-
చంద్రబాబుపై బీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: చంద్రబాబు నాయుడిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో గనుక చంద్రబాబు గెలిస్తే తన శిష్యుడితో హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేస్తాడని అన్నారు. వినోద్ కుమార్ కరీంగనగర్లో మంగళవారం మీడియాతో మాట్లాడారు.‘హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు దగ్గర పడింది. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో పొత్తు పెట్టుకుని హైద్రాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తాడు. బీజేపీ ఆలోచనలు కూడా హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలన్నట్టుగానే సాగుతున్నాయి. పార్లమెంట్లో గళం విప్పాలంటే నేను గెలువాలి. బండి సంజయ్ బీజేపీ కుర్చోమంటే కూర్చుంటూ.. లెమ్మంటే లేచే వ్యక్తి’ అని మండిపడ్డారు. -
గ్యారంటీలు అమలైతే ఓట్లడగం! : మాజీ మంత్రి హరీశ్రావు
మెదక్: ఆరు గ్యారంటీలు అమలయ్యే గ్రామాల్లో మేం ఓట్ల అడగమని, అమలు కాని గ్రామాల్లో మీరు ఓట్లు అడగొద్దని మాజీ మంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు. సోమవారం నర్సాపూర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అమలు కాని గ్యారెంటీలపై మాట్లాడిన రాహుల్గాం«దీకి, కేసీఆర్ను బూతులు తిడుతున్న రేవంత్రెడ్డికి ఓట్లతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీలు అబద్ధాలకు పుట్టిన కవలలని విమర్శించారు.ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ రిజర్వేషన్లు, బీజేపీ మతం పేరుతో ఓటర్లను రెచ్చగొడుతూ గ్లోబల్ ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి జిల్లాలను ఎత్తివేస్తానంటున్నారని, దీనిపై ప్రజలు ఆలోచించాలన్నారు. పదేళ్ల బీజేపీ పాలన కార్పొరేట్లకు దోచిపెట్టిందన్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు ఎన్నికలకు ముందు ఫేక్ వీడియోలు విడుదల చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ఆలోచనతో ఉన్నారని చెప్పారు.అనంతరం ఎమ్మెల్యే సునీతారెడ్డి మా ట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదన్నారు. హత్నూర మండలం రెడ్డిపాలెంలో పలువురికి బలవంతంగా కాంగ్రెస్ కండువాలు కప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 8న నర్సాపూర్లో నిర్వహించే రోడ్షోలో కేసీఆర్ పాల్గొంటారని, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి, నాయకులు సింగయ్యపల్లి గోపి, చంద్రగౌడ్, మన్సూర్, మున్సిపల్ చైర్మన్ అశోక్గౌడ్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, సత్యంగౌడ్, నయీమ్, ఆంజనేయులుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.ఇవి చదవండి: కాంగ్రెస్, బీఆర్ఎస్ల పోటీ.. రెండో స్థానం కోసమే! : కిషన్రెడ్డి -
వారిది చీకటి ఒప్పందం..: సీఎం రేవంత్రెడ్డి
ఉప్పల్/మల్లాపూర్/అంబర్పేట/కంటోన్మెంట్: బీఆర్ఎస్ బీజీపీలది పొద్దుటి పూట బంధం.. చీకట్లో ఒప్పందం అని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీలోనే లేదన్నారు. చీకటి ఒప్పందంలో భాగంగానే మల్కాజిగిరిలో బీఆర్ఎస్ అభ్యర్థిని దిష్టిబొమ్మలా నిలబెట్టారని ధ్వజమెత్తారు. ఇక్కడి బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడే లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలోనే హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకునేందుకు పునాది పడిందని చెప్పారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలు రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరుల్లా జీవిస్తున్నారని, కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో కలిపేస్తామని హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీలో విలీనం చేయడం వల్ల కంటోన్మెంట్కు కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సహకారం అందుతుందని తెలిపారు. సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్రెడ్డి పేదల మనిషి కాదని విమర్శించారు. సోమవారం మల్కాజిగిరి, సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థులు