-
నేలరాలిన దళిత సుమం
ముంబైలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) దేశంలో పేరెన్నికగన్న ఉన్నతశ్రేణి విద్యాసంస్థ. ‘జ్ఞానమ్ పరమమ్ ధ్యేయమ్’ అనే ఉపనిషద్వాక్యాన్ని అది తన చిహ్నంలో అలంకరించుకుంది. చదువులో ముందుంటూ ఇంజనీరింగ్ చేయాలనుకునే ప్రతి విద్యార్థికీ బాంబే ఐఐటీలో అవకాశం రావాలన్న కోరిక బలంగా ఉంటుంది. మొన్న ఆదివారం అలాంటి ప్రాంగణంలో పద్దెమినిదేళ్ల దళిత విద్యార్థి దర్శన్ సోలంకీ ప్రాణం తీసుకున్న వైనం గమనిస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది. ఎక్కడో అహ్మదాబాద్లో పుట్టి ఎన్నో కలలతో ఆ ప్రాంగణంలో అడుగుపెట్టిన దర్శన్ అంత చిన్న వయసులో ప్రాణం తీసుకోవటం తప్ప గత్యంతరం లేదనుకున్నాడంటే సంస్థ సిగ్గుపడాలి. అంతవరకూ చదువులో చురుగ్గా ఉండేవాడు ఇటీవల ముభావంగా మారాడనీ, నెలక్రితం మాట్లాడినప్పుడు కుల వివక్ష సంగతి చెప్పాడనీ అతని సోదరి చెబుతున్నారు. తన కులం తెలిసినప్పటి నుంచీ సహ విద్యార్థులు మాట్లాడటం మానేశారనీ, తాను ఒంటరినయ్యాననీ బాధపడ్డాడని అంటున్నారు. ఇదే ముంబైలో 2019లో వైద్య శాస్త్రంలో పీజీ చేస్తున్న పాయల్ తాడ్వీ అనే గిరిజన విద్యార్థిని సహ విద్యార్థినుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. గైనకాలజీలో పీజీ చేస్తున్న తనను కనీసం ఆపరేషన్ థియేటర్లోకి కూడా రానీయలేదని చివరిసారిగా రాసిన లేఖలో ఆమె బాధ పడింది. విద్యాసంస్థలు చిన్నవైనా, పెద్దవైనా వాటి తరగతి గదులు నిలువెల్లా కులోన్మాదంతో లుకలుకలాడుతున్నాయని తరచు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాటిల్లో ఆవగింజంత నిజం లేదన్న బుకాయింపులూ ఆ వెనకే వినవస్తున్నాయి. బహుశా కేవలం ఆ కారణం వల్లే దళిత, ఆదివాసీ విద్యార్థులకు కుల సర్పాల తాకిడి తప్పడం లేదేమో! తమ ప్రాంగణంలో కుల వివక్ష లేనేలేదని, ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక విభాగం ఉన్నదని చెబుతున్న బాంబే ఐఐటీ ఆ విభాగం పని తీరెలావుందో ఇప్పటికైనా సమీక్షించుకోవటం మంచిది. ఏడేళ్లనాడు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ వేముల ప్రాణం తీసుకున్నప్పుడు యాజమాన్యం నుంచి వచ్చిన సంజాయిషీకీ, దీనికీ పెద్దగా తేడాలేదు. రోహిత్ వేముల మరణానికి దారితీసిన పరిస్థితులేమిటో వెలికి తీయాల్సిన జస్టిస్ రూపన్వాల్ కమిషన్ అతను ఎస్సీ కాదని చెప్పడానికే తాపత్రయపడింది. తన చిన్ననాడే తల్లిదండ్రులు విడిపోయి దళిత స్త్రీ అయిన తల్లి పెంపకంలో దళిత వాడలోనే పెరిగిన రోహిత్ దళితుడు కాడని ‘నిరూపించింది’. మన సమాజంలో అన్నిచోట్లా కులం రాజ్యమేలుతోంది. అందుకు ఢిల్లీ ఎయిమ్స్ మొదలుకొని ఉన్నతశ్రేణి విద్యాసంస్థలేవీ మినహాయింపు కాదని 2007లో థోరట్ కమిటీ ఇచ్చిన నివేదిక మొదలుకొని 2013 నాటి ముంగేకర్ కమిటీ నివేదిక వరకూ చెబుతూనే వస్తున్నాయి. కానీ వాటిని అవసరమైనంతగా పట్టించుకోవటం లేదని దర్శన్ సోలంకీ ఉదంతం మరోసారి నిరూపించింది. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘హిందూ’ కథనం ప్రకారం నిరుడు ఫిబ్రవరిలో బాంబే ఐఐటీలో కుల వివక్ష, అందువల్ల తలెత్తే అనారోగ్య సమస్యలపై సంస్థ లోని ఎస్సీ, ఎస్టీ విభాగం రెండు సర్వేలు చేసింది. దాంట్లో వచ్చిన ఫలితాల ఆధారంగా కొన్ని చర్యలు తీసుకోవాలని కూడా సంకల్పించింది. కానీ ఏడాదైంది. ఇంకా ఆ సంకల్పం ఆచరణ రూపం దాల్చినట్టు లేదు. అసలు సర్వేలకు స్పందించిన విద్యార్థుల సంఖ్య చూస్తేనే వివక్ష ఎంత బలంగా ఉన్నదో అర్థమవుతుంది. బాంబే ఐఐటీలో దాదాపు 2,000 మంది దళిత విద్యార్థులుంటే కేవలం 20 శాతంమంది మాత్రమే తొలి సర్వేకు స్పందించారట! రెండో సర్వేకైతే 5 శాతంమంది మాత్రమే జవాబిచ్చారు. స్టూడెంట్ కౌన్సెలర్గా ఉంటున్న మహిళా ప్రొఫెసర్ రిజర్వేషన్ల గురించి సామాజిక మాధ్యమాల్లో బాహాటంగా వ్యక్తంచే సిన అభిప్రాయాలు వారి భయానికి కారణం. రాజ్యాంగం అట్టడుగు కులాలవారికి కల్పిస్తున్న రిజర్వేషన్ల గురించి మేధావులనుకునేవారిలోనే, శాఖాధిపతుల్లోనే బోలెడంత అజ్ఞానం గూడుకట్టుకుంది. ఇక చదువుకోవడానికొచ్చిన పిల్లల్లో దాన్ని వెదకటం వృ«థా ప్రయాస. దర్శన్ తల్లిదండ్రుల ప్రకారం సహ విద్యార్థులకు అతని కులం తెలిసినప్పటినుంచీ ‘ఉచితంగా సీటు సంపాదించావు. మేం భారీగా డబ్బు చెల్లించాల్సివచ్చింది’ అంటూ వేధించారట. దేశంలో శతాబ్దాలుగా వేళ్లూనుకున్న కుల వివక్షవల్ల కొన్ని కులాలు ఈనాటికీ సామాజిక నిరాదరణకు గురవుతున్నాయని, ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోయాయని గుర్తించి మన రాజ్యాంగ నిర్మాతలు ఆ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించారు. దాన్ని ఈనాటికీ పూర్తి స్థాయిలో అందుకోలేనంత బలహీన స్థితిలో ఆ వర్గాలున్నాయి. ఒక దళిత విద్యార్థి లేదా గిరిజన విద్యార్థి ఉన్నత చదువుల వరకూ ఎదగాలంటే ఇంటిల్లి్లపాదీ ఎన్ని త్యాగాలు చేయాల్సివుంటుందో, మరెన్ని కష్టాలు భరించాల్సివుంటుందో తెలిస్తే అటువంటివారిని ఎవరూ గేలిచేయరు. కానీ ఆధిపత్య కులాల పిల్లలకు ఇదంతా ఎవరు చెప్పాలి? ఇళ్లల్లో చెప్పరు. క్లాసు పుస్తకాల్లో ఉండదు. విశ్వవిద్యాలయ ఆచార్యులు కూడా మౌనం పాటిస్తారు. కులం లేనట్టు ఇంతగా నటించే సమాజంలో అంతిమంగా ఇక జరిగేదేమిటి? బాంబే ఐఐటీలో ఎస్సీ, ఎస్టీ విభాగం నిరుడు ఇచ్చిన నివేదికను బయటపెట్టి దానిపై లోతుగా చర్చిస్తే బహుశా దర్శన్కు ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదేమో! ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వటం మంచిదే. కానీ అంతకన్నా ముందు రిజర్వేషన్ల అవసరం గురించి, తోటి విద్యార్థులతో సున్నితంగా, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాల్సిన తీరుగురించి దళితేతర విద్యార్థులకు కౌన్సెలింగ్ తప్పనిసరి చేయాలి. అప్పుడే ఏదోమేరకు కులవివక్ష జాడ్యం పోతుంది. -
బైక్ను తాకాడని దళిత విద్యార్థి గొంతు పిసికిన టీచర్
బలియా (యూపీ): తన మోటారుసైకిల్ను తాకాడనే కారణంగా ఓ దళిత విద్యార్థిని తరగతి గదిలో బంధించి, ఇనుప రాడ్తో కొట్టాడో ఉపాధ్యాయుడు. ఉత్తరప్రదేశ్లోని నగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని రనౌపూర్ హయ్యర్ సెకండరీ స్కూల్లో శుక్రవారం ఈ దారుణం చోటుచేసుకుంది. ‘స్కూల్ ఉపాధ్యాయుడు కృష్ణ మోహన్ శర్మ బైక్ను ఆరో తరగతి చదువుకుంటున్న ఓ దళిత విద్యార్థి తాకాడు. శర్మ ఆగ్రహంతో ఆ బాలుడిని గదిలో బంధించి, ఐరన్ రాడ్తో, చీపురుతో కొట్టాడు. అతడి గొంతు పిసికాడు. స్కూల్ సిబ్బంది బాధిత బాలుడిని కాపాడారు’ అని పోలీసులు తెలిపారు. ఆగ్రహించిన బాలుడి కుటుంబసభ్యులు శనివారం స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. అధికారులు ఉపాధ్యాయుడు శర్మను సస్పెండ్ చేశారు. చదవండి: పాపం పక్షులు.. గుండెల్ని పిండేస్తున్న వీడియో.. స్పందించిన గడ్కరీ కార్యాలయం -
75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!
జెండా పండుగ అయిపోయింది.. ఇక ఆ రంగు లైట్లు ఆర్పేసి ఇటు రండి.. తొమ్మిదేళ్ల దళిత విద్యార్థి ఇంద్రా మేఘ్వాల్ చిత్రపటం వద్ద పెట్టిన కొవ్వొత్తుల వెలుగులో... చీకట్లు చూద్దాం. ఒక గ్లాసుడు నీళ్లు.. పోయిన చిన్న ప్రాణం. అగ్రవర్ణం దాహార్తికి చిన్నబోయిన త్రివర్ణాలు కనిపిస్తాయి. ఇది ‘..అనుకోని సంఘ టన’ అని సర్దిచెప్పుకునే లోపే.. ‘కాదు.. అనునిత్యమే’ అన్నమాట రీసౌండ్లా ‘జనగణమన’కన్నా ఎక్కువ శబ్దంతో మన చెవుల్లో మారుమోగుతుంది. – ఇదీ సామాజిక భారతం రోడ్లపై వేలాది జెండాల ప్రదర్శనలు, వాట్సాప్ డీపీలు, ధగధగా మెరిసే కాంతుల అలంకరణలు, గొప్పగా సంబురాలు.. వీటన్నిటి మధ్య బిల్కిస్ బానో సామూహిక అత్యాచార దోషులకు స్వాతంత్య్ర దినోత్సవం ఇచ్చిన స్వేచ్ఛా వాయువులు. వారి మెడలో పూలదండలు, పంచుకున్న మిఠాయిలు.. అమృతోత్సవాలను చేదెక్కించ లేదూ! – ఇదీ రాజకీయ భారతం ‘కలకత్తా ఫుట్పాత్లపై ఎందరో గాలివానల్లో తడుస్తున్నారు వాళ్లను అడగండి పదిహేను ఆగస్టు గురించి ఏమంటారో..’ .. 1947లో స్వాతంత్య్రం వచ్చిన రోజున మాజీ ప్రధాని వాజ్పేయి రాసుకున్న కవిత ఇది.. ఉత్సవాలు జరిగిన మరునాడే (ఆగస్టు 16న) వాజ్పేయి వర్ధంతి జరిపినవారిలో ఎవరైనా.. ఆయన గుర్తుగానైనా.. ఫుట్పాత్లపై ఉన్న వారిని అడిగి ఉంటారా ‘..ఆగస్టు 15 గురించి ఏమంటారూ’ అని.. – వృద్ధిరేటు 75 ఏళ్లుగా పెరిగీ పెరిగీ హైరైజ్ భవనాల్లో చిక్కుకునిపోయిందని, అక్కడి నుంచి ఫుట్పాత్ దాకా రాలేదని తెలిసేది కదా! – ఇదీ ఆర్థిక భారతం ‘..దేశభక్తి, అఖండత అని ఒకటే అంటున్నారు.. మేం దేశభక్తి ఎలా చాటుకోవాలి? మా ఇంటిపై జెండా ఎగురవేసే కదా..? మరి జెండా ఎగురవేయడానికి మాకు ఇల్లు ఏది?..’ ..ఇది ఏ సామాన్యుడో అన్నది కాదు.. గరీబోళ్ల సీఎం టంగుటూరి అంజయ్య 1970లో అన్నమాట! మరి ‘ఇంటింటికీ జెండా పండుగ’.. అంటూ జెండాలు పంచిన నాయకులకు ఈ ప్రశ్న ఏమైనా ఎదురై ఉంటుందా.. బధిర శంఖారావంలా! – ఇదీ నేటి జన భారతం హుందాతనం, ఆత్మగౌరవం, సమన్యాయం.. చైతన్యం, సమున్నత మానవ విలువలు, సామాజిక న్యాయం, లౌకిక భావన, సౌభ్రాతృత్వం.. ఆదా యాల్లో, అంతస్థుల్లో, అవకాశాల్లో, సౌకర్యాల్లో.. సమానత్వం తెచ్చుకుందాం అని 75 ఏళ్ల క్రితం రాసుకున్న రాతలు రాజ్యాంగం పుస్తకాన్ని దాటి బయటికి రానట్టున్నాయ్.. – ఇదీ గణతంత్ర భారతం ... వీటన్నింటినీ అంబేద్కర్కు వదిలేసి మన నేతలు ఏం చేస్తున్నారో చూడండి. ► గాంధీ, గాడ్సేల ఎత్తును భారతీయత స్కేలుతో కొలిచి.. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువని తేల్చు కునే పనిలో తీరిక లేకుండా మునిగిపోయారు. ► ఇన్నేళ్లూ నెహ్రూ, గాంధీల పాలనలోనే భారతావని నడిచినా.. ఇప్పుడు క్విట్ ఇండియా స్ఫూర్తిగా దేశాన్ని ఏకం చేస్తామంటూ అదే గాంధీలు కొత్తగా ‘జోడో యాత్రలు’ చేస్తున్నారు. ► గాంధీ, నెహ్రూలపై విద్వేషం చిమ్ముతూ కొందరు.. నెహ్రూ కూడళ్లలో జనగణమన పాడుతూ గాంధీకి వెకిలి మకిలి పూస్తే జాగ్రత అని హెచ్చరిస్తూ మరికొందరు.. 75 ఏళ్ల తర్వాత కూడా అవే పేర్లు, అదే స్మరణ, అదే రాజకీయం.. ► 75 ఏళ్ల క్రితం గీసిన విభజన రేఖలు.. ఇప్పుడా దూరాన్ని మరింత పెంచాయి. రెండు వర్గాల మధ్య అపనమ్మకాన్ని, అగాధాన్ని ఎగదోస్తూ.. ‘లౌకికం’ అన్న మాటను ఫక్తు రాజకీయం చేశాయి. మన మట్టి మీదే పుట్టి పెరిగినా.. త్రివర్ణ పతాకం చేతపట్టి మేమూ భారతీయులమే అని చెప్పుకోవాల్సిన దుఃస్థితికి తెచ్చాయి. ► దేశ విభజన నాటి హింసాకాండ, విధ్వంసాలు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి. మానిపోతున్న గాయాలను కెలుకుతూ విభే దాలకు ఆజ్యం పోస్తూనే ఉన్నాయి. నాటి దాష్టీకాన్ని నేటికీ అంటగడుతూ.. విచ్ఛిన్నకర శక్తులంటూ పాత కాలపు చర్చను లేవదీస్తూనే ఉన్నాయి. .. ఇదీ 75 ఏళ్ల భారతం.. స్వేచ్ఛ వచ్చిందనుకున్న తొలిరోజున ఉన్నకాడే.. ఇప్పటికీ ఉన్నామని చెప్పకనే చెబుతున్న తీరు.. ఇది స్వప్నం.. స్వాతంత్య్రోత్సవాల సందర్భంగా సోషల్ మీడియాలో యువతతో నడిచిన ఓ చిట్ఛాట్ ఇది. ‘..నేను పుణెలో చదివా, నాలుగేళ్లు బెంగళూరులో, ఇప్పుడు తిరువనంతపురంలో ఉద్యోగం. రేపు ఎక్కడికి వెళ్తానో తెలియదు. నన్ను ఏ ప్రాంతం వాడని అడక్కండి..’ ‘..ఇదిగో వీడు అబ్దుల్లా.. అమెరికా నుంచి ఈమధ్యే దిగుమతి అయ్యాడు, ఢిల్లీ వాడే అనుకోండి. ఈ అమ్మాయి సారిక, వీడి ఫియాన్సీ. వాళ్లు రాజు, అభిషేక్, శ్రవణ్.. మేమంతా హాస్టల్ మేట్స్.. మమ్మల్ని ఏ కులం, ఏ మతం అని ప్రశ్నించకండి. అవన్నీ పాలిటిక్స్ కోసమే.. మేం భారతీయులం..’ ... కెరీర్ గోలలో కొట్టుకుపోతూ దేశం గురించి పట్టించుకోవడం లేదని యువతపై వేస్తున్న అపవాదు నిజం కాదనిపిస్తోంది. వీరిని చూస్తుంటే.. కులం, ప్రాంతం, మతం హద్దులు చెరిపేసుకుని.. అన్ని వర్ణాలనూ త్రివర్ణంలో కలుపుకొని పోతారనే ఆశలు ఇంకా మిణుకుమిణుకుమంటున్నాయి. ఇది నిజం... అట్టడుగు వర్గాలను అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టి ఆనందపడ్డా, వారి పరిస్థితి ఉన్నకాడే ఉన్నదనడానికి ఇదొక్క ‘చిత్రం’ చాలదా! -
నీళ్ల కుండను తాకాడని .. దళిత బాలుడ్ని కొట్టి చంపిన టీచర్
ఉదయపూర్: స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ కూడా దేశంలో కుల వివక్ష వికృతరూపం ఎక్కడో ఒకచోట బట్టబయలువుతూనే ఉంది. రాజస్తాన్లోని జలోర్ జిల్లాలోని సురానా గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్లో చెయిల్ సింగ్ అనే టీచర్ తన కోసం ప్రత్యేకంగా ఉంచుకున్న నీళ్లకుండను ఇంద్రకుమార్ మేఘవాలా దళిత విద్యార్థి తాకాడు. దాంతో తొమ్మిదేళ్ల ఆ బాలుడ్ని విచక్షణారహితంగా చితకబాదాడు. తీవ్రంగా గాయపడిన బాలుడు చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు. జులై 20న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీచర్ దెబ్బలకు తన కొడుకు చెవులు, కళ్లు, ముఖానికి తీవ్రంగా గాయాలయ్యాయని, అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడని తండ్రి దేవరామ్ మేఘవాలా కన్నీటిపర్యంతమయ్యారు. పైగా కులం పేరుతో దూషించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీన్ని రాజస్థాన్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆదేశించారు. టీచర్ను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ చెప్పారు. -
కొట్టి.. పాదాలు నాకించి.. దళిత విద్యార్థికి తీవ్ర అవమానం
రాయ్బరేలీ: పదో తరగతి చదువుతున్న ఒక దళిత విద్యార్థిని కొందరు తీవ్రంగా కొట్టి, పాదాలు నాకించిన వీడియో సోషల్ మీడియాలో కలకలం సృష్టించింది. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి 8 మందిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం ఈనెల 10న జగత్పూర్ నగరంలో నివసించే పదో తరగతి పిల్లాడిని అతని స్నేహితుడు మోటార్సైకిల్పై రామ్లీలా మైదానానికి తీసుకుపోయాడు. అక్కడనుంచి అతన్ని సెలూన్ రోడ్కు, అట్నించి మరికొందరు కలిసి ఒక తోటకు తీసుకుపోయారు. తోటలో అతన్ని అంతా కలిసి తీవ్రంగా కొట్టారు. అనంతరం దాడి చేసినవారిలో ఒకరి పాదాలను నాకమని సదరు విద్యార్థిని బలవంతపెడుతూ ఈ మొత్తం ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అనంతరం ఆ పిల్లాడు తన తల్లితో కలిసి కొట్వాలీ పోలీసుస్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశాడు. పిల్లాడిపై దాడికి కారణాలను పోలీసులు వెల్లడించలేదు. అతని ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు 8 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారని అధికారులు తెలిపారు. దాడిచేసిన వారిలో కొందరు మైనర్లున్నారనే వాదనకు ఇంతవరకు ఆధారం లభించలేదన్నారు. మోకాళ్లపై కూర్చోబెట్టి.. దాదాపు రెండున్నర నిమిషాలున్న ఈ వీడియోలో నిందితులంతా మోటార్సైకిళ్లపై కూర్చొని ఉండగా బాధితుడు మోకాళ్లపై కూర్చొని ఉన్నాడు. నిందితుల్లో ఒకరు బాధితుడిని ఠాకూర్ అనే పేరు గట్టిగా చెప్పమని బలవంతపెడుతూ తిట్టడం, మరోమారు ఈ తప్పు చేస్తావా? అని ప్రశ్నించాడు. దీంతో పాటు ఇదే ఘటనకు సంబంధించిన ఇంకొక వీడియోలో ఇకపై గంజాయి అమ్మవుగా అని బాధితుడిని నిందితులు ప్రశ్నిస్తున్నట్లు కనిపించింది. ఈ రెండు వీడియోల కలకలం సద్దుమణగకముందే ఒంటరిగా దొరికిన అబ్బాయిని తీవ్రంగా కొట్టారంటూ ఒక వ్యక్తి అగ్రకుల వ్యక్తులను దుర్భాషలాడుతున్నట్లున్న మరో వీడియో కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. తనపై దాడి చేసింది ఎవరో, ఎందుకు చేశారో తెలియదని బాధితుడు ఇండియన్ ఎక్స్ప్రెస్కు చెప్పారు. దాడి అనంతరం నిందితులంతా అక్కడ నుంచి వెళ్లిపోగా స్థానికులు తనను రక్షించారన్నారు. రాజకీయ విమర్శలు ఈ ఘటన బయటపడిన వెంటనే రాజకీయ రంగు పులుముకుంది. స్థానిక కాంగ్రెస్ నేత సుశీల్ రాయ్బరేలీ కలెక్టర్ను కలిసి ఘటనపై చర్యలు తీసుకోవాలన్నారు. సమాజ్వాదీ నేత అఖిలేశ్ను కలిసిన బాధితుడు, అతని కుటుంబ సభ్యులు ఘటన గురించి వివరించారు. ఎస్పీ ఎంఎల్ఏ మనోజ్ కుమార్ పాండే బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కేసుపై రాజీ చేసుకోమని విద్యార్థిపై ఒత్తిడి తెచ్చారని, కానీ స్థానికులు ఆందోళనకు దిగడంతో పోలీసులు తేలికపాటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని ఎస్పీ నేతలు విమర్శించారు. కేసులో ప్రధాన నిందితుడిని పట్టుకోలేదన్నారు. నిందితుల ఇళ్లను పడగొట్టాలని, బాధితుడికి రక్షణ కల్పించి పరిహారం ఇవ్వాలని, అతన్ని కేంద్రీయవిద్యాలయంలో చేర్చాలని డిమాండ్చేశారు. ప్రజాస్వామ్యంలో కులాధిపత్యానికి తావులేదని అఖిలేశ్ ట్వీట్ చేశారు. వెనుకబడినవర్గాలకు తాము అండగా ఉంటామన్నారు. ఈ ఘటనకు బీజేపీ కారణమని విమర్శించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement