-
డబ్బు కొట్టు.. జెండా కట్టు..!
పలమనేరు : పట్టణంలో సోమవారం జరిగిన టీడీపీ అభ్యర్థి అమరనాథ రెడ్డి నామినేషన్ సందర్భంగా జనాలకు మద్యం, నగదు పంపకాలు జోరుగా సాగాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థి, వెంకటేగౌడ నానినేషన్ కార్యక్రమానికి 30వేల మంది వరకు హాజరుకావడంవతో టీడీపీ నేతలు ఉలిక్కిపడ్డారు. పరువుపోతుందనే భయంతో అమరనాథరెడ్డి సైతం జన సమీకరణకు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. ఆమేరకు వి.కోట నుంచి బైక్లో వచ్చేవారికి రూ.300, పెట్రోలు, బిర్యానీ, మద్యం, బైరెడ్డిపల్లె నుంచి వచ్చేవారికి రూ.150 పెట్రోలు, భోజనం పంచిపెట్టినట్లు ఆయా వాహనాలను జెండా కట్టినట్లు సమాచారం. అలాగే కుప్పం, కర్ణాటక సరిహద్దు గ్రామాలు, మదనపల్లె, పూతలపట్టు నియోజకవర్గాలనుంచి సైతం జనాలను రప్పించారు. వీరికి మాత్రం మనిషికి రూ.400 దాకా పంపిణీ చేసినట్టు తెలిసింది. -
విచ్చలవిడిగా ‘పచ్చ’ ప్రలోభాలు!
పూతలపట్టు/కాణిపాకం : టీడీపీ నేతలు యథేచ్ఛగా కోడ్ను ఉల్లంఘిస్తున్నారు. సోమవారం పూతలపట్టులో ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మురళీమోహన్ నామినేషన్ చేసేందుకు గాను జనసమీకరణకు డబ్బులు వెదజల్లారు. ప్రతీ పంచాయతీకి వాహనాలు పంపించి జనాన్ని తరలించే యత్నించారు. 40కుపైగా బస్సులు, 20కుపైగా ట్రాక్టర్లు, ఆటోలు 50, లారీలు, ఐషర్ వాహనాలు, కార్లు, ద్విచక్రవాహనాలను పూతలపట్టుకు తీసుకొచ్చారు. ఇందుకు గాను రూ.5 లక్షల వరకు ఖర్చుపెట్టినట్లు తమ్ముళ్లే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. నామినేషన్కు తీసుకువచ్చిన వారికి పెళ్లిపేరుతో విందు ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన ఓ పెళ్లి జంట బ్యానర్ వేసి బహిరంగంగానే విందు పెట్టారు. ఈలెక్కన విందుకు రూ.5 లక్షల వరకు ఖర్చుచేసినట్టు తెలుస్తోంది. అలాగే మద్యం పంపిణీ షరా మామూలుగానే సాగింది. కాగా, వచ్చిన జనాలకు అందించిన మొత్తం దాదాపు రూ.10లక్షలు దాటినట్లు ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. -
‘ఆరణి’ అక్రమాలు..!
చిత్తూరు అర్బన్ : ప్రజలకు చిత్తశుద్ధితో సేవ చేయాల్సిన పదవిని ‘ఆరణి’ తన స్వార్థానికి వినియోగించుకున్నారు. వందల ఎకరాల ప్రభుత్వ భూమిని చెరపట్టారు. ఆయన అడుగు జాడల్లోనే వారి అన్న కుమారుడు సైతం భూ దందాలు చేస్తూ రూ.కోట్లకు పడగెత్తాడు. వీరి ఆగడాలను అడ్డుకోవడం ఎవరి తరం కాలేదు. చిత్తూరు ‘శ్రీనివాసుడి’ అక్రమాలు ఓవైపు .. అబ్బాయ్ క్రిమినల్ ఆలోచనలు చూసి ప్రజలు ‘శివ’ శివా..! అనుకుంటున్నారు. వీళ్లకు ప్రభుత్వ భూములా...? ప్రైవేటు భూములా అనే తేడాలేదు. తమకు నచ్చిదంటే కబ్జాచేసి కంచెలు వేసేస్తారు. చిత్తూరు బాబాయ్ ‘ఆరణి’.. అబ్బాయ్ ‘శివ’ అవినీతి పర్వంలో కొన్ని.. ఫోర్జరీ మాయలు..! ● కరోనా సమయంలో చిత్తూరు మార్కెట్గేటు తన బినామీల పేరిట సొంతం చేసుకున్న ‘ఆరణి’.. చిన్నా,చితకా వ్యాపారుల ముక్కుపిండి రూ.కోట్లు వసూలు చేశారు. అయినప్పటికీ కరోనా సమయంలో తాము ఆశించిన నగదు వసూలు కాలేదని, ఈ మొత్తాన్ని మాఫీ చేయాలని అధికారులను అడ్డుపెట్టుకుని కౌన్సిల్లో తీర్మానం చేయించారు. ఫలితంగా కార్పొరేషన్ ఖజానాకు రూ.52 లక్షల నష్టం వాటిల్లింది. ● బూత్బంగ్లాను తలపించే శ్రీఆరణిశ్రీ ఇంట్లో, తన కంపెనీల్లో పనిచేయడానికి కొత్త స్కెచ్ వేశారు. తమ వద్ద పనిచేసే 27 మందిని మున్సిపల్ కార్పొరేషన్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా చేర్పించారు. సొంత పనులకు వీళ్లను వాడుకుని, కార్పొరేషన్ నుంచి నెలకు రూ.18 వేల చొప్పున వేతనాలు ఇచ్చేలా చక్రం తిప్పారు. ఇలా 27 మందికి 58 నెలల పాటు రూ.2.81 కోట్లను వేతనాల రూపంలో కొల్లగొట్టారు. ● ఇక 2017లో బెంగళూరు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఓ టెండర్లో పాల్గొనేందుకు ‘ఆరణి’ కంపెనీకి ఏదైనా కార్పొరేషన్లో రూ.వంద కోట్లకు పనులు చేసినట్లు ద్రువీకరణ పత్రం కావాల్సి వచ్చింది. దీనికోసం చిత్తూరులోని ఇరువారం నుంచి గంగినేనిచెరువు వరకు కాలువ పనులు, చెరువుకట్టపై అభివృద్ధి పనులను చేసినట్లు ఓ సర్టిఫికెట్ను బెంగళూరు మహానగర పాలక (బీబీఎంపీ) అధికారులకు అందజేశారు. రూ.280 కోట్ల విలువైన ఈ పనుల్లో తాము తొలివిడతగా రూ.19.35 కోట్ల పనులు పూర్తి చేసినట్లు, దీనికి చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ బిల్లులు కూడా ఇచ్చేసిందని అందులో పేర్కొన్నారు. చిత్తూరు మున్సిపల్ కమిషనర్, ఇంజినీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ సంతకాలను ఫోర్జరీ చేసి బీబీఎంపీ టెండర్లలో పాల్గొన్నారు. బెంగళూరు అధికారులకు అనుమానం వచ్చి, దీనిపై చిత్తూరు మున్సిపల్ అధికారులకు లేఖ రాశారు. దీన్ని శ్రీఆరణిశ్రీ తొక్కిపెట్టడంతో ఏకంగా బీబీఎంపీ అధికారులు చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయానికి నేరుగా వచ్చి ఇక్కడి అధికారులను సంప్రదించారు. ధ్రువీకరణ పత్రంలోని సంతకాలు తమవి కాదని, అవి ఫోర్జరీ సంతకాలని తేల్చిచెప్పారు. దీంతో ‘ఆరణి’ కంపెనీపై బీబీఎంపీ అనర్హత వేటువేసింది. అయితే ఇది ఎవరి కంటాపడకుండా ‘ఆరణి’ వాస్తవాలను తొక్కపెట్టేశారు. ఇన్నాళ్లకు పాపం పండడంతో నిజం వెలుగుచూసింది. ● చిత్తూరు మండలంలో ‘ఆరణి’ చేసిన ఇసుక దందా అంతా ఇంతాకాదు. తన కంపెనీకు చెందిన భారీ యంత్రాలతో యథేచ్ఛగా ఇసుకను తవ్వేసి ఇతర ప్రాంతాలకు తరలించి అమ్మేశారు. ఇలా మూడేళ్ల పాటు సుమారు రూ.3.24 కోట్ల విలువైన ఇసుక అక్రమాలకు పాల్పడ్డారు. భూ బకాసురుడు..! చిత్తూరులో ఆరణి చేసిన భూ దందాలనే ఆదర్శంగా తీసుకున్న శివ అక్రమాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. చిత్తూరు భూ బకాసురుడిగా పేరుతెచ్చుకున్న తన బాబాయ్ ‘ఆరణి’ చేసిన అక్రమాల్లో శివ తనవంతు పాత్రను పోషించాడు. గుడిపాల మండలంలోని పానాటూరు వద్ద 22 ఎకరాల ప్రభుత్వ భూమిని తన బంధువుల పేరిట పట్టా ఇప్పించుకున్నాడు. దీనికి ప్రస్తుతం గేటు ఏర్పాటుచేసి పంటలు పండిస్తున్నారు. చిత్తూరు–బెంగళూరు బైపాస్ రోడ్డులో సీతమ్స్ కళాశాల సమీపంలో 74–తిమ్మసముద్రం రెవెన్యూ భూముల వద్ద ఓ అనామకుడి నుంచి రూ.కోటి విలువ చేసే భూములను బలవంతంగా లాక్కున్నారు. అసలు పట్టాదారులపై దౌర్జన్యం చేసి మరీ 2,800 అడుగుల భూమిని కబ్జా చేశారు. భూమికి సొంతవాళ్లు ఏర్పాటు చేసుకున్న ఫెన్సింగ్ను తొలగించి కొత్తగా కూసాలను నాటించేశారు. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని తన అడ్డాగా మార్చుకున్న ‘ఆరణి’ అన్నకొడుకు.. ఉద్యోగుల సంఘ గౌరవాధ్యక్షుడిగా తనుకు తానే ఓ పదవిని సృష్టించుకున్నాడు. పట్టణ ప్రణాళిక విభాగం నుంచి రూ.5 లక్షలు, రెవెన్యూ విభాగం నుంచి రూ.2 లక్షలు, ప్రజారోగ్య విభాగం నుంచి రూ.50 వేలు చొప్పున ప్రతీ నెలా మున్సిపల్ అధికారుల నుంచి మామూళ్లను ముక్కుపిండి మరీ వసూలు చేశాడు. ఇన్ని అక్రమాలుచేసిన ‘ఆరణి’ తన అన్నకొడుకుతో కలిసి తిరుపతికి మకాం మార్చారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీచేస్తున్న ‘ఆరణి’ గురించి నిజాలు తెలిసిన తిరుపతి వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇంతటి ఘనుడిని అందలం ఎక్కిస్తే తిరుమల శ్రీనివాసుడికే నామాలు పెట్టడం ఖాయమని భయపడుతున్నట్లు సమాచారం. అవినీతిలో బాబాయ్.. అబ్బాయ్ పోటాపోటీ ఇసుక దందాలో రూ.3 కోట్లకు పైగా స్వాహా తమ సిబ్బందికి సైతం ప్రభుత్వ ఖజానా నుంచి రూ.2.81 కోట్ల వేతనాలు కోవిడ్ కాలంలో మార్కెట్ గేటుకు రూ.52లక్షల ఎగవేత పోర్టరజీ సంతకాలతో టెండర్ల భాగోతం చిత్తూరును సాంతం దిగమింగి.. తిరుపతికి పాకిన అనకొండలు ప్రజాధనానికి జవాబుదారీగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యే అయినప్పటికీ ఎక్కడ అవకాశముంటే అక్కడ అవినీతికి తెరతీసేస్తారు.. కంచే చేను మేసినట్టు ఖాళీ భూమి కనిపిస్తే కబ్జా చేసేస్తారు.. అధికారుల సంతకాలను పోర్జరీ చేసి ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టేస్తారు.. బాబాయ్ పదవిని అడ్డుపెట్టుకుని అబ్బాయ్ అక్రమాలకు పాల్పడతారు.. అన్న కుమారుడి క్రిమినల్ ఆలోచనలను సదరు ప్రజాప్రతినిధి తూచా తప్పకుండా అమలు చేసేస్తారు.. జేబులోని రూపాయి తీయరు.. యథేచ్ఛగా ఊరి మీద పడి దోచుకున్నారు.. ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేశారు.. చివరకు చిత్తూరును సాంతం దిగమింగేశారు.. తమ అక్రమా ర్జనను కొనసాగించేందుకు కొత్తగా తిరుపతిని ఎంచుకున్నారు. దీంతో తిరునగరి వాసులు అప్రమత్తంగా ఉండాలని బాధితులు హెచ్చరిస్తున్నారు. -
వైఎస్సార్సీపీలోకి వలసల వెల్లువ
జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి పెద్దసంఖ్యలో నేతలు, కార్యకర్తలు చేరారు.వైఎస్సార్సీపీ గెలుపు తథ్యం పెనుమూరు మండలంలో ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మితో కలిసి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం ప్రచారం చేపట్టారు.మంగళవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2024ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలు ఉత్తమ ఫలితాలను అందించాయి.. విద్యావ్యవస్థలో తీసుకువచ్చిన మార్పులు పిల్లల భవిష్యత్కు బంగారు బాటలు వేశాయి.. సర్కారు బడుల్లో కల్పించిన సౌకర్యాలు విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునే వెసులుబాటు కల్పించాయి.. ప్రభుత్వ చిత్తశుద్ధిని పదో తరగతి ఫలితాలు రుజువు చేశాయి. సరైన ప్రోత్సాహం అందిస్తే పేద బిడ్డలు సైతం కార్పొరేట్కు ధీటుగా మార్కులు సాధించగలరని చాటి చెప్పారు. జిల్లాను రాష్ట్రంలోనే ఆరో స్థానంలో నిలబెట్టారు. ప్రైవేటు స్కూళ్ల కంటే అత్యుత్తమంగా రాణించి సత్తా చూపించారు.జిల్లాలో పదో తరగతి ఫలితాలు విడుదల చేస్తున్న డీఈఓ దేవరాజుప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించినవారు● బైరెడ్డిపల్లె మండలంలోని ఏపీరెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థి సి.తన్మయి 592 మార్కులు సాధించి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ● సదుం మండలంలోని బీసీ వెల్ఫేర్ పాఠశాలలో చదివిన మణి, రామకుప్పం మండలం విజలాపురం జెడ్పీ హైస్కూల్లో చదివిన అఫ్షాన్ 589 మార్కులు సాధించి రెండో స్థానం దక్కించుకున్నారు. ● చిత్తూరులోని కణ్ణన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని సంతోషి, కార్వేటినగరంలోని ప్రభుత్వ పాఠశాలకు చెంది న యశ్వంత్, బైరెడ్డిపల్లె మండలం కమ్మనపల్లె మోడ ల్ స్కూల్ విద్యార్థిని మంజుల, గుడుపల్లె మండలం సోదిగానిపల్లె జెడ్పీ పాఠశాల విద్యార్థిని కావ్యశ్రీ, ఐరా ల మండలం ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థిని బిందుసా యి, బైరెడ్డిపల్లి మండలం కడపనత్తం జెడ్పీ హైస్కూల్ విద్యార్థి కిరణ్కుమార్ 587 మార్కులు సాధించారు.మెరుగైన ఫలితాలు ప్రైవేట్, కార్పొరేట్ బడులకు ధీటుగా జిల్లాలో సర్కారు బడుల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఎవ్వరికీ తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారు. ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకున్నారు. ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, డీవైఈఓలు, ఎంఈఓల సమష్టి కృషితోనే ఇది సాధ్యమైంది. – దేవరాజు, డీఈఓ, చిత్తూరు మెరుగైన విద్య మాది నగరి మున్సి పాలిటీ సత్రవాడ, మా ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన మెరుగు పడింది. నేతపై ఆధారపడి జీవించే కుటుంబం మాది. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనే మా కుమార్తె కార్తీకను చదివించాం. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఈ బడిలో వసతులను కల్పించారు. నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. పాఠ్యపుస్తకాలు, బ్యాగు, విద్యా సామగ్రి అంతా ప్రభుత్వమే ఇస్తోంది. పదోతరగతికి ప్రత్యేక తరగతులు తీసుకొని బోధించారు. దీంతో మా కుమార్తె అత్యుత్తమ ప్రతిభను కనబరచింది. 580 మార్కులు సాధించి మండలంలో మొదటి స్థానంలో నిలిచింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. – జగన్నాథన్, సుమిత సత్తా చాటిన కవలలు మా నాన్న సుధాకర్ బంగారు షాపులో పని చేస్తూంటారు. అమ్మ స్వప్న గృహిణి. మాది మధ్య తరగతి కుటుంబం. మేము కవల పిల్లలం. ఐరాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివాం. బీణసాయికి 565 మార్కులు వచ్చాయి. మా ఇద్దరి కల సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలనుంది. 587 మార్కులతో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో మండల టాపర్గా నిలిచా. మా స్కూల్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు ప్రభుత్వం కల్పించిన వసతులను ఉపయోగించుకుని ఈ మార్కులు సాధించాం. అమ్మ ఒడి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించడంతో బాగా చదువుకున్నాం. – బిందు సాయి, బీణ సాయి, ఐరాల వందశాతం ఉత్తీర్ణత పదోతరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడం గర్వంగా ఉందని స్థానిక ఏంజేపీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని, వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ఎప్పటికప్పుడు వారి సామర్థ్యాలు మెరుగు పరి చేలా చర్యలు తీసుకోవడమే ఉత్తమ ఫలితాలకు కారణమైందని వివరించారు. – శ్రీనివాసులురెడ్డి నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణపుంగనూరు : జిల్లాలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్పీ మణికంఠ తెలిపారు. సోమవారం పట్టణంలో నామినేషన్ల కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. ఆర్ఓ కేంద్రాన్ని తనిఖీ చేశారు. టీడీపీ ర్యాలీ సందర్భంగా ట్రాఫిక్ ఇక్కట్లను స్వయంగా తొలగించి, రాకపోకలను క్రమబద్ధీకరించారు. అనంతరం విలేకర్లతో ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పుంగనూరులో ప్రత్యేక దళాల బందోబస్తు నడుమ పోలింగ్ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అనుమానితులు, రౌడీ షీటర్లు, తీవ్రమైన నేర చరిత్ర గలవారిని బైండోవర్ చేశామన్నారు. ఎన్నికలలో సామాన్యులు ధైర్యంగా ఓటు వేసేలా అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. సమావేశంలో ఏఆర్ఓ నరసింహప్రసాద్ పాల్గొన్నారు. ఎన్నికలకు వేతనంతో కూడిన సెలవుచిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో కార్మికులుగా పనిచేస్తున్న కర్ణాటక ఓటర్లకు ఈ నెల 26 , మే 7వ తేదీన సెలవు ఇవ్వాలని జిల్లా కార్మికశాఖాధికారి ఓంకార్రావు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ కర్ణాటకలో రెండు దశలుగా లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నందున ఆయా రోజుల్లో కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలన్నారు. ఈ మేరకు కార్మిక కమిషనర్ శేషగిరిబాబు, జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే మే 13వ తేదీన రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా దుకాణాలు, వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు సైతం వేతనం కూడిన సెలవు మంజూరు చేయాలని ఆదేశించారు. సంబంధిత యజమానులు ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతోపాటు శిక్షార్హులవుతారని స్పష్టం చేశారు. ఏనుగుల దాడిలో పంటల ధ్వంసం రామకుప్పం: మండలంలోని ఎస్.గొల్లపల్లె సమీపంలో పంటపొలాలపై ఏనుగుల గుంపు ఆదివారం రాత్రి దాడి చేసింది. పలువరు రైతులకు చెందిన వేరుశనగ, బీన్స్, రాగి, అరటి పంటలతోపాటు గంట్లప్ప అనే రైతుకు చెందిన డ్రిప్ పరికరాలను నాశనం చేసింది. ఇప్పటికై నా అటవీ అధికారులు స్పందించి ఏనుగులను కట్టడి చేయాలని బాధితులు కోరారు.చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సర్కారు బడులు ఉత్తమ ఫలితాలు సాధించాయి. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా రాష్ట్ర స్థాయిలో 6వ స్థానంలో నిలిచింది. ప్రైవేట్ యాజమాన్యాలను అధిగమించి ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు ఉత్తమంగా రాణించారు. గత టీడీపీ పాలనలో కార్పొరేట్ వ్యవస్థకు రెడ్ కార్పెట్ వేయడంతో ప్రైవేట్ స్కూళ్లతే ఆధిపత్యం ఉండేది. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మారులు తీసుకువచ్చింది. సర్కారు ప్రోత్సాహాన్ని విద్యార్థులు అందిపుచ్చుకుని అద్భుతంగా ఫలితాలు సాధించారు. ప్రైవేట్ వెనుక ‘బడి’..! జిల్లా వ్యాప్తంగా ఈ విద్యాసంవత్సరంలో అన్ని యాజమాన్యాల నుంచి 20,399 మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 19,113 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పది ఫలితాల్లో ప్రైవేట్ బడులు వెనుకబడ్డాయి. జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ బడులలో 4,756 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే జిల్లా వ్యాప్తంగా వివిధ యాజమాన్యాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాల నుంచి పది పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 14,357 మంది ఉత్తీర్ణత సాధించారు 17 నుంచి ఆరోస్థానంలోకి పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో చిత్తూరు జిల్లా ఆరో స్థానంలో నిలిచింది. సోమవారం రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ పది ఫలితాలను విడుదల చేశారు. అనంతరం జిల్లా ఫలితాలను డీఈఓ కార్యాలయంలో డీఈఓ దేవరాజు విడుదల చేసి వివరాలు వెల్లడించారు. గత ఏడాది జిల్లా రాష్ట్రంలో 17వ స్థానంలో నిలవగా, ప్రస్తుతం 6 స్థానం దక్కించుకున్నట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే 20.27 శాతం ఫలితాలు పెరగడం విశేషం. బాలికలదే హవా పది పరీక్షలకు 10,793 మంది బాలురు హాజరుకాగా 9596 మంది ఉత్తీర్ణత చెందారు. అలాగే 10,146 మంది బాలికలు పరీక్షలు రాయగా 9517 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 88.91 శాతం, బాలికలు 93.8 మొత్తం 91.28 ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొదటి డివిజన్లో 15,463 మంది జిల్లావ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో 15,463 మంది మొదటి డివిజన్లో ఉత్తీర్ణత సాధించారు. రెండో డివిజన్లో 2593 మంది, మూడో డివిజన్లో 1057 మంది మొత్తం 19,113 మంది ఉత్తమ ఫలితాలు సాధించారు. కేజీబీవీ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలు జిల్లా వ్యాప్తంగా కేజీబీవీ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం అధునాతనంగా తీర్చిదిద్దింది. ఈ పాఠశాలల్లో చదువుతున్న బాలికల చదువుకు పేదరికం ఏ మాత్రం అడ్డుకాకుడదని సకల సౌకర్యాలనుకల్పించింది. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకున్న బాలికలు పది ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత శాతం సాధించారు. జిల్లాలోని 8 కేజీబీవీ పాఠశాలల్లో 5 బడులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. రామకుప్పం కేజీబీవీలో చదివిన నేత్ర 600 మార్కులకు 569, గుడుపల్లె కేజీబీవీలో పుష్పలత 565, బైరెడ్డిపల్లి, శాంతిపురం కేజీబీవీల్లోని మాధవి, మహేశ్వరి 552 మార్కులను సాధించి శభాష్ అనిపించుకున్నారు. – 8లో– 8లో– 8లోన్యూస్రీల్ పదోతరగతి ఉత్తీర్ణతలో జిల్లాకు 6వ స్థానం 20,939 మందికి గాను 19,113 మంది పాస్ సత్తా చాటిన సర్కారు బడుల విద్యార్థులు 93.80శాతంతో పైచేయి సాధించిన బాలికలు ప్రైవేట్ స్కూళ్లలో 4,756 మంది.. ప్రభుత్వ పాఠశాలల్లో 14,357 మంది ఉత్తీర్ణులు కేటగిరీ ఫస్ట్క్లాస్లో ఉత్తీర్ణులు పాస్ అయినవారు ఉత్తీర్ణత శాతం ఎయిడెడ్ 139 194 95.57 బీసీ వెల్ఫేర్ 116 121 100.00 ప్రభుత్వ 708 1078 79.38 కేజీబీవీ 258 290 95.71 మున్సిపల్ 423 630 78.36 ఆదర్శ పాఠశాలలు 430 458 98.49 ప్రైవేట్ స్కూళ్లు 4,439 4,756 97.40 ఏపీ రెసిడెన్షియల్ 111 112 100.00 ఏపీ సోషల్వెల్ఫేర్ 442 472 98.74 ఏపీ ట్రైబల్వెల్ఫేర్ 61 82 91.11 జిల్లా పరిషత్ 8,336 10,920 88.39 మొత్తం 15,463 19,113 90.28 మే 24 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పదోవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి జూన్ 3 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 23 నుంచి 30 వ తేదీ లోగా అపరాధ రుసుం లేకుండా సంబంధిత పాఠశాలల హెచ్ఎంలకు పరీక్ష ఫీజు చెల్లించాలి. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ అప్లికేషన్లను www.bse. ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రీ కౌంటింగ్ కు దరఖాస్తు చేసుకునే వారు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకునే వారు సబ్జెక్టుకు రూ.1000 చొప్పున సీఎఫ్ఎంఎస్ చలానా ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు నేతపై ఆధారపడి జీవించే కుటుంబం కావడంతో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనే మా కుమారుడు సంతోష్ను చదివించాం. అయితే విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాఠశాల మెరుగుపడింది. టాయిలెట్లు, తాగునీటి సౌకర్యం, ప్రతి గదికి వెలుతురు, గాలి బాగా ఉందేలా లైట్లు, ఫ్యాన్లు అమర్చారు. గ్రీన్ బోర్డు పెట్టారు. ప్రైవేటు పాఠశాల కంటే ప్రభుత్వ బడి మెరుగుపడింది. మా కుమారుడు మంచి పాఠశాలలో చదువుతున్నాడన్న ఆనందం మాకూ కలిగింది. ప్రస్తుతం పదవ తరగతి పరీక్షల్లో 600 మార్కులకు 577 మార్కులు సాధించి మండలంలో రెండవ స్థానంలో నిలిచాడు. మాకు ఎంతో ఆనందంగా ఉంది. – బాలాజీ, హేమావతి అందరూ శభాష్ అంటున్నారు ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలంటే అందరికీ చులకనగా ఉండేది. నేడు ఆ పరిస్థితి లేదు. పాఠశాలలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద పెట్టడంతో అవి కూడా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మారిపోయాయి. ఇక్కడే మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారు. ఇంగ్లిషు మీడియం అందుబాటులో ఉంది. ఇంగ్లిష్ ల్యాబ్ ఉంది. చదువుతో పాటు ఆడుకునేందుకు కూడా పరికరాలు అందిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఆరోగ్యంగా చదువుకుంటున్నారు. ఇలాగే మా కుమారుడు తమిళ్సెల్వన్ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే బాగా చదువుకుని 577 మార్కులు సాధించి మండలంలో రెండో స్థానంలో నిలిచాడు. అందరూ శబాష్ అంటున్నారు. మాకు గర్వంగా ఉంది. – విశ్వనాథన్, తేన్మొళివసతి గృహాల్లో 88.41 శాతం జిల్లా వ్యాప్తంగా 37 సాంఘిక సంక్షేమ వసతి గృహాలున్నాయి. ఇక్కడి విద్యార్థులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది. ఈ వసతి గృహాల నుంచి 302 మంది విద్యార్థులు పది పరీక్షలు రాశారు. ఇందులో 267 మంది పరీక్షలు ఉత్తీర్ణత పొందారు. 88.41 శాతం ఉత్తీర్ణతతో సత్తీ చాటారు. -
వైఎస్సార్సీపీ గెలుపు తథ్యం
పెనుమూరు(కార్వేటినగరం) : సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు తథ్యమని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ అధికార పగ్గాలు చేపడతారని ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం స్పష్టం చేశారు. సోమవారం పెనుమూరు మండలం పెద్ద కావూరి వారిపల్లె, మోపిరెడ్డిపల్లె, గుడ్యాణంపల్లె పంచాయతీల్లో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహాసముద్రం దయాసాగర రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థి కళత్తూరు కృపాలక్ష్మికి ఆయా గ్రామాల్లో ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ నానాజాతి సమితిగా కూటమి కట్టిన పార్టీలు ఒక్క వైపు ఉంటే, సంక్షేమం, చక్కటి అజెండాతో ప్రజా ఆశీస్సులు కోరుతూ జగనన్న ఒక్కరే ఓ వైపు ఉన్నారని వెల్లడించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు విజయకుమార్, మండల మాజీ అధ్యక్షుడు సురేష్రెడ్డి, ఎంపీపీ హేమలతరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు దొరస్వామి, సింగిల్ విండో అధ్యక్షుడు గోవిందరెడ్డి, నియోజకవర్గ మహిళ అధ్యక్షులు యశోదారెడ్డి, ఏఎంసీ చైర్మన్ కమలాకరరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు దూది మోహన్, వైస్ ఎంపీపీ కోదండన్, జిల్లా యువత ప్రధాన కార్యదర్శి గిరిధర్రెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కృష్ణారెడ్డి, మండల యువత అధ్యక్షుడు లోకేష్ రెడ్డి, నేతలు పులికల్లు బాలాజీరెడ్డి, పూర్ణ చంద్రారెడ్డి, జయచంద్రారెడ్డి, నవీన్ కుమార్రెడ్డి, దేవరాజులు రెడ్డి, గంధం ముని, నీలా పండరినాథ్, గంగుపల్లె రవి, మాజీ సర్పంచ్లు ఎన్.నరసింహారెడ్డి, పి.ఈశ్వరరెడ్డి, రాజారెడ్డి, దాము పాల్గొన్నారు. -
సంక్షేమ పాలనను ఆశీర్వదించండి
పెద్దపంజాణి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పాలనను ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప కోరారు. సోమవారం మండలంలోని మాదనపల్లెలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రెడ్డెప్ప మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వేకువనే సామాజిక పింఛన్లు అందాలన్నా.. పేద బిడ్డలకు ఉన్నత చదువులు అందుబాటులోకి రావాలన్నా.. పేదలకు ఖరీదైన వైద్యం అందాలన్నా రెండు ఓట్లను ఫ్యాను గుర్తుపై వేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా వెంకటేగౌడను, ఎంపీగా తను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డెప్ప, పార్టీ మండల కన్వీనర్ బాగా రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు సుష్మకీర్తి, వైస్ ఎంపీపీలు జీడీ బాబు, ఆంజమ్మ తదితరులు పాల్గొన్నారు. -
నాలుగో రోజు 39 నామినేషన్లు