పట్నం సునీతా మహేందర్ రెడ్డి, దానం నాగేందర్, కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి శ్రీగణేశ్లకు మద్దతుగా హైదరాబాద్లోని ఉప్పల్, మల్లాపూర్, అంబర్పేట, కంటోన్మెంట్ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉప్పల్ వీటీ కమాన్, ఫీవర్ ఆస్పత్రి చౌరస్తా, పికెట్ చౌరస్తాల వద్ద జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగులు, రోడ్ షోల్లో ప్రసంగించారు. కిషన్రెడ్డి పేదల మనిషి కాదు ‘వైఎస్ సారథ్యంలో మంత్రిగా పని చేసిన దానం నాగేందర్, అప్పటి ఎంపీ అంజన్కుమార్ల ఆధ్వర్యంలో నగరంలో చేసిన అభివృద్ధే నేటికీ ప్రజలకు అందుబాటులో ఉంది. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కిషన్రెడ్డి అంబర్పేటకు చేసిందేమీ లేదు. ఆయన పేద ప్రజల మనిషి కాదు. ఆయనకు ఓటు వేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు. గత జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు నగరంలో వరదలు వచ్చి పేదలు ఇబ్బందులు పడితే కిషన్రెడ్డి అణా పైసా ఇవ్వలేదు. ఆరేళ్లు గడిచినా అంబర్పేట ఫ్లైఓవర్ ఎందుకు పూర్తి కాలేదు?..’ అని రేవంత్ నిలదీశారు. ఈటల వేషాలు ప్రజలు గుర్తుపట్టేస్తారు ‘ఈటల రాజేందర్ మల్కాజిగిరి ప్రాంతానికి చేసిన మేలు ఏంటో చెప్పాలి. గత పదేళ్లలో ఒక్కరోజు కూడా ఈటల పేద ప్రజల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. 2001 నుంచి 2021 వరకు కేసీఆర్, నువ్వు ఒకే కంచంలో తిని, ఒకే మంచంలో పడుకోలేదా? ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఫైల్ మీద సంతకం పెట్టింది నీవు కాదా? ధరణి ముసుగులో హైదరాబాద్ చుట్టూ వేలాది ఎకరాలు కొల్లగొట్టలేదా? కేసీఆర్ దోపిడీలో నీవు కూడా భాగస్వామివే. పంపకాల్లో తేడా వచ్చి విడి పోయారంతే తప్ప మరొకటి కాదు. బీజేపీలోకి వచ్చి మూడేళ్లు అయినా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై నరేంద్ర మోదీ, అమిత్షాలతో ఎందుకు చర్చించలేదు? పదేళ్లలో ఏనాడైనా ఉప్పల్కు వచ్చావా? ఈటల ఎన్ని బైరూపుల వేషాలు వేసినా ఇక్కడి ప్రజలు ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందాల్సిన ఫలితాలు అందకుండా ప్రధాని మోదీ రాజ్యంగాన్ని మార్చాలని చూస్తున్నారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ సర్కారు ఏర్పడితే రిజర్వేషన్లు తొలగిస్తుంది. తెలంగాణకు ఆయన గాడిద గుడ్డు ఇచ్చారు..’ అని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. కేటీఆర్ చీర కట్టుకుని బస్సెక్కు ‘రేవంత్ ప్రభుత్వం ఏమీ చేయలేదని అంటున్న వారందరికీ చెబుతున్నా. ఆడపడుచులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. 40 లక్షల మందికి గ్యాస్ సబ్సిడీ, 50 లక్షల కుటుంబాలకు ఉచిత కరెంటు ఇస్తున్నాం. మూడు నెలల్లో 30 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాం. 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిన ఘనత మాది. కేటీఆర్ ఎర్రగా ఉన్నావు...చీర కట్టుకుని తెలంగాణలో ఎక్కడైనా ఆర్టీసీ బస్సు ఎక్కు.. టికెట్ అడిగితే మా పథకం అమలు కావడం లేదన్నట్టు.. అడగగకపోతే అమలవుతున్నట్లు తెలుసుకో..’ అని రేవంత్ సవాల్ చేశారు. దానం నాగేందర్ను కేంద్ర మంత్రిని చేస్తా ఆరుసార్లు ఎమ్మెల్యేగా, వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేసిన అనుభవజు్ఞడు దానం నాగేందర్ను గెలిపిస్తే కేంద్ర మంత్రిని చేస్తానని సీఎం అన్నారు. సునీతా మహేందర్రెడ్డి రంగారెడ్డి జిల్లాలో ఎన్నో సేవలు, అభివృద్ధి పనులు చేశారని, తాను ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరిలో సునీతమ్మను గెలిపిస్తే అభివృద్ధిలో అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీగణేశ్ను గెలిపిస్తే ఈ ప్రాంతంలో సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మాజీ ఎంపీ వి.హన్మంతరావు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి, రోహిణ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
