-
ఇక ఉచితంగా మాట్లాడను!
కొందరు వ్యక్తులు తన సమయాన్ని అనవసరంగా వృథా చేస్తున్నారని, అలాంటి వ్యక్తులతో ఇక ఉచితంగా మాట్లాడననీ అంటున్నారు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్. అందుకే ఇకనుంచి ఎవరికైనా సమయం కేటాయించాలనుకుంటే అందుకు తగ్గట్టుగా ‘చార్జ్’ చేస్తానని అంటున్నారాయన. ఈ విషయంపై అనురాగ్ ఓ నోట్ను సోషల్ మీడియాలో షేర్ చేయగా, బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ‘‘కొంతమంది కొత్త వ్యక్తులకు సహాయం చేయాలనుకుని వారితో సమావేశమై నేను నా సమయాన్ని చాలా కోల్పోయాను. ఆ సమావేశాలు నాకు ఏ మాత్రం వర్కౌట్ కాలేదు కూడా. చెప్పాలంటే ఇలా చాలామందితో మాట్లాడి నేను అలసిపోయాను. ఈ విధంగా జీవితంలో చాలా సమయాన్ని కోల్పోయాను. సక్సెస్కు షార్ట్ కట్స్ వెతికేవారితో, తాము క్రియేటివ్ జీనియస్లా ఫీలయ్యే కొందరు వ్యక్తులతో ఇకపై నేను ఉచితంగా మాట్లాలనుకోవడం లేదు. నేను ఓ స్వచ్ఛంద సేవా సంస్థను కాదలచుకోలేదు. ఇకపై ఎవరైనా నన్ను కలవాలనుకుంటే పది నుంచి పదిహేను నిమిషాలు అయితే లక్ష రూపాయలు, 30 నిమిషాలకు రెండు లక్షలు, గంట అయితే ఐదు లక్షలు చెల్లించాలి. ఒకవేళ ఎవరైనా ఇలా డబ్బులు చెల్లించలేని పక్షంలో వారు నన్ను కలవడానికి ప్రయత్నించవద్దు’’ అని ఆ నోట్లో పేర్కొన్నారు అనురాగ్ కశ్యప్. ఇక బాలీవుడ్లో వచ్చిన ‘బ్లాక్ ఫ్రైడే’, ‘ముంబై కటింగ్’, ‘బాంబే టాకీస్’ వంటి సినిమాలకు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. -
నన్ను కలవాలంటే డబ్బులు చెల్లించాల్సిందే!
బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కొత్త పాట పాడుతున్నాడు. ఇకనుంచి ఎవరినీ ఊరికే కలిసేది లేదంటున్నాడు. డబ్బులిస్తేనే పని జరుగుతుందంటున్నాడు. ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆయన ఇకనుంచి ఏదీ ఫ్రీగా చేయనంటున్నాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టాడు. 'ఇండస్ట్రీకి వచ్చే కొత్తవాళ్లకు సాయం చేయడం కోసం ఇప్పటికే నేను చాలా సమయాన్ని వృథా చేశాను. కొన్నిసార్లు టైం వేస్ట్ తప్ప ఏమీ మిగల్లేదు. కాబట్టి నేనో నిర్ణయానికి వచ్చాను. పావుగంటకు లక్ష.. గంటకు..? మేము తెలివైనవాళ్లం.. మా దగ్గర టాలెంట్కు కొదవే లేదని చెప్పుకుని తిరిగేవాళ్లతో నా సమయం వృథా చేయాలనుకోవడం లేదు. ప్రతిదానికి ఓ రేటు పెడుతున్నాను. నన్ను ఒక పది, పదిహేను నిమిషాలు కలవాలంటే రూ.1 లక్ష చెల్లించాలి. అరగంట మాట్లాడాలంటే రూ.2 లక్షలు.. అదే గంటసేపు నాతో మాట్లాడటానికి రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. షార్ట్కట్స్ కావాలా? మీరు అంత డబ్బు ఇవ్వగలిగేవారైతేనే రండి. లేదంటే వెళ్లిపోండి. షార్ట్కట్స్ వెతుక్కుంటూ వచ్చేవారిని చూసి అలిసిపోయాను. మరో ముఖ్య విషయం.. ఆ డబ్బంతా కూడా ఒక్కసారే అడ్వాన్స్గా ఇచ్చేయాలి' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన అతడి కూతురు ఆలియా.. నీకు ఫార్వర్డ్ చేయమంటూ నాకు స్క్రిప్టులు పంపుతున్న ప్రతిఒక్కరికీ ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాను అని రిప్లై ఇచ్చింది. View this post on Instagram A post shared by Anurag Kashyap (@anuragkashyap10) చదవండి: మొన్నే ప్రియుడితో ఎంగేజ్మెంట్.. కుమారుడితో కలిసి పార్టీ ఇచ్చిన హీరోయిన్ -
కోలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్న దర్శకుడు!
ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్.. గ్యాంగ్ ఆఫ్ వసీపూర్ చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈయన పలు హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. నటుడిగానూ, పలు చిత్రాలలో యాక్ట్ చేసిన అనురాగ్ కశ్యప్ కోలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడే. నయనతార, విజయ్ సేతుపతి జంటగా నటించిన ఇమైకా నొడిగల్ చిత్రంలో విలన్గా నటించి తన విలక్షణ నటనను ప్రదర్శించాడు. ఇటీవల విజయ్ కథానాయకుడిగా నటించిన లియో చిత్రంలోనూ చిన్న పాత్రలో మెరిశాడు. ఈయన దర్శకత్వం వహించిన కెన్నడీ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఇదిలా ఉంటే దర్శకుడిగా ఈయన కోలీవుడ్ ఎంట్రీ షురూ అయినట్లు సమాచారం. ఈయన దర్శకత్వంలో జీవీ ప్రకాష్కుమార్ హీరోగా పాన్ ఇండియా చిత్రం తెరకెక్కనుంది. దీని గురించి జీవీ ప్రకాష్ కుమార్ ఇటీవల ఒక భేటీలో మాట్లాడుతూ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్కశ్యప్ తనను హీరోగా నటించమని అడిగారన్నాడు. ఇది పాన్ ఇండియా చిత్రంగా ఉంటుందన్నాడు. కాగా జీవీ ప్రకాష్కుమార్ ప్రస్తుతం నటుడిగా, సంగీత దర్శకుడిగా చాలా బిజీగా ఉన్నాడు. ఈయన నటించిన రెబల్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. దీనితో పాటు 13, ఇడి ముళక్కమ్, కల్వన్ చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తున్నాడు. అదేవిధంగా సైరన్, సియాన్ విక్రమ్ 62వ చిత్రం, శివకార్తికేయన్ 21వ చిత్రం , సూర్య 43వ చిత్రం అంటూ సంగీత దర్శకుడిగానూ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాలను పూర్తి చేసిన తరువాత ఈయన అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉంది. చదవండి: 10 మంది పొగిడితే, 50 మంది తిట్టారు: నయనతార -
ఆ సమయంలో ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్నా: స్టార్ డైెరెక్టర్
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన కెన్నెడీ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సన్నిలియోన్, రాహుల్ భట్ జంటగా నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన బాలీవుడ్పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాలీవుడ్ ఎదురైన పరిస్థితుల వల్ల ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. (ఇది చదవండి: ప్రియాంక చోప్రా భర్తకు అవమానం.. పాట పాడుతుండగానే!) అదే సమయంలో తనకు తమిళం, మలయాళం ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు వచ్చాయని వెల్లడించారు. అందుకు గల కారణాలను కూడా అనురాగ్ వివరించారు. నెగెటివిటీ కారణంగా ఒకానొక సమయంలో బాలీవుడ్ వదిలి వెళ్లిపోవాలనుకున్నానని దర్శకుడు అనురాగ్ కశ్యప్ అన్నారు. నెగెటివిటీ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. 'ఒకటి, రెండు సంవత్సరాల పాటు నాకు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నా. 2021కి ముందు రెండేళ్లపాటు ఎక్కువగా ప్రభావితమయ్యా. ఆ సమయంలో బయటకు వెళ్లాలని అనుకున్నా. దక్షిణాదికి చెందిన నా స్నేహితులు తమిళంలో సినిమాలు చేయమని ఆహ్వానించారు. కేరళకు చెందిన నా స్నేహితుడు మలయాళంలో సినిమాలు చేయమని పిలిచారు. జర్మన్, ఫ్రెంచ్ సినిమాలు చేయమని కూడా ఆహ్వానం అందింది. కానీ నాకు భాషలు తెలియక వాటిని అంగీకరించలేకపోయా. విమర్శలు అన్నింటినీ ఎదుర్కొన్నప్పటికీ.. ఈ రంగంలోనే కొనసాగుతున్నందుకు ఆనందంగా ఉన్నా. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా విమర్శించినా నేను పెద్దగా పట్టించుకోను. అవీ నన్ను ఏమాత్రం బాధపెట్టడం లేదు. వాళ్లు ఏం మాట్లాడినా.. నా పని నేను చేసుకుంటూ వెళ్లిపోతా.' అని అన్నారు. (ఇది చదవండి: భార్య వల్లే హీరో ప్రశాంత్ కెరీర్ దెబ్బతిందా.. పెళ్లికి ముందే ఆమె మరొకరితో) అనురాగ్ కెరీర్ అనురాగ్ కశ్యప్ మొదట రామ్ గోపాల్ వర్మ చిత్రం సత్యలో కో- డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ తర్వాత బ్లాక్ ఫ్రైడే, నో స్మోకింగ్, దేవ్.డి, గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్, అగ్లీ, రామన్ రాఘవ్ 2.0 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన చివరిసారిగా మేడ్ ఇన్ హెవెన్ సీజన్ -2లో ప్రత్యేక పాత్రలో కనిపించారు. -
Aaliyah Kashyap: స్టార్ డైరెక్టర్ కూతురి ఎంగేజ్మెంట్లో మెరిసిన తారలు (ఫొటోలు)
Pagination
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
Advertisement