చిత్తూరు కలెక్టరేట్ : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సోమవారం నాలుగో రోజు 36 మంది 39 సెట్ల నామినేషన్లను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో దాఖలు చేశారు. జిల్లాలోని చిత్తూరు పార్లమెంట్, మిగిలిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్లు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు. చిత్తూరు పార్లమెంట్ స్థానానికి నలుగురు అభ్యర్థులు ఏడు సెట్లు నామినేషన్లను దాఖలు చేశారు. కలెక్టరేట్లో ఆర్ఓ షణ్మోహన్కు అభ్యర్థులు నామినేషన్ పత్రాలను అందజేశారు. వైఎస్సార్సీపీ తరపున రెడ్డెప్ప 2 సెట్లు, ఆయన భార్య రెడ్డెమ్మ 2 సెట్లు, నాగేశ్వరరావు (జాతీయ జనసేన పార్టీ) –1 సెట్, జానకిరామారావ్ (నేషనల్ మహాసభ పార్టీ)–1, చిట్టిబాబు (కాంగ్రెస్) –1 సెట్ నామినేషన్ వేశారు. చిత్తూరు అసెంబ్లీ పరిధిలో ప్రభాకర్రెడ్డి (ఇండిపెండెంట్), ప్రతిమ (టీడీపీ–2 సెట్లు), ఇందుమతి (వైఎస్సార్సీపీ తరపున)–2 సెట్లు, ఇండిపెండెంట్–2 సెట్లు), తుకారామ్–1 (కాంగ్రెస్) నామినేషన్లను ఆర్ఓ శ్రీనివాసులుకు అందజేశారు. పుంగనూరు నియోజకవర్గంలో 5 మంది అభ్యర్థులు 5 సెట్లు, నగరిలో ఒక అభ్యర్థి, జీడీ నెల్లూరులో నలుగు గురు అభ్యర్థులు, పూతలపట్టులో 6 మంది అభ్యర్థులు 7 సెట్లు, పలమనేరులో 6 మంది అభ్యర్థులు 6 సెట్లు, కుప్పంలో 6 మంది అభ్యర్థులు 6 సెట్లు నామినేషన్లను ఆయా ఆర్ఓలకు సమర్పించారు. కుప్పంలో భరత్ తరఫున (వైఎస్సార్సీపీ) ఆయన సతీమణి దుర్గ నామినేషన్ అందజేశారు. -
విశ్వంలో ఉచిత ఏపీఆర్జేసీ మోడల్ ఎంట్రెన్స్ టెస్ట్ రేపు
తిరుపతి ఎడ్యుకేషన్: తిరుపతి వరదరాజనగర్ లోని విశ్వం టాలెంట్ స్కూల్లో బుధవారం ఉదయం 10 గంటలకు విద్యార్థులకు ఏపీఆర్జేపీ మోడల్ ఎంట్రెన్స్ టెస్ట్ ఉచితంగా నిర్వహించనున్నట్టు విశ్వం విద్యా సంస్థల అధినేత, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి తెలియజేశారు. ఏప్రిల్ 25న రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షకు అనుగుణంగా ఈ నమూనా పరీక్ష నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు, ఈ ఉచిత నమూనా పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ జిరాక్స్ కాపీతో హాజరు కావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 86888 88802 / 93999 76999 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు. -
పుంగనూరులో నల్లారి ప్లాప్ షో
● కూటమి అభ్యర్థుల సభకు జనం కరువు ● తెలుగుదేశం నేతల కోడ్ ఉల్లంఘన ● బాణసంచా హోరు ● జనాలకు మద్యంగంటల కొద్దీ జనం కోసం.. టీడీపీ అభ్యర్థి చల్లాబాబు బాలాజీ థియేటర్ వద్ద నుంచి పట్టణంలోని ప్రధాన రహదారి ఎంబీటీ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు నానాతంటాలు పడ్డారు. పలువురు శాపనార్థాలు పెట్టడం కనిపించింది. ర్యాలీకి జనం రాకపోవడంతో ముందుగా బాణసంచా భారీ ఎత్తున కాల్చారు. అలాగే డీజే పాటలు, డ్యాన్స్లతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగించారు. ర్యాలీకి వచ్చిన అద్దె జనానికి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద షామియానాలు వేసి భోజనాలు ఏర్పాటు చేశారు. మండుటెండలో తాగునీరు లేక, భోజనం రుచిగా లేకపోవడంతో ప్రజలు తినకుండా అక్కడే పడేసి వెళ్లడం కనిపించింది.పుంగనూరు: కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. సోమవారం రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి, పుంగనూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లారామచంద్రారెడ్డి పట్టణంలోని గోకుల్ సర్కిల్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. బాణసంచా పెద్ద ఎత్తున కాల్చా రు. డీజేపాటలు పెట్టి డ్యాన్సులు చేశారు. మద్యాన్ని విచ్చలవిడిగా తాగించారు. ఆపై భోజనం రుచిగా లేదంటూ అద్దెజనం అక్కడి నుంచి వెళ్లిపోయారు. కట్టుకథల కిరణ్ కూటమి అభ్యర్థుల సభ జనం లేక వెలవెలబోయింది. తొలుత చల్లా రామచంద్రారెడ్డి ప్రసంగిస్తుండగా జనం వెళ్లి పోతుండడంతో కిరణ్కుమార్రెడ్డి మైకు అందుకుని మాట్లాడారు. మంత్రి పెద్దిరెడ్డిపై ఆయన పలు విమర్శలు చేశారు. పాల దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. ఇదేంటి కిరణ్ ఇలా మాట్లాడుతున్నారంటూ గుసగుసలాడడం కనిపించింది. రూ.300, క్వార్టర్ అద్దె జనానికి భారీగా నగదు, మద్యం పంపిణీ చేసినట్టు ఆయా పార్టీల కార్యకర్తలే చెబుతున్నారు. ఒక్కొక్కరికి రూ.300, క్వార్టర్ బాటిల్, బిరియానీ అందజేశారు. మద్యం షాపుల వద్ద టీడీపీ జెండాలు చేతబట్టిన కార్యకర్తలు కిక్కిరిసిపోయారు. -
Kuppam: బాబుకు ఓటమి భయం!
కుప్పం కోటపై చంద్రబాబుకు నమ్మకం సడలుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయం వెంటాడుతోంది. ఇన్నేళ్లుగా మోసిన జనం ఇప్పుడు ముఖం చాటేస్తుండడంపై ఆందోళన పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేతకు తెలుగు తమ్ముళ్ల సమర్థతపై అనుమానం మొదలైంది. అందుకే ఇతర ప్రాంతాల నుంచి సొంత మనుషులను కుప్పానికి తరలిస్తున్నారు. ఎలక్షన్ మేనేజర్ల పేరిట నేతల ఇళ్లలో తిష్ట వేయిస్తున్నారు. ప్రచారం నుంచి తాయిలాల పంపిణీ వరకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నారు. బాబు వ్యవహారిశైలికపై స్థానిక నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన తమను విశ్వసించకుండా బయటి వారిని తెచ్చిపెట్టడంపై లోలోపల రగిలిపోతున్నారు. శాంతిపురం : కుప్పం నియోజకవర్గంలోని టీడీపీ నాయకులను నమ్మకుండా ప్రకాశం జిల్లా నుంచి తన సామాజికి వర్గానికి చెందిన కంచెర్ల శ్రీకాంత్కు చంద్రబాబు పెద్దపీట వేశారు. నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఎన్నికల వేళ సైతం గ్రామ స్థాయిలోని పార్టీ కార్యకర్తలు, నాయకులపై కూడా అపనమ్మకంతో సొంత మనుషులతో నిఘా ఏర్పాట్లు చేస్తున్నారు. వంద మంది మేనేజర్లు కుప్పంలో ఎన్నికల పర్యవేక్షణకు బయటి ప్రాంతాల నుంచి తన సొంత మనుషులు వందమందిని చంద్రబాబు మోహరిస్తున్నట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ప్రతి 3 పోలింగ్ కేంద్రాలకు ఒకరి చొప్పున ఎలక్షన్ మేనేజర్ల పేరుతో ఇక్కడికి తీసుకువస్తున్నారు. బెంగళూరులోని టీడీపీ ఐటీ ఫోరమ్ ద్వారా బెంగళూరు, హైదరాబాదులో గుర్తించిన దాదాపు వంద మందిని తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం కుప్పానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి దాదాపుగా రోజూ బెంగళూరు–కుప్పం మద్య చక్కర్లు కొడుతున్నారు. ఆయా మేనేజర్లు తమ పోలింగ్ కేంద్రాల పరిధిలోని టీడీపీ నాయకుల బంధువులుగా చెప్పుకుని వారి ఇళ్లలోనే బస చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా వచ్చే వారి బసకు ఇబ్బంది లేకుండా వసతులు ఉన్న నాయకుల ఇళ్లను ఇప్పటికే గుర్తించారు. ఈ నెల 26 నుంచి మే 12వ తేదీ రాత్రి వరకూ బయటి వ్యక్తులు స్థానికంగా మకాం వేసి పార్టీ వ్యవహారాలను నడపనున్నారు. ప్రచారం సాగాల్సిన తీరును పర్యవేక్షిస్తూ కింది స్థాయి నాయకులు, కార్యకర్తలను వారు సమన్వయం చేయనున్నారు. తమపై పరిశీలకుల కన్ను ఉంటే పార్టీ క్యాడర్ రాజీ పడకుండా పనిచేస్తారని ఈ ఏర్పాటుకు చంద్రబాబు ఆలోచన చేసినట్లు తెలిసింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు జరిపే పంపకాలు కూడా వీరి ద్వారానే నిర్వహించి, పోలింగ్ ముందు రోజు రాత్రి వారంతా స్వస్థలాలకు వెళ్లి ఓటు వేసేలా వ్యూహరచన చేసుకున్నారు. కానీ ఇంత కాలం పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన తమను ఎన్నికల వేళ నమ్మకుండా అవమానిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు కుమిలిపోతున్నారు. అలవి కాని హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయకపోగా కాలకేయుల్లాంటి నాయకులను ప్రోత్సహించిన తమ అధినేత, ఇప్పుడు తమను చేతకాని వాళ్లుగా నిలబెడుతున్నారని ఓ సీనియర్ కార్యకర్త వాపోయారు. చివరకు ఎన్నికలకు ముందే చంద్రబాబు ఓటమి భయం రుచిచూస్తున్నారని వెల్లడించారు. తగ్గిన జనాదరణ కుప్పం నుంచి తొలుత 1989 ఎన్నికల్లో చంద్రబాబు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పుడు 52.65 శాతం ఓట్లు సాధించారు. తర్వాత ప్రత్యర్థి పార్టీల నాయకులను ప్రలోభ పెట్టి తన దారికి తెచుకోవడం ద్వారా నియోజకవర్గంపై క్రమంగా పట్టు బిగించారు. 1994లో గరిష్టంగా 75.49 శాతం ఓట్లు సాధించారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రస్థానం ప్రారంభమైన తర్వాత కుప్పంలో కూడా బాబు ప్రభ తగ్గడం మొదలైంది. 2014లో 62.59 శాతం ఓట్లు రాగా, 2019లో 55.18 శాతం ఓట్లు మాత్రమే సాధించారు. అనంతరం వివక్ష లేని సుపరిపాలనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అశేష ప్రజాదరణ సొంతం చేసుకున్నారు. కుప్పం ప్రజల మనసును గెలుచుకున్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం ప్రజలు సైతం వైఎస్సార్సీపీకే జైకొట్టారు. దీంతో అసలు సంగతి చంద్రబాబుకు బోధపడింది. ఇక కల్లబొల్లి కబుర్లును కుప్పం వాసులు నమ్మరని అర్థమైంది. అందుకే తరచూ కుప్పంలో పర్యటనలు ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో సైతం తన సతీమణి నారా భువనేశ్వరి చేతులమీదుగా నామినేషన్ వేయించారు. ఆమె కూడా కుప్పంలోనే మూడు రోజులపాటు తిష్ట వేసి నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
వైఎస్సార్సీపీలోకి వలసల వెల్లువ
పుంగనూరు : జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీలోకి టీడీపీ నేతలు భారీగా చేరారు. అందులో భాగంగా సోమవారం పుంగనూరులో ముస్లిం నేతలు ఎంఎం సాధిక్, సీమ జిల్లాల మైనారిటీ సెల్ ఇన్చార్జ్ ఫకృద్ధీన్షరీఫ్ ఆధ్వర్యంలో రాంనగర్ కాలనీకి చెందిన అబ్బొడు, శీన, రాజా, వెంకటేష్, సుధా, సిద్దప్ప, ధన, మధు, మున్వర్సాబ్, జలీల్సాబ్, అక్భర్, రహీమ్, సౌఖత్, జావీద్, అక్రమ్, సైపుల్లా, కరీంసాబ్ పార్టీలో చేరారు. వీరికి మంత్రి, ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. చిత్తూరులో.. చిత్తూరు కార్పొరేషన్: గుడిపాల మండలం బసవపల్లె పంచాయతీ దళితవాడకు చెందిన టీడీపీ నాయకులు చంద్రబాబు, రాజేష్, అన్బు, సతీష్, విజయ్కుమార్, సురేష్, ఆనంద్రాజ్, అల్వార్, ఇమాన్, అరుణ్, మునిరాజ్, శశి, నవీన్, నరేష్, అర్విన్లతో కలిపి మొత్తం 30 కుటుంబాలు వైఎస్సార్సీపీలోకి వచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నగరానికి చెందిన మైనార్టీ నాయకులు ముజీబ్, ఫైరోజ్, జూనీద్ ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు. గంగవరంలో.. గంగవరం : మండలంలోని నల్లసానిపల్లి గ్రామానికి చెందిన దాదాపు 15 కుటుంబాలవారు ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేగౌడ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో సుబ్రమణ్యం, చిట్టిబాబు, వెంకటరమణ, పెద్దన్న, అమరనాథ్, రమణయ్య, జగదీష్, గజేంద్ర, మంజుల, చిన్నబిడ్డమ్మ, నరేంద్ర, శ్రీనివాసులు, టి.వెంకటరమణ ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ మోహన్రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ ప్రహ్లాద, నాయకులు చంద్రప్ప, గిరిరాజారెడ్డి, మోత్కుపల్లి మణి, చెన్నకృష్ణ, శంకరయ్య, నారాయణ, అమరేంద్ర, కుమార్ తదితరులు పాల్గొన్నారు. కుప్పంలో.. కుప్పంరూరల్: మండలంలోని యనమనాశనపల్లె, పరకుంట్ల గ్రామాలకు చెందిన 20 కుటుంబాలు వారు వైఎస్సార్ సీపీలో చేరారు. ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో వెంకటాచలం,రాజశేఖర్, నాగరాజు, శంకరప్ప తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లిక, నాయకులు సురేష్, శంకరప్ప, శ్రీరాములు, మణి, ప్రకాశ్, చంద్రప్ప పాల్గొన్నారు. -
● తొలిరోజు జిల్లాలో మొత్తం 15 నామినేషన్ల దాఖలు ● అట్టహాసంగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లు ● భారీ సంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు ● డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ రెడ్డెప్పతో కలసి విజయానందరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డితో కలసి వెంకటేగౌడ నామినేషన్
సాక్షి, చిత్తూరు/చిత్తూరు కలెక్టరేట్ : సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే గురువారం జిల్లాలో నామినేషన్ల పర్వం మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని చిత్తూరు పార్లమెంట్ స్థానం, జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలకు కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రిటర్నింగ్ అధికారులు ఆయా ఆర్ఓ కార్యాలయాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. తొలిరోజు 15 నామినేషన్లు దాఖలు.... జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నామినేషన్ల పర్వం సాగింది. తొలిరోజు 15 నామినేషన్లు దాఖలయ్యాయి. చిత్తూరు పార్లమెంట్ స్థానానికి టీడీపీ అభ్యర్థి దగ్గుముళ్ల ప్రసాదరావు కలెక్టరేట్లో ఆర్ఓ షణ్మోహన్కు ఒక సెట్ నామినేషన్ అందించారు. పుంగనూరు నియోజకవర్గంలో చల్లా రామచంద్రారెడ్డి (టీడీపీ), చల్లా పూజారెడ్డి (టీడీపీ), జి.మురళిమోహన్ (కాంగ్రెస్), కందడి షేక్ అన్వర్ భాషా (సోషియల్ డెమోక్రటిక్ పార్టీ), నగరిలో జి.భానుప్రకాష్ (టీడీపీ), గంగాధరనెల్లూరు లో ఉసురుపతి పద్మనాభం (ఇండిపెండెంట్), రత్నవేల్ గాంధీ (టీడీపీ), చిత్తూరు అసెంబ్లీకి ఎంసీ విజయానందరెడ్డి (వైఎస్సార్సీపీ–3 సెట్లు), జీసీ జగన్మోహన్ (టీడీపీ–2 సెట్లు), పలమనేరులో ఎన్.వెంకటేగౌడ (వైఎస్సార్సీపీ), పావని (వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి) నామినేషన్ వేశారు. కుప్పం, పూతలపట్టు నియోజకవర్గాల్లో తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. చిత్తూరులో.. విజయానందరెడ్డి నామినేషన్ వేసేందుకు నగరంలోని గంగినేని చెరువు నుంచి విజయా డెయిరీ వరకు ర్యాలీగా వచ్చారు. పెద్దసంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ రెడ్డెప్ప, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డితో కలిసి విజయానందరెడ్డి జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ సమర్పించారు. జన ప్రవాహమే..! నామినేషన్ ఘట్టానికి జనప్రవాహంలా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని వైఎస్సార్సీపీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంసీ విజయానందరెడ్డి తెలిపారు. ఎండను సైతం లెక్కచేయకుండా ర్యాలీలో పాల్గొన్నారని ఆనందం వ్యక్తం చేశారు. అభిమానం చూపిన ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు. ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ పేదలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో మేలు చేశారన్నారు. మరోసారి ఆయనను సీఎంగా చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ ఎన్నికల తర్వాత టీడీపీ నామరూపాలు లేకుండా పోతుందని స్పష్టం చేశారు. కుప్పంలో సైతం చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని వెల్లడించారు. -
వైఎస్సార్సీపీలోకి వలసల వెల్లువ
● పుంగనూరులో దాదాపు టీడీపీ ఖాళీ ● మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో భారీగా చేరికలు పుంగనూరు : జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగా గురువారం పుంగనూరుకు చెందిన పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ పసుపుల కేశవమూర్తి, ఆయన సతీమణి, మాజీ కౌన్సిలర్ ఆనంతలక్ష్మీతో సుమారు 70 మందికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కౌన్సిలర్ రెడ్డెమ్మ, కిషోర్, వైఎస్సార్సీపీ నాయకులు రాయల జగదీష్, ఎస్వీటీ కిషోర్ల ఆధ్వర్యంలో పసుపుల కుటుంబాలకు చెందిన బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు పార్టీలో చేరడంతో తెలుగుదేశం నేతలు షాక్కు గురయ్యారు. అలాగే నక్కబండకు చెందిన హైదర్ ఆధ్వర్యంలో 40 మంది ముస్లిం మహిళలు టీడీపీ వీడి వైఎస్సార్సీపీలో చేరారు. ఈ క్రమంలోనే మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర ఆధ్వర్యంలో కట్టకిందపాళ్యానికి చెందిన మనోహర్, రెడ్డెప్ప, బాలు, శంకర, పవన్కల్యాణ్తో పాటు 20 మంది టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ కేశవమూర్తి కుటుంబం రాకతో పార్టీ మరింత బలోపేతమైందన్నారు. ఆయనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని, పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. కేశవమూర్తి మాట్లాడుతూ 30 ఏళ్లలో ఎన్నడూ జరగని అభివృద్ధి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ ఐదేళ్లలోనే జరిగిందని వెల్లడించారు. కార్యక్రమంలో టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు పోకల అశోక్కుమార్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, నియోజకవర్గ పరిశీలకుడు జింకా వెంకటాచలపతి, ఎన్ఆర్ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిలర్ ముత్తంశెట్టి విశ్వనాథ్, రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, పీకేఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, బలిజ సంఘ నాయకులు ప్రభాకర్, మల్లికార్జున , రమణ, హరీష్, రెడ్డెప్ప పాల్గొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి సమక్షంలో చేరిన గణేష్యాదవ్ పలమనేరు : నియోజకవర్గంలో కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలను చేపడుతూ ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావించిన రియల్టర్ గణేష్యాదవ్ తన అనుచరులతో కలసి వైఎస్సార్సీపీలో చేరారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గణేష్ యాదవ్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం తథ్యమని, జగనన్నే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి ఆశీస్సులతో పలమనేరులో వైఎస్సార్సీపీ జెండాను మళ్లీ ఎగురవేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఏఎంసీ చైర్మన్ హేమంత్కుమార్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, సంయుక్త కార్యదర్శి ఆకుల గజేంద్రప్రసాద్, చలపతి రెడ్డి పాల్గొన్నారు. ఐరాల: తవణంపల్లె మండలం ఉత్తరబ్రాహ్మణపల్లెకు చెందిన వైఎస్సార్సీపీ నేత రమాదేవి తిరిగి సొంతగూటికి చేరారు. గురువారం మండలంలోని ఎం.పైపల్లె వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, నియోజకవర్గ అదనపు పరిశీలకులు శైలజాచరణ్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు సుచిత్ర సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. రమాదేవి మాట్లాడుతూ 2014 నుంచి వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా పనిచేశామన్నారు. 2019 ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో మనస్తాపం చెంది పార్టీకి దూరమైనట్లు వెల్లడించారు. అయితే టీడీపీ నాయకలు ఎంతగా ప్రలోభాలకు గురిచేనా అటు వైపు వెళ్లలేదన్నారు. వైఎస్సార్సీపీ పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్కుమార్ పిలుపు మేరకు సొంతగూటికి రావడం ఆనందంగా ఉందని వివరించారు.నగరి : నిజాయితీగా ఉన్నారు.. పేదలకు మంచిచేస్తున్నారు నిండుమనసుతో మీవెంట వచ్చేస్తున్నాం అంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. గురువారం నగరి దళితవాడ నుంచి 40 మంది కాంగ్రెస్ వారు వైఎస్సార్సీపీ నేత అముద ఆధ్వర్యంలో మంత్రి ఆర్కే రోజా కార్యాలయం పార్టీలో చేరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో కాంగ్రెస్ నేత జాన్, ఆల్ ఇండియా అంబేడ్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్, సుకుమార్, ఆనంద్ రాజ్, పరమానందం, మారన్, ప్రతాప్, లారెన్న్స్, అభిషేక్, ప్రతాప్, ఏసు, ప్రసిల్లా, సెల్వి, సంపూర్ణ, జ్యోతి, దయానిధి, జాయిస్ తదితరులు ఉన్నారు. వీరికి మంత్రి రోజా కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన నేతలు మాట్లాడుతూ ప్రస్తుతం పేదల పాలిట సువర్ణ యుగం నడుస్తోందన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ఎలాంటి సిఫార్సులు లేకుండా అన్నీ అందుతున్నాయని వెల్లడించారు. గతంలో టవర్క్లాక్ సెంటర్ వద్ద పనిచేసే కూలీలకు సమయం తెలుసుకోవాలన్నా వీలుపడేది కాదన్నారు. మంత్రి రోజా రూ.3 లక్షల సొంత నిధులతో టవర్ క్లాక్ను మరమ్మతులు చేయించారని వివరించారు. మేము చేసిన అభివృద్ధి ఇది.. మేము అమలుచేసిన సంక్షేమం దానికి వెచ్చించిన నగదు ఇది అంటూ నిజాయితీగా ప్రజలకు చూపించి ఓటు అడుగుతున్న ఏకై క పార్టీ వైఎస్సార్పీపీ అని కొనియాడారు. ఆర్ఎంపీల చేరిక కుప్పం: నియోజకవర్గంలోని ఆర్ఎంపీ అసోసియేషన్ సభ్యులు 20 మంది వైఎస్సార్ సీపీ చేరారు. గురువారం పట్టణంలోని పార్టీ కార్యాలయ ప్రాంగణంలో వారికి మంత్రి పెద్దిరెడ్డి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు రెడ్డెప్ప, భరత్ గెలుపునకు కృషి చేస్తామని తెలిపారు. -
చిత్తూరు @ 40
చిత్తూరు కలెక్టరేట్: మండే ఎండలతో జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. వడగాలులకు జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చిత్తూరులో గురువారం అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రోజుల్లో ఎండలు మరింత తీవ్రరూపం దాల్చుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఉక్కపోత మండే ఎండలు, వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రతతో పాటు ఉక్క పోత మొదలవుతోంది. ఇక మధ్యాహ్నం నుంచి 3 గంటల వరకు తీవ్ర ఎండలు నమోదవుతున్నాయి. సూర్యుడు నిప్పులు కక్కుతూ దూసుకొస్తున్నాడు. జనం వీధిలోకి రావడానికి భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎన్నికల సిబ్బంది సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
నవరత్నాలు గిర్ర్ర్ర్ర్ర్... సూపర్ సిక్స్ తుర్ర్ర్ర్ర్ర్
ఏమబ్బా! ఆయన ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఇదేమన్నా ప్రకాశం..ఒంగోలు అనుకున్నాడా ఏందీ? కార్యకర్తలను ఓ అని సతాయిస్తావుండాడే. ఎలక్షన్లు అందరికీ తెలుసూ. చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ పథకాల హామీల గురించి జెనాలకు చెబుతావుంటే వాళ్లినాలి కదా! వాటి గురించి జెనాలకు చెప్పండా.. చెప్పాండా.. అని శ్రీకాంత్ అంటావుండారు..జెనంలో అయితే రెస్పాన్సు లేదప్పా.. మొన్న మావూర్లో ప్రచారం చేస్తిమా...చంద్రబాబును గెలిపిచ్చి సీఎం చేస్తే తల్లికి వందనం కింద 20 వేలు ఇస్తారని చెప్తిమా..ఆయమ్మ ఏమనిందో గుర్తుంది కదా!?.. మాకు అమ్మఒడి కింద జగనన్న 15 వేలిస్తాండాడు..అని నవ్వాతా చెప్పి తలుపేసుకుని ఇంట్లోకి ఎల్లిపాయె. జనాలు ముందు మాదిరిగా లేదప్పా .. చాలా వుషారుగా ఉండారు..జగనను ఎన్నో ఇస్తాండాడు..ఇప్పుడు ఆయన పథకాలకు పేర్లు మార్చి, ఇంక కొత్తగా మీరిచ్చేదేందప్పా? అని ఆడోళ్లు ముకానే అడగతాండారు. ఆ మాదిరి చెప్తే తలకాయ యాడబెట్టుకోవాల? జెనం మైండులో జగను పథకాలే తిరగతాండాయప్పా.. సూపర్ సిక్స్ లేదప్పా..ఈ శ్రీకాంతు సారేమో జెనాలకు చంద్రబాబు పథకాల గురించి చెప్పండా.. చెప్పండా.. అని చాలా ఇబ్బంది పెడుతావుండాడు. అన్నదాత కింది చంద్రబాబు 20 వేలు ఇస్తాడని ఊళ్లో జెనాలకు పాంప్లేట్ ఇస్తే..మాకు రైతు భరోసా వస్తాందిలే అని ఆడోళ్లే చెప్తాండారు. జగన్ మోహన్రెడ్డి తైక్కుమంటే చాలు..పుసుక్కుమని బటను నొక్కి పథకాల డబ్బులు ఎన్నోసార్లు వేసి ఉండాడు.. అందుకే ఆడోళ్లు, మగోళ్ల మైండ్లలో జగను పథకాలన్నీ గిర్ర్ర్ర్ర్ర్ర్ర్..మని ఫ్యానులాగ తిరగతాండాయప్పా..మనవేమో తుర్ర్ర్ర్ర్ర్మంటాడాయప్పా..చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏ బటనూ నొక్కలా..! జన్మభూమి కమిటీలు చెప్పినోళ్లకే ఇచ్చినారు..అదే పెద్ద మైనస్సప్పా..మనం ఏం జెప్పినా చంద్రబాబు కన్నా ఇప్పటి ప్రభుత్వమే బాగా చేస్తాందని ఓటర్లు చెప్పేస్తాండారప్పా.. జగన్ పార్టీ కూడా స్త్రాంగైంది.. విలేజీల్లో ముందు మాదిరిగా లే..మన లీడర్లకు ఇది చెబితే పట్టించుకోరు.’’ భువనేశ్వరి వచ్చి నామినేషన్ వేసినా ఇంతేప్పా.. అని నిట్టూర్చారు తెలుగు తమ్ముళ్లు. టీడీపీ కార్యాలయం మీటింగ్ అయినా తరువాత నలుగురు కార్యకర్తల మధ్య బస్టాండులో పిచ్చాపాటీగా సాగిన సంభాషణ ఇది. ప్రజల్లో వైఎస్సార్ సీపీ పథకాలు ఎంత బలంగా ఉన్నాయో, వాటి ప్రభావం ఎంతగా ఉందో ఈ సంభాషణ చెప్పకనే చెప్పింది. –కుప్పం -
అభివృద్ధి.. సంక్షేమమే అజెండా
శాంతిపురం: కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి.. సంక్షేమమే అజెండాగా ముందుకు వెళుతున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గురువారం శాంతిపురం, రామకుప్పం మండలాల పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ కుప్పం భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్సీపీ ని ఆశీర్వదించాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ ఇచ్చి న మాట ప్రకారం హంద్రీ–నీవా కాలువ ద్వారా నీరందించారన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కాలువను ప్రారంభించాక వచ్చి ఎల్లో మీడియా ద్వారా అబద్ధాలు వల్లించి వెళ్లారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో కుప్పం ప్రజలు అంచనాలకు మించి వైఎస్సార్సీపీ అండగా నిలిచారని, ఇదే ఒరవడి ని కొనసాగిస్తూ భరత్ను సైతం గెలిపిస్తారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు మరో 20 రోజులు శ్రమిస్తే భరత్ గెలవడం, మంత్రి కావడం సులువుగా జరిగిపోతాయని చెప్పారు. ప్రతి కార్యకర్తకు అండగా నిలిచి, వారిని కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. సీమ ద్రోహి చంద్రబాబు చంద్రబాబు తాను పుట్టి, పెరిగిన రాయలసీమకు తీరని ద్రోహం చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసు కోసం ఉమ్మడి రాజధాని హైదరాబాద్, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. ఎన్నికల హామీలను అమలు చేసి, ప్రతి కుటుంబానికి మేలు చేసి, తన ఐదేళ్ల పాలనలో మంచి జరిగి ఉంటేనే తనకు ఓటు వేయాలని చెప్పిన దమ్మున్న నాయకుడు జగన్మోహన్రెడ్డి అని వివరించారు. ఈ మాట చెప్పే ధైర్యం 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు ఉందా ? అని ప్రశ్నించారు. అది లేకనే సూపర్ సిక్స్, బాబు గ్యారెంటీ అంటూ మళ్లీ మోసం చేసేందుకు వస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ మాట్లాడుతూ గతంలో నామినేషన్ వేయడానికి, ఓట్లు అడగడానికి కూడా కుప్పానికి రాకుండా చంద్రబాబు ఓటర్లను అవమానించారని విమర్శించారు. ఇప్పుడు ఓటమి భయంతోనే కుప్పం బాట పడుతున్నారని ఆరోపించారు. 35 ఏళ్లుగా పట్టించుకోని వ్యక్తి మళ్లీ అవకాశం ఇస్తే ఐదేళ్లలో అభివృద్ధి చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కుప్పం రాజకీయ చరిత్రను తిరగరాసేందుకు పార్టీ శ్రేణులతో కలిసి కృషి చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ సుబ్రమణ్యంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్కుమార్రెడ్డి, నియోజకర్గ పరిశీలకుడు మొగసాల రెడ్డెప్ప, నాయకులు మొగసాల కృష్ణమూర్తి, భూపేష్ గోపీనాథ్, రెస్కో వైస్ చైర్మన్ కోదండరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు శ్రీనివాసులు, నితిన్రెడ్డి, పార్టీ మండల కన్వీనర్లు బుల్లెట్ దండపాణి, విజలాపురం బాబురెడ్డి, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు చంగప్ప, పెద్దన్న, కృష్ణమూర్తి, సుబ్బరాజు పాల్గొన్నారు. కుప్పంలో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేద్దాం భరత్ను గెలిపించి ముఖ్యమంత్రికి కానుక ఇద్దాం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -
No Headline
జనసంద్రంగా మారిన వీధులు.. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు.. మద్దతు పలుకుతూ పెద్దసంఖ్యలో బారులు తీరిన ప్రజలు.. దశదిశలా మార్మోగిన జై జగన్ నినాదాల నడుమ వైఎస్సార్సీపీ పలమనేరు, చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థులు వెంకటేగౌడ, విజయానందరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజే సమరానికి సై అంటూ బరిలో దిగారు. ఈ సందర్భంగా వెంకటేగౌడను అఖండ మెజారిటీతో గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. విజయానందరెడ్డిని ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించాలని డిప్యూటీ సీఎం నారాయణస్వామి పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని విన్నవించారు. -
పోలింగ్ కేంద్రాల పరిశీలన
బంగారుపాళ్యం: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను గురువారం జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పరిశీలించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గురించి సీఐ లక్షుమయ్యను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు పోలీస్ స్టేషన్ను సందర్శించారు. స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి సిబ్బందికి తెలియజేశారు. పోలింగ్ కేంద్రాల్లో సమస్యలు తలెత్తితే తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. బైండోవర్లు, రౌడీషీటర్లు, అనుమానితులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఎంసీసీ కోడ్కు సంబంధించి చేపట్టాల్సిన చర్యలను గురించి సిబ్బందికి సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు సిబ్బంది సంసిద్ధంగా ఉండాలన్నారు. -
చిత్తూరు @ 40
జిల్లాలో ఎండలు మండుతున్నాయి. గురువారం గరిష్టంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.మాట్లాడుతున్న మంశ్రీత్రి పెద్దిరెడ్డి, అభివాదం చేస్తున్న వెంకటేగౌడపలమనేరులో.. వైఎస్సార్సీపీ పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.వెంకటేగౌడ సుమారు 10వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఓంశక్తి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన సతీమణి పావని కూడా మరో సెట్ నామినేషన్ను సమర్పించారు. అనంతరం ఓంశక్తి ఆలయం నుంచి టవర్ క్లాక్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులకు అఖండ విజయం చేకూర్చాలని పిలుపునిచ్చారు. – 8లో– 8లో -
నేడు పెద్దిరెడ్డి, మిఽథున్రెడ్డి నామినేషన్లు
పుంగనూరు : వైఎస్సార్సీపీ పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి శుక్రవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. స్థానిక హనుమంతరాయునిదిన్నెలోని శ్రీఅభయాంజనేయస్వామి ఆలయంలో పెద్దిరెడ్డి ముందుగా పూజలు నిర్వహించనున్నారు. అక్కడి నుంచి రామసముద్రం రోడ్డు, ఎన్ఎస్ పేట, పుంగమ్మ చెరువు కట్ట, బ్రాహ్మణవీధి, సెంటర్ లాడ్జి, నాగపాళ్యెం, ఇందిరా సర్కిల్ మీదుగా గోకుల్ సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టనున్నారు. అలాగే ఎంపీ మిథున్రెడ్డి తరఫున సీమ జిల్లాల మైనారిటీ సెల్ ఇన్చార్జి ఫకృద్ధీన్షరీఫ్ ఆధ్వర్యంలో ముస్లింలు రాయచోటికి వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు. నెలాఖరుకు వర్క్ ఆర్డర్లు క్లోజ్ చిత్తూరు కార్పొరేషన్: ట్రాన్స్కో అర్బన్ డివిజన్ పరిధిలోని ఏఈలు పెండింగ్లో ఉండే వర్క్ఆర్డర్లను ఈనెలాఖరులోపు క్లోజ్ చేయాలని సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం ఈఈ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్క్ఆర్డర్ల పై ప్రతినెలా గడువు ఇస్తున్నా ఏఈల తీరులో మార్పు రాలేదన్నారు. ఇప్పటికై నా పద్ధతి మార్చుకుని పనులు క్లోజ్ చేయాలని సూచించారు. డివిజన్ పరిధిలో పెండింగ్లోనిరూ.5 కోట్ల ప్రైవేటు సర్వీసుల మొండి బకాయిలను వసూలు చేయాలని స్పష్టం చేశారు. సంబంధిత సర్వీసులకు విద్యుత్ సరఫరా తొలగించినా, డబ్బులు సంస్థకు చెల్లించేలా కృషి చేయాలన్నారు. ప్రతినెలా 7వ తేదీలోపు వినియోగదారులకు విద్యుత్ బిల్లులను అందజేయాలని ఆదేశించారు. వందశాతం బిల్లుల వసూలుకు కృషి చేయాలని కోరారు. సెక్షన్ల పరిధిలో అదనపులోడ్ సర్వీసులను గుర్తించి క్రమబద్ధీకరణ చేయించాలని సూచించారు. సమావేశంలో ఈఈ పద్మనాభపిళ్లై, డీఈలు శేషాద్రి, జ్ఞానేశ్వర్, జేఏఓ గోవిందరాజులు, చంద్రశేఖర్ పాల్గొన్నారు. జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశం రేపుచిత్తూరు కార్పొరేషన్: ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా శనివారం జెడ్పీ 1–7 స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు సీఈఓ గ్లోరియా గురువారం తెలిపారు. ఆ రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సమావేశం ఉంటుందన్నారు. తాగునీటి సమస్య, వైద్య ఆర్యోగశాఖ అంశాల పై సమీక్షించనున్నట్లు వెల్లడించారు. జెడ్పీటీసీ సభ్యులు హాజరు కావాలని కోరారు. -
టీడీపీ ఎన్నికల ప్రచార వాహనం బోల్తా
చిత్తూరు కలెక్టరేట్ : సార్వత్రిక ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ను జిల్లాలోని ఆయా నియోజకవర్గాల ఆర్ఓలు ప్రచురించారు. గురువారం ఉదయం ఆయా ఆర్ఓల కార్యాలయాల్లో నోటిఫికేషన్ విడుదల చేసి వివరాలు వెల్లడించారు. కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షణ్మోహన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాదల ఆదేశాల మేరకు ఎన్నికలను పకడ్బందీగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మే 13న ఎన్నికల పోలింగ్ ఉంటుందన్నారు. జూన్4 ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందన్నారు. జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ జిల్లా వ్యాప్తంగా అమలులో ఉంటుందని వెల్లడించారు. పకడ్బందీగా నామినేషన్ల ప్రక్రియ జిల్లాలో పకడ్బందీగా నామినేషన్ల ప్రక్రియ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. చిత్తూరు ఆర్డీఓ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రతి రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ముందుగా వచ్చే అభ్యర్థి నామినేషన్ను పరిశీలిస్తామని చెప్పారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు నలుగురిని అనుమతిస్తామని వివరించారు. అభ్యర్థులు నామినేషన్లను నేరుగా ఆర్ఓలకే అందజేయాలని సూచించారు. అభ్యర్థులు అందజేసే అఫిడవిట్ను ఈసీ వెబ్సైట్లో పొందుపరుస్తామని, ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులకు ఏ సమస్య ఉన్నా నేరుగా ఆర్ఓల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. ఈ నెల 29న పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తామని వెల్లడించారు. ఏడు కేటగిరీలలో ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులందరూ పోస్టల్బ్యాలెట్ కోసం సంబంధిత హెచ్ఓడీ వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. మే 3వ తేదీ తర్వాత పోస్టల్ బ్యాలెట్ పేపర్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 29న సప్లిమెంటరీ ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని వివరించారు. సమావేశంలో జేసీ శ్రీనివాసులు, డీఆర్ఓ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. – ఐదుగురికి తీవ్రగాయాలు గుడిపాల : జనసేన పార్టీ మండల అధ్యక్షుడు రూపేష్కు టీడీపీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ఓ ఇన్నోవా కారును అందజేశారు. అందులో ప్రతిరోజు కొంతమంది యువకులను వెంటబెట్టుకొని రూపేష్ ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 197రామాపురం మార్గంలో అతివేగంగా కారణంగా కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఏఎల్పురం వడ్డియిండ్లకు చెందిన చిరంజీవి(26, ఖైదుగానికండ్రిగకు చెందిన ఆదికేశవులు(55), కొత్తకోట హరిజనవాడకు చెందిన సంతోష్(27), కిల్లారిపల్లెకు చెందిన డ్రైవర్ దాము(50)తోపాటు రూపేష్(33) గాయపడ్డారు. క్షతగాత్రులందరూ చీలాపల్లె వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్ఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
● ‘నవమి’.. నమామి!
జిల్లాలో ఉన్నత స్థానంలోని అధికారులు.. ఆపై ఎన్నికల హడావిడి.. ఏర్పాట్లపై సమీక్షలు. వరుస సమావేశాలు.. క్షణ తీరిక లేని పరిస్థితి. అయితే మన సంస్కృతి.. సంప్రదాయాలు.. పండుగలకు అధిక ప్రాధాన్యమిస్తారు. అందులో భాగంగానే బుధవారం శ్రీరామ నవమి వేడుకల్లో కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ మణికంఠ, జేసీ శ్రీనివాసులు భాగస్వాములయ్యారు. చిత్తూరులోని మిట్టూరు పోలీస్ క్వార్టర్స్లో ఉన్న రామమందిరంలో నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొన్నారు. సీతారాములకు పట్టువస్త్రాలను సమర్పించారు. కనులపండువగా దేవదేవేరుల కల్యాణోత్సవం జరిపించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీలు ఆరీఫుల్లా, నాగేశ్వరరావు, సుబ్బరాజు తదితరులు కుటుంబసమేతంగా పాల్గొన్నారు.– చిత్తూరు అర్బన్ -
బోయకొండలో రాహుకాల అభిషేకం
చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయంలో శుక్రవారం శాస్త్రోక్తంగా రాహుకాల అభిషేకం నిర్వహించారు. అర్చకులు వేకువ జామున ఆలయాన్ని శుద్ధి చేసి ఆలయాన్ని మామిడి, వేపాకు, పూలతోరణాలతో సుందరంగా ముస్తాబుచేశారు. 10:30 నుంచి 12 గంటల నడుమ రాహుకాల అభిషేకం జరిపించారు. పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు ఉపవాస దీక్షలతో మొక్కులు చెల్లించుకున్నారు . ఉభయదారులకు ఆలయ కమిటీ చైర్మన్ నాగరాజారెడ్డి చేతుల మీదుగా తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు. పకడ్బందీగా ఎంసీసీ పర్యవేక్షక్షణ – టీడీపీ ప్రచారంలో పాల్గొన్న ఉద్యోగికి నోటీసు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ నిబంధనల అమలును ఎంసీసీ బృందం పకడ్బందీగా పర్యవేక్షిస్తోంది. జిల్లా నోడల్ అధికారి మురళీకృష్ణ ప్రతి రోజు వస్తున్న ఫిర్యాదులు, పత్రికల్లో ప్రచురితమవుతున్న వార్తలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఫిర్యాదులను పరిశీలించి విచారణ చేపడుతున్నారు. అందులో భాగంగా ఈ నెల 16వ తేదీన సాక్షి దినపత్రికలో ప్రచురితమైన టీడీపీ ప్రచారంలో ఉద్యోగి అనే వార్తను పరిగణనలోకి తీసుకున్నారు. విచారణ నిర్వహించి ఆ మేరకు తవణంపల్లె ఎంపీడీఓ కార్యాలయం టైపిస్ట్ దేవకుమార్కు షోకాజ్ నోటీసును జారీచేశారు. 24 గంటల్లోపు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే బంగారుపాళ్యం మండలం తుంబపాళెం జెడ్పీ హైస్కూల్ లో నిబంధనలకు విరుద్ధంగా ఎన్ఆర్ఐ విక్రమ్ టీడీపీ కార్యకర్తలను పెట్టుకుని పంపిణీ చేసిన క్రీడాపరికరాలను సీజ్ చేయించారు. -
గంగమ్మకు ‘మకర తోరణం’
చౌడేపల్లె : బోయకొండ గంగమ్మకు ఇత్తడి మకర తోరణాన్ని ఆలయ కమిటీ సభ్యుడు రాజేష్ శుక్రవారం విరాళంగా అందజేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ నాగరాజారెడ్డి తెలిపారు. శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఉత్సవమూర్తికి మకరతోరణం అలంకరించేందుకు అందించినట్లు వివరించారు. అనంతరం దాతను ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో సురేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వీరకుమార్, సిబ్బంది కృష్ణారెడ్డి, సురేంద్రరెడ్డి, హరిప్రసాద్, వశిష్టా చార్యులు పాల్గొన్నారు. నేటి నుంచి నామినేషన్లు చిత్తూరు రూరల్: జిల్లాలో గురువారం నుంచి నామినేషన్ల కోలాహలం మొదలుకానుంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతున్న నేపథ్యంలో తొలిరోజే నామినేషన్ వేయాలని పలువురు అభ్యర్థులు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం ఈనెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల సమర్పణకు అవకాశం ఉంది. ఈ మేరకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు మంచి ముహూర్తాల కోసం పండితులు, సిద్ధాంతులను ఆశ్రయిస్తున్నారు. ఆయా అభ్యర్థుల జాతక చక్రాలు, నామ/జన్మ నక్షత్రాలకు అనుగుణంగా ముహూర్తాలను నిర్ణయిస్తున్నారు. పంచాంగం ప్రకారం చూస్తే ఈనెల 18, 19, 21, 22, 24, 25 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయని వేదపండితుడు సుధాకర్ గురుకుల్ తెలిపారు. ఆదర్శనీయులు ‘ఆంధ్రకేసరి’చిత్తూరు రూరల్: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆదర్శనీయులని, తెలుగుజాతి కీర్తికిరీటమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా సీనియర్ సివిల్ జడ్జి ఐ. కరుణకుమార్ కొనియాడారు. బుధవారం చిత్తూరులోని పలమనేరు రోడ్డులో ఉన్న భారతీయ తెలుగు రచయితల సమాఖ్య కార్యాలయంలో వ్యవస్థాపకులు మర్రిపూడి దేవేంద్రరావు నేతృత్వంలో సాహితీవేత్తలు, సంఘసేవకులకు ‘ఆంధ్రకేసరి’ జాతీయ సేవా పురస్కారాలు ప్రదానం చేశారు. న్యాయమూర్తి మాట్లా డుతూ స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ప్రకా శం పంతులు పాత్రను గమనిస్తే రోమాంఛిత ఘట్టాలెన్నో కనిపిస్తాయన్నారు. సమాఖ్య జాతీయ అధ్యక్షుడు సి.నారాయణ స్వామి మాట్లాడుతూ దేశప్రజల ఆక్రోశానికి సారథిగా నిల్చి ప్రకాశం పంతులు ఆంధ్రకేసరిగా పేరుపొందారని తెలిపారు. అనంతరం కరుణకుమార్కు ‘న్యాయవిభూషణ’ బిరుదును దేవేంద్రరావు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సాహితీవేత్తలు కొఠారి వెంకటరత్నం, శాంతకుమారి, లావణ్య, సోము ఉమాపతి, సి. సుబ్రమణ్యంరెడ్డి, తోట గోవిందన్, ఆదివిష్ణు బాలచంద్ర, పాలకూరు కన్నయ్య, గొడుగుచింత గోవింద య్య, సంఘ సేవకులు కోటేశ్వర మొదలియార్, కడియాల ఆనందనాయుడు, జ్ఞానశేఖరరెడ్డి పాల్గొన్నారు. -
గెలుపే లక్ష్యం.. సమష్టిగా పయనం
● విభేదాలు వీడి ఏకమైన నేతలు ● మంత్రి రోజా వెంటే నడుస్తామని ప్రకటనపుత్తూరు : వారందరూ వైఎస్సార్సీపీ నేతలే.. పార్టీ కోసం అహర్నిశలు పాటుపడిన వారే.. అయితే ప్రతిపక్షాలకు చెందిన రాజకీయ విద్రోహులు అపోహలు సృష్టించడంతో మంత్రి ఆర్కే రోజాకు దూరమయ్యారు. పరిస్థితుల కారణంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే కాలం వారి మధ్య ఉన్న దూరాన్ని తొలగించింది. నిజానిజాలను పార్టీ నేతలు తెలుసుకున్నారు. ఇంతకాలం మంత్రితో తమకున్న అనుబంధాన్ని దూరం చేసింది అపోహలే వారికి స్పష్టంగా అర్థమైంది. ఇక ఒక్క క్షణం కూడా ఆగకుండా మంత్రి రోజా, ఆమె భర్త ఆర్కే సెల్వమణి వద్దకు తమ అనుచరగణంతో కలిసి పరుగుపరుగున వచ్చేశారు. అపోహల వీడి ఆప్యాయతలను పంచుకున్నారు. రోజమ్మతోనే ఇక తమ ప్రయాణమని, సమష్టిగా ఆమె గెలుపునకు ఎన్నికల్లో పనిచేస్తామని ప్రకటించారు. నేతలందరూ ఒక్కతాటిపైకి రావడంతో వైఎస్సార్సీపీ బలాన్ని ఇనుమడింపజేసింది. బుధవారం ఈ ఘటన పుత్తూరు మండలం కేబీఆర్పురంలో చోటుచేసుకుంది. కేబీఆర్పురానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు ప్రతాప్, తిరుమలకుప్పం గ్రామానికి చెందిన సంపత్, కృష్ణసముద్రానికి చెందిన రవి, బాబు గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపునకు అహర్నిశలు శ్రమించారు. తర్వాత కొన్ని పొరపొచ్చాలు రావడంతో మంత్రి రోజాతో విభేదించారు. ఇటీవల సందర్భోచితంగా వారు కలుసుకున్న సమయంలో వాస్తవం తెలియవచ్చింది. ఇంతకాలం అనవసరంగా మంత్రికి దూరంగా ఉన్నామని వారు తెలుసుకున్నారు. కేబీఆర్ పురం గ్రామానికి విచ్చేసిన మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక మంత్రి వెంటే ఉంటామని, ఏ శక్తులూ మమ్మల్ని విడదీయలేవని ప్రకటించారు. పార్టీకి దూరమై టీడీపీలోకి చేరిన వారి అనుచరులను సైతం తీసుకువచ్చి వైఎస్సార్సీపీలో చేర్చారు. నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి కలుసుకోవడం కార్యకర్తల్లో ఆనందం నింపింది. కేబీఆర్పురం జనంతో నిండింది.. విజయహోరు వినిపించింది. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ దూరమైన సేనాధిపతులు మళ్లీ వచ్చారని, రెట్టింపుబలం వచ్చిందన్నారు. ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించేందుకు ఇది శుభపరిణామమని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీపీ మునివేలు, పార్టీ మండల అధ్యక్షుడు గోవిందస్వామి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్, జేసీఎస్ కన్వీనర్ భాస్కర్ యాదవ్, నాయకులు లక్ష్మణమూర్తి, వెంకటేష్, సుదర్శనం పాల్గొన్నారు.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- ఆగని టీడీపీ అరాచకాలు
- చీరాలలో టీడీపీ, కాంగ్రెస్ బరితెగింపు
- Lok Sabha Election 2024: నేడు వారణాసిలో మోదీ నామినేషన్
- గన్నవరంలో టీడీపీ గలాటా
- పోలింగ్ సిబ్బంది ‘పచ్చ’పాతం
- Lok Sabha Election 2024: మహిళలకు ‘మహాలక్ష్మి’ గ్యారెంటీ: సోనియా
- నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత
- పల్నాట పచ్చ మూక బీభత్సకాండ
- వెచ్చని హృదయ రాగ సందేశం
- TS: 64.93% పోలింగ్! ప్రశాంతంగా ముగిసిన లోక్సభ ఎన్నికలు
Advertisement