రోజంతా ఒడిదుడుకులమయంగా సాగిన శుక్రవారం నాటి ట్రేడింగ్లో స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో గట్టెక్కింది. దీంతో రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. మరోవైపు డాలర్తో రూపాయి మారకం ఇంట్రాడేలో 20 పైసలు నష్టపోవడం, ముడి చమురు ధరలు పెరగడం, అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటం ఒకింత ప్రతికూల ప్రభావం చూపించాయి. ఇంట్రాడేలో 423 పాయింట్ల మేర కదలాడిన సెన్సెక్స్ చివరకు 86 పాయింట్ల లాభంతో 39,616 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 11,871 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, ఐటీ, ఆర్థిక రంగ షేర్లు లాభపడగా, ఫార్మా, లోహ షేర్లు నష్టపోయాయి. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 98 పాయింట్లు నిఫ్టీ 52 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.
రోలర్ కోస్టర్ రైడ్లా ట్రేడింగ్: సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. కానీ వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. మళ్లీ పుంజుకొని లాభాల్లోకి వచ్చింది. ఇలా లాభ, నష్టాల మధ్య దోబూచులాడింది. సెన్సెక్స్ ఏడు సార్లు నష్టాల్లోంచి లాభాల్లోకి వచ్చిందంటే, మార్కెట్లో ఏ రేంజ్లో ఒడిదుడుకులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒక దశలో 251 పాయింట్ల వరకూ నష్టపోయిన సెన్సెక్స్ మరో దశలో 173 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 424 పాయింట్ల రేంజ్లో కదలాడింది.
బడ్జెట్పైనే దృష్టి....
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) నిధుల సమస్య ఇప్పట్లో పరిష్కారమయ్యేలా లేకపోవడంతో ఎంపిక చేసిన బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు జరిగాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. రూపాయి పతనం కారణంగా ఐటీ షేర్లు లాభపడ్డాయని వివరించారు. అమెరికా ఉద్యోగ గణాంకాలు, రానున్న కేంద్ర బడ్జెడ్ మార్కెట్కు దిశా నిర్దేశం చేయనున్నాయని పేర్కొన్నారు.
స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో గట్టెక్కినా, వందకు పైగా షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. డీహెచ్ఎఫ్ఎల్, లుపిన్, బేయర్ క్రాప్ సైన్స్, క్యాడిలా హెల్త్కేర్, మన్పసంద్ బేవరేజేస్, రాడికో ఖైతాన్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ఇన్ఫ్రా, ఫోర్టిస్ హెల్త్కేర్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు హావెల్స్ ఇండియా, అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్, చంబల్ ఫెర్టిలైజర్స్, తదితర 30కు పైగా షేర్లు తాజా ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి.
► ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా షేర్లు శుక్రవారం కూడా 20 శాతం లోయర్ సర్క్యూట్ను తాకాయి. 14% నష్టంతో రూ.45 వద్ద ముగిసింది.
► ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో రిలయన్స్ ఇన్ఫ్రా షేర్ 13 శాతం నష్టపోయి 15 ఏళ్ల కనిష్ట స్థాయి, రూ.74కు పతనమైంది. గత రెండు రోజుల్లో ఈ షేర్ 25 శాతం క్షీణించింది.
స్వల్ప లాభాలతో సరి
Published Sat, Jun 8 2019 5:47 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
2024 ఎన్నికల్లో ఇది బెస్ట్ ఫోటో: ఆనంద్ మహీంద్రా ట్వీట్
రేవ్ పార్టీ పై హీరో శ్రీకాంత్ రియాక్షన్
‘బిగ్ బ్రదర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
సర్జరీలపై ట్రోలింగ్.. అర్థం చేసుకోకుండా తిడతారేంటి? మీ వల్ల..
ఏపీలో అల్లర్లపై.. డీజీపీకి సిట్ నివేదిక
ఫస్ట్టైమ్.. ఐటీని వెనక్కినెట్టిన బ్యాంకింగ్
భారత్లో ఐఫోన్ తయారీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ
నాట్స్ ఆధ్వర్యంలో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ వెబినార్
నాట్స్ సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం!
హార్దిక్ అద్భుతమైన ప్లేయర్.. పాక్పై కచ్చితంగా చెలరేగతాడు: రైనా
తప్పక చదవండి
- అప్పటికి భారతీయులు ధనవంతులవుతారా.. అసలు సమస్య ఏంటంటే?
- ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
- కేజ్రీవాల్కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
- రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
- AP: పలువురు డీఎస్పీలు, సీఐలను నియమించిన ఈసీ
- యాక్షన్ ఎంటర్టైనర్గా బిగ్బ్రదర్.. రిలీజ్ ఎప్పుడంటే?
- హైదరాబాద్లో మళ్లీ దంచికొడుతున్న వాన
- ‘28 శాతం జీఎస్టీ’, సుప్రీం వైపు.. గేమింగ్ కంపెనీల చూపు
- నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
- ‘AI’తో ప్రమాదమే.. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ వార్నింగ్
Advertisement