గచ్చిబౌలి, శంషాబాద్ (హైదరాబాద్)/ సిరిసిల్ల: దేశంలో ప్రధాని నరేంద్ర మోదీని నిలువరించ గలిగే శక్తి, కేంద్రంలో రానున్న సర్కారుతో పోరాడే దమ్ము కేవలం మాజీ సీఎం కేసీఆర్కు, అలాగే కేజ్రీవాల్, మమతా బెనర్జీ లాంటి వారికే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. కేసీఆర్ను మరింత బలోపేతం చేసేందుకు బీఆర్ఎస్ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో 10 నుంచి 12 సీట్లు బీఆర్ఎస్కు ఇస్తే ఆరు నెలల్లో రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పడం ఖాయమని పేర్కొన్నారు.సీఎం రేవంత్రెడ్డి ఆర్ఎస్ఎస్ వ్యక్తి అని, రాజీవ్గాంధీ లైన్లో కాకుండా మోదీ లైన్లో నడుస్తున్నాడని విమర్శించారు. బీజేపీ వాళ్లు ఇంటింటికీ పంపే రాముడి ఫొటోకు, అంక్షితలకు మోసపోవద్దని కోరారు. అవి అయోధ్య నుంచి రాలేదని ఇక్కడి రేషన్ బియ్యానికే పసుపు పూసి పంపుతున్నారని ఆరోపించారు. సోమవారం హైదరాబాద్ లోని కొండాపూర్, శంషాబాద్లో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ షోల్లో ఆయన మాట్లాడారు. ఆయనేమన్నా బోటి కొట్టేటోడా?‘కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపి, అలవికాని హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఈ ఐదు నెలల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. సిరిసిల్ల నేతన్నలకు భరోసా ఇచ్చే బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వలేదు. హామీలు అమలు చేయని కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయాలి? కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెడితేనే పిచ్చి వాగుడు వాగుతున్న రేవంత్రెడ్డికి బుద్ధి వస్తుంది. ఆయన తులం బంగారం కాదు కదా తులం ఇనుము కూడా ఇయ్యడు. రూ.2,500 నగదు, రూ.4 వేల పింఛను, స్కూటీలు ఇప్పటివరకు ఇయ్యలేదు.రూ.4 వేలు కాదు కదా రూ.400 కూడా ఇయ్యడు. రూ.2,500 కాదు ఉన్న రూ.500 ఇస్తే అదే గొప్ప. రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ అడ్రస్ లేకుండా పోయింది. ఫార్మాసిటీ లేకుండా పోయింది.. ఒప్పందం చేసుకున్న కంపెనీలు కూడా వెనక్కి వెళ్లిపోతున్నాయి.. కొత్తవి రావడం లేదు. పేగులు మెడకు వేసుకుంటా అంటున్నాడు.. ఆయనేమన్నా బోటి కొట్టేటోడా? కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని పెట్టింది. సిరిసిల్ల రోడ్డుపై రాజేందర్రావు నిల్చుంటే.. బస్సు కోసం చూస్తుండని భావిస్తారే కానీ కాంగ్రెస్ అభ్యర్థి అని గుర్తుపట్టరు..’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మోదీకి ఎందుకు ఓటెయ్యాలి?‘మోదీ పచ్చి మోసగాడు. న.మో అంటే న మ్మించి మోసం చేసేవాడని అర్థం. ఐటీఐ ఆర్, మెట్రో విస్తరణ, మూసీ సుందరీకర ణకు నిధులు అడిగితే ఇప్పటివరకు ఇయ్యని మోదీకి ఎందుకు ఓటు వేయాలి? జన్ధన్ ఖాతాలు తెరవండి ధనాధన్ 15 లక్షలు వేస్తా, బుల్లెట్ రైళ్ళు..ఇలా పదేళ్ళ కాలంలో ఎన్నో చెప్పారు. కానీ బడే భాయ్ మోదీ మ నకు ఒక్క రూపాయి కూడా ఇయ్యలేదు. గు డి కట్టుడు ఒక్కటే ఓటు వేసేందుకు కారణ మైతే కేసీఆర్ యాదాద్రి కట్టలేదా? హైదరా బాద్ నగరంలో అన్ని మతాలు, కులాల వారూ ఉంటారు. ముస్లింలను తిట్టడమే లక్ష్యంగా మోదీ పెట్టుకున్నారు. పదేళ్ళు ప్రధానిగా పనిచేసిన వ్యక్తి చేయాల్సిన పని ఇదా?. దేవుడిని మొక్కండి.. బీజేపీని తొక్కండి..’ అంటూ మాజీమంత్రి ధ్వజమెత్తారు.గ్రేటర్ ప్రజలు కేసీఆర్నే కోరుకున్నారు‘హైదరాబాద్ నగరంలో అత్యధికంగా 36 ఫ్లైఓవర్లు నిర్మించాం. అత్యధిక ఐటీ కంపెనీలు ఉన్న నియోజకవర్గం శేరిలింగంపల్లి అభివృద్ధికి ఎమ్మెల్యే గాంధీ కష్టపడి పనిచేస్తున్నాడు. ఆయనకు జోడేదార్గా ఇప్పుడు ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపిస్తే వారిద్దరికీ నేను పూర్తి అండగా ఉంటా. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో 16 స్థానాల్లో బీఆర్ఎస్ను గెలిపించారు. బీజేపీకి ఒక్క సీటు ఇచ్చారు. కాంగ్రెస్కు ఒక్కటి కూడా ఇవ్వలేదు. గ్రేటర్ ప్రజలు కేసీఆరే సీఎంగా ఉండాలని కోరుకున్నారు. ఇప్పుడైనా, ఎప్పుడైనా తెలంగాణకు కేసీఆరే రక్ష..’ అని కేటీఆర్ చెప్పారు. రోడ్ షోల్లో జ్ఞానేశ్వర్, ఎమ్మెల్యేలు గాంధీ, ప్రకాశ్గౌడ్, పార్టీ సీనియర్ నేత గణేష్గుప్తా పలువురు స్థానిక నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆ రెండూ ప్రతిష్టాత్మకమే
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలతోపాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉపఎన్నికలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికలతోపాటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి, ఆ తర్వాత ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’ పట్టభద్రుల స్థానానికి కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండూ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు కావడంతో వాటిని తిరిగి గెలుచుకోవడంపై బీఆర్ఎస్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో కంటోన్మెంట్కు ఉపఎన్నిక రాగా, ఈ నెల 13న జరిగే లోక్సభ పోలింగ్తోపాటు ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా పోలింగ్ జరగనుంది. మరోవైపు ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్రెడ్డి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో పల్లా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీగా పల్లా పదవీకాలం 2027 ఏప్రిల్లో ముగియనుంది. తాజాగా ఎన్నికల కమిషన్ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 9 వరకు నామినేషన్ల స్వీకరణ, ఈ నెల 27న పోలింగ్ జరుగుతుంది.లాస్య నందిత సోదరి కోసం.. మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్లో తమ అభ్యర్థి నివేదిత గెలుపు కోసం బీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డికి ప్రచార సమన్వయ బాధ్యతలు అప్పగించగా, పార్టీ నేత రావుల శ్రీధర్రెడ్డి నియోజకవర్గ ప్రచార ఇన్చార్జ్గా పనిచేస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో పాటు మల్కాజిగిరి ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఎనిమిది వార్డులు, జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక డివిజన్ వారీగా ప్రచార బాధ్యతలు పంచుకొని పనిచేస్తున్నారు.అయితే ఇక్కడ బీఆర్ఎస్ టికెట్ ఆశించిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతర ఆశావహులు గజ్జెల నాగేశ్ కేసీఆర్ బస్సు యాత్రలో ఉండగా, ఎర్రోⶠ్ల శ్రీనివాస్ సంగారెడ్డి ప్రచార సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. నివేదిత తరపున సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే కొందరు నేతలు కాంగ్రెస్లో చేరడంతో ప్రచారంపై ఆ ప్రభావం పడకుండా చూడాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తున్న కేసీఆర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో రెండు రోజుల క్రితం ఫోన్లో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు. మరోవైపు ఇప్పటికే నియోజకవర్గంలో రోడ్షోల్లో పాల్గొన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచార సరళిని పర్యవేక్షిస్తున్నారు.నేడు బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్శాసనమండలి ఆరంభం నుంచి బీ ఆర్ఎస్ అభ్యర్థులే ‘వరంగల్– ఖమ్మం–నల్లగొండ’ పట్టభద్రుల స్థానం నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఈ నేప థ్యంలో ప్రస్తుతం ఈ స్థానానికి జరుగు తున్న ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి పేరును అధినేత కేసీఆర్ రెండు రోజుల క్రితం ఖరారు చేశారు. రాకేశ్ రెడ్డి మంగళ వారం నల్ల గొండ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారు. బీఆర్ ఎస్ టికెట్ పార్టీ నేతలు ఓ.నర్సింహారెడ్డి, డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, సుందర్ రాజు తదితరులు ఆశించారు. అయినా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రాకేశ్ రెడ్డికి టికెట్ దక్కింది. ఇక్కడ గెలుపును బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని సమ న్వయంతో పనిచేయడం ద్వారా ప్రచారంలో పైచేయి సాధించాలని భావి స్తోంది. దీంతో ప్రస్తుతం లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఉన్న పార్టీ అధి నేత కేసీఆర్ ఈ నెల 12న లేదా 14న మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్చార్జ్లు, ఇతర ముఖ్యనేతలతో తెలంగాణభవన్లో భేటీ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement