. భయంతో సంజన పరుగులు తీస్తుంది. చివరకు స్పృహతప్పి పోగా.. పోలీసులు కాపాడతారు. సూర్య గురించి పోలిసులు ఇన్వెస్టిగేట్ చేయగా.. అతను చనిపోయినట్లు తెలుస్తుంది. మరి సంజనను వెంబడిస్తున్న సూర్య ఎవరు? ఎందుకు వెంబడిస్తున్నాడు? ప్రేమించి పెళ్లి చేసుకున్న అరవింద్ని సంజన ఎందుకు వదిలేసి వచ్చింది? అరవింద్ చేసిన తప్పేంటి? కిడ్నాప్కి గురైన కూతురు రియాని కాపాడుకోవడం సంజన ఎం చేసింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే?ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఇలాంటి సినిమాల్లో థ్రిల్ ఎలిమెంట్స్తో పాటు ట్విస్టులు కూడా ఊహించని విధంగా ఉండాలి. అప్పుడే సినిమా రక్తి కట్టిస్తుంది. శబరిలోనూ ఆ రెండు ఉన్నాయి. కానీ డైరెక్టర్ కథను డీల్ చేయడంలో కాస్త తడబడ్డాడు. ఎంచుకున్న పాయింట్ బాగుంది కానీ దాని చుట్టు అల్లుకున్న కథ.. రాసుకున్న స్క్రీన్ప్లే అంతగా అకట్టుకోలేకపోయింది. చాలా సన్నివేశాలు గత సినిమాలను గుర్తు చేసేలా ఉన్నాయి. లాజిక్స్ విషయంలో సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసుకున్నాడు. కథంతా ఒక్క పాయింట్ చుట్టే తిరగడంతో సాగదీతగా అనిపిస్తుంది. అయితే మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. బిడ్డను కాపాడుకోవడం కోసం తల్లి చేసే పొరాటం ఆకట్టుకుంటుంది.సిటీలో ఓ మెంటల్ ఆస్పత్రి నుంచి ఓ వ్యక్తి తప్పించుకొని వచ్చి ఇద్దరిని చంపి, సంజన కోసం వెతికె సీన్తో కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు. ఆ తర్వాత కథను రెండేళ్ల ముందుకు తీసుకెళ్లాడు. సంజన ఉద్యోగం కోసం వెతకడం.. ఈ క్రమంలో ఆమె బాల్యం.. అరవింద్తో పెళ్లి.. విడిపోవడానికి గల కారణాలను చూపిస్తూ ఎమోషనల్గా కథనాన్ని నడిపించాడు. అయితే ప్రతీది డీటెల్డ్గా చూపించడంతో కథనం సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఫస్టాఫ్ అంతా సింపుల్గా, నిదానంగా సాగినట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండాఫ్లో ఒక్కో ట్విస్ట్ రివీల్ అవ్వడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. కానీ సూర్య గురించి ట్విస్ట్ తెలిసిన తర్వాత కథనం మళ్లీ రొటీన్గానే సాగుతుంది. క్లైమాక్స్ ముందు వచ్చే ట్విస్ట్ కాస్త థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. లాజిక్స్పై దృష్టిపెట్టి స్క్రీన్ప్లేని మరింత బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే..సంజనా పాత్రకు వరలక్ష్మి శరత్ కుమార్ పూర్తి న్యాయం చేసింది. ఇనాళ్లు విలనిజం ఉన్న పాత్రలు పోషించిన వరలక్ష్మీ.. ఇందులో డిఫరెంట్ రోల్ ప్లే చేసింది. కూతురుని కాపాడటం కోసం పోరాడే సాధారణ మహిళ పాత్రలో ఒదిగిపోయింది. ఇక మైమ్ గోపి విలనిజం బాగా వర్కౌట్ అయింది. రియాగా చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నివేక్ష అద్భుతంగా నటించింది. అరవింద్గా గణేష్ వెంకట్రామన్ చక్కగా నటించాడు. లాయర్గా శశాంక్, పోలీసు అధికారి శంకర్గా మధుసూధన్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. గోపీసుందర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కథలో భాగంగా వస్తుంటాయి. కానీ అవి గుర్తించుకునేలా ఉండవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమా నిడివి తక్కువే అయినా చాలా చోట్ల అనవసరపు సీన్స్ ఉన్నాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
Death Whisperer Review: అమ్మాయిలను వెంటాడే దెయ్యం..చివరికేమైంది?
టైటిల్: డెత్ విస్పరర్డైరెక్టర్: థావివాత్ వాంతానటీనటులు: నదెచ్ కుగిమియ, జూనియర్ కజ్భుందిట్, పీరకృత్ పచరబూన్యకైట్, దెడిస్ జెలిల్చ కపౌన్నిడివి: 2 గంటలుఓటీటీ: నెట్ఫ్లిక్స్హారర్ సినిమాలకు ప్రత్యేక అభిమానులుంటారు. కొందరు భయమనేదే లేకుండా.. కన్నార్పకుండా సినిమా చూస్తారు. మరికొందరు ఎంత భయమేసినా సరే.. నిండా దుప్పటి కప్పుకుని మరీ చూస్తుంటారు. హారర్ సినీప్రియులందరికోసం ప్రతియేడూ బోలెడన్ని సినిమాలు రిలీజవుతున్నాయి. అలా గతేడాది డెత్ విస్పరర్ అనే థాయ్ మూవీ రిలీజైంది. క్రిట్టనాన్ రచించిన టీ యోడ్ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ కథేంటి? ఎలా ఉందో చూద్దాం..కథేంటంటే..అది 1970.. థాయ్లాండ్ కాంచనబూరిలోని గ్రామంలో ఓ ఫ్యామిలీ సంతోషంగా జీవనం సాగిస్తుంటుంది. ఇంటి పెద్ద పొలం పని చేస్తుంటాడు. చాలా స్ట్రిక్ట్. భార్య ఇంటి పనికే పరిమితమవుతుంది. వీరికి ముగ్గురమ్మాయిలు, ముగ్గురబ్బాయిలు సంతానం. పిల్లలు బడికి వెళ్లేముందు, వచ్చాక తల్లికి ఇంటిపనిలో సాయపడుతుంటారు. ఇద్దరబ్బాయిలు తండ్రికి పొలంలో సాయం చేస్తారు. అందరికంటే పెద్దవాడైన యాక్ మిలిటరీలో పని చేస్తాడు. కానీ ఓ రోజు ఉన్నట్లుండి ఇంటికి వచ్చేస్తాడు. అప్పటికే ముగ్గురమ్మాయిలకు స్కూలుకు వెళ్లే దారిలో ఓ చెట్టు కింద దెయ్యం కనిపిస్తూ ఉంటుంది. వారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ దెయ్యం కనిపిస్తుంది.పన్ను పీకి చేతబడిఆ దెయ్యం అందరికంటే ఆరోగ్యంగా ఉన్న యామ్ను ఆవహించేందుకు సెలక్ట్ చేసుకుంటుంది. దీంతో తను అనారోగ్యానికి లోనవుతుంది. వింతగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఓ రోజు చూయ్ అనే మంత్రగత్తె కిటికీలోంచి ఆ అమ్మాయి గదిలోకి దూరం తన పన్ను పీకి దానిపై చేతబడి చేస్తుంది. ఈ విషయం తెలిసి మిలిటరీ నుంచి వచ్చిన అన్న తనను చావబాదడానికి వెళ్తే తనే ఆత్మహత్య చేసుకుంటుంది. అక్కడినుంచి ఈ కుటుంబానికి కష్టాలు మొదలవుతాయి.క్లైమాక్స్లో ట్విస్ట్రాత్రిపూట దెయ్యం ఏదో వింతవింత(గుసగుసలాడినట్లు) శబ్దాలు చేయడం, అది విన్నవారు స్పృహ తప్పిపోవడం.. అర్ధరాత్రి యామ్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లడం, ఆమెను వెతికి తీసుకురావడం.. ఇదే జరిగేది. దెయ్యం వారిని మానిప్యులేట్ చేయడానికి ట్రై చేసినా.. ప్రాణాలకు తెగించి మరీ యాక్ తన చెల్లిని బతికించేందుకు ప్రయత్నిస్తాడు. దెయ్యం ఎక్కడైతే కనిపించిందో ఆ చెట్టును కొట్టేసి అక్కడున్న మానవ మాంసాన్ని కాల్చేస్తారు. తర్వాత ఆస్పత్రికి వెళ్లే దారిలో దెయ్యాన్ని కూడా షూట్ చేస్తారు. ఇక దాని పీడ విరగడైందనుకున్న సమయంలో డైరెక్టర్ ట్విస్ట్ ఇచ్చాడు.. అదేంటో తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే!ఎలా ఉందంటే?డెత్ విస్పరర్స్.. ఈ మూవీలో హారర్కే పెద్ద పీట వేశారు. కామెడీ జోలికి వెళ్లలేదు. అయితే సినిమా అంతా ఒక ఫ్లోలో వెళ్లిపోతుంది. పెద్దగా ఎగ్జయిట్ అయ్యే విషయాలంటూ ఏమీ ఉండవు. నటీనటులు బాగా యాక్ట్ చేశారు. సౌండ్ ఎఫెక్ట్స్ మీద కాస్త ఫోకస్ చేయాల్సింది. క్లైమాక్స్ చివర్లో సీక్వెల్ ఉంటుందని హింటిచ్చారు. ఫైనల్గా చెప్పాలంటే ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. అయితే తెలుగు ఆడియో, సబ్టైటిల్స్ లేవు. ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో సినిమా చూసేయొచ్చు. -
‘రత్నం’ మూవీ రివ్యూ
టైటిల్ : రత్నంనటీనటులు: విశాల్, ప్రియా భవానీ శంకర్, మురళీ శర్మ, గౌతమ్ మీనన్, సముద్రఖని, యోగిబాబు తదితరులునిర్మాణ సంస్థలు: జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్దర్శకత్వం: హరిసంగీతం: దేవీ శ్రీ ప్రసాద్విడుదల తేదిఫ: ఏప్రిల్ 26, 2024‘భరణి’, ‘పూజా’సినిమాల తర్వాత మాస్ యాక్షన్ హీరో, పురుచ్చి దళపతి విశాల్, యాక్షన్ డైరెక్టర్ హరి కాంబినేషన్లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ‘రత్నం’. కార్తికేయన్ సంతానం ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ని ప్రేక్షకులను నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ గ్రాండ్గా చేయడంతో ‘రత్నం’పై టాలీవుడ్లోనూ భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఏప్రిల్ 26) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన రత్నం(విశాల్) చిత్తూరు మార్కెట్లో పని చేస్తుంటాడు. చిన్నప్పుడు ఓ సారి అదే మార్కెట్కు చెందిన పన్నీర్ సామి(సముద్రఖని)ని చంపేందుకు వచ్చిన ఓ మహిళను కత్తితో చంపేస్తాడు. తన ప్రాణాలను కాపాడడనే సానుభూతితో రత్నాన్ని తనవద్దే ఉంచుకుంటాడు పన్నీర్. కొన్నాళ్లకు పన్నీర్ ఎమ్మెల్యే అవుతాడు. అతని తోడుగా ఉంటూ నియోజకవర్గంలో ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తాడు రత్నం. ఓ సారి నీట్ పరీక్ష రాసేందుకు చిత్తూరు వచ్చిన మల్లిక(ప్రియా భవానీ శంకర్)ని చూసి, ఫాలో అవుతాడు. అదే సమయంలో అమెను చంపేందుకు లింగం(మురళీ శర్మ) గ్యాంగ్ చిత్తూరు వస్తుంది. వారి నుంచి మల్లికను కాపాడమే కాదు, దగ్గరుండి మరీ పరీక్ష రాయిస్తాడు. అసలు మల్లిక ఎవరు? ఆమెకు రత్నంకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? లింగం మనుషులు ఆమెను ఎందుకు వెంబడిస్తున్నారు? రత్నం తల్లి రంగనాయకమ్మ ఎలా చనిపోయింది? లింగం నేపథ్యం ఏంటి? మల్లిక కుటుంబానికి వచ్చిన సమస్యను తీర్చే క్రమంలో రత్నంకు తెలిసిన నిజం ఏంటి? ఆ నిజం తెలిసిన తర్వాత రత్నం ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. మాస్ సినిమాలను డిఫరెంట్గా తెరకెక్కించడంలో డైరెక్టర్ హరి స్పెషలిస్ట్. నాన్ స్టాప్ యాక్షన్తో కథనాన్ని పరుగులు పెట్టిస్తాడు. అందుకే సింగంతో పాటు దానికి కొనసాగింపుగా వచ్చిన చిత్రాలన్నీ తెలుగులోనూ మంచి విజయం సాధించాయి. రత్నం కూడా అదే తరహాలో తెరకెక్కించాడు. కావాల్సినంత యాక్షన్తో కథనాన్ని పరుగులు పెట్టించాడు. కానీ కథలో మాత్రం కొత్తదనం మిస్ అయింది. యాక్షన్ సీన్స్తో పాటు ప్రతి సన్నివేశం రొటీన్గానే అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల పాత్రల మధ్య ఉన్న సంబంధాన్ని మాత్రం కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. కాని అది ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. 1994లో ఆంధ్ర-తమిళనాడు సరిహద్దులో జరిగే బస్సు దోపిడి సీన్తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కథంతా చిత్తూరు మార్కెట్ చుట్టూ తిరుగుతుంది. రత్నం చైల్డ్ ఎపిసోడ్ తర్వాత కథ వెంటనే 2024లోకి వెళ్లిపోతుంది. అక్కడ నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. హీరో.. హీరోయిన్ చూసి ఎక్కడో చూసినట్లు భావించడం.. ఆమెను ఫాలో అవుతూ.. లింగం గ్యాంగ్ నుంచి కాపాడడం.. ఇలా ప్రతీ సన్నివేశం రొటీన్గానే అనిపిస్తుంది. మధ్య మధ్య యోగిబాబు వేసే కామెడీ పంచులు మినహా ఫస్టాఫ్ అంతా రొటీన్గానే సాగుతుంది. హీరోయిన్ విషయంలో దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్ కన్విసింగ్గా అనిపించడు. దీంతో సెకండాఫ్ అంతా మరింత రొటీన్ సాగుతు బోర్ కొట్టిస్తుంది. కథనం పరుగులు పెట్టినట్లే అనిపిస్తుంది కానీ..ఎక్కడా ఆసక్తిని రేకెత్తించదు. కొన్ని యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ రొటీన్గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ అటు కోలీవుడ్తో పాటు ఇటు టాలీవుడ్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో విశాల్. ఆయన నుంచి ఓ యాక్షన్ సినిమా వస్తుందంటే ఆ క్రేజే వేరే లెవల్లో ఉంటుంది. ఈ జానర్ సినిమాల్లో విశాల్ మరింత రెచ్చిపోయి నటిస్తాడు. రత్నంలోనూ అలానే నటించాడు. ఎప్పటిమాదిరే కథంతా తన భుజానా వేసుకొని నడిపించాడు. యాక్షన్ సీన్స్తో పాటు ఎమోషన్ సీన్స్లోనూ చక్కగా నటించాడు. మల్లిక పాత్రకు ప్రియా భవానీ శంకర్ న్యాయం చేసింది. కథంతా ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది. లింగంగా మురళీ శర్మ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు.ఎమ్మెల్యే పన్నీర్గా సముద్రఖనీ తన పాత్ర పరిధిమేర బాగానే నటించాడు. హీరో స్నేహితుడు మూర్తిగా యోగిబాబు వేసే పంచులు, కామెడీ బాగా వర్కౌట్ అయింది. హరీశ్ పేరడీ, గౌతమ్ మీనన్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. పాటలతో పాటు కొన్ని చోట్ల అదిరిపోయే బీజీఎం అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
Paarijatha Parvam Review: ‘పారిజాత పర్వం’ మూవీ రివ్యూ
టైటిల్: పారిజాత పర్వంనటీనటులు: సునీల్, శ్రద్ధా దాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్, గుండు సుదర్శన్ , గడ్డం నవీన్, జబర్దస్త్ రోహిణి తదితరులునిర్మాతలు : మహీధర్ రెడ్డి, దేవేష్రచన, దర్శకత్వం: సంతోష్ కంభంపాటిసంగీతం: రీఎడిటర్: శశాంక్ వుప్పుటూరివిడుదల తేది: ఏప్రిల్ 19, 2024‘పారిజాత పర్వం’ కథేంటంటే?చైతన్య(చైతన్య రావు) దర్శకుడు కావాలని హైదరాబాద్ వస్తాడు. తన స్నేహితుడు(వైవా హర్ష)ని హీరోగా పెట్టి ఓ సినిమాను తెరకెక్కించాలనేది అతని కల. దాని కోసం కథతో నిర్మాతల చుట్టూ తిరుగుతాడు. కానీ కొంతమంది కథ నచ్చక రిజెక్ట్ చేస్తే.. మరికొంతమంది హీరోగా అతని స్నేహితుడిని పెట్టడం ఇష్టంలేక రిజెక్ట్ చేస్తుంటారు. చివరకు చైతన్యనే నిర్మాతగా మారి సినిమా తీయాలనుకుంటాడు. డబ్బు కోసం ప్రముఖ నిర్మాత శెట్టి(శ్రీకాంత్ అయ్యంగార్) భార్య(సురేఖ వాణి)ను కిడ్నాప్ చేయాలనుకుంటారు. మరోవైపు బారు శ్రీను -పారు(శ్రద్ధాదాస్) గ్యాంగ్ కూడా శెట్టి భార్యనే కిడ్నాప్ చేసేందుకు స్కెచ్ వేస్తారు. మరి ఈ ఇద్దరిలో శెట్టి భార్యను కిడ్నాప్ చేసిందెవరు? అసలు బారు శ్రీను ఎవరు? అతని నేపథ్యం ఏంటి? చైతన్య, బార్ శ్రీను ఎలా కలిశారు? శెట్టి భార్యను కిడ్నాప్ చేయమని బార్ శ్రీను గ్యాంగ్కి చెప్పిందెవరు? వాళ్ల ప్లాన్ ఏంటి? చివరకు చైతన్య సినిమా తీశాడా? లేదా? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉందంటే.. సినిమా తీయడం ఓ కళ. ప్రేక్షకుడిని నవ్వించో, భయపెట్టో.. ఏదో ఒకటి చేసి రెండున్నర గంటల పాటు థియేటర్స్లో కూర్చోబెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. సినిమాలో సమ్థింగ్ స్పెషల్ ఉంటేనే ప్రేక్షకుడు థియేటర్కి వస్తాడు. రొటీన్ కథనే మరింత రొటీన్గా చూపిస్తానంటే ఎందుకు వస్తాడు? ఈ విషయం తెలిసి కూడా పారిజాత పర్వం తెరకెక్కించాడు దర్శకుడు సంతోష్ కంభంపాటి.క్రైమ్ కామెడీ జోనర్లో సెఫెస్ట్ కాన్సెప్ట్ అయిన కిడ్నాప్ డ్రామానే కథగా మలుచుకొని.. రొటీన్ ట్విస్టులతో సాదాసీదాగా కథనాన్ని నడిపించాడు. ఫన్, సస్పెన్స్, థ్రిల్..వీటిల్లో ఏ ఒక్కటి కూడా ప్రేక్షకుడికి పూర్తిగా అందించలేకపోయాడు. కథ ప్రారంభం కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చైతన్య సినిమా కష్టాలను చూపిస్తూనే బారు శ్రీను నేపథ్యాన్ని పరిచయం చేయడం కాస్త కొత్తగా అనిపిస్తుంది. అయితే ఆ తర్వాత కథ అస్సలు ముందుకు సాగదు. చెప్పిన కథనే మళ్లీ చెప్పడం..వచ్చిన సీన్లే మళ్లీ రావడంతో ఫస్టాఫ్ సాగదీతగా అనిపిస్తుంది. వైవా హర్ష పంచులతో పాటు హీరోయిన్ కారు డ్రైవింగ్ సీన్లు కాస్త నవ్విస్తాయి.అసలు కథంతా(కిడ్నాప్) సెకండాఫ్లోనే మొదలవుతుంది. అయితే కిడ్నాప్ కోసం రెండు టీమ్లు చేసే ప్లాన్ మొదలుకొని..చివరి సీన్ వరకు కథనం రొటీన్గా సాగుతుంది. చాలా చోట్ల లాజిక్ మిస్ అయ్యారు. కన్ఫ్యూజన్ డ్రామా సరిగా వర్కౌట్ కాలేదు. కిడ్నాప్ తర్వాత ఏం జరుగుతుందనేది ఈజీగా అర్థమైపోతుంది. పేలవమైన స్క్రీన్ప్లే, రొటీన్ ట్విస్టులతో కథను సాగదీశాడు. ఈ చిత్రానికి కొనసాగింపు ఉంటుందని ప్రకటించడమే ప్రేక్షకుడికి పెద్ద ట్విస్ట్.ఎవరెలా చేశారంటే.. నటన పరంగా చైతన్యకు వంక పెట్టలేం కానీ ఆయన ఎంచుకుంటున్న కథలే రొటీన్ ఉంటున్నాయి. ఇందులోనూ ఆయన రొటీన్ పాత్రే పోషించాడు. సునీల్కి మంచి పాత్రే లభించింది. కానీ అటు విలన్గాను, ఇటు కమెడియన్గానూ పూర్తిగా మెప్పించలేకపోయాడు. కొన్ని చోట్ల మాత్రం తనదైన కామెడీతో నవ్విస్తాడు. పార్వతిగా శ్రద్ధాదాస్ తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై అందంగాను కనిపించింది. హీరో ఫ్రెండ్గా వైవా హర్ష పండించే కామెడీ బాగుంది. ఇక చైతన్య లవర్గా మాళవికా సతీశన్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. వైవా హర్షకు, ఆమె మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, సురేఖ వాణితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సినిమాలో నటించిన ఆర్టిస్టుల నుంచి తనకు కావల్సిన నటనను దర్శకుడు సరిగా రాబట్టుకోలేకపోయాడనే చెప్పాలి. ఇక సాంకేతికంగా సినిమా పర్వాలేదు. రీ అందించిన సంగీతం పర్వాలేదు. పాటలు కాస్త డిఫరెంట్గా ఉన్నాయి. నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
‘తెప్పసముద్రం’ మూవీ రివ్యూ
టైటిల్: తెప్పసముద్రంనటీనటులు: చైతన్య రావు, అర్జున్ అంబటి, కిశోరి దాత్రక్, రవిశంకర్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సతీష్ రాపోలునిర్మాత: నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్నిర్మాణ సంస్థ: శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్సంగీతం: : పి.ఆర్ సినిమాటోగ్రఫీ: శేఖర్ పోచంపల్లిఎడిటర్: సాయిబాబు తలారివిడుదల తేది: ఏప్రిల్ 19, 2024‘తెప్పసముద్రం’ కథేంటంటే..తెలంగాణలోని తెప్పసముద్రం అనే గ్రామంలో తరచు స్కూల్ పిల్లలు మాయం అవుతుంటారు. వారిని ఎవరు కిడ్నాప్ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారనే విషయాన్ని ఛేదించడానికి ఎస్సై గణేష్(చైతన్య రావు) ప్రయత్నిస్తుంటాడు. క్రైమ్ మిర్రర్ రిపోర్టర్గా పని చేస్తున్న ఇందు(కిశోరి ధాత్రిక్) కూడా ఈ మిస్సింగ్ కేసు గురించి వివరాలు సేకరిస్తూ ఉంటుంది. ఇందుని ప్రాణంగా ప్రేమించే ఆటో డ్రైవర్ విజయ్(అర్జున్ అంబటి) కూడా తప్పిపోయిన పిల్లల కోసం వెతుకుతుంటాడు. మరోవైపు ఎస్సై గణేశ్ తండ్రి లాయర్ విశ్వనాథ్(రవిశంకర్) కూడా తన దగ్గరకు ట్యూషన్ వచ్చే పిల్లలు తప్పిపోవడంతో..ఈ మిస్సింగ్ కేసును ఛేదించడానికి తనవంతు ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో గజా చేసే గంజాయి దందా బయటపడుతుంది. ఈ కేసులో విజయ్తో పాటు అతని స్నేహితులను అరెస్ట్ చేస్తాడు గణేష్. ఆ సమయంలోనే పిల్లల కిడ్నాప్కి సంబంధించిన విషయంలో విస్తుపోయే నిజం ఒకటి తెలుస్తుంది. ఆ నిజం ఏంటి? తప్పిపోయిన పిల్లలు ఏమయ్యారు? ఎస్సై గణేష్ ఈ కేసును ఛేదించాడా లేదా? సైకో కిల్లర్ని చంపిందెవరు? చివరకు లాయర్ విశ్వనాథ్ తీసుకున్న కఠిన నిర్ణయం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇలాంటి సినిమాల్లో ఒక్కసారి ట్విస్ట్ తెలిస్తే.. సినిమాపై ఆసక్తి పోతుంది. అలా అని ట్విస్ట్ చెప్పకుండా ఉంటే ఎంగేజ్ చేద్దామంటే.. కథనం ఆసక్తికరంగా సాగాలి. ప్రేక్షకుడికి క్యూరియాసిటీని పెంచాలి. అద్భుతమైన స్క్రీన్ప్లే ఉండాలి. అలా అయితే ఆ సినిమా విజయం సాధిస్తుంది. ఈ విషయంలో తెప్ప సముద్రం కొంతవరకు సఫలం అయింది.చిన్నారులను హత్య చేసే సైకో కిల్లర్ ఎవరనేది చివరి వరకు తెలియకుండా సస్పెన్స్ కొనసాగిస్తూ ఆసక్తికరంగా కథననాన్ని నడిపించాడు దర్శకుడు. కథగా చూస్తే ఇది రొటీన్ చిత్రమే. ఓ సైకో.. చిన్నారులపై అత్యాచారానికి పాల్పడుతూ.. వారిని హత్య చేయడం, చివరకు అతన్ని కనిపెట్టి అంతమొందించడం.. సింపుల్గా చెప్పాలంటే తెప్పసముద్రం కథ ఇంతే. కానీ దర్శకుడు దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాలు.. స్క్రీన్ప్లే కథపై ఆసక్తిని కలిగించేలా చేశాయి. అసలు హంతకుడు ఎవరనేది చివరివరకు కనిపెట్టలేం. ప్రతి పాత్రపై అనుమానం కలిగేలా కథనం సాగుతుంది. ఈ సినిమాలోని మెయిన్ పాయింట్ తెలంగాణాలో సంచలనం సృష్టించిన ‘హాజీపూర్ ఘటనను గుర్తు చేస్తోంది. రొటీన్ లవ్స్టోరీగా సినిమా ప్రారంభం అవుతుంది. తన ప్రేమ విషయాన్ని హీరోయిన్కి చెప్పడానికి హీరో భయపడడం.. ఆమెకు తెలియకుండానే ఆమె పేరుమీద డొనేషన్ ఇవ్వడం.. ఆ విషయం తెలిసి హీరోని హీరోయిన్ ప్రేమించం..ఫస్టాఫ్ ఇలా రొటీన్గా సాగుతుంది. వరుస హత్యలపై ఎస్సై గణేష్ చేసే ఇన్వెస్టిగేషన్ని కథపై ఆస్తకిని పెంచుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్దుంది. సెకండాఫ్ అంతా ట్విస్టులతో సాగుతుంది. సీరియల్ కిల్లర్ ఎవరనేది తెలిసిన తర్వాత ప్రేక్షకులు ఒకింత షాక్కి గురవుతారు. ఆ తర్వాత కిల్లర్ బాల్యం నుంచి హత్య వరకు ప్రతిది డిటెయిల్డ్గా చెప్పడంతో కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. చివరిలో దర్శకుడు ఇచ్చిన మెసేజ్ కూడా అందరిని ఆలోచింపజేస్తుంది. ఎవరెలా చేశారంటే..ఆటోడ్రెవర్, హీరోయిన్ లవర్గా అర్జున్ అంబటి చక్కగా నటించాడు. డ్యాన్స్ తో పాటు ఉన్నంతలో యాక్షన్ సీన్స్ కూడా బాగానే చేశాడు. క్రైమ్ రిపోర్టర్ ఇందుగా కిశోరి దాత్రిక్ తన పాత్ర పరిధిమేర నటించి మెప్పించింది. ఎస్సై గణేశ్గా చైతన్య రావు అద్భుతంగా నటించాడు. చైతన్య రావు గతంలో ఈ తరహా పాత్రను పోషించలేదు. లాయర్ విశ్వనాథ్ గా రవిశంకర్తో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధిమేర నటించారు. పి.ఆర్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకుంటాయి. చివర్లో వచ్చే పెంచల్ దాస్ రాసి, పాడిన "నా నల్లా కలువా పువ్వా" సాంగ్ గుండెను బరువెక్కిస్తుంది.ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి -
‘మార్కెట్ మహాలక్ష్మి’ మూవీ రివ్యూ
టైటిల్: మార్కెట్ మహాలక్ష్మినటీనటులు: పార్వతీశం, ప్రణీకాన్వికా, హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్ తదితరులునిర్మాణ సంస్థ: బి2పి స్టూడియోస్ నిర్మాత: అఖిలేష్ కలారుదర్శకత్వం: వియస్ ముఖేష్సంగీతం: జో ఎన్మవ్ నేపథ్య సంగీతం: సృజన శశాంకసినిమాటోగ్రఫీ: సురేంద్ర చిలుములఎడిటర్: ఆర్.యమ్. విశ్వనాధ్ కూచనపల్లివిడుదల తేది: ఏప్రిల్ 19, 2024‘కేరింత’ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు పార్వతీశం. ఆ సినిమాలో తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక చాలా రోజుల తర్వాత ఆయన హీరోగా నటించిన చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రేపు(ఏప్రిల్ 19) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం ప్రివ్యూ ఏర్పాటు చేసింది చిత్రబృందం. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ప్రభుత్వ కార్యాలయంలో గుమాస్తాగా పనిచేసే వ్యక్తి(కేదార్ శంకర్) తన కుమారుడు (పార్వతీశం)ని ఇంజనీరింగ్ చదివిస్తాడు. అతని చదువు పూర్తయ్యాక హైదరాబాద్లని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం లభిస్తోంది. లక్షల్లో జీతం సంపాదించే తన కుమారుడికి కోటి రూపాయలు కట్నంగా ఇచ్చే అమ్మాయితోనే పెళ్లి చేయాలని ప్రయత్నిస్తుంటాడు తండ్రి. అలాంటి సంబంధాలనే తీసుకొస్తాడు. కానీ పార్వతీశం(ఈ సినిమాలో హీరో పాత్రకి పేరు లేదు) మాత్రం అన్నింటిని రిజెక్ట్ చేసి, మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే మహాలక్ష్మి అలియాస్ ‘మార్కెట్ మహాలక్ష్మి(ప్రణీకాన్వికా)ని ప్రేమిస్తాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు.కానీ మహాలక్ష్మి మాత్రం అతని ప్రేమను తిరస్కరిస్తుంది.దీంతో తనను ఒప్పించేందుకు మార్కెట్లోనే తిష్టవేస్తాడు. చివరకు మహాలక్ష్మి పెళ్లికి ఒప్పుకుందా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన పార్వతీశం.. కూరగాయలు అమ్ముకునే అమ్మాయినే ఎందుకు ఇష్టపడ్డాడు? మహాలక్ష్మి ఫ్యామిలీ నేపథ్యం ఏంటి? తన సంపాదనతోనే బతకాలని మహాలక్ష్మి ఎందుకు డిసైడ్ అయింది? మహాలక్ష్మి కోసం సాఫ్ట్వేర్ కుర్రాడు తీసుకున్న గొప్ప నిర్ణయం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..?పెళ్లి తర్వాత అమ్మాయి.. అబ్బాయి వాళ్ల ఇంటికే ఎందుకు వెళ్లాలి? అబ్బాయియే అమ్మాయి వాళ్ల ఇంటికి వచ్చి ఎందుకు కాపురం చేయకూడదు? ఉద్యోగ రిత్యా చాలా మంది తమ పెరెంట్స్కి దూరంగా ఉంటున్నారు కదా? మరి అమ్మాయి ఇంటికి వెళ్లి ఉంటే జరిగే నష్టమేంటి? అనే ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరకదు. అది మన సంప్రదాయం అని.. ఫాలో అవ్వడమే తప్ప అలానే ఉండాలని ఎక్కడా రాసి పెట్టిలేదు. ఇదే విషయాన్ని ఈ సినిమా ద్వారా తెలియజేశాడు దర్శకుడు వియస్ ముఖేష్.పెరెంట్స్కి దూరంగా ఉన్నా సరే..వారి బాగోగులను చూసుకునే బాధ్యత మనదనే విషయం గుర్తుంటే చాలు అనే సందేశాన్ని వినోదాత్మకంగా తెలియజేసే ప్రయత్నం చేశాడు. అలాగే ఒక ఆడపిల్ల ఇండిపెండెంట్గా ఎందుకు బతకాలో ఈ చిత్రం ద్వారా తెలియజేశాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా, సందేశాత్మకంగా ఉంది కానీ.. ఆ పాయింట్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో పూర్తిగా సఫలం కాలేదు. కథలోని ఎమోషన్ని ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలా చేయడంలో కొంతవరకు మాత్రమే సక్సెస్ అయ్యారు. హీరో.. హీరోయిన్ని చూసి ప్రేమలో పడే సీన్తో పాటు చాలా సన్నివేశాలు సినిమాటిక్గా అనిపిస్తాయి. అలాగే ప్రేమను పొందడం కోసం హీరో చేసే పనులు కూడా అంతగా ఆకట్టుకోవు. అక్కడ మరింత కామెడీ పండించే స్కోప్ ఉన్నా.. సరిగా వాడుకోలేదోమో అనిపిస్తుంది. అయితే సెకండాఫ్లో మాత్రం దర్శకుడు బలమైన సన్నివేశాలను రాసుకున్నాడు. క్లైమాక్స్లో ప్రేక్షకులను ఓ మంచి సందేశాన్ని ఇచ్చాడు. ఓ ఇండిపెండెంట్ అమ్మాయి, సాఫ్ట్వేర్ అబ్బాయి మధ్య సాగే ప్రేమకథే ఇది. కట్నం కోసం కొడుకును ఇంజనీరింగ్ చదివించాలని గుమాస్తాగా పని చేసే తండ్రి ఆలోచించే సీన్తో కథ ప్రారంభం అవుతుంది. హీరో ఎంట్రీ సీన్ కూడా అదిరిపోతుంది. ఆ తర్వాత కథనం స్లోగా సాగుతుంది. మార్కెట్లో మహాలక్ష్మిని చూసి ప్రేమలో పడిన తర్వాత వచ్చే కొన్ని సీన్లు వినోదాన్ని అందిస్తాయి. ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది. ఇక సెకండాఫ్ కథంతా మార్కెట్ చుట్టే తిరుగుతుంది. మహాలక్ష్మిని ఇంప్రెస్ చేయడం కోసం హీరో చేసే పనులు పాత సినిమాలను గుర్తు చేస్తాయి. అలాగే చాలా వరకు కథనం నెమ్మదిగా, ఊహకందేలా సాగుతుంది. మహాలక్ష్మి ఎందుకు ఇండిపెండెంట్గా బతకాలని అనుకోవాడానికి గల కారణం కన్విన్సింగ్గా ఉంటుంది. క్లైమాక్స్ బాగుటుంది. ఎవరెలా చేశారంటే.. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పార్వతీశం చక్కగా నటించాడు. గత సినిమాలతో పోల్చితే నటన పరంగా ఆయన బాగా మెప్పించాడని చెప్పొచ్చు. ఇక మార్కెట్ మహాలక్ష్మిగా ప్రణికాన్విక ఒదిగిపోయింది. ఇది తనకు తొలి చిత్రమే అయినా.. తెరపై ఆ విషయం తెలియకుండా చక్కగా నటించింది. హీరో ప్రెండ్గా ముక్కు అవినాష్ కనిపించేంది కాసేపే అయినా నవ్వించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ బ్రదర్, తాగుబోతుగా మహబూబ్ బాషా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ‘కోటర్ ఇస్తే చెబుతా’ అంటూ ఆయన పండించిన కామెడీ బాగుంది. కేదార్ శంకర్, జయ, పద్మ, హర్షవర్దన్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతికంగా సినిమా పర్వాలేదు. సృజన శశాంక భ్యాగ్రౌండ్ స్కోర్, జో ఎన్మవ్ మ్యూజీక్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
ఓటీటీలో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. క్లైమాక్స్ చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్!
ఓటీటీల్లో బోర్ కొట్టని జానర్ అంటే థ్రిల్లరే. మిగతా సినిమాల సంగతేమో గానీ థ్రిల్లర్స్ ని థియేటర్లలో కంటే సింగిల్ గా ఇంట్లోనే చూడటం బెస్ట్ అని చెప్పొచ్చు. అలా హాలీవుడ్ లో 2014లోనే వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ సైన్స్ ఫిక్షన్ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ మూవీ 'ప్రీ డెస్టినేషన్'. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా నిజంగా అంత బాగుందా? ఏంటనేది డీటైల్డ్ గా చూద్దాం.(ఇదీ చదవండి: ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ రివ్యూ)'ప్రీ డెస్టినేషన్' విషయానికొస్తే.. ఈ సినిమాలో బేబీ జేన్, జేన్, జాన్, బార్ కీప్, ఫిజిల్ బాంబర్ అని ఐదు పాత్రలు ఉంటాయి. 1945-1992 మధ్య కాలంలో స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. అసలు వీళ్ల ఐదుగురికి కనెక్షన్ ఏంటి? చివరకు ఏమైందనేదే అసలు కథ.కొన్ని సినిమాలు చూడటానికి చాలా సాధారణంగా ఉంటాయి. 40 నిమిషాలు అయ్యేవరకు 'ప్రీ డెస్టినేషన్' కూడా అలానే అనిపిస్తుంది. డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడా అని డౌట్ వస్తుంది. కానీ ఐదు పాత్రలకు సంబంధించిన డీటైల్స్ అన్ని ప్రేక్షకుల అర్థమైన దగ్గర నుంచి థ్రిల్ కలిగిస్తుంది. ఐదు పాత్రలు టైమ్ ట్రావెలింగ్ చేస్తుంటే.. చూస్తున్న మనకు సరికొత్త అనుభూతి, థ్రిల్ అనిపిస్తుంది. ఇక్కడ నిజంగా టైమ్ ట్రావెల్ అనేది సాధ్యమా కాదా అనేది పక్కనబెట్టి చూస్తే మాత్రం మూవీ నచ్చేస్తుంది. ఇంతకంటే ఒక్క విషయం ఎక్కువ చెప్పినా సరే మళ్లీ కథ లీక్ చేసి, మేమే మీకు స్పాయిలర్స్ ఇచ్చేసినట్లు అయిపోద్ది!(ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో మంచు మనోజ్ భార్య)'ప్రీ డెస్టినేషన్' సినిమాని గ్రేటెస్ట్ అని చెప్పలేం కానీ డిఫరెంట్ మూవీస్ అంటే ఇష్టపడే మూవీ లవర్స్ కచ్చితంగా మిస్సవకుండా చూడాల్సిన మూవీ. 2014లోనే రిలీజైన ఈ చిత్రం హాలీవుడ్ ఆడియెన్స్ కి తెగ నచ్చేసింది. ఓటీటీలోకి వచ్చేసిన తర్వాత గ్లోబల్ ఆడియెన్స్ కి మరింత చేరువైంది. ఇదే మూవీ కథని స్ఫూర్తిగా తీసుకుని తెలుగులో పలు సినిమాలు తీయడం విశేషం. అవేంటో చెబితే మళ్లీ స్టోరీ చెప్పిసినట్లు అవుతుంది.లాస్ట్ అండ్ ఫైనల్.. ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత 'అత్తారింటికి దారేది' సినిమాలోని ఫేమస్ డైలాగ్ కచ్చితంగా గుర్తొస్తుంది. అదేంటనేది 'ప్రీ డెస్టినేషన్' చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. కేవలం 97 నిమిషాల నిడివితో ఉన్న ఈ సినిమాని అలా మొదలుపెడితే ఇలా ముగించేయొచ్చు. మరి ఇంకెందుకు లేటు త్వరగా చూసేయండి.(ఇదీ చదవండి: ఖరీదైన బంగ్లాలోకి హీరోయిన్ పూజాహెగ్డే.. రేట్ తెలిస్తే మైండ్ బ్లాకే!) -
DeAr Movie Review : గురక కాన్సెప్ట్తో వచ్చిన ‘డియర్’ ఎలా ఉందంటే?
టైటిల్: డియర్నటీనటులు: జీవీ ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్, ఇలవరసు, రోహిణి, కాళి వెంకట్, తలైవసల్ విజయ్, నందిని, గీతా కైలాసం తదితరులునిర్మాతలు: జీ పృథ్వీ కుమార్, అభిషేక్ రామిశెట్టి, వరుణ్ త్రిపురనేనిదర్శకత్వం: ఆనంద్ రవించంద్రన్సంగీతం: జీవీ ప్రకాశ్విడుదల తేది: ఏప్రిల్ 12, 2024అర్జున్(జీవీ ప్రకాశ్ కుమార్) ఓ న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్. ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేసి ఫేమస్ అవ్వాలనేది అతని కల. కానీ అతని అన్నయ్య చరణ్(కాళి వెంకట్), అమ్మ లక్ష్మీ(రోహిణి) మాత్రం అర్జున్కి పెళ్లి చేయాలని ఫిక్స్ చేస్తారు. ఓ మంచి సంబంధం చూస్తారు. అమ్మాయి పేరు దీపిక(ఐశ్వర్య రాజేష్). ఆమెకు గురక పెట్టే అలవాటు ఉంటుంది. ఈ విషయాన్ని దాచి అర్జున్ని పెళ్లి చేసుకుంటుంది. అర్జున్కి ఏమో నిద్రపోయినప్పుడు చిన్న శబ్దం వినిపించినా.. లేచి కూర్చునే అలవాటు. వీరిద్దరికి ఉన్న విభిన్నమైన అలవాట్లు.. వారి కాపురంలో కలతలు తెచ్చిపెడతాయి. అర్జున్ ఉద్యోగానికి ప్రమాదం తెచ్చిపెడతాయి. దీంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? భార్య పెట్టే గురక వల్ల అర్జున్కి ఎలాంటి సమస్యలు వచ్చాయి? విడాకుల వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చివరకు వీరిద్దరు విడాకులు తీసుకున్నారా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. కొత్త పాయింట్తో ఓ సినిమా వచ్చి..అది సూపర్ హిట్ అయిన తర్వాత అలాంటి కాన్సెప్ట్తోనే మళ్లీ సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా? పాత కథే అయినా తెరపై కొత్తగా చూపిస్తే కొంతలో కొంత ఆదరించే అవకాశం ఉంటుంది. కానీ హిట్ సినిమా కాన్సెప్ట్ తీసుకొని.. అతి సాధారణంగా కథనాన్ని నడిపిస్తే ఎలా ఉంటుంది? ‘డియర్’ మూవీలా ఉంటుంది. గురక సమస్యతో అల్రేడీ ‘గుడ్నైట్’ అనే సినిమా వచ్చి.. ప్రేక్షకులను మనసును దోచుకుంది. అలాంటి కాన్సెప్ట్తోనే తెరకెక్కిన మూవీ ‘డియర్’.‘గుడ్నైట్’లో హీరోకి గురక సమస్య ఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్కి ఉంటుంది. అంతే తేడా. కానీ గుడ్నైట్ సినిమాలో వర్కౌట్ అయిన ఎమోషన్ ఈ చిత్రంలో కాలేదు.. కథనాన్ని అటు వినోదాత్మకంగాను..ఇటు ఎమోషనల్గాను మలచడంతో దర్శకుడు ఘోరంగా విఫలం అయ్యాడు. సినిమాలో నాటకీయత ఎక్కువగా ఉంటుంది. గురక సమస్యను అధిగమించేందుకు హీరో తీసుకునే నిర్ణయం సిల్లీగా అనిపిస్తుంది. ఆ సమస్యను పరిష్కరించేందుకు చాలా మార్గాలే ఉన్నా.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అవసరమా అనిపిస్తుంది. పైగా మధ్యలో హీరో పేరేంట్స్ సంబంధించిన స్టోరీని తీసుకొచ్చారు.పోనీ అదైనా కొత్తగా ఉందా అంటే.. అరగదీసిన ఫార్ములానే మళ్లీ వాడేశారు. ఏ దశలోను కథనం ఆసక్తికరంగా సాగదు. హీరోహీరోయిన్లకు ఉన్న సమస్యలను చూపిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. హీరోయిన్కి గురక పెట్టే సమస్య.. హీరోకి పెన్సిల్ కిందపడిన శబ్దం వినించినా నిద్రలేచే అలవాటు. ఈ ఇద్దరికి ఉన్న సమస్యల మధ్య బోలెడంత కామెడీ పండించొచ్చు. కానీ దర్శకుడు ఆ దిశగా సన్నివేశాలను రాసుకోలేకపోయాడు. పోనీ ఎమోషనల్గా అయినా చూపించారా అంటే అదీ లేదు. తమకున్న సమస్యలను దాచి పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత అసలు విషయం తెలియడం.. ఆ సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేయడం.. ఇవన్నీ రొటీన్గా ఉంటాయి. ఇక హీరో ఉద్యోగం పోవడానికి గల కారణం బాగున్నా..దానికి సంబంధించిన సన్నివేశాలు అయితే సిల్లీగా అనిపిస్తుంది. ఫస్టాఫ్ కాస్త ఆస్తకరంగా అనిపించినా.. సెకండాఫ్ మరింత సాగదీతగా ఉంటుంది. పేరెంట్స్ని కలిపే ఎపిసోడ్ మెయిన్ కథను పక్కదారి పట్టిస్తుంది. క్లైమాక్స్ రొటీన్గా ఉంటుంది. గుడ్నైట్ సినిమా చూడనివారిని ఈ సినిమా కాస్త అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. అర్జున్గా జీవీ ప్రకాశ్ చక్కగా నటించారు. అయితే ఆయన పాత్రను బలంగా తిర్చిదిద్దడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. దీపిక పాత్రలో ఐశ్వర్య రాజేశ్ ఒదిగిపోయింది. ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కగా నటించింది. హీరో తల్లిగా రోహిణిది రొటీన్ పాత్రే. కాళీ వెంకట్, ఇళవరసుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా ఈ సినిమా జస్ట్ ఓకే. జీవీ ప్రకాశ్ అందించిన నేపథ్య సంగీతం పర్వాలేదు. పాటలు సోసోగా ఉంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ రివ్యూ
టైటిల్: గీతాంజలి మళ్ళీ వచ్చిందినటీనటులు: అంజలి, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవిశంకర్, రాహుల్ మాధవ్ తదితరులు నిర్మాత: ఎంవీవీ సత్యనారాయణకథ, స్క్రీన్ప్లే: కోన వెంకట్దర్శకత్వం: శివ తుర్లపాటిసంగీతం: ప్రవీణ్ లక్కరాజుసినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థఎడిటర్: ఛోటా కె ప్రసాద్విడుదల తేది: ఏప్రిల్ 11, 2024తెలుగు బ్యూటీ అంజలి కెరీర్లో భారీ విజయం సాధించిన చిత్రాల్లో ‘గీతాంజలి’ సినిమా ఒకటి. పదేళ్ల క్రితం వచ్చిన ఈ కామెడీ హారర్ అప్పట్లో ఘన విజయం సాధించింది. దశాబ్దం తర్వాత మళ్లీ అదే టీమ్తో గీతాంజలికి సీక్వెల్గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రాన్ని తెరకెక్కించారు. మంచి అంచనాలతో నేడు(ఏప్రిల్ 11) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? గీతాంజలి తరహాలో సీక్వెల్ కూడా హిట్ అయినట్లేనా? లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. దర్శకుడు శ్రీనివాస్(శ్రీనివాస్ రెడ్డి) తీసిన మూడు చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో మరో అవకాశం రాదు. సినిమా చాన్స్ కోసం ఫ్యామిలీని వదిలేసి స్నేహితులు ఆరుద్ర(షకలక శంకర్), ఆత్రేయ(సత్యం రాజేశ్)కలిసి హైదరాబాద్లో కష్టపడుతుంటాడు. మరోవైపు వైజాగ్లో ఫాస్ట్పుడ్ సెంటర్ నడుపుకునే అయాన్(సత్య) హీరో కావాలనని కలలు కంటుంటాడు. అయాన్ని హీరో చేస్తానని నమ్మించి అతని నుంచి డబ్బులు వసూలు చేస్తాడు శ్రీనివాస్. ఫ్రెండ్పై నమ్మకంతో హైదరాబాద్ వస్తాడు అయాన్. ఇక్కడకు వచ్చాక అసలు విషయం తెలుస్తుంది. మోస పోయానని తెలిసినా శ్రీనివాస్ పరిస్థితి చూసి ఏమి అనలేకపోతాడు.ఇక సినిమా ఇండస్ట్రీని వదిలేసి వేరే ఏదైనా పని చేసుకుందాని శ్రీనివాస్ గ్యాంగ్తో పాటు అయాన్ కూడా నిర్ణయం తీసుకుంటారు. సరిగ్గా అదే సమయంలో ఊటికి చెందిన పెద్ద వ్యాపారవేత్త విష్ణు( రాహుల్ మాధవ్) మేనేజర్ గోవిందా గోవిందా(శ్రీకాంత్ అయ్యంగార్) నుంచి శ్రీనివాస్కి ఫోన్ కాల్ వస్తుంది. అతనితో ఓ సినిమాను నిర్మిస్తానని విష్ణు చెబుతాడు. హీరోయిన్గా ఊటీలోనే కాఫీ కేఫ్ రన్ చేస్తున్న గీతాంజలి(అంజలి)ని తీసుకోవాలని విష్ణు సూచిస్తాడు. అలాగే షూటింగ్ అంతా సంగీత్ మహాల్లోనే చేయాలని కండీషన్ పెడతాడు. ఆ మహాల్ చరిత్ర ఏంటి? ఆ బంగ్లాలో ఉన్న దెయ్యాలలో శ్రీను టీమ్కి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? సినిమా షూటింగ్ని అక్కడే చేయాలని విష్ణు ఎందుకు కండీషన్ పెట్టాడు? హ్యాట్రిప్ ఫ్లాపులు ఇచ్చిన డైరెక్టర్ శ్రీనుతో విష్ణు ఎందుకు సినిమా తీయాలనుకున్నాడు? హీరోయిన్గా అంజలినే ఎందుకు ఎంచుకున్నాడు? ఈ కథలోకి గీతాంజలి ఆత్మ మళ్లీ ఎలా వచ్చింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. హారర్ కామెడీ చిత్రాలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. పదేళ్ల కిందట వచ్చిన గీతాంజలి ముందు కూడా ఈ జానర్లో సినిమాలు వచ్చాయి. కానీ గీతాంజలి తరహాలో అవి విజయం సాధించలేకపోయాయి. ఆ చిత్రం విజయానికి ప్రధాన కారణం కామెడీ, హారర్తో పాటు ఎమోషన్స్ కూడా చక్కగా కుదరడం. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’లో ఆ ఎమోషన్ మిస్ అయింది. కేవలం కామెడీ, హారర్ ఎలిమెంట్స్తో కథనాన్ని నడింపించారు దర్శకుడు. కథ- కథనంపై ఫోకస్ చేయకుండా కాన్సెప్ట్ని నమ్ముకొని సినిమాను తెరకెక్కించారు.వాస్తవానికి ఈ సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంది. దెయ్యాలతో సినిమా షూటింగ్ అనేది కొత్త పాయింటే. ఆ ఎపిసోడ్ వరకు కామెడీ బాగా వర్కౌట్ అయింది. కానీ మిగతా కథంతా అంతగా ఆకట్టుకునేలా సాగదు. ప్రేక్షకులను నవ్విస్తూనే..కొన్నిచోట్ల భయపెట్టే ప్రయత్నం చేశారు. కానీ అది పూర్తిగా సక్సెస్ కాలేదు. కొన్ని సన్నివేశాలు అయితే మరీ రొటీన్గా ఉంటాయి. ఇక ఇలాంటి సినిమాల్లో లాజిక్కులను వెతుకొద్దు. కానీ ఎమోషన్స్ని ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చేయడంలో చిత్రబృందం పూర్తిగా విఫలం అయింది.ఎంతసేపు నవ్వించడం మీదనే ఫోకస్ పెట్టారు. పోనీ ఆ కామెడీ అయినా కొత్తగా ఉందంటే అదీ లేదు. ఫస్టాప్లో వచ్చే కామెడీ సీన్స్ అయితే జబర్దస్త్ షోని గుర్తు చేస్తాయి. ఇంటర్వెల్ వరకు కథంతా సోసోగానే సాగుతుంది. సెకండాఫ్ ప్రారంభంలో కథనం కాస్త ఆసక్తికరంగా, వినోదాత్మకంగా సాగుతుంది. దెయ్యాలను జూనియర్ ఆర్టిస్టులు అని శ్రీను నమ్మించడం.. ఆ తర్వాత సత్య, సునీల్ పాత్రలు ఆ దెయ్యాలతో జరిపే సంభాషణలు నవ్వులు పూయిస్తాయి. క్లైమాక్స్ పరమ రొటీన్గా ఉంటుంది. ఈ హారర్ కామెడీ చిత్రం ప్రేక్షకులను పూర్తిగా భయపెట్టలేదు.. కడుపుబ్బా నవ్వించనూ లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే మాత్రం కాస్త ఎంటర్టైన్ అవుతారు. ఎవరెలా చేశారంటే.. గీతాంజలి పాత్రలో అంజలి ఒదిగిపోయింది. అల్రేడీ చేసిన పాత్రే కాబట్టి.. ఇంకాస్త చక్కగా నటించింది. ఇందులో ఆమెకు ఓ యాక్షన్ సీన్ ఉంది. ఆ సీన్లో అదరగొట్టేసింది. ఈ సినిమాకు సత్య పోషించిన పాత్ర హైలెట్ అని చెప్పాలి. అయాన్గా ఆయన పండించిన కామెడీ బాగా వర్కౌట్ అయింది. శ్రీనివాస్రెడ్డి, షకలక శంకర్, సత్యం రాజేశ్లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాటోగ్రాఫర్ కిల్లర్ నానిగా సునీల్ పండించిన కామెడీ కొన్ని చోట్ల నవ్వులు పూయిస్తుంది. దెయ్యాలుగా రవిశంకర్, ప్రియ కొన్ని చోట్ల భయపెట్టారు. ఆ పాత్రలకు సరైన ముగింపు ఉండదు. రాహుల్ మహదేవ్ విలనిజం అంతగా పండలేదు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాకేతికంగా ఈ సినిమా జస్ట్ ఓకే. హారర్ సినిమాలకు నేపథ్య సంగీతం చాలా ముఖ్యం. బీజీఎంతోనే భయపెట్టాలి. కానీ ప్రవీణ్ లక్కరాజు ఆ స్థాయి నేపథ్య సంగీతాన్ని అందించలేకపోయాడు. పాటలు కూడా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. గ్రాఫిక్స్ విభాగం పనితీరు వీక్గా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. సంభాషణలు కొన్నిచోట్ల ట్రెండ్కి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
Family Star Review: ‘ ఫ్యామిలీ స్టార్’ మూవీ రివ్యూ
టైటిల్: ఫ్యామిలీ స్టార్ నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, వాసుకి, రోహిణీ హట్టంగడి, అభినయ, అజయ్ ఘోష్ నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్ రచన-దర్శకత్వం: పరశురామ్ పెట్ల సంగీతం: గోపీ సుందర్ సినిమాటోగ్రఫీ: కేయూ మోహనన్ ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్ విడుదల తేది: ఏప్రిల్ 5, 2024 కథేంటంటే.. గోవర్ధన్(విజయ్ దేవరకొండ) ఓ మిడిల్ క్లాస్ యువకుడు. ఫ్యామిలీ అంటే అతనికి చాలా ఇష్టం. ఇద్దరు అన్నయ్యలు..వదినలు..వారి పిల్లలు..బామ్మ ఇదే తన ప్రపంచం. సివిల్ ఇంజనీర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. పెద్దన్నయ్య మద్యానికి బానిసవడం.. చిన్నన్నయ్య బిజినెస్ అంటూ ఇంకా స్థిరపడకపోవడంతో ఫ్యామిలీ ఆర్థిక భారానంత గోవర్ధనే మోస్తాడు. అనవసరపు ఖర్చులు చేయకుండా.. వచ్చిన జీతంతోనే సింపుల్గా జీవనాన్ని కొనసాగిస్తున్న గోవర్ధన్ లైఫ్లోకి ఇందు(మృణాల్ ఠాకూర్) వచ్చేస్తుంది. తనతో పాటు తన ఫ్యామిలీకి బాగా దగ్గరవుతుంది. ఇద్దరు ప్రేమలో కూడా పడిపోతారు. ఈ విషయం ఇరుకుటుంబాలలో చెప్పి, పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అని భావిస్తున్న సమయంలో ఇందు రాసిన ఓ పుస్తకం గోవర్ధన్ చేతికి వస్తుంది. ఆ పుస్తకం చదివి..ఇందుపై ద్వేషం పెంచుకుంటాడు గోవర్ధన్. అసలు ఆ పుస్తకంలో ఏం ఉంది? ఇందు ఎవరు? గోవర్ధన్ ఇంటికి ఎందుకు వచ్చింది? ఇందు రాసిన పుస్తకం వీరిద్దరి ప్రేమను ఎలా ప్రభావితం చేసింది? ఉన్నంతలో సర్దుకొని జీవించే గోవర్దన్ లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని ఎందుకు డిసైడ్ అయ్యాడు? అమెరికాకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చివరకు ఇందు, గోవర్దన్లు ఎలా ఒక్కటయ్యారు? అనేది తెలియాలంటే థియేటర్స్లో సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. టాలీవుడ్లో ఫ్యామిలీ కథలు చాలా వచ్చాయి. అన్ని సినిమాల్లోనూ కుటుంబ బంధాలు.. ప్రేమానురాగాలు.. ఇదే కథ. ఆ కథను తెరపై ఎంత కొత్తగా చూపించారనేదానిపై సినిమా ఫలితం ఆధారపడుతుంది. అందుకే కొన్ని సినిమాల కథలు రొటీన్గా ఉన్న ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ‘గీతగోవిందం’. సింపుల్ కథతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లను కొల్లగొట్టింది. అలాంటి కాంబినేషన్లో మరో సినిమా అంటే ప్రేక్షకుల్లో కచ్చితంగా భారీ అంచనాలు ఏర్పడతాయి. ఆ అంచనాలను తగ్గట్టుగా ‘ఫ్యామిలీ స్టార్’ కథను తీర్చిదిద్దడంలో దర్శకుడు పరశురామ్ పూర్తిగా సఫలం కాలేకపోయాడు. హాస్యం, మాటలు, కథనంతో మ్యాజిక్ చేసే పరశురామ్.. ఈ సినిమా విషయంలో వాటిపై పెట్టిన ఫోకస్ సరిపోలేదనిపిస్తుంది. కథ పరంగా ఈ సినిమా చాలా చిన్నది. ఫ్యామిలీ భారమంతా మోస్తున్న ఓ మిడిల్ క్లాస్ యువకుడు.. తన సొంతప్రయోజనాల కోసం అతనికి దగ్గరైన ఓ యువతి.. ఇద్దరి మధ్య ప్రేమ.. గొడవలు.. చివరికి కలుసుకోవడం.. సింపుల్గా చెప్పాలంటే ‘ఫ్యామిలీ స్టార్’ కథ ఇదే. అంచనాలు లేకుండా వస్తే..ఈ కథకి అందరు కనెక్ట్ అవుతారు. కానీ ‘గీతగోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కాబట్టి.. ప్రేక్షకులు అంతకు మించి ఏదో ఆశిస్తారు. దాన్ని దర్శకుడు అందించలేకపోయాడు. భారీ అంచనాలు ఉన్న సినిమాకు కావాల్సిన సరకు, సంఘర్షణ రెండూ ఇందులో మిస్ అయ్యాయి. అయితే హీరో క్యారెక్టరైజేషన్, కొన్ని సన్నివేశాలు మాత్రం విజయ్ ఫ్యాన్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా ఆకట్టుకుంటాయి. విజయ్ లుంగి కట్టుకొని తిరగడం.. ఉల్లి పాయల కోసం ఆధార్ కార్డులు పట్టుకొని క్యూలో నిలబడడం.. హీరోయిన్ లిఫ్ట్ అడిగితే పెట్రోల్ కొట్టించమని అడగడం.. చెంపదెబ్బలు తినడం ఇవన్నీ ఫ్యామిలీ ఆడియన్స్ని ఎట్రాక్ట్ చేస్తాయి. ‘అతనికి కాస్త తిక్కుంటుంది.. పిచ్చి ఉంటుంది.. వెర్రి ఉంటుంది’ అంటూ హీరో గురించి హీరోయిన్ చేత చెప్పిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. మిడిక్లాస్ యువకుడి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో హీరో ఎంట్రీ సీన్తోనే చూపించాడు. ప్యామిలీ కోసం హీరో పడే పాట్లు.. అన్నయ్యలతో వచ్చే కష్టాలు చూపిస్తూనే ఇందు పాత్రను పరిచయం చేశాడు. ఆమె వచ్చిన తర్వాత కూడా కథనం రొటీన్గా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు అయితే మరీ సినిమాటిక్గా అనిపిస్తాయి. ఇంటర్వెల్కి ముందు వచ్చే సీన్స్ మాత్రం ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్పై ఆసక్తినికి పెంచుతుంది. ద్వితియార్థం ఎక్కువగా అమెరికాలోనే సాగుతుంది. అక్కడ హీరోహీరోయిన్ల మధ్య వచ్చే ఒకటి రెండు సీన్స్ మినహా మిగతావన్నీ బోర్ కొట్టిస్తాయి. మిడిల్ క్లాస్ యువకుడి మీద హీరోయిన్ థీసిస్ ఎందుకు రాసిందనేదానికి సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేకపోయారు. ప్రీక్లైమాక్స్ బాగుంటుంది. పతాక సన్నివేశాలు రొటీన్గా అనిపిస్తాయి. కొన్ని సంభాషణలు మాత్రం ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేస్తాయి. కథ, కథనాన్ని మరింత బలంగా రాసుకొని, హాస్యంపై ఫోకస్ పెడితే ‘ఫ్యామిలీ స్టార్’ మరో లెవెల్ విజయం సాధించేది. ఎవరెలా చేశారంటే.. మిడిల్ క్లాస్ యువకుడు గోవర్ధన్ పాత్రలో విజయ్ దేవరకొండ ఒదిగిపోయాడు. తన డైలాగ్ డెలీవరీ, మ్యానరిజం సినిమాకు ప్లస్ అయింది. కథంతా తన భుజాన వేసుకొసి సినిమాను ముందుకు నడిపించాడు. తెరపై చాలా అందంగా కనిపించాడు. ఇక ధనవంతుల కుటుంబానికి చెందిన యువతి ఇందుగా మృణాల్ చక్కగా నటించింది. తెరపై విజయ్, మృణాల్ల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. హీరో బామ్మగా రోహిణి హట్టంగడి తనదైన నటనతో ఆకట్టుకుంది. జగపతి బాబు, వెన్నెల కిశోర్, వాసుకి, అభినయతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికత విషయానికొస్తే.. గోపీ సుందర్ సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. అద్భుతమైన పాటలతో మంచి బీజీఎం అందించాడు. కేయూ మోహన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
Tillu Square: ‘టిల్లు స్వ్కేర్’ మూవీ రివ్యూ
టైటిల్: టిల్లు స్వ్కేర్ నటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ,అనుపమ పరమేశ్వరన్, ప్రిన్స్, మురళీధర్ గౌడ్, మురళీ శర్మ తదితరులు నిర్మాణ సంస్థ: సితార ఎంటర్టైన్మెంట్స్,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య దర్శకత్వం:మల్లిక్ రామ్ నేపథ్య సంగీతం: భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు ఎడిటింగ్: నవీన్ నూలి విడుదల తేది: మార్చి 29, 2024 స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'డీజే టిల్లు'(2022)ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్తో పాటు యూత్లో కల్ట్ ఫాలోయింగ్ను సంపాదించుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కిన చిత్రమే ‘టిల్లు స్వ్కేర్’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘టిల్లు స్వ్కేర్’పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని యూత్ ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు నేడు(మార్చి 29) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. టిల్లు స్వ్కేర్ కథేంటంటే.. రాధిక(నేహా శెట్టి) చేసిన మోసం నుంచి కోలుకున్న బాల గంగాధర తిలక్ అలియాస్ డీజే టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ)..ఫ్యామిలీ,ఫ్రెండ్స్తో కలిసి ‘టిల్లు ఈవెంట్స్’ స్టార్ట్ చేస్తాడు. వెడ్డింగ్ ప్లానింగ్తో పాటు డీజే ఈవెంట్స్ చేస్తూ హాయిగా గడుపుతున్న టిల్లు జీవితంలోకి లిల్లీ(అనుపమ పరమేశ్వరన్) ఎంటర్ అవుతుంది. తొలి చూపులోనే ఆమెపై మనసు పారేసుకుంటాడు. ఆమెతో ఓ రాంత్రంతా గడుపుతాడు. తెల్లారి చూస్తే లిల్లి కనిపించదు. సరిగ్గా నెల రోజుల తర్వాత ఓ ఆస్పత్రిలో కనిపించి తాను గర్భవతి అని చెబుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు లిల్లి ఎవరు? టిల్లు జీవితంలోకి ఎందుకు వచ్చింది? ఇంతకు ముందు రాధిక మాదిరే ఇప్పుడు లిల్లితో టిల్లుకి వచ్చిన కొత్త సమస్యలు ఏంటి? వీళ్ళ కథతో పేరు మోసిన మాఫియా డాన్ మెహబూబ్ అలీ(మురళీ శర్మ) కి లింక్ ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్లో ‘టిల్లు స్వ్కేర్’ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. 'డీజే టిల్లు' సక్సెస్కి ముఖ్యకారణం టిల్లుగాడి పాత్ర.. ఆ పాత్రతో పలికించిన సంభాషణలు. కథగా చూసుకుంటే'డీజే టిల్లు'లో కొత్తదనం ఏమి ఉండదు. కానీ టిల్లుగాడి మ్యానరిజం.. వాడు చేసిన మాటల మ్యాజిక్కే ఆ చిత్రానికి భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. 'టిల్లు స్క్వేర్'లోనూ అదే అప్లై చేశారు దర్శకరచయితలు. కథను కాకుండా టిల్లుగాడి, లిల్లిల కారెక్టరైజేషన్స్ను నమ్ముకున్నారు. సినిమా మొత్తం టిల్లు, లిల్లి పాత్రల చుట్టే తిరుగుతుంది. ప్రేక్షకులకు అల్రేడీ టిల్లు క్యారెక్టర్ గురించి అవగాహన ఉంటుంది కనుక.. సినిమా ప్రారంభం నుంచే ఆ పాత్రతో కనెక్ట్ అవుతారు. పార్ట్ 1 లాగే పార్ట్ 2లో కూడా లాజిక్స్ని పట్టించుకోలేదు. చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవుతారు. కానీ టిల్లుగాడు తన మ్యానరిజంతో, డైలాగ్స్తో ఆ లోపాలను కప్పిపుచ్చుతాడు. మధ్య మధ్యలో వచ్చే కొన్ని ట్విస్టులు కూడా ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా చేస్తాయి. అలా అని ఆ ట్విస్టులు సర్ప్రైజింగ్గా ఉండవు. నిడివి తక్కువగా ఉండడం(దాదాపు 137 నిమిషాలు) కూడా సినిమాకు కలిసొచ్చింది. 'డీజే టిల్లు'లోని రాధిక ఎపిసోడ్ని చూపిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. దాన్నివల్ల సినిమా చూడని వారికి కూడా రాధిక పాత్రపై కాస్త అవగాహన వస్తుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్స్టైల్ ఎలా ఉంటుందో చూపించి.. నేరుగా అసలు కథలోకి తీసుకెళ్లాడు. లిల్లి పరిచయం.. ఆ తర్వాత చిన్న టిస్టు.. బర్త్డే పార్టీ రోజు మరో షాక్.. ఇలా ఫస్టాఫ్ సాగుతుంది. ఇంటర్వెల్ టిస్టు బాగుంటుంది కానీ.. దాన్ని యాక్సెప్ట్ చేయడం కష్టంగా అనిపిస్తుంది. సెకండాఫ్లో కామెడీ డోస్ తగ్గుతుంది. ఇంటర్నేషనల్ మాఫియా కింగ్ ఎంట్రీ తర్వాత కథనం రొటీన్గా, సినిమాటిక్గా సాగుతుంది. అయితే ప్రీక్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. కొన్ని సంభాషణలను యూత్ బాగా ఎంజాయ్ చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. టిల్లుగాడి పాత్ర సిద్ధూ జొన్నలగడ్డకు ఎంత పేరు సంపాదించిపెట్టిందో అందరికి తెలిసిందే. ఆ పాత్రను సిద్ధు తప్పా ఎవరూ చేయలేరు అనేంతలా నటించాడు. ఆల్రెడీ చేసిన పాత్రే కాబట్టి చాలా ఈజీగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ఆయన మ్యానరిజం, డైలాగ్ డెలివరీ సినిమా స్థాయిని పెంచేసింది. అనుపమ ఈ సినిమాలో చాలా కొత్త పాత్రను పోషించింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పాత్రలో ఆమె నటించలేదు. లిల్లిగా ఆమె తెరపై అందాలను పంచడమే కాకుండా.. తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్రలో వచ్చే సర్ప్రైజులు, ట్విస్టులు ఆకట్టుకుంటాయి. టిల్లు తండ్రిగా మురళీధర్ గౌడ్ పండించిన కామెడీ బాగా వర్కౌట్ అయింది. మురళీ శర్మ, ప్రిన్స్తో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సినిమా బాగుంది. రామ్ మిరియాల కంపోజ్ చేసిన 'డీజే టిల్లు...' రీమిక్స్, 'రాధికా రాధికా' పాటలతో పాటు అచ్చు రాజమణి అందించిన 'ఓ మై లిల్లీ' సాంగ్ కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. భీమ్ అందించిన బీజీఎం సినిమాకు మరో ప్రధాన బలం. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. తక్కువ నిడివే ఉండడంతో సినిమా త్వరగానే అయిపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
Aadujeevitham Review: ది గోట్ లైఫ్ (ఆడు జీవితం) మూవీ రివ్యూ
టైటిల్: ది గోట్ లైఫ్ నటీనటులు: పృథ్వీరాజ్ సుకుమారన్, జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు నిర్మాణం:జువల్ రొమాన్స్ దర్శకత్వం: బ్లెస్సీ సంగీతం: ఏఆర్ రెహమాన్ సినిమాటోగ్రఫీ: సునీల్ కేఎస్ ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్ విడుదల తేది: మార్చి 28, 2024 నజీబ్(పృథ్వీరాజ్ సుకుమారన్) ఊర్లో ఇసుక పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. భార్య సైను(అమలాపాల్) గర్భవతి. పుట్టబోయే బిడ్డకు మంచి భవిష్యత్ ఇవ్వాలని, అలాగే సొంత ఇంటిని కట్టుకోవాలనే ఉద్దేశంతో సౌదీ వెళ్లాలనుకుంటాడు. అక్కడ భారీగా డబ్బు సంపాదించి ఫ్యామిలీని సంతోషంగా చూసుకోవాలనుకుంటాడు. ఇంటిని తాకట్టు పెట్టి రూ. 30 వేలు అప్పు తెచ్చి మరీ సౌదీకి వెళ్లాడు. అతనితో పాటు హకీమ్(కేఆర్ గోకుల్) కూడా వెళ్తాడు. వీరిద్దరిని ఏజెంట్ మోసం చేస్తాడు. సౌదీకి వెళ్లిన తర్వాత వీరికి ఎవరూ ఉద్యోగం చూపించరు. అక్కడ కఫీల్ చేతిలో ఇరుక్కుంటారు. అతను వీరిద్దరి బలవంతంగా తీసుకెళ్లి వేరు వేరు చోట్ల పనిలో పెడతాడు. నజీబ్ని ఏడారిలో గొర్రెలు, మేకలు, ఒంటెలు కాసే పనిలో పెడతారు. అక్కడ నజీబ్కి ఎదురైన సమస్యలు ఏంటి? ఏడారి నుంచి బయటపడేందుకు నజీబ్ ఎన్ని కష్టాలు పడ్డాడు? ఆఫ్రికన్ ఇబ్రహం ఖాదిరి (జిమ్మీ జీన్ లూయిస్) నజీబ్కి అందించిన సహాయం ఏంటి? చివరకు నజీబ్ తిరిగి ఇండియాకు వెళ్లాడా లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. 90వ దశకంలో పొట్టకూటి కోసం చాలామంది భారతీయులు గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు. అక్కడి వెళ్తే బాగా డబ్బు సంపాదించొచ్చని, దాంతో తమ కష్టాలన్నీ తీరుపోతాయనే ఆశతో అప్పు చేసి మరీ గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు. అలాంటివారిలో చాలా మంది ఏజెంట్ చేతిలో మోసపోయేవారు. మంచి ఉద్యోగం ఇప్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేసి.. అక్కడికి వెళ్లిన తర్వాత రెస్పాన్స్ అయ్యేవారు కాదు. మళ్లీ తిరిగి ఇండియాకు వచ్చే స్థోమత లేక చాలా మంది అక్కడ యాచకులుగా.. గొర్రెలు, ఒంటెల కాపరిగా పని చేసేవారు. కొంతమంది అయితే అక్కడే చనిపోయేవారు కూడా. అలా ఏజెంట్ చేతిలో మోసపోయిన ఓ వ్యక్తి కథే ‘ది గోట్ లైఫ్’. చదువు, అవగాహన లేకుండా, ఏజెంట్ చేతిలో మోసపోయి.. దొంగ వీసాలపై గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి జీవితాలు ఎలా ఉంటాయి? అక్కడ వారు పడే కష్టాలు ఏంటి? అనేవి కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు బ్లెస్పీ. ఇది వాస్తవంగా జరిగిన కథే. 90వ దశకంలో కేరళకు చెందిన నజీబ్ అనే వ్యక్తి జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు చాలా కష్టాలు పడ్డాడు. నజీబ్ ఎడారిలో సాగించిన ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ ప్రముఖ రచయిత బెన్యామిక్ గోట్ డేస్ అనే పుస్తకాన్ని రాశారు. కేరళలో ఈ పుస్తకం అనూహ్య పాఠక ఆదరణ పొందింది. ఆ పుస్తకం ఆధారంగానే దర్శకుడు బ్లెస్సీ ఈ చిత్రాన్ని రూపొందించాడు. పుస్తకంలోని ప్రతి అక్షరానికి తెర రూపం ఇచ్చాడు దర్శకుడు. సినిమా చూస్తున్నంతసేపు మనసులో ఏదో తెలియని బాధ కలుగుతుంది. ప్రధాన పాత్రకు ఎదురయ్యే సమస్యలు చూసి తట్టుకోలేం. ‘అయ్యో.. ఇంకెంత సేపు ఈ వేదన’ అనే ఫీలింగ్ కలుగులుతుంది. ఓ సాధారణ ప్రేక్షకుడు కోరుకునే ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రంలో ఉండదు. కానీ హీరో పాత్రకు కనెక్ట్ అయితే మాత్రం సీటులో నుంచి కదలరు. హీరో ఏజెంట్ చేతిలో మోసపోయి సౌదీలో బానిసగా మారే సీన్తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హీరో గతాన్ని, వర్తమానాన్ని చూపిస్తూ కథనాన్ని ముందుకు నడిపించాడు. అద్భుతమైన స్క్రీన్ప్లేతో కథనాన్ని ఆసక్తికరంగా మలిచాడు. ఫస్టాఫ్లో కొన్ని సీన్లు ప్రేక్షకుల మనసును మెలిపెట్టేస్తుంది. ఎడారిలో నీళ్ల కోసం అతను పడే బాధను చూపిస్తూనే.. వెంటనే గతంలో నది ఒడ్డున అతను ఎలా బతికాడనేది చూపించారు. ఈ రెండింటిని పోల్చకనే పోలుస్తూ ప్రేక్షకులను ఎమోషనల్కు గురి చేశాడు. గొర్రెల మందతో కలిసి హీరో నీళ్లు తాగే సీన్ పెట్టి.. గల్ఫ్ వెళ్లిన తర్వాత అతని పరిస్థితి కూడా ఓ గొర్రెలాగే అయిందని చెప్పే ప్రయత్నం చేశాడు. అద్దంలో తన ముఖం తాను చూసుకొని హీరో పడే బాధను చూస్తుంటే మన గుండె బరువెక్కుతుంది. ఇలాంటి ఎమోషనల్ సీన్స్ ఫస్టాఫ్లో చాలానే ఉన్నాయి. ద్వితియార్థంలో కథ కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ఏడారి నుంచి బయటపడేందుకు మరో ఇద్దరితో కలిసి హీరో చేసే ప్రయత్నాలు.. ఈ క్రమంలో వారికి ఎదురైన కష్టాల నేపథ్యంలో సెకండాఫ్ సాగుతుంది. దర్శకుడు ప్రతి విషయాన్ని డీటెయిల్డ్గా చెప్పే ప్రయత్నం చేశాడు. సెకండాఫ్లో వచ్చే కొన్ని సన్నివేశాలు కన్నీళ్లను తెప్పిస్తాయి. ముగింపు ఆకట్టుకుంటుంది. అయితే ఈ కథ అందరికి నచ్చకపోవచు. నిడివి కూడా ఇబ్బంది పెట్టొచ్చు. కానీ హీరో క్యారెక్టర్తో కనెక్ట్ అయి చూసేవాళ్లకి మాత్రం ‘ది గోట్ లైఫ్’ అద్భుతమైన సినిమా. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం పృథ్వీరాజ్ సుకుమారన్ నటన. నజీబ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ పడిన కష్టమంతా తెర పై కనిపించింది. నటనపై ఎంతో ఫ్యాషన్ ఉంటే తప్ప ఇలాంటి పాత్రలు చేయలేరు. పృథ్వీరాజ్ నట జీవితంలో ‘ది గోట్ లైఫ్’ కచ్చితంగా ఒక బెంచ్ మార్క్ మూవీ అనొచ్చు. ఖాదిరి పాత్రకు జిమ్మిజీన్ లూయీస్ న్యాయం చేశాడు. అమలాపాల్ పాత్ర నిడివి తక్కువే అయినా..ఉన్నంతలో చక్కగా నటించింది. హీరోహీరోయిన్ల ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంది. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. టెక్నికల్గా సినిమా చాలా బాగుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమా కు ప్లస్ అయింది. తనదైన బిజియం తో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. పాటలు కథకు అనుగుణంగా సాగుతుంది. సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. చివరిగా.. ఈ సినిమా కమర్షియల్గా ఏ మేరకు వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ.. ఇదొక అవార్డు విన్నింగ్ మూవీ. ఆస్వాదించేవారికి ‘ది గోట్ లైఫ్’ అద్భుతమైన సినిమా. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
Om Bheem Bush: ‘ఓం భీమ్ బుష్’ మూవీ రివ్యూ
టైటిల్: ఓం భీమ్ బుష్ నటీనటులు: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్ తదితరులు నిర్మాతలు: వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు సమర్పణ: యూవీ క్రియేషన్స్ దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి సంగీతం: సన్నీ ఎమ్ఆర్ సినిమాటోగ్రఫీ: రాజ్ తోట సంగీతం ఎడిటింగ్: విజయ్ వర్ధన్ విడుదల తేది: మార్చి 22, 2024 ‘ఓం భీమ్ బుష్’ కథేంటంటే? కృష్ణ కాంత్ అలియాస్ క్రిష్(శ్రీవిష్ణు), వినయ్ గుమ్మడి(ప్రియదర్శి), మాధవ్ రేలంగి అలియాస్ మ్యాడీ(రాహుల్ రామకృష్ణ) ముగ్గురు మంచి స్నేహితులు. సైంటిస్టులు కావాలనేది వారి కోరిక .పీహెచ్డీ కోసం లెగసీ యూనివర్సిటీలో చేరతారు. ఐదేళ్లయినా పీహెచ్డీ పూర్తి చేయరు. కాలేజీలో వీళ్లు చేసే పనులు భరించలేక డాక్టరేట్లు ఇచ్చి పంపించేస్తాడు కాలేజీ ప్రిన్సిపాల్ రంజిత్ విలుకొండ(శ్రీకాంత్ అయ్యంగార్). ఊరికి వెళ్లే క్రమంలో ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు. అక్కడ జరిగే కొన్ని సంఘటనలు, మాంత్రిక దళం చేసే మోసాన్ని గమనించి, తాము కూడా టెక్నాలజీ ఉపయోగించి డబ్బులు వసూలు చేయాలనుకుంటారు. సైంటిస్టుల అవతారమెత్తి ఎ టు జెడ్ సర్వీసెస్ పేరు ఓదుకాణం తెరుస్తారు. తక్కువ సమయంలోనే ఊరి ప్రజల అభిమానాన్ని సంపాదించుకుంటారు. అయితే బ్యాంగ్ బ్రోస్(ఈ ముగ్గురి టీమ్ పేరు బ్యాంగ్ బ్రోస్) నిజమైన సైంటిస్టులు కాదని, డబ్బుకోసం ప్రజలను మోసం చేస్తున్నారనే విషయం బయటపడుతుంది. దీంతో ఆ ఊరి సర్పంచ్(ఆదిత్యా మీనన్).. ఈ ముగ్గురికి ఓ పరీక్ష పెడతాడు. ఊరి చివరన ఉన్న సంపంగి మహాల్లోకి వెళ్లి నిధిని కనిపెట్టి తీసుకురావాలని ఆదేశిస్తాడు. సంపంగి దెయ్యం ఉన్న ఆ మహాల్లోకి వెళ్లిన తర్వాత బ్యాంగ్ బ్రోస్కి ఎదురైన సంఘటనలు ఏంటి? సంపంగి మహల్ కథ ఏంటి? ఇంతకీ ఆ మహల్ లో నిధి ఉందా లేదా? చివరికి ఏం జరిగింది అనేది తెలియాలంటే థియేటర్స్లో ‘ఓం భీమ్ బుష్’చూడాల్సిందే. ఎలా ఉందంటే.. కొన్ని సినిమాల కథలు వాస్తవానికి విరుద్దంగా, లాజిక్ లెస్గా ఉంటాయి. కానీ తెరపై చూస్తే మాత్రం వినోదాన్ని పంచుతాయి. అలాంటి సినిమాల్లో ‘ఓమ్ భీమ్ బుష్’ ఒకటి. ‘నో లాజిక్ ఓన్లీ మేజిక్ ’అని టైటిల్ క్యాప్షన్ ఇచ్చిన దర్శకుడు శ్రీహర్ష.. అందుకు తగ్గట్టే ఓన్లీ స్క్రీన్ప్లేతో తెరపై మ్యాజిక్ చేశాడు. మంచి కథతో పాటు అంతకు మించిన కామెడీతో రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో శ్రీహర్ష సక్సెస్ అయ్యాడు. ‘జాతిరత్నాలు’ తరహాలో సాగే ముగ్గురు స్నేహితుల కథకి హారర్ని జోడించి.. చివరిలో ఓ మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేశాడు. కొన్ని చోట్ల నవ్విస్తూ మరికొన్ని చోట్ల భయపెడతూనే ఓ డిఫరెంట్, ఎమోషనల్ లవ్స్టోరీని చెప్పాడు. టైటిల్లో చెప్పినట్లుగానే కథ ప్రారంభం నుంచే ఇందులో లాజిక్స్ ఉండవు. సంపంగి మహల్ లో తాంత్రిక పూజ సీన్ తో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వెంటనే కాలేజీ ఎపిసోడ్ తో ముగ్గురు హీరోల క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయో చూపించాడు. ఈ ముగ్గురు భైరవపురం వచ్చేవరకు కథ స్లోగా అవుతుంది. అయితే ఆ మధ్యలో వచ్చే అడల్ట్ కామెడీ నవ్వులు పూయిస్తుంది. భైరవపురంలో బ్యాంగ్ బ్రోస్ ఎ టు జెడ్ సర్వీసెస్ పేరుతో దుకాణం తెరిచాక అసలైన కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఊరి ప్రజలతో ఈ ముగ్గురు చేసే పనులు నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా సంతానం కలగడం లేదని వచ్చిన ఓ వ్యక్తికి వీరిచ్చే ట్రీట్మెంట్ సీన్కి థియేటర్స్లో పగలబడి నవ్వుతారు. అలాగే అర్థరాత్రి ఈ ముగ్గురు సర్పంచ్ ఇంట్లోకి చొరబడి చేసే అల్లరి, ప్రియదర్శి, ఆదిత్య మీనన్కు సంబంధించిన సన్నివేశాలు పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది.ద్వితియార్థం మొత్తం సంపంగి మహాల్ చుట్టే తిరుగుతుంది. అయితే సెకండాఫ్లో కొన్ని సన్నివేశాలను డైరెక్టర్ పకడ్బంధీగా ప్లాన్ చేసుకున్నాడు. ఎక్కడ హారర్ సీన్ పెట్టాలి? ఎలాంటి సీన్కి నవ్వుతారు? లాంటివి లెక్కలేసుకొని బలమైన స్క్రీప్ట్ రాసుకున్నాడు. సంపంగి దెయ్యం, ప్రియదర్శిని భయపెట్టే సీన్ వచ్చినప్పుడు మనం కూడా భయపడుతూనే నవ్వుతుంటాం. అయితే సంపంగి దెయ్య నేపథ్యం తెలిశాక వచ్చే సీన్స్ అంతగా ఆకట్టుకోవు. నిధి వివరాలు తెలుసుకోవడం కోసం ఈ ముగ్గురు చేసే ప్రయత్నాలు కూడా రొటీన్గా ఉంటాయి. కానీ చివరిలో మాత్రం ఓ కొత్త పాయింట్ని టచ్ చేశాడు. ఇంతవరకు ఎవరూ అలాంటి అంశాన్ని ఇంత డిఫరెంట్గా తెరపై చూపించలేదు. నవ్వించడంతో పాటు సందేశాన్ని కూడా ఇచ్చారు. కొన్నీ సంభాషణలు, సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చు. కానీ లాజిక్స్ జోలికి వెళ్లకుండా సినిమా చూస్తే మాత్రం రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకోవచ్చు. ఎవరెలా చేశారంటే.. ఎప్పటి మాదిరే శ్రీవిష్ణు మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు.తన కామెడీ టైమింగ్ సినిమాకు చాలా ప్లస్ అయింది. క్రిష్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఆయన చేసే ఇన్నోసెంట్గా కామెడీ నవ్వులు పూయిస్తుంది. శ్రీవిష్ణుతో పాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ పాత్రలు కూడా ఆద్యంతం నవ్విస్తూనే ఉంటాయి. భయస్తుడు వినయ్ గుమ్మడి పాత్రకి ప్రియదర్శి వందశాతం న్యాయం చేశాడు. సినిమాలో బాగా నవ్వించిన సీన్లలో ఎక్కువగా ప్రియదర్శివే ఉంటాయి.మహల్లో అతనికి, దెయ్యంకి మధ్యవచ్చే సీన్లు హిలేరియస్గా అనిపిస్తాయి. ఇక రాహుల్ రామకృష్ణ ఎప్పటి మాదిరే తనదైన పంచ్ డైలాగ్స్, కామెడీతో ఆకట్టుకున్నాడు.స్పెషల్ సాంగ్లో ప్రియా వడ్లమాని అందాల అరబోసింది.ప్రీతీ ముకుందన్ , ఆయేషా ఖాన్, రచ్చరవితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికపరంగా సినిమా ఉన్నతంగా ఉంది. రాజ్ తోట సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయింది. ఆర్ట్ డైరెక్టర్ పనితీరు బాగుంది. సన్నీ అందించిన బీజీఎం కొన్ని సీన్లను నెక్ట్స్ లెవెల్కి తీసుకెళ్లింది. పాటలు పర్వాలేదు. ఎడిటర్ విజయ్ వర్దన్ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉంది. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
Save The Tigers 2 Review: సేవ్ ద టైగర్స్ 2.. ఎలా ఉందంటే?
వెబ్ సిరీస్ రివ్యూ: సేవ్ ద టైగర్స్ 2 నటీనటులు : ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ, 'జోర్దార్' సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని, హర్షవర్ధన్, గంగవ్వ, వేణు టిల్లు, రోహిణి తదితరులు క్రియేటర్స్: మహి వి రాఘవ్, ప్రదీప్ అద్వైతం రైటర్స్ : ప్రదీప్ అద్వైతం, విజయ్ నమోజు, ఎస్ ఆనంద్ కార్తీక్ దర్శకత్వం : అరుణ్ కొత్తపల్లి క్రియేటర్స్ : మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం సంగీతం : అజయ్ అరసద ఎడిటర్ : శ్రవణ్ కటికనేని విడుదల తేది: మార్చి 15, 2024 (డిస్నీ ప్లస్ హాట్స్టార్) ఓటీటీలో క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్సే కానీ కామెడీ జాడేది అనుకుంటున్న తరుణంలో సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ రిలీజైంది. గతేడాది హాట్స్టార్లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ జనాలను ఎంతగానో ఆకట్టుకుంది. భార్యా బాధితులుగా హీరోలు పడే అగచాట్లు ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తుంది. ఈ హిట్ సిరీస్కు సీక్వెల్గా తాజాగా సేవ్ ద టైగర్స్ 2 విడుదలైంది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం... కథ హీరోయిన్ హంసలేఖ(సీరత్ కపూర్) మిస్ అవడంతో మొదటి సీజన్ ముగుస్తుంది. తను ఏమైందన్న ఆందోళనతో రెండో సీజన్ కథ మొదలవుతుంది. హంసలేఖ ఎక్కడ? అని పోలీసులు విక్రమ్ (చైతన్య కృష్ణ), రాహుల్ (అభినవ్ గోమఠం), గంటా రవి (ప్రియదర్శి)లను ప్రశ్నిస్తారు. తమకు తెలియదు మహాప్రభో అని మొర పెట్టుకున్నా సరే.. పోలీసులు లెక్క చేయకుండా ముగ్గురికీ లాఠీదెబ్బల రుచి చూపిస్తారు. మరోవైపు మీడియాలో హంసలేఖను ఈ ముగ్గురూ పార్టీ నుంచి తీసుకెళ్లిన వీడియో చూపించి ఏకంగా ఆమెను హత్య చేశారంటూ కథనాలు ప్రసారం చేస్తారు. ఇంతలో హంసలేఖ ఎంట్రీ ఇవ్వడంతో ఆ ముగ్గురినీ పోలీసులు వదిలేస్తారు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాక ఏం జరిగింది? ఆ ముగ్గురి భార్యలు స్పంద కౌన్సిలర్ (సత్యకృష్ణ) దగ్గరకు ఎందుకెళ్లారు? రాహుల్, అతడి భార్య మాధురి (పావని గంగిరెడ్డి) మధ్య దూరిన మూడో వ్యక్తి హారిక (దర్శనా బానిక్) ఎవరు? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలన్న రవి భార్య హైమావతి(జోర్దార్ సుజాత) కల నెరవేరిందా? విక్రమ్ భార్య రేఖ (దేవయాని శర్మ) లాయర్ ప్రాక్టీస్ ఎందుకు ఆపేయాలనుకుంది? మూడు జంటల మధ్య మళ్లీ గొడవలు ముదరడానికి కారణమేంటి? అన్నది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే! విశ్లేషణ మొదటి సీజన్లాగే ఈ సీజన్లోనూ కామెడీకి కొదవలేదు. కామెడీతో పాటు ఓ సందేశాన్ని జోడించారు. కళ్లతో చూసే ప్రతీది నిజం కాదని నొక్కి చెప్పారు. చూసిన ప్రతీది నిజమని గుడ్డిగా నమ్మేసి ఓ అభిప్రాయానికి రాకూడదని, ఏది నిజం? ఏది అబద్ధం? అనేది మనమే తెలుసుకోవాలని మహి వి రాఘవ్ మెదడుకు ఎక్కేలా చెప్పాడు. ఈ విషయంలో మహిని కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే! మహి క్రియషన్స్, అరుణ్ డైరెక్షన్ ఎక్కడా సింక్ మిస్ అయినట్లు అనిపించదు. సిరీస్ నిర్మాణ విలువలు సైతం బాగున్నాయి. కథకు తగ్గట్టుగా అజయ్ అరసద సంగీతం అందించాడు. ఎవరెలా చేశారంటే? ఈ సిరీస్లో ఎవరి నటనకు వంక పెట్టాల్సిన పని లేదు. ప్రియదర్శి, అభినవ్, చైతన్య బాగా నటించారు. సుజాత, దేవయాని, పావని వారితో పోటీపడి నటించినట్లు అనిపించినా మగజాతి ఆణిముణ్యాలదే ఇక్కడ పైచేయి అని చెప్పాలి. ముఖ్యంగా ప్రియదర్శి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కూతురు పెద్దమనిషి అయ్యాక ఆమెతో మాట్లాడిన సీన్.. ఆ అమ్మాయి స్కూల్లో తన గురించి మాట్లాడేటప్పుడు అతడు భావోద్వేగానికి లోనయ్యే సన్నివేశాల్లో ప్రియదర్శి చింపేశాడు. గంగవ్వ, అవినాష్, , వేణు.. తమ పాత్రల పరిధిమేర నటించారు. పనిమనిషితో పెట్టుకుంటే మడతెడిపోద్ది అనే రీతిలో రోహిణి మరోసారి ఫుల్గా నవ్వించింది. ఫైనల్గా చెప్పాలంటే.. ఓపక్క నవ్విస్తూనే భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్తుందీ సిరీస్. తండ్రీకూతుళ్ల అనుబంధంతో ఏడిపిస్తుంది. వీకెండ్లో హ్యాపీగా చూసేయొచ్చు. -
Sharathulu Varthisthai: ‘షరతులు వర్తిస్తాయి’ రివ్యూ
టైటిల్ : షరతులు వర్తిస్తాయి నటీనటులు: చైతన్య రావ్, భూమి శెట్టి, నంద కిషోర్, సంతోష్ యాదవ్, దేవరాజ్ పాలమూరు, పద్మావతి, వెంకీ మంకీ, శివ కల్యాణ్, మల్లేష్ బలాస్త్, సీతా మహాలక్ష్మి, పెద్దింటి అశోక్ కుమార్, సుజాత తదితరులు నిర్మాణ సంస్థ: స్టార్ లైట్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ దర్శకత్వం: కుమారస్వామి (అక్షర) బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ - ప్రిన్స్ హెన్రీ మ్యూజిక్ - అరుణ్ చిలువేరు, సరేష్ బొబ్బిలి (పన్నెండు గుంజల) సినిమాటోగ్రఫీ - ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి ఎడిటింగ్ - సీహెచ్ వంశీ కృష్ణ, గజ్జల రక్షిత్ కుమార్ విడుదల తేది: మార్చి 15, 2024 కథేంటంటే.. చిరంజీవి(చైతన్య రావు) ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. నాన్న చనిపోవడంతో కుటుంబ బాధ్యతను తానే తీసుకుంటాడు. నీటిపారుదల శాఖలో క్లర్క్ ఉద్యోగం చేసుకుంటూ.. చెల్లి, తమ్ముడిని చదివించడానికి కష్టపడుతుంటాడు. అతని స్కూల్మేట్ విజయశాంతి అలియాస్ విజయ(భూమి శెట్టి)ని చిన్నప్పటి నుంచే ప్రేమిస్తాడు. విజయ కూడా అతన్ని ప్రేమిస్తుంటుంది. కష్టకాలంలో ఆర్థిక సహాయం చేసి తోడుగా నిలుస్తుంది. వీరిద్దరి ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో పెళ్లి కూడా చేస్తారు. సాఫీగా సాగిన వీరి జీవితంలోకి చైన్ సిస్టమ్ బిజినెస్ వచ్చి నాశనం చేస్తుంది. కొంత డబ్బు కట్టి మీ తరపున నలుగురిని జాయిన్ చేయిస్తే బోలెడు డబ్బు వస్తుందంటూ ఆశపెట్టి.. ఊరందిరితో డబ్బులు కట్టిస్తారు. ఆ ఏరియా లీడర్, వచ్చే ఎన్నికల్లో కార్పోరేటర్గా నిలబడాలనుకునే శంకరన్న భరోసా ఇవ్వడంతో చాలా మంది డబ్బులు కట్టడమే కాకుండా వారి తరపును మరో నలుగురిని జాయిన్ చేయింస్తారు. చిరంజీవికి తెలియకుండా తన భార్య, తల్లి కూడా ఈ బిజినెస్ కోసం డబ్బులు కడతారు. ఇలా పెద్ద మొత్తంలో డబ్బులు చేసిన మోసగాళ్లు..రాత్రికి రాత్రే బోర్డు తిప్పేస్తారు. అసలు ఆ భోగస్ కంపెనీ ఎవరిది? శంకరన్నని ముందు పెట్టి ఎందుకు డబ్బులు వసూలు చేశారు? తన డబ్బులు కూడా పోయాయని తెలిసిన తర్వాత చిరంజీవి ఏం చేశాడు? భర్తకు తెలియకుండా డబ్బులు ఇచ్చి మోసపోయిన విజయశాంతి చివరకు ఏం చేసింది? కార్పోరేషన్ ఎన్నికలకు ఈ మోసానికి గల సంబంధం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఇదొక మధ్యతరగతి కుటుంబానికి చెందిన కథ. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు ఎలా ఉంటాయి? అలాంటి వాళ్లు మోసానికి గురైతే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? తదితర విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు కుమార్. గొలుసు కట్టు మోసం అనేది తరచూ వార్తల్లో వింటుంటాం. డబ్బు ఆశతో ఒక్కొక్కరు నలుగురిని జాయిన్ చేయించడం.. అలా పెద్ద మొత్తంలో జనాన్ని చేర్పించిన తర్వాత బోర్డు తిప్పేసి పరారైతే.. ఆ కుటుంబాల ఎలా బాధపడతాయి అనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. అచ్చమైన తెలంగాణ పల్లెటూరి నేపథ్యంతో కథ ప్రారంభం అవుతుంది. ఫస్టాప్ చిరంజీవి, విజయ లవ్ స్టోరీ, వారి కుటుంబాల పరిస్థితి, మిడిస్ క్లాస్ ఫ్యామిలీల కష్టాల చుట్టూ తిరుగుతుంది. పెళ్లి తర్వాత అత్తాకోడళ్ల మధ్య జరిగే గొడవలు.. వాట్సాప్ స్టేటస్లు.. అటు తల్లికి ఇటు భార్యకి చిరంజీవి సర్దిచెప్పించే తీరు..ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. డబ్బు ఆశ చూపుతూ గోల్డెన్ ప్లేట్ అనే చిట్ కంపెనీ రావడం..దానికి శంకరన్న మద్దతు తెలపడంతో ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇంటర్వెల్ సీన్ ఎమోషనల్గా ఉంటూనే సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం నెమ్మదిగా సాగుతూ..ఒక పాయింట్ చుట్టే తిరుగుతుంది. ఫస్టాఫ్లో వర్కౌట్ అయిన ఎమోషన్.. సెకండాఫ్లో కాలేదు. ఎన్నికలకు సంబంధించిన ఎపిసోడ్ అంతగా ఆకట్టుకోదు. క్లైమాక్స్ రొటీన్గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. మధ్యతరగతి యువకుడు చిరంజీవి పాత్రలో చైతన్య రావు ఒదిగిపోయాడు. సినిమా మొత్తాన్ని తన భుజాన వేసుకొని నడిపించాడు. మిడిల్ క్లాస్ గృహిణిగా,భూమి శెట్టి మెప్పించింది. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. నంద కిషోర్, , వెంకీ మంకీ, శివ కల్యాణ్, మల్లేష్ బలాస్త్, సీతా మహాలక్ష్మి, పెద్దింటి అశోక్ కుమార్తో పాటు మిగిలిన నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి సీన్ తెరపై చాలా నేచురల్గా కనిపించింది. తెలంగాణలోని పలు జలయశయాలని కూడా తెరపై చక్కగా చూపించారు. నేపథ్య సంగీతం పర్వాలేదు. పాటలు బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ఎలాంటి కమర్షియల్ ఆడంబరాలకు వెళ్లకుండా చాలా సహజంగా మధ్యతరగతి మనుషుల కథను చెప్పిన దర్శకుడిని మాత్రం అభినందించాల్సిందే. -
Tantra Review: 'తంత్ర' సినిమా రివ్యూ
ఏ భాష తీసుకున్నా సరే హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. సరిగ్గా తీయాలే గానీ హిట్ కొట్టడం పక్కా. ఈ మధ్య కాలంలో 'మసూద', 'విరూపాక్ష', 'మా ఊరి పొలిమేర' తదితర చిత్రాలు ఇలాంటి కథలతో వచ్చి అందర్ని భయపెట్టాయి. ఇప్పుడు అలాంటి కథతో తీసిన మూవీ 'తంత్ర'. ట్రైలర్తోనే అంచనాలు పెంచిన ఈ చిత్రం తాజాగా థియేటర్లలోకి వచ్చింది. అనన్య నాగళ్ల భయపెట్టిందా? హిట్ కొట్టిందా? అనేది ఈ రివ్యూలో చూద్దాం. కథేంటంటే? రేఖ(అనన్య నాగళ్ల)కు దెయ్యాలు కనిపిస్తుంటాయి. చిన్నప్పుడు తల్లి చనిపోవడంతో నాన్న సంరక్షణలో పెరుగుతుంది. చిన్నప్పటి నుంచి తనకు తెలిసిన తేజూ (ధనుష్ రఘుముద్రి)ని ఇష్టపడుతుంది. వీళ్లిద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే రేఖపై ఎవరో క్షుద్ర పూజలు చేశారని తేజుకి తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? ఈ కథలో విగత ('టెంపర్' వంశీ), రాజేశ్వరి (సలోని) ఎవరు? వీళ్లకు రేఖకు సంబంధం ఏంటనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఎలా ఉందంటే? హారర్ సినిమాల్లో లాజిక్స్ ఉన్నా లేకున్నా పర్వాలేదు. భయపెట్టే, వణుకు పుట్టించే సీన్స్ కచ్చితంగా ఉండాలి. లేదంటే మొదటికే మోసం వచ్చేస్తుంది. 'తంత్ర' విషయంలో అదే జరిగింది. స్టోరీ లైన్ పరంగా చూసుకుంటే మంచి పాయింట్. హారర్ కథకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ దాన్ని సినిమాగా తీసే విషయంలో పూర్తిగా తడబడ్డారు. చూస్తున్నంత సేపు ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించదు. సరికదా బోర్ కొడుతుంది. 'తంత్ర' సినిమాలో రక్త దాహం, పాతాళ కుట్టి, శత్రువు ఆగమనం, ముసుగులో మహంకాళి, వజ్రోలి రతి, చిన్నామస్తా దేవి.. అని ఆరు భాగాలు ఉంటాయి. అయితే వాటివల్ల పెద్దగా ప్లస్ కాలేదు. ఈ పేర్లు లేకుండా కథ చెప్పినా సరే ఇబ్బంది ఏం ఉండేది కాదు. తాంత్రిక విద్యలు, క్షుద్ర పూజలు లాంటి వాటి గురించి ప్రేక్షకులకు చెప్పనక్కర్లేదు. భయపెడితే చాలు. కానీ దర్శకుడు.. వాటి గురించి ఒక్కోటి వివరించుకుంటూ వెళ్లడం సాగదీతగా అనిపించింది. దీంతో 'తంత్ర'.. సీరియల్ కంటే స్లోగా సాగింది. సాధారణంగా హారర్ సినిమాలు అంటే ఇంట్రెస్టింగ్ అనిపించే ఓ సీన్తో మొదలవుతాయి. 'తంత్ర'లో అలాంటిదేం లేకుండా చాలా ఫ్లాట్గా స్టోరీ వెళ్తుంది. సెకండాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే విసుగు తెప్పిస్తుంది. 'మా సినిమాకు పిల్ల బచ్చాలు రావొద్దు' అని.. మూవీ రిలీజ్కి కొన్నిరోజుల ముందు హడావుడి చేశారు. కాకపోతే ఒకటి రెండు సీన్లు తప్పితే పెద్దగా హారర్ ఎఫెక్ట్ అనిపించే సినిమా అయితే ఇది కాదు. ఎవరెలా చేశారు? రేఖగా ప్రధాన పాత్ర చేసిన అనన్య నాగళ్ల ఉన్నంతలో పర్వాలేదనిపించింది. అయితే ఈమెకి తగ్గ సీన్స్ పడలేదు. క్లైమాక్స్లో కాస్త స్కోప్ దక్కింది. తేజూగా చేసిన ధనుష్ రఘుముద్రి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. కాకపోతే ఇంకా ఇంప్రూవ్ కావాలి. రాజేశ్వరిగా ప్రత్యేక పాత్ర చేసిన సలోని.. ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేసింది. ఎమోషనల్ సీన్స్ పడ్డాయి. కానీ ఆ పాత్రని ఇంకాస్త బలంగా రాసుకోవాల్సింది. మిగతా పాత్రధారులు తమ ఫరిది మేరకు నటించారు. దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి రాతలో విషయం ఉంది. కాకపోతే పేపర్ మీద రాసుకున్నది స్క్రీన్పైకి తీసుకొచ్చేసరికి అనుభవలేమి కనిపించింది. క్షుద్రపూజాల నేపథ్యంలో క్యూరియసిటీ పాయింట్ రాసుకున్నప్పటికీ.. తీసే విషయంలో తడబడ్డారు. సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్.. పాటలు, నేపథ్య సంగీతం పెద్దగా ఎలివేట్ చేయలేకపోయాయి. అలా అని పూర్తి బాగోలేవని కూడా కాదు. నిర్మాణ విలువలు పర్వాలేదు. ఓవరాల్గా చెప్పుకొంటే 'తంత్ర'.. ప్రేక్షకుల్ని భయపెట్టలేకపోయింది. -
'అన్వేషిప్పిన్ కండేతుమ్' సినిమా రివ్యూ (ఓటీటీ)
ఈ మధ్య మలయాళ సినిమాలు సెన్సేషన్ సృష్టించాయి. ఫిబ్రవరిలో రిలీజైన నాలుగు మూవీస్ కూడా హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అందులో ఒకటే 'అన్వేషిప్పిన్ కండేతుమ్'. పోలీస్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్ కథతో తీసిన ఈ చిత్రం తాజాగా నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వచ్చేసింది. తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం? (ఇదీ చదవండి: 'ప్రేమలు' సినిమా రివ్యూ) కథేంటి? ఆనంద్ నారాయణన్ (టొవినో థామస్) చింగావనం అనే ఊరిలో సబ్ ఇన్స్పెక్టర్. లవ్ లీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసు తన దగ్గరకు వస్తుంది. చాలా చాక్యంగా అన్ని ఆధారాలతో నేరస్తుడిని పట్టుకుంటారు. కానీ ఊహించని విధంగా అతడు పోలీసులు కళ్లముందే ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. దీంతో ఆనంద్ & టీమ్పై సస్పెన్షన్ వేటు. కొన్నాళ్లకు అనధికారికంగా ఆనంద్ టీమ్ దగ్గరకు మరో కేసు వస్తుంది. శ్రీదేవిని అమ్మాయి మర్డర్ కేసు ఇది. అందరూ చేతులెత్తేసిన ఈ కేసుని ఆనంద్ టీమ్ ఎలా పరిష్కరించింది? ఇంతకీ నిందుతుడు ఎవరనేదే 'అన్వేషిప్పిన్ కండేతుమ్' స్టోరీ. ఎలా ఉందంటే? థ్రిల్లర్ సినిమా అనగానే.. మిస్సింగ్ లేదా మర్డర్ కేసు. దొంగని పట్టుకోవడానికి ఓ పోలీసు ఆఫీసర్. సవాళ్లు, పలువురు వ్యక్తులపై అనుమానం. చివరకు నిందుతుడు ఎలా దొరికాడు? అనేదే మీకు గుర్తొస్తుంది. చెప్పుకోవడానికి బాగానే ఉన్నా ఎవరెంత గ్రిప్పింగ్గా తీశారా అనేదే ఇక్కడ పాయింట్. ఆ విషయంలో 'అన్వేషిప్పిన్ కండేతుమ్' మూవీ డిస్టింక్షన్లో పాస్ అయిపోయింది. ఒక్క టికెట్ మీద రెండు సినిమాలు అన్నట్లు ఈ చిత్రంలో హీరో రెండు కేసుల్ని సాల్వ్ చేస్తాడు. సస్పెన్షన్లో ఉన్న హీరో.. ఎస్పీ ఆఫీస్కి రావడంతో సినిమా ఓపెన్ అవుతుంది. ఆ వెంటనే ఫ్లాష్ బ్యాక్కి వెళ్తుంది. ఎస్సైగా ఆనంద్.. పోలీస్ స్టేషన్లో జాయిన్ కావడం, కొన్నాళ్లు గడవడం.. ఓ రోజు లవ్లీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసు వస్తుంది. ఇంటి పరిసరాల్లో వెతకగా ఆ అమ్మాయి శవం దొరుకుతుంది. ఎవరు చంపారు? ఎందుకు చంపారు అనేది ఫస్టాప్ అంతా చూపించారు. నిందితుడు విషయంలో ఓ షాకింగ్ ఘటన జరగడంతో ఇంటర్వెల్ పడుతుంది. ఈ సంఘటన.. ఆనంద్ & టీమ్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. అదే టైంలో మరో అమ్మాయి మర్డర్ కేసు వీళ్ల దగ్గరికి వస్తుంది. దీన్ని చేధించడం అంతా సెకండాఫ్లో ఉంటుంది. (ఇదీ చదవండి: 'గామి' సినిమా రివ్యూ) ఈ సినిమాలో మర్డర్ కేసు.. దొంగ దొరకడం అనే పాయింట్ చూపిస్తూనే.. పోలీస్ వ్యవస్థలో జరిగే రాజకీయాల్ని కూడా చూపించారు. 1980-90 కాలమానాన్ని తీసుకుని డైరెక్టర్ చాలా మంచి పనిచేశాడు. అప్పటి కాలానికి తగ్గట్లు డ్రస్సులు, ఇల్లు, వాతావరాణన్ని అద్భుతంగా క్రియేట్ చేశారు. అలానే హీరో పోలీసు అనగానే అనవసరమైన బిల్డప్పుల జోలికి పోకుండా స్టోరీకి తగ్గట్లు సినిమా తీశారు. దర్యాప్తు చూపించే విధానంగా మిమ్మల్ని ఎటు డైవర్ట్ చేయకుండా ఇంట్రెస్టింగ్గా చూసేలా చేస్తుంది. సాధారణంగా ఓ సినిమాలో ఒక్క కథ మాత్రమే ఉంటుంది. ఇందులో ఇంటర్వెల్ ముందు ఒకటి. తర్వాత ఒకటి ఉంటుంది. అంటే ప్రేక్షకులకు డబుల్ ధమాకా. ఎవరెలా చేశారు? అంకిత భావంతో పనిచేసే ఎస్సై ఆనంద్గా టొవినో థామస్ ఆకట్టుకున్నాడు. పాత్రకు ఎంత కావాలో అంత చేశాడు. మిగతా పాత్రధారులందరూ కూడా సినిమాకు తగ్గట్లు చేసుకుంటూ వెళ్లిపోయారు. ఇందులో హీరోయిన్లు లాంటి వాళ్లు ఎవరూ లేకపోవడం రిలాక్సింగ్ విషయం. రెండు వేర్వేరు కేసుల్లో డిఫరెంట్ యాక్టింగ్ తో టొవినో ఆకట్టుకున్నాడు. ఇక టెక్నికల్ విషయాలకొస్తే.. డైరెక్టర్ డార్విన్ కురియాకోస్ ఫెర్ఫెక్ట్ థ్రిల్లర్ సినిమాని ప్రేక్షకులకు అందించాడు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్.. ఓ థ్రిల్లర్ మూవీకి కావాల్సిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. సినిమా చూస్తున్నంతసేపు మీకు కూడా ఓ టెన్షన్ క్రియేట్ అవుతుంది. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ కూడా బ్యూటీఫుల్. ఆర్ట్ డిపార్ట్మెంట్ 1980 వాతావరణాన్ని ఉన్నది ఉన్నట్లు చూపించింది. ఓవరాల్గా చెప్పుకుంటే ఓ మంచి థ్రిల్లర్ చూసి చాలారోజులైంది అనుకుంటే 'అన్వేషిప్పిన్ కండేతుమ్' ట్రై చేయండి. పక్కా నచ్చేస్తుంది. -చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
‘శపథం’ మూవీ రివ్యూ
టైటిల్: శపథం నటీనటులు: అజ్మల్ అమీర్,మానస రాధాకృష్ణన్,ధనంజయ్ ప్రభునే,సురభి ప్రభావతి తదితరులు నిర్మాణ సంస్థ: రామదూత క్రియేషన్స్ నిర్మాత: దాసరి కిరణ్ కుమార్ రచన-దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ సంగీతం: ఆనంద్ సినిమాటోగ్రఫీ: సాజీశ్ రాజేంద్రన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్వర్మ ‘వ్యూహం’, ‘శపథం’ అనే సినిమాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ‘వ్యూహం’ గతవారం(మార్చి 2) థియేటర్స్లో రిలీజై మంచి టాక్ని సంపాదించుకుంది. ఇక దానికి కొనసాగింపుగా ‘శపథం’అనే మూవీని తీసుకొచ్చారు. అయితే ఈ చిత్రాన్ని థియేటర్స్లో కాకుండా ఏపీ ఫైబర్ నెట్తో పాటు పలు ఓటీటీల్లో వెబ్ సిరీస్గా రిలీజ్ చేస్తున్నారు. అసలు శపథం కథ ఏంటి? ఈ చిత్రం ద్వారా ఆర్జీవి బయటపెట్టిన నిజాలు ఏంటి? సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. కథ ఏంటంటే..? ‘వ్యూహం’ ముగింపు నుంచి శపథం మూవీ ప్రారంభం అవుతుంది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి((అజ్మల్ అమీర్)) ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏపీలో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి? ఆయన చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ఆపడానికి చంద్రబాబు(ధనంజయ్ ప్రభునే) చేసిన కుట్రలు ఏంటి? ఓటమి తర్వాత పవన్ కల్యాణ్(చింటూ) పరిస్థితి ఎలా ఉంది? 2014 ఎన్నికల్లో చంద్రబాబును తిట్టిన పవన్.. 2024 ఎన్నికల్లో మళ్లీ టీడీపీతో ఎందుకు జత కట్టాడు? సొంత ప్రయోజనాల కోసం మీడియాని, వ్యవస్థలను చంద్రబాబు ఎలా వాడుకున్నాడు? ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా నిలిచిన వాలంటరీ వ్యవస్థను అభాసు పాలు చేసేందుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేసిన కుట్రలేంటి? విగ్రహాలు, దేవాలయాలపై దాడులు చేయిందెవరు? దాని వెనుక ఉన్న వారి వ్యూహం ఏంటి? స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? అనేది తెలియాలంటే శపథం చూడాల్సిందే. (చదవండి: 'వ్యూహం' సినిమా రివ్యూ) ఎలా ఉందంటే.. ‘వ్యూహం’, ‘శపథం’ సినిమాల ప్రారంభానికి ముందే.. ‘ఇది బయోపిక్ కాదు …బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ ,రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి’ అని ఆర్జీవీ చెప్పారు. చెప్పినట్లే పచ్చి నిజాలను తెరపై చూపించాడు వర్మ. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ల కుట్రలను తిప్పి కొడుతూ సీఎం జగన్ ఎలా ప్రజా పాలన కొనసాగిస్తున్నాడు అనేది ఇందులో చూపించాడు దర్శకుడు. 2019 నుంచి 2023 వరకు ఏపీలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను.. దాని వెనుక ఉన్న కారణాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు. ప్రజల మనసులో ఏముందో, వాళ్లు ఏం చర్చింకుంటున్నారో దాన్నే తెరపై చూపించే ప్రయత్నం చేశాడు. సీఎం జగన్ తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియం.. వాలంటరీ వ్యవస్థ కారణంగా పేద ప్రజలను జరుగుతున్న ప్రయోజనాలను.. వాటిని అడ్డుకునేందుకు చంద్రబాబు, పవన్ చేసిన కుట్రలను ధైర్యంగా తెరపై చూపిస్తూ వారితో ఓ ఆట ఆడుకున్నాడు. వర్మ మాత్రమే ఇలా తీయగలడు అనేంతలా చిత్రాన్ని తీర్చి దిద్డాడు. సినిమా చూస్తున్నంతసేపు నిజంగా అప్పుడు ఇలానే జరిగింది కదా? దాని వెనుక ఇంత పెద్ద ప్లాన్ ఉందా? అనే అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అలాగే అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు పన్నిన కుట్రని కూడా ఉన్నది ఉన్నట్లుగా, సామాన్యులకు సైతం అర్థమయ్యేలా చూపించాడు వర్మ. స్వప్రయోజనం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తాడనేది అందరు అనుకునే మాట. అదే విషయాన్ని వర్మ కూడా తన సినిమా ద్వారా చెప్పాడు. అవసరానికి పవన్ ఎలా వాడుకున్నాడు? ఇప్పుడు మళ్లీ జనసేనతో పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు? చంద్రబాబు చేతిలో పవన్ పావులా ఎలా మారాడు ? అనే నిజాన్ని కామెడీ వేలో చూపించి నవ్వించాడు. సినిమాల్లో పవన్ హీరో అయినా.. రాజకీయాల్లో మాత్రం పెద్ద జోకర్ అని తనదైన శైలీలో చూపించాడు వర్మ. పవన్కి సంబంధించిన సీన్లు వచ్చిన ప్రతిసారి పగలబడి నవ్వడం గ్యారెంటీ? ఆయన తెరపై కనిపించిన ప్రతిసారి పీకే..పీకే.. అంటూ వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరింత నవ్విస్తుంది. ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా కొన్ని సీరియస్ అంశాలను కూడా కామెడీగా చూపించాడు వర్మ. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడాన్ని వ్యతిరేకించినప్పుడు.. ‘మరి మీ పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకుంటున్నారు కదా?’ అని మీడియా పవన్ ప్రశ్నించడం..దానికి ఆయన ఇచ్చిన సమాధానం..తెరపై చూస్తే నవ్వొస్తుంది. బయటకు వచ్చి ఆలోచిస్తే.. నిజమే కదా? అనిపిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ వెనుక ఉన్న అసలు కారణాన్ని చూపిస్తూ.. సీఎం జగన్పై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ‘ఎవరు నమ్మినా నమ్మకపోయినా.. బాబుని అరెస్ట్ చేయించడం కక్ష సాధింపు కాదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనం నాకిచ్చిన స్థానానికి న్యాయం చేయడానికే. నేను అధికారం కోరుకున్నది ప్రజలకు మంచి చేయడానికే. అదే చేస్తున్నా. ఇది నాకు నేను చేసుకున్న శపథం’ అంటూ సీఎం జగన్ చెప్పే మాటలు ఆలోచింపజేస్తాయి. అలాగే చివరల్లో చంద్రబాబు గురించి ‘వెయ్యి తప్పులు చేశావ్..’అంటూ ఆర్జీవీ పాడిన పాట అయితే సినిమాకే హైలెట్. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమా మొత్తం వైఎస్ జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాత్రల చుట్టే తిరుగుతుంది. సీఎం వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ అమీర్ ఒదిగిపోయాడు. తన నటనతో తొలి షాట్ నుంచే తెర మీద వైఎస్ జగన్నే చూస్తున్నామన్నంతగా ప్రేక్షకుడిని కథలో లీనం చేశాడు.వైఎస్ భారతి గారి పాత్రలో మానస రాధాకృష్ణన్ ఒదిగిపోయారు. వ్యూహంతో పోలిస్తే ఇందులో ఆమెకు ఎక్కువ సన్నివేశాలు ఉన్నాయి. ఇక చంద్రబాబు పాత్రలో ధనంజయ్ ప్రభునే పరకాయ ప్రవేశం చేశాడు. చంద్రబాబు మ్యానరిజానికి ఏ మాత్రం తగ్గకుండా ప్రేక్షకులను ఆయన మెప్పించాడు. పవన్ కల్యాణ్ పాత్రకి చింటు న్యాయం చేశాడు. ఇక లోకేష్ పాత్రకి ఎక్కువగా డైలాగ్స్ లేకున్నా.. ఉన్న ఒకటి రెండు సీన్లు నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా లోకేష్ని ఉద్దేశిస్తూ ‘పులి కడుపున పులే పుడుతుంది’ అని చంద్రబాబు అనగానే బ్యాక్గ్రౌండ్ స్కోర్గా పిల్లి సౌండ్ రావడం.. డైట్ అంటూ చిప్స్..గ్లాసుల కొద్ది పాలు తాగడం.. ఇవన్నీ నవ్విస్తాయి. సాకేంతిక పరంగా సినిమా బాగుంది. ఆనంద్ నేపథ్య సంగీతం, పాటలు బాగున్నాయి. ఆర్జీవీ పాడిన ‘వెయ్యి తప్పులు చేశావ్’ పాట సినిమాకే హైలెట్. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. ఓవరాల్గా ‘శపథం’ సినిమా వైఎస్సార్సీపీ అభిమానులలో జోష్ని నింపుతూ.. సామాన్యులను ఆలోచింపజేస్తుంది. -
‘భీమా’ మూవీ రివ్యూ.. 'గోపీచంద్' హిట్ కొట్టాడా..?
టైటిల్: భీమా నటీనటులు: గోపీచంద్, ప్రియా భవానీ శంకర్,మాళవిక శర్మ,నాజర్,వెన్నెల కిషోర్,నరేష్ తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీ సత్య సాయి ఆర్ట్స్ నిర్మాత: కేకే రాధామోహన్ దర్శకత్వం: ఏ. హర్ష సినిమాటోగ్రఫీ: స్వామి జె గౌడ సంగీతం: రవి బస్రుర్ విడుదల తేది: మార్చి 8, 2024 భీమా కథేంటంటే సినిమా ప్రారంభంలోనే పరశురాముడి కథతో ప్రారంభం అవుతుంది. ఒకానొక సమయంలో పరశురాముడు కొత్త భూభాగం కావాలని వరుణుడిని కోరాడు. సముద్రంలో గొడ్డలిని విసిరితే విసిరినంత మేర భూభాగం లభిస్తుందని వరుణుడు చెప్పడంతో భార్గవరాముడు గొడ్డలి విసిరాడు. దీంతో సముద్రం వెనక్కు వెళ్లింది. ఇలా కొత్తగా ఏర్పడిన భూభాగమే కేరళ అని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే ఈ సినిమా కథ బాదామితో పాటు కేరళలోని పలు ప్రాంతాల్లో కథ జరుగుతుంది. కేరళలోని మహేంద్రగిరిలో సినిమా కథ మొదలౌతుంది. ఆ ప్రాంతంలో అరాచక శక్తులతో అల్లకల్లోలంగా ఉంటుంది. అక్కడి ప్రజలతో పాటుగా పోలీసు వ్యవస్థను శక్తి భవాని (ముఖేష్ తివారి) గడగడలాడించే స్థాయిలో ఉంటాడు. పెట్రోల్ ట్యాంకర్స్ మాటున అతను చేస్తున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించిన ఒక ఎస్సై (కమల్ కామరాజు)ను చంపేస్తాడు. మహేంద్రగిరిలో తనకు అడ్డు తగిలేవాడు ఎవడూ లేడని శక్తి భవాని తన అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. మరో వైపు భీమా కథలో పరశురామ క్షేత్రం అనే ఊరు తెరపైకి వస్తుంది. ఆ ఊరులో గత యాభైఏళ్లుగా మూత పడిన శివాలయాన్ని తన అక్రమాలకు అడ్డాగా మార్చుకుంటాడు భవాని. సరిగ్గా అలాంటి సమయంలో ఎస్సైగా మహేంద్రగిరిలోకి ఎంట్రీ ఇస్తాడు భీమా (గోపీచంద్)... ఈ క్రమంలోనే విద్య (మాళవికా శర్మ) ఎంట్రీ ఇస్తుంది. విద్య ఒక స్కూల్లో పనిచేస్తూనే మొక్కలపై పరిశోధనలు కూడా చేస్తూ ఉంటుంది. పరశురామ క్షేత్రంలో ఆయుర్వేద వైద్యుడిగా రవీంద్రవర్మ (నాజర్) ఉంటారు. ఆయన దగ్గర విద్య మొక్కలపై పలు పరిశోధనలు చేస్తూ ఉంటుంది. ఇక్కడ రవీంద్రవర్మ ప్రజలకు వైద్యం చేస్తూ దగ్గరగా ఉంటే.. శక్తి భవాని ప్రజలను భయపెడుతూ ఉంటాడు. ఈ క్రమంలో మరణించిన మనిషిని కూడా బతికించే మందును కనిపెట్టాలని ఆయుర్వేద వైద్యంలో పలు పరిశోధనలు చేస్తుంటాడు రవీంద్రవర్మ.. ఇలా ఆసక్తిగా నడుస్తున్న కథలో ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి. ఈ కథలో పెట్రోలు ట్యాంకర్స్ మాటున భవాని చేస్తున్న అక్రమ వ్యాపారం ఏంటి..? భీమాని అడ్డుకోవటం కోసం భవాని పన్నిన వ్యూహం ఏమిటి..? విలన్లను ఎదుర్కొనే క్రమంలో భీమా ఏం అయ్యాడు..? ఎప్పుడో చిన్నతనంలో విడిపోయిన తన తమ్ముడు రామా (గోపీచంద్) కథలోకి ఎలా వచ్చాడు..? పరశురామ క్షేత్రంలో ఉన్న శివాలయం 50 ఏళ్లుగా ఎందుకు మూత పడింది..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు సినిమా చూస్తున్నంత సేపు అందరిలో కలుగుతాయి. ప్రీ క్లైమాక్స్లో రివీల్ అయ్యే అసలు ట్విస్ట్ ఏమిటి..? ఇవన్నీ తెలియాలంటే 'భీమా' చూడాల్సిందే. ఎలా ఉందంటే.. సినిమా ప్రారంభంలోనే పరశురాముడి గురించి చెప్పడం.. ఆపై పరశురామ క్షేత్రంలోని శివాలయంలో జరిగే కొన్ని సంఘటనలు చూపించడంతో కథ అంతా మానవాతీత శక్తులతో నిండి ఉంటుందని అనుకుంటాం కానీ అదేమీ కాదని 15 నిమిషాల్లోనే తెలిపోతుంది. అక్కడ నుంచి రోటీన్ కమర్షియల్ స్టోరీతో సినిమా జరుగుతుంది. ఫస్టాఫ్లో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ కూడా చాలా సినిమాల్లో కనిపించిందే ఉంటుంది. కథ ప్రారంభంలో ఎంతో ఆసక్తిగా చెప్పిన కన్నడ డైరెక్టర్ ఏ. హర్ష కొంత సమయం తర్వాత మెల్లిమెల్లిగా స్టోరీపై పట్టు కోల్పోయాడు. సినిమా ప్రారంభంలో చెప్పిన శివాలయం పాయింట్ను చివరి వరకు ఎక్కడా ప్రస్థావన ఉండదు. ఇలాంటి కథలకు స్క్రీన్ ప్లే చాలా బలంగా ఉండాలి.. ఎందుకంటే గోపీచంద్ రెండు పాత్రలు చేశాడు.. ఆపై గుడి కాన్సెప్ట్ ఉంది. కథలో ప్రేక్షకుడు లీనం అయ్యేలా తెరకెక్కించాలి. కానీ భీమాలో అది కాస్తా మైనస్గా మారింది. కమర్షియల్ టచ్ ఉన్న స్టోరీకి ఫాంటసీ ఎలిమెంట్ను చేర్చి ప్రేక్షకులను మెప్పించడం అంత సులభమైన విషయం కాదు. ముఖ్యంగా గోపీచంద్, మాళవికా శర్మ మధ్య ఉండే లవ్ ట్రాక్ కాస్త తగ్గించి ఉంటే సినిమాకు బాగా ప్లస్ అయ్యేది. కన్నడ చిత్ర సీమలో కొరియోగ్రాఫర్గా కెరియర్ స్టార్ట్ చేసిన ఏ. హర్ష శివరాజ్కుమార్తో 'వేదా' చిత్రాన్ని తీసి తెలుగు వారికి దగ్గరయ్యాడు. దీంతో గోపీచంద్తో భీమా సినిమాను డైరెక్ట్ చేసే చాన్స్ ఆయనకు దక్కింది. సినిమాలో గోపీచంద్ నటనకు ఎలాంటి పేరు పెట్టాల్సిన పనిలేదు.. రెండు పాత్రలలో ఆయన ఇరగదీశాడు.. సినిమా మొత్తం సింగిల్ హ్యాండ్తో నడిపించాడు. సినిమా స్టోరీ అంతా కూడా ఫాంటసీ ఎలిమెంట్తో డైరెక్టర్ తెరకెక్కించి ఉండుంటే భారీ హిట్ కొట్టేది అని చెప్పవచ్చు. ఎవరెలా చేశారంటే.. భీమాగా పోలీసు గెటప్లో కనిపించిన గోపీచంద్.. రామాగా పురోహితుడి పాత్రలో కూడా కనిపిస్తాడు. రెండు క్యారెక్టర్లలో ఇరగదీశాడని చెప్పవచ్చు. యాక్షన్ సీన్స్తో పాటు ఎమోషనల్ సన్నివేశాలలోనూ ఆయన చక్కగా నటించాడు. ఇక సినిమాలో గోపీచంద్ తర్వాత నాజర్ పాత్ర అందరినీ మెప్పిస్తుంది. తెరపై గోపీచంద్ మాళవికా శర్మ,ప్రియా భవానీ శంకర్ల కెమిస్ట్రీ ఫర్వాలేదనిపిస్తుంది. పోలీసు పాత్రలో గోపీచంద్ ఉన్నంత సేపు ప్రేక్షకులో ఉత్సాహం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సమయంలో వచ్చే ఫైట్ అందరినీ కట్టిపడేస్తుంది. విలన్గా నటించిన శక్తి భవానీని డైరెక్టర్ అంతగా ఉపయోగించుకోలేదు అనిపిస్తుంది. వెన్నెల కిషోర్,నరేష్, పూర్ణ,నాజర్ వంటి స్టార్స్ వారి పరిధిమేరకు మెప్పించారు. సాంకేతిక విషయాలకొస్తే.. రవి బస్రూర్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. ఆయన అందించిన బీజీఎమ్ సినిమాపై పాజిటివ్ వైబ్ను క్రియేట్ చేస్తుంది. పాటలు అంతగా నోటెడ్ కాకపోయినప్పటికీ తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. స్క్రీన్ ప్లే మరికొంత బలంగా ఉండాల్సింది. నిర్మాణ విలువలు ఫర్వాలేదు అనిపిస్తాయి. సినిమా చివరిలో 30 నిమిషాల పాటు దర్శకుడి చూపిన పని తీరుకు ఎక్కువ మార్కులు పడుతాయి. -బ్రహ్మ కోడూరు, సాక్షి వెబ్ డెస్క్ -
'బాబు నెం.1 బుల్ షిట్ గయ్' సినిమా రివ్యూ
బిగ్బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్, బజ్జీల పాపగా ఫేమస్ అయిన కుషిత కల్లపు జంటగా నటించిన సినిమా 'బాబు నెం.1 బుల్ షిట్ గయ్'. లక్ష్మణ్ వర్మ దర్శకుడు. డీడీ క్రియేషన్స్ బ్యానర్పై దండు దిలీప్ కుమార్ రెడ్డి నిర్మించారు. శివరాత్రి కానుకగా ఈ చిత్రం థియేటర్లలో రిలీజైంది. మరి ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం. (ఇదీ చదవండి: 'ప్రేమలు' సినిమా రివ్యూ) కథేంటి? కార్తీక్ బాబు(అర్జున్ కల్యాణ్) అమెరికాలో చదువుకుని ఇండియాకు తిరిగొచ్చిన ఓ డబ్బున్న కుర్రాడు. కరోనా టైంలో స్వదేశానికి వస్తాడు. దీంతో హైదరాబాద్ శివారులో ఉన్న తమ విల్లాలో కొడుకుని ఉండమని తండ్రి (రవి వర్మ) చెబుతాడు. దీంతో కార్తీక్... తన ప్రేయసి కుషిత(కుషిత కల్లపు)తో కలిసి విల్లాలో ఉండాలని ఫిక్స్ అవుతారు. ఆర్నెళ్లకు సరిపడా వస్తువులన్నీ తెచ్చుకుంటారు. ఇంతలో ప్లంబర్ సోంబాబు(డైరెక్టర్ లక్ష్మణ్ వర్మ) వీరిద్దరిని కిడ్నాప్ చేసి, విల్లాలో బంధించి అక్కడే సెటిల్ అయిపోతారు. ఇంతకీ సోంబాబు ఎందుకలా చేశాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ. ఎలా ఉందంటే? 'బాబు నం.1 బుల్ షిట్ గాయ్' మూవీ యాక్షన్ కామెడీ డ్రామా స్టోరీతో తీశారు. ఓ అందమైన జంటను గదిలో బంధించి... అదే బంగ్లాలో తన కుటుంబంతో కలిసి దర్జాగా జీవించే ఓ తాపీ మేస్త్రీ సోంబాబు కథే ఈ సినిమా. కిడ్నాపర్కి కూడా నైతిక విలువలు వుంటాయని చివర్లో చూపించారు. (ఇదీ చదవండి: 'గామి' సినిమా రివ్యూ) కోట్ల విలువ చేసేవి ఎదురుగానే ఉన్నా తనకు వచ్చిన కష్టకాలంలో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికే ఆ బంగ్లాలో ఉండాల్సి వచ్చిందని సింపుల్గా వెళ్లిపోయే సోంబాబు జీవిత పాఠం బాగుంది. ఫస్టాప్లో కామెడీ ట్రాక్తో మొదలై, సోంబాబు లవ్, తన ప్రేయసి సోనాలి పాణిగ్రాహితో వివాహం తదితర అంశాలతో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేశారు. సెకెండాఫ్లో కొంత ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ సీన్స్ తదితర అంశాలతో ఆకట్టుకున్నారు. ఎవరెలా చేశారు? అర్జున్ కల్యాణ్, కుషిత జంట బాగుంది. అర్జున్ ఉన్నంతలో బాగానే చేశాడు. హీరోయిన్ కుషిత క్యూట్ ఫెర్ఫార్మెన్తో అలరించింది. డైరెక్టర్ లక్ష్మణ్ వర్మ కూడా హీరోకి సమంగా ఉండే పాత్రలో కనిపించారు. ఇతనికి జంటగా సోనాలి పాణిగ్రాహి చేసింది. కమెడియన్ భద్రం కాసేపు అక్కడక్కడ నవ్వించాడు. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. దర్శకుడు లక్ష్మణ్ వర్మ రాసుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే బాగున్నాయి. అన్నివర్గాల ప్రేక్షకులు చూసేయొచ్చు. మణికర్ణన్ సినిమాటోగ్రఫీ బాగుంది. పవన్ సంగీతం ఓకే. నిర్మాణ విలువులు స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
'గామి' సినిమా రివ్యూ
టైటిల్: గామి నటీనటులు: విశ్వక్ సేన్, చాందిని చౌదరి, అభినయ, హారిక పెద్ద తదితరులు నిర్మాతలు: కార్తిక్ శబరీష్, శ్వేత మొరవనేని రచన-దర్శకత్వం: విద్యాధర్ కాగితాల సంగీతం: నరేశ్ కుమారన్, స్వీకర్ అగస్తీ సినిమాటోగ్రఫీ: విశ్వనాథ్ రెడ్డి, ర్యాంపీ నందిగాం విడుదల తేదీ: 2024 మార్చి 8 నిడివి: 2h 26m ఐదేళ్ల పాటు షూటింగ్ జరుపుకొన్న తెలుగు సినిమాగా 'గామి' వార్తల్లో నిలిచింది. ట్రైలర్ రిలీజ్ కాగానే విజువల్స్ చూసి అందరూ షాకయ్యారు. అంచనాలు పెరిగపోయాయి. ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఎదురుచూశారు. ఇప్పుడు శివరాత్రి కానుకగా 'గామి' థియేటర్లలో విడుదలైంది. విశ్వక్ సేన్ అఘోరాగా నటించిన ఈ మూవీ ఎలా ఉంది? అంచనాలకు మించి హిట్ కొట్టిందా? లేదా అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. 'గామి' కథేంటి? శంకర్ (విశ్వక్ సేన్) హరిద్వార్లో ఉండే ఓ అఘోరా. ఇతడికి ఓ విచిత్రమైన సమస్య. ఎవరైనా పొరపాటున తాకితే శంకర్ ఒళ్లంతా నీలం రంగులోకి మారిపోతుంది. సృహ తప్పి పడిపోతాడు. ఇతడి వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని మిగతా అఘోరాలు అందరూ ఇతడిని ఆశ్రమం నుంచి వెళ్లగొడతారు. దీంతో తన సమస్యకు పరిష్కారం తెలుసుకునేందుకు కాశీకి వెళ్తాడు. అక్కడ ఓ సాధువు వల్ల శంకర్ సమస్యకు పరిష్కారం తెలుస్తుంది. హిమాలయాల్లో 36 ఏళ్లకు ఓసారి లభించే మాలిపత్రాలే తీసుకుంటే ఇది నయమవుతుంది. దీంతో శంకర్ హిమాలయాలకు ప్రయాణం మొదలుపెడతాడు. ఇతడికి జాహ్నవి (చౌందిని చౌదరి) కూడా తోడు వెళ్తుంది. మరి శంకర్ చివరకు మాలి పత్రాల్ని సాధించాడా? అలానే శంకర్ ఆలోచనల్లో వచ్చే ఉమ (హారిక పెద్ద), సీటీ-333(మహమ్మద్ సమాద్) ఎవరు? తెలియాలంటే 'గామి' చూడాల్సిందే. ఎలా ఉందంటే? 'గామి' గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బొమ్మ బ్లాక్ బస్టర్. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూసేవాళ్లకు ఈ సినిమా నచ్చదు. కానీ డిఫరెంట్ మూవీస్, అందులోనూ హాలీవుడ్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉండే చిత్రాలు చూసే వాళ్లకు 'గామి'.. మెమొరబుల్ ఎక్స్పీరియెన్స్ని ఇస్తుంది. అలా అని ఈ సినిమాలో లోటుపాట్లు లేవా అంటే ఉన్నాయి. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం టాలీవుడ్లోనే గుర్తుండిపోయే చిత్రాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందన చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హరిద్వార్లో అఘోరాల ఆశ్రమంలో ఉండే ఒకడిగా శంకర్ని చూపించి నేరుగా కథ మొదలుపెట్టేశారు. హీరోకి ఉన్న సమస్య గురించి వివరించడం, దీనికి సొల్యూషన్ ఏంటో కూడా ఓ సాధువు.. శంకర్కి చెప్పడం, దీంతో హీరో పరిష్కారం కోసం హిమాలయాలకు వెళ్లేందుకు సిద్ధం కావడం.. ఇలా సీన్లన్నీ చకాచకా సాగిపోతుంటాయి. ఈ ట్రాక్కి సమాంతరంగా ఇండో-చైనీస్ బోర్డర్లో ఓ రీసెర్చ్ ల్యాబ్లో ఉండే అబ్బాయి, దక్షిణ భారతదేశంలో దేవదాసి అనే ఊరిలో ఉమ అనే అమ్మాయి కథ సమాంతరంగా చూపిస్తుంటారు. దీంతో అసలు ఈ ముగ్గురికి కనెక్షన్ ఏంటా అని ఓ వైపు క్యూరియాసిటీ.. శంకర్ అసలు మాలిపత్రాల్ని ఎలా సాధిస్తాడనే టెన్షన్ ఓవైపు నుంచి ఉంటుంది. అయితే ఏదో కావాలని పెట్టినట్లు ఇంటర్వెల్ పడుతుంది. ఆ తర్వాత శంకర్తో తాను కూడా హిమాలయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చిందో జాహ్నవి చెబుతుంది. అయితే ఫస్టాప్లో సినిమా వేగంగా నడుస్తుంది. సెకండాఫ్కి వచ్చేసరికి నెమ్మదిస్తుంది. కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. ఇక సెకండాఫ్లో రోప్ సాయంతో శంకర్-జాహ్నవి చేసే అడ్వెంచర్ సీక్వెల్ ఒకటు ఉంటుంది. చూస్తుంటే టెన్షన్తో సచ్చిపోతాం. చివర్లో సింహాం ఓ రెండు మూడు సీన్లలో కనిపిస్తుంది. ఆ సీన్స్ని ఇంకాస్త ఎఫెక్టివ్గా తీసుండాల్సింది. ఇకపోతే శంకర్కి అతడి ఆలోచనల్లో వచ్చే ఇద్దరు వ్యక్తులకు మధ్య రిలేషన్ ఏంటనేది క్లైమాక్స్లో రివీల్ అవుతుంది. అయితే దీన్ని సినిమా ప్రారంభంలోనే చాలామంది ఊహించేస్తారు. చివర్లో చూసినప్పుడు ఇది ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. ఇందులో శివుడి రిఫరెన్సులు కొన్ని ఉన్నాయి. అవి శివభక్తులని ఆకట్టుకుంటాయి. అయితే శంకర్ ఫ్లాట్ రాసుకున్నంత శ్రద్ధగా.. దేవదాసి ట్రాక్, రీసెర్చ్ ట్రాక్ రాసుకోలేదు. సినిమాలో ఇది కాస్త వెలితిగా అనిపిస్తుంది. ఎవరెలా చేశారు? మాస్, కమర్షియల్ పాత్రలతో మనకు తెలిసిన విశ్వక్ సేన్.. ఇందులో అఘోరా శంకర్గా కొత్తగా కనిపిస్తాడు. సినిమా అంతా కూడా ఒకే కాస్ట్యూమ్లో ఉంటాడు. చెప్పాలంటే ఇందులో అతడి హీరో కాదు కథలో ప్రధాన పాత్రధారి అంతే. ఆ క్యారెక్టర్కి ఫెర్ఫెక్ట్గా సెట్ అయిపోయాడు. ఇక సీటీ-333 పాత్ర చేసి మహమ్మద్ సమాద్, దుర్గ పాత్ర చేసిన హారిక అనే చైల్డ్ ఆర్టిస్టు వాళ్లకిచ్చిన పాత్రల్లో ఆకట్టుకున్నారు. చాందిని చౌదరి రోల్ ఉన్నంతలో బాగా చేసింది. మిగిలిన వాళ్లంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమా కోసం ఏళ్లకు ఏళ్లు కష్టపడిన దర్శకుడు విద్యాధర్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. సినిమా మొదలైన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు చాలా అంటే చాలా ఇంప్రెస్ చేస్తాడు. ఓ కొత్త దర్శకుడు ఈ రేంజులో సినిమా తీశాడా అంటే నమ్మలేం. ఇతడి తర్వాత సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్, ర్యాంపీ.. హిమాలయాల్ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. గ్రాఫిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాకు కథ ఎంత ప్లస్ అయిందో.. సంగీతం అంతకు మించి ప్లస్ అయింది. స్వీకర్ అగస్తీ పాటలు.. నరేశ్ కుమారన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని మరోస్థాయిలో నిలబెట్టాయి. ఓవరాల్గా చెప్పుకొంటే 'గామి' ఓ డిఫరెంట్ అటెంప్ట్. ఎలాంటి అంచనాల్లేకుండా వెళ్లండి. మిమ్మల్ని అంతకు మించి ఆశ్చర్యపరుస్తుంది. -చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
'ప్రేమలు' సినిమా రివ్యూ
సంక్రాంతి తర్వాత తెలుగులో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏం రాలేదు. వచ్చిన వాటిలో ఒకటి రెండు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి గానీ మరీ అంత హిట్ కాలేదు. మరోవైపు మలయాళంలో రీసెంట్గా వరసపెట్టి మూవీస్ ఒకదానిని మించి మరొకటి హిట్ అయ్యాయి. అందులో ఒకటే 'ప్రేమలు'. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్తో తీసిన ఈ మలయాళ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ వెర్షన్ థియేటర్స్లోకి వచ్చేసింది. ఇది ఎలా ఉందో ఈ రివ్యూలో చూసేద్దాం. కథేంటి? సచిన్(నస్లేన్) ఇంజనీరింగ్ పూర్తిచేసిన కుర్రాడు. యూకే వెళ్ళాలనేది ప్లాన్. వీసా రిజెక్ట్ అవ్వడంతో, ఇంట్లో ఉండటానికి ఇబ్బంది పడుతుంటాడు. అదే టైంలో ఫ్రెండ్ అమూల్ (సంగీత్ ప్రతాప్) చెప్పడంతో ఇద్దరు కలిసి గేట్(GATE) కోచింగ్ కోసం హైదరాబాద్కి వస్తారు. ఓ పెళ్ళిలో రీను(మమిత బైజు)ని చూసి సచిన్ ఇష్టపడతాడు. అనుకోకుండా వీళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. ఆ తర్వాత ప్రేమ విషయాన్ని రీనుకి సచిన్ చెప్పేస్తాడు. కానీ ఆమె రిజెక్ట్ చేస్తుంది. మరి ఈ ప్రేమకథ కంచికి చేరిందా? చివరకు ఏమైందనేదే 'ప్రేమలు' స్టోరీ. ఎలా ఉంది? ప్రేక్షకులకు సినిమా నచ్చాలంటే కథే ఉండాలా ఏంటి? అవును ఈ మూవీలో కథ గిదా ఏం ఉండదు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన అబ్బాయి, సాప్ట్వేర్ జాబ్ చేస్తున్న అమ్మాయి.. అస్సలు పరిచయం లేని ఈ ఇద్దరూ లవ్లో పడితే ఏమైందనేదే 'ప్రేమలు'. చెప్పుకుంటే ఓస్ ఇంతేనా అన్నట్టు వుంటది గానీ సినిమా చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంటారు. ఇది మాత్రం గ్యారంటీ. తెలిసిన కథల్ని, అదీ ప్రేమ కథల్ని చెప్పడం కత్తి మీద సాము. కానీ 'ప్రేమలు' డైరెక్టర్ చాలా తెలివిగా స్టోరీ కంటే ఫన్నీ సీన్స్తో ఆడియెన్స్ని నవ్వించాలనే టార్గెట్ పెట్టుకున్నాడు. ఈ విషయంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. సచిన్, రీనూ పాత్రలకు యూత్ ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఆయా పాత్రల్లో తమని తాము చూసుకుంటారు. అమాయకత్వం, లేత లేత ప్రేమ.. వీటితో పాటు ఈ సినిమాలో చూపించిన హైదరాబాద్ అందాలకు ఇంకా ఫిదా అయిపోతారు. ట్యాంక్ బండ్, హైటెక్ సిటీ, ఓల్డ్ సిటీ, మైండ్ స్పేస్, చార్మినార్, ఖజాగుడా లేక్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్.. ఇలా హైదరాబాద్లో ఉన్న చాలా ప్రదేశాల్ని అంతే అందంగా చూపించారు. తెలుగు డబ్బింగ్కి వచ్చేసరికి.. ఫేమస్ కుమారి ఆంటీ దగ్గర నుంచి బిగ్బాస్ ఫేమ్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ వరకు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ప్రతీ డైలాగ్ని వాడేశారు. వన్ లైనర్స్, పంచ్లు భలే పేలాయి. సందర్భానికి తగ్గట్టు వచ్చే కామెడీ అయితే వేరే లెవెల్. కథ కావాలి అని వెళ్తే ఈ మూవీ నచ్చదు. అలానే రెగ్యులర్గా సోషల్ మీడియాలో వచ్చే చూడకపోయినా సరే ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ అర్థం కావు. 'ప్రేమలు' మైనస్సుల విషయానికొస్తే.. ఇది యూత్కి మాత్రమే కనెక్ట్ అయ్యే సినిమా. ఎందుకంటే ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్కి స్పేస్ లేదు. తెలుగు వెర్షన్ వచ్చేసరికి ఊరి పేర్ల విషయంలో ఒకటి రెండు సీన్లలో కన్ఫ్యూజ్ చేశారు. సో మీ గ్యాంగ్తో అయినా సింగిల్గా అయినా రెండున్నర గంటలు నవ్వుతూ ఎంజాయ్ చేయాలి అనుకుంటే గో అండ్ వాచ్ 'ప్రేమలు'. ఎవరెలా చేశారు? సచిన్ పాత్రలో నస్లేన్.. చాలా బాగా చేశాడు. అమాయకత్వం, ప్రేమ, బిడియం, బాధ.. ఇలా అన్ని ఎమోషన్స్ని పండించాడు. రీనుగా చేసిన మమిత అయితే చాలా క్యూట్నెస్తో తనతో ప్రేమలో పడిపోయేలా చేసింది. ఈమె స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారీ ఈమెని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఈమె హెయిర్ స్టైల్, డ్రెస్సెస్ కూడా భలే ఉన్నాయి. హీరో ఫ్రెండ్ అమూల్గా చేసిన సంగీత్ ప్రతాప్ని చూస్తే మనకు ఇలాంటి ఓ ఫ్రెండ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. హీరోయిన్ ని ప్రేమిస్తూ, ఆమెతో పాటు కలిసి పనిచేసే ఆది పాత్రలో చేసిన శ్యామ్ మోహన్.. డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ కామెడీతో కేక పుట్టించాడు. మిగతా వాళ్ళు ఉన్నంతలో బాగా చేశారు. టెక్నికల్ విషయాలకు వస్తే ఫస్ట్ డైరెక్టర్ గిరీష్ని మెచ్చుకోవాలి. క్యూట్ క్యూట్ ప్రేమకథను అంతే క్యూట్గా తీశారు. సాధారణంగా మలయాళ సినిమాలంటే అక్కడే ఉంటాయి. కానీ హైదరాబాద్ బ్యాక్డ్రాప్ని ఎంచుకుని ఫ్రెష్నెస్ తీసుకొచ్చాడు. సినిమాటోగ్రాఫర్ అజ్మల్ సభు.. హైదరాబాద్ని రోజూ చూసే వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చూడాలి అనేంత అందంగా చూపించాడు. విష్ణు విజయ్ పాటలు కథలో కలిసిపోయాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా స్టోరీకి తగ్గట్లే ఉంది. ఓవరాల్గా చెప్పుకుంటే 'ప్రేమలు'.. మీ మనసు దోచే పెర్ఫెక్ట్ సినిమా. - చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
'వ్యూహం' సినిమా రివ్యూ
టైటిల్: వ్యూహం నటీనటులు: అజ్మల్ అమీర్,మానస రాధాకృష్ణన్,ధనంజయ్ ప్రభునే,సురభి ప్రభావతి తదితరులు నిర్మాణ సంస్థ: రామదూత క్రియేషన్స్ నిర్మాత: దాసరి కిరణ్ కుమార్ రచన-దర్శకత్వం: రామ్ గోపాల్ వర్మ సంగీతం: ఆనంద్ సినిమాటోగ్రఫీ: సాజీశ్ రాజేంద్రన్ విడుదల తేది: మార్చి 2, 2024 రాజకీయాలు, సినిమాలు తెలుగువారి జీవితంలో భాగం. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఉన్నన్నీ రోజులు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గార్ల పేర్లు చిరస్థాయిలో ఉంటాయనేది జగమెరిగన సత్యం. అందుకే వారి రాజకీయ ప్రయాణంపై వచ్చిన యాత్ర, యాత్ర-2 చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు 'వ్యూహం' చిత్రాన్ని తెరకెక్కించారు వర్మ. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వాస్తవంగా ఈ రెండు నెలల క్రితం రావాల్సిన ఈ చిత్రాన్ని నారా లోకేష్ అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆ చిక్కులన్ని దాటుకోని నేడు(మార్చి 2) విడుదలైన వర్మ వ్యూహం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు మరణించిన సీన్తో వ్యూహం సినిమా ప్రారంభం అవుతుంది. ఇందులోని పాత్రలకు వర్మ తనదైన స్టైల్లో పేర్లు పెట్టుకుని తెరకెక్కించాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని వీర శేఖర్ రెడ్డి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మదన్ రెడ్డి అని ప్రేక్షకులకు వర్మ పరిచయం చేశారు. వీఎస్సార్ మరణానికి ముందు జగన్ అంటే ప్రజలకు పెద్దగా తెలియదు.. తండ్రి అడుగుజాడల్లో నడవాలని రాజకీయాల్లో ఆయన తొలి అడుగు పడి కడప ఎంపీగా గెలుస్తారు. 2009లో హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్సార్ మరణించడంతో ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు రావడం జరుగుతుంది. ఆ సమయంలో ఏపీ సీఎం ఎవరంటూ ప్రశ్నలు రావడం జరుగుతుండగా.. మదన్(అజ్మల్ అమీర్) ముఖ్యమంత్రిగా కావాలని 150కి పైగా ఎమ్మెల్యేల మద్ధతుతో ఒక లేఖ భారత్ పార్టీ (కాంగ్రెస్) అధినేత్రి అయిన మేడం (సోనియా) వద్దకు చేరుతుంది. అదే సమయంలో మదన్ ముఖ్యమంత్రి ఎట్టిపరిస్థితిల్లో కాకూడదని ఇంద్రబాబు (ధనుంజయ్ ప్రభునే) పన్నిన వ్యూహం ఏంటి..? మేడంను దిక్కరించిన జగన్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు..? 2009లో జగన్ సీఎం కాకుండా చంద్రబాబు అండ్ కో చేసింది ఏమిటి..? 2014లో ఇంద్రబాబుకు మద్దతు ఇచ్చిన శ్రవణ్ కళ్యాణ్..2019 ఎన్నికల్లో ఆ పార్టీతో ఎందుకు పోటీ పెట్టుకోలేదు? శ్రవణ్ కల్యాణ్ పన్నిన వ్యూహం ఏంటి? అతన్ని ఇంద్రబాబు ఎలా వాడుకున్నాడు? ప్రతి పక్షాల కుట్రలన్నింటిని మదన్ ఎలా ప్రజా నాయకుడిగా ఎదిగారనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. వైఎస్సార్ మరణం తర్వాత ఎపీ రాజకీయాల్లో చోటుచేసుకున్న పెనుమార్పులను ఎదర్కొని జగన్ ఎలా నిలబడ్డారు..? అనేది వ్యూహంలో వర్మ చూపించారు. తండ్రి ఆశయాలకు గండిపడుతున్న సమయంలో నేనున్నానంటూ ప్రజల కోసం జగన్ పోరాటం.. కేంద్రాన్ని ఎదురించి తనను నమ్ముకున్న ప్రజల కోసం జగన్ ప్రారంభించిన ఓదార్పు యాత్ర.. దాంతో కేంద్రం నుంచి జగన్ ఎలాంటి చిక్కులు ఎదుర్కొన్నారు..? అప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్ను ప్రత్యర్థులంతా ఏకమై ఎదురుదాడి చేస్తున్నప్పటికి ఎలాంటి బెరుకు లేకుండా ప్రజలను మాత్రమే నమ్ముకుని అసలు సిసలైన ప్రజా నాయకుడిగా ఎలా ఎదగగలిగాడు అనే విషయాన్ని వ్యూహంలో వర్మ చక్కగా చూపించాడు. ప్రజల్లో తిరుగుతున్న నాయకులు అందరూ కూడా తమ వ్యక్తిగత జీవితంలో ఎలా ఉంటారో తను అనుకున్న రీతిలో చూపించారు వర్మ.. అందుకే వైఎస్ఆర్ మరణం తర్వాత చంద్రబాబు ఆలోచనలు ఎలా ఉన్నాయి.. అప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయి ఉంటాడు అనేది చూపించారు. కుటుంబ పెద్దను కోల్పోతే ఒక ఫ్యామిలీ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంది.. ఆ సమయంలో వారి బాధ ఎలా ఉంటుంది అనేది వర్మ బయటకు తీశాడు.. కష్ట సమయంలో వైఎస్ జగన్ గారికి ఆయన తల్లి, సతీమణి అండగా ఎలా నిలడ్డారనే పాయింట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. కేంద్రాన్ని దిక్కారించడం వల్ల జగన్ జైలుకు వెళ్లిన సమయంలో తన అనుకున్న వారందరూ దూరం అయినా కూడా ఆయన సతీమణి వైఎస్ భారతి(సినిమాలో మాలతి) గారు ఎలా ధైర్యంగా ముందు అడుగు వెశారో వర్మ తనదైన స్టైల్లో చూపించారు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా పోటీకి సింగిల్గానే జగన్ బరిలోకి దిగితే... ఓటమి భయంతో చంద్రబాబు కూటమిని ఏర్పాటు చేసుకుని పోటీకి సిద్ధమౌతాడు.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మనసేన (జనసేన) అధినేత అయిన శ్రవణ్ కల్యాణ్ను తప్పించేందుకు బాబు ఎలాంటి ఎత్తుగడలు వెశాడో చూస్తే అందరినీ నవ్వు తెప్పిస్తాయి. మళ్లీ 2019 నాటికి పవన్తో మళ్లీ బాబు టచ్లోకి వెళ్లడం వంటి సీన్స్ వస్తున్న సమయంలో ఏం వ్యూహం బాబుగారు అంటూ పొగడ్తలతో ప్రేక్షకులు కూడా ముంచెత్తుతారు. సినిమా జరుగుతున్న సమయంలో అప్పుడప్పుడు ముకేష్ (లోకేష్) పాత్ర కనిపించి కనిపించక ఉంటుంది. వర్మకు ఆ పాత్ర అంటే బాగా ఇష్టం ఉన్నట్లు ఉంది అందుకే చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దాడు. ముకేష్ నుంచి వచ్చే డైలాగ్స్ తక్కువే అయినా ఫన్నీగా అందరినీ ఆకట్టుకుంటాయి. ఆయన పాత్ర గురించి చెప్పడం కంటే సినిమాకు వెళ్లి చూస్తేనే బాగుంటుందని అభిప్రాయం. ఎవరెలా చేశారంటే.. వ్యూహం సినిమాలో కథ మొత్తం వైఎస్ జగన్, చంద్రబాబు పాత్రల చూట్టే ఎక్కువగా జరుగుతుంది. తర్వాత పవన్ కల్యాణ్ పాత్రకు కాస్త ఎక్కువగానే ప్రయారిటీ ఉంటుంది. వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ అమీర్ సరిగ్గా సరిపోయారు అని చెప్పవచ్చు.. జగన్ గారిలో ఉన్న మ్యానరిజాన్ని పర్ఫెక్ట్గా అజ్మల్ చూపించాడు.. తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ముఖ్యంగా ఓదార్పు యాత్ర సమయంలో ఆయన కనిపించిన తీరుతో పాటు ప్రత్యేక హోదా కోసం ఆయన చేపట్టిన దీక్షకు సంబంధించిన సీన్స్లలో జగన్ గారికి దగ్గరగా కనిపిస్తాడు. ముఖ్యంగా వ్యూహం సినిమాలో వైఎస్ భారతి గారి పాత్రలో మానస రాధాకృష్ణన్ సరిగ్గా సెట్ అయ్యారు. సినిమాలో ఆమె కనిపించిన ప్రతిసారి అచ్చం భారతిలాగే ఉన్నారు. చంద్రబాబు పాత్రలో కనిపించిన ధనంజయ్ ప్రభునే అందరికీ సుపరిచయమే.. ఆయన నటనతో దుమ్మురేపాడు అని చెప్పవచ్చు.. చంద్రబాబు మ్యానరిజానికి ఏ మాత్రం తగ్గకుండా ప్రేక్షకులను ఆయన మెప్పించాడు. సోనియా గాంధీ పాత్రలో ఎలీనా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. వ్యూహం సినిమాలో నటించిన అందరిలో దాగి ఉన్న టాలెంట్ను వర్మ సరిగ్గా ఉపయోగించుకున్నాడు. సాంకేతిక పరంగా సినిమా బాగుంది. వైఎస్ జగన్ పార్టీ పెట్టిన సమయంలో వచ్చిన పాట అందరినీ మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగున్నప్పటికీ సంగీత నేపథ్యం ఇంకాస్త మెరుగ్గా ఉండుంటే బాగుండేది. వైఎస్ జగన్ గారి జీవితంలోని కీలకమైన సంఘటనలను మాత్రమే తీసుకుని ఎడిటింగ్ చేసిన తీరు పర్వాలేదు.. ఏదైమనా వ్యూహం సినిమాను ఎవరైనా చూడొచ్చు.. వైఎస్ జగన్ గారి అభిమానుల్లో మాత్రం ఫుల్ జోష్ను నింపడం ఖాయం.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హీరోయిన్తో బ్రేకప్! మరో బ్యూటీతో హీరో పార్టీ!
చంద్రబాబుకు ఊడిగం చేయడానికే పవన్ రాజకీయాల్లోకి వచ్చారు
ముస్లిం రిజర్వేషన్లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..
సీఎం జగన్ రాకతో దద్దరిల్లిన కర్నూలు
ఐపీఎల్లో నేటి (మే 9) మ్యాచ్.. ఆర్సీబీతో పంజాబ్ 'ఢీ'
చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం..బాబు బాగా ముదిరిపోయిన తొండ
కూటమిపై గర్జించిన సీఎం జగన్.. దద్దరిల్లిన రాయలసీమ గడ్డ..
నామినేషన్కు ‘మృతుడు’.. కలెక్టరేట్లో కలకలం!
మీ బిడ్డ పాలనలోనే ఈ గొప్ప మార్పులు: సీఎం జగన్
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- బాబు, పవన్, బాలయ్య, కిరణ్.. కూటమి ప్రముఖుల ఎదురీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement