-
వామ్మో.. నీళ్లన్నీ తాగేస్తున్న చాట్జీపీటీ, ఇలా అయితే కష్టమే!
విడుదలైన కేవలం రెండు నెలల్లోనే వంద కోట్లమంది యూజర్లతో ప్రపంచాన్ని చుట్టేసింది చాట్జీపీటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టెక్నాలజీతో ఎన్నె అద్భుతాలు చేస్తున్న అందరి నోట ఔరా అనిపించింది. దిగ్గజ సంస్థలకు సైతం పోటీగా నిలబడే స్థాయికి చేరుకుంటోంది. అయితే ఇదంతా ఇప్పటి వరకు మనకు పైకి తెలిసిన విషయం మాత్రమే. కాయిన్కు రెండు వైపుల ఉన్నట్లు చాట్జీపీటీ కూడా రెండో వైపు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ చాట్పిట్ని పరీక్షిస్తున్నారా…? చాట్జీపీతో ఒక అంశం ఆధారంగా కథనం, కథ లేదా కవిత రాయాలనే ఆసక్తి ఉన్నవారు ఇంకో విషయం తెలుసుకోవాలి...! ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ప్రతిరోజూ ఇలా ChatGPTని ఉపయోగిస్తున్నందున, మనం దీనికి భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రివర్సైడ్, యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ ఆర్లింగ్టన్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో.. 20-50 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు చాట్జీపీటీకి దాదాపుగా అర లీటరు నీరు అవసరం అవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అసలు చాట్జీపీటీకి, నీటి మధ్య సంబంధం ఏమిటంటే.. ChatGPT వంటి ఏఐ మోడల్లను అమలు చేస్తున్నప్పుడు ఆ సర్వర్లను చల్లబరచడానికి పెద్ద మొత్తంలో నీటిని ఉపయోగిస్తాయట. డాటా సెంటర్ల నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తు ఉత్పత్తికి నీటి వినియోగాన్ని లెక్కగట్టి శాస్త్రవేత్తలు ఈ అంచనాకు వచ్చారు. పైగా ఇందుకు మంచి నీటినే వినియోగించాల్సి ఉంటుందట. జీపీటీ-3కి శిక్షణ ఇవ్వడానికే మైక్రోసాఫ్ట్ 7 లక్షల లీటర్ల నీటిని వినియోగించడమే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. చాట్ జీపీటీకి కోట్ల మంది యూజర్లు ఉన్నందున డాటా సెంటర్లకు భారీగా నీటి వినియోగం ఉంటున్నదని ఈ అధ్యయనంలో బయటపడింది. ఇదే కాకుండా ఇతర సంస్థల ఏఐ మాడళ్లు కూడా భారీగా నీటిని వినియోగిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. చదవండి: ఆ దేశాలకు ఆయుధాలు అమ్మబోం.. అలాంటి ఉద్దేశమే లేదు: చైనా -
మా డేటా మాదే..!
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖకు సంబంధించిన సమగ్ర సమాచారం తమకు ప్రత్యేకంగా ఇవ్వాలని కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. రాష్ట్రాలు ఇప్పటికే అమలు చేస్తున్న విద్యాలయాలకు సంబంధించిన సమగ్ర సమాచార నిధి(డేటా బేస్) యు–డైస్(డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్)తో తమకు సంబంధం లేదని పేర్కొంది. యూడైస్ ప్లస్ పేరుతో కేంద్రం సరికొత్త పోర్టల్ను సృష్టించింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, ఖాళీల వివరాలు ఇందులో నమోదు చేయాల్సి ఉంటుంది. స్కూళ్లలో మౌలిక వసతులు, ఆధార్ అనుసంధానం, మధ్యాహ్న భోజన వివరాలను యూడైస్ ప్లస్లో అందించాలి. అందులో అడిగిన మేరకు సమాచారం అందించాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో పాఠశాలల్లో నడిచే కార్యక్రమాలకు ఇదే కీలకమని భావిస్తోంది. ఈ నేపథ్యంలో యూడైస్ ప్లస్ ద్వారా సమాచారం ఇవ్వకపోతే నిధుల విడుదల కష్టమని హెచ్చరించినట్టు తెలిసింది. నేడు, రేపు సదస్సు యూడైస్ ప్లస్పై సమగ్ర అవగాహన కల్పించేందుకు శుక్ర, శనివారాల్లో విజయవాడలో ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ ప్రాంతాలకు చెందిన రాష్ట్రస్థాయి సమన్వయకర్తలు ఈ సదస్సులో పాల్గొనాలని సూచించింది. వీరి ద్వారా జిల్లాస్థాయిలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. జిల్లాస్థాయిలో సమాచారాన్ని నిక్షిప్తం చేసే ఏఎస్వోలకు కొత్త విధానంపై సంపూర్ణ అవగాహన కలిగించి ఏమైనా సందేహాలుంటే శిక్షణ పొందినవారు నివృత్తిచేస్తారు. ’డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, లిటరసీ, న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో సదస్సు జరుగుతోంది. ‘యు–డైస్ ప్లస్’ కార్యాచరణపై కేంద్రం అన్ని జిల్లాల్లోని డీఈవో కార్యాలయాలకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. -
‘ట్యాంపరింగ్’ కేసు వివరాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) డేటాబేస్లో వెలుగుచూసిన రికార్డుల ట్యాంపరింగ్ వ్యవహారంపై తమకు పూర్తి వివరాలు, రికార్డులు అందించాలని ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సిటీ సైబర్ క్రైం పోలీసులు ఆదేశించారు. డాక్టర్ల రిజిస్ట్రేషన్ విధివిధానాలు, డేటాబేస్ నిర్వహణ, సాంకేతిక అంశాలను తమకు సమర్పించాలని టీఎస్ఎంసీకి శుక్రవారం నోటీసులు జారీ చేశారు. వివరాలన్నీ అందితేనే సాంకేతికంగా దర్యాప్తు చేయడానికి, కేసులో ముందుకు వెళ్లడానికి ఆస్కారం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 2016లో కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకొని నంబర్ పొందిన ముగ్గురు ఎంబీబీఎస్ డాక్టర్ల రికార్డులను కొందరు ‘ఇంటిదొంగలు’ ట్యాంపర్ చేసి వేరే వ్యక్తుల పేర్లతో డేటాబేస్లో నమోదు చేసినట్లు వెలుగులోకి రావడం తెలిసిందే. డాక్టర్ నాగమణి అర్హతల విషయంలో తొలుత గందరగోళం ఏర్పడటంతో ఆమె వివరాలు ట్యాంపర్ అయినట్లు తొలుత భావించిన కౌన్సిల్... పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆ అంశాన్నీ చేర్చింది. అయితే నాగమణి దరఖాస్తులో పొరపాటు రావడం వల్లే అలా జరిగిందని, ఆమె అంశంలో ఎలాంటి ట్యాంపరింగ్ లేదని శుక్రవారం స్పష్టమైంది. -
కేంద్రం కీలక ఆదేశాలు! కాల్ రికార్డ్స్, ఇంటర్నెట్ యూజర్ల వివరాలన్నీ..
టెలికాం ఆపరేటర్లకు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న యూజర్ల కాల్ రికార్డింగ్ డాటాను, ఇంటర్నెట్ యూసేజ్ డాటాను రెండేళ్ల పాటు భద్రపర్చాలంటూ ఆ ఆదేశాల్లో పేర్కొంది. గతంలో ఈ సమయం ఏడాది పాటే ఉండేది. ఒకవేళ భద్రతా ఏజెన్సీలు కోరితే ఆ గడువును పెంచే విధంగా సవరణ వెసులుబాటు ఉండేది(గతంలో ఎన్నడూ జరగలేదు!). అయితే ఈసారి రెండేళ్లపాటు భద్రపర్చాలంటూ యునిఫైడ్ లైసెన్స్ అగ్రిమెంట్కు సవరణ చేయడం విశేషం. రెండేళ్లపాటు లేదంటే ప్రభుత్వం చెప్పేవరకు వివరాలను భద్రపర్చి ఉంచాలని టెలికమ్యూనికేషన్స్ విభాగం(DoT) డిసెంబర్ 21న ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. భద్రతాపరమైన కారణాల దృష్ట్యా టెలికామ్ కంపెనీలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, టెలికాం లైసెన్స్లు కలిగిన ఇతరులు.. కమర్షియల్తో పాటు యూజర్ల కాల్ వివరాల రికార్డ్లను భద్రపర్చాలని స్పష్టం చేసింది. భద్రతా ఏజెన్సీలు కోరినందునే ఈసారి ఈ సవరణ చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రజాప్రయోజనాల దృష్ట్యా లేదంటే భద్రతాపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని టెల్కోస్, ఇంటర్నెట్ ప్రొవైడర్లకు టెలికమ్యూనికేషన్ విభాగం ఈ తరహా ఆదేశాల్ని జారీ చేస్తుంటుంది. కాల్ రికార్డింగులు, మెసేజ్ల వివరాలతో పాటు ఇంటర్నెట్ సేవలకు సంబంధించి ఈ-మెయిల్, లాగిన్, లాగ్ అవుట్.. ఇలా అన్ని వివరాలను జాగ్రత్త పర్చాల్సి ఉంటుంది. ఐపీ అడ్రస్ వివరాలకు అదనంగా ఈసారి ఇంటర్నెట్ టెలిఫోనీ(యాప్ల ద్వారా చేసే కాల్స్, వైఫై కాల్స్ తదిరత వివరాలు) సైతం రెండు సంవత్సరాలపాటు భద్రపర్చాల్సిందే!. దర్యాప్తు, విచారణ, భద్రతా ఏజెన్సీలు ఎప్పుడు కోరితే అప్పుడు ఆ వివరాల్ని కంపెనీలు సమర్పించాల్సి ఉంటుంది. థర్డ్ జనరేషన్ ఇంటర్నెట్.. మీరూ కుబేరులు అయిపోవచ్చు! -
వాట్సాప్కు భారీ దెబ్బ..!
మాస్కో: ప్రముఖ సోషల్ మీడియా మెసేంజర్ వాట్సాప్కు రష్యాలో భారీ దెబ్బ తగిలింది. రష్యా ప్రభుత్వం సుమారు మూడు మిలియన్ల రూబెల్స్ను వాట్సాప్పై జరిమానా విధించనుంది. రష్యా దేశ నియమాలను ఉల్లఘించినందుకు వాట్సాప్పై జరిమానా విధించినట్లు తెలుస్తోంది. రష్యా భూభాగంలో రష్యన్ వినియోగదారుల డేటాను స్థానికీకరించడంలో వాట్సాప్ విఫలమైంది. వాట్సాప్పై తగు చర్యలు తీసుకోవడానికి రష్యా ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలోనే రష్యా ప్రభుత్వం వాట్సాప్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీడింగ్లను ప్రారంభించే అవకాశం ఉందని స్థానిక న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. కాగా ఈ విషయంపై ఫేస్బుక్ స్పందించలేదు. కొద్దిరోజుల క్రితమే గూగుల్కు చెందిన ఆల్ఫాబెట్పై కూడా రష్యా ప్రభుత్వం 3 మిలియన్ల రూబిళ్లను జరిమానా విధించింది. వ్యక్తిగత డేటా చట్టాన్ని ఉల్లంఘించినందుకు గాను రష్యన్ కోర్టు ఫేస్బుక్, ట్విటర్పై కూడా జరిమానాను విధించింది. రష్యా అడ్మినిస్ట్రేటివ్ దిగ్గజ కంపెనీలపై జరిమానాలను విధించడం గత కొన్ని రోజుల నుంచి నడుస్తూనే ఉంది. వాట్సాప్కు ఒక మిలియన్ లేదా 6 మిలియన్ రూబిళ్ల నుంచి జరిమానా విధించవచ్చునని ఇంటర్ ఫాక్స్ తన నివేదిక పేర్కొంది.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
Advertisement