-
‘దేవర’ చలో వైజాగ్
వైజాగ్ వెళ్లనున్నారట ‘దేవర’ టీమ్. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దేవర’. జాన్వీకపూర్ హీరోయి న్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నరైన్, సైఫ్ అలీఖా న్ , టామ్ షైన్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ వైజాగ్లో ్రపారంభం కానుందని ఫిల్మ్నగర్ సమాచారం. అయితే ఈ షెడ్యూల్లో తొలుత ఎన్టీఆర్ పాల్గొనని సన్నివేశాలను చిత్రీకరిస్తారట మేకర్స్. ప్రస్తుతం ముంబైలో హిందీ చిత్రం ‘వార్ 2’తో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఆ సినిమా తాజా షెడ్యూల్ పూర్తయిన తర్వాత ‘దేవర’ సెట్స్లో ఎన్టీఆర్ జాయి న్ అవుతారట. కల్యాణ్రామ్, కె.హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ‘దేవర’ రెండు భాగాలుగా విడుదల కానుంది. కాగా ఈ సినిమా తొలి భాగాన్ని ఈ ఏడాది అక్టోబరు 10న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. -
ఎన్టీఆర్తో నటించాలని ఉంది: ఊర్వశి
ఊర్వశి రౌతేలా.. ప్రత్యేకించి పరిచయం అక్కర్లేని పేరు. తన గ్లామర్తో అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో.. ప్రత్యేకించి యువతలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారీ బ్యూటీ. తాజాగా ఊర్వశి రౌతేలా ఎక్స్లో చేసిన ఓ పోస్ట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఎన్టీఆర్తో కలిసి ఉన్న ఫొటోను ఆమె షేర్ చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో, ఎన్టీఆర్ అభిమానుల్లో చర్చకు తెరలేపింది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ సినిమాలో ఊర్వశి నటించనున్నారేమో? అనే చర్చలు జరుగుతున్నాయి. ‘వార్ 2’ హిందీ సినిమా చిత్రీకరణ కోసం ముంబయ్లో ఉన్నారు ఎన్టీఆర్. ఆయనతో జిమ్లో దిగిన ఫొటోను ఊర్వశి సోషల్ మీడియాలో షేర్ చేసి.. ‘‘ఎన్టీఆర్గారు మన ప్రియమైన, నిజమైన గ్లోబల్ సూపర్ స్టార్. క్రమశిక్షణ, నిజాయితీ, వినయపూర్వకంగా ఉండే వ్యక్తి. మీ దయ, ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. మీ వ్యక్తిత్వం నిజంగా ప్రశంసనీయం. సమీప భవిష్యత్తులో మీతో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ‘దేవర’ చిత్రంలో ఊర్వశి రౌతేలా ప్రత్యేక పాటలో కనిపించనున్నారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఊర్వశి తెలుగులో ‘వాల్తేరు వీరయ్య, ఏజెంట్, బ్రో, స్కంద’ వంటి చిత్రాల్లో ప్రత్యేక పాటల్లో తన డ్యాన్స్తో అలరించారు. మరి... ఎన్టీఆర్ సినిమాలో నటించాలనే ఆసక్తి కనబరుస్తున్న ఊర్వశికి ఆ చాన్స్ వస్తుందా? అనేది చూడాలి. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) -
పాట.. ఫైటు
గోవాకు బై బై చెప్పారు ‘దేవర’. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్. శ్రుతీ మరాఠి, చైత్ర, సైఫ్ అలీఖాన్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. కాగా ఇటీవల గోవాలో మొదలైన ‘దేవర’ సినిమా చిత్రీకరణ ముగిసిందని సమాచారం. ఓ ఫైటు సీక్వెన్స్ తో పాటు ఓ పాటను చిత్రీకరించారట మేకర్స్. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కాంబినేషన్ లోని సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగిందని తెలిసింది. తదుపరి షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభం అవుతుందని, ఏప్రిల్ మొదటివారంలో ఈ కొత్త షెడ్యూల్ ఉండే అవకాశం ఉందని భోగట్టా. కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ స్వరకర్త. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలి భాగం ఈ ఏడాది అక్టోబరు 10న విడుదల కానుంది. -
పుష్ప 2 సాంగ్ ని మించి దేవర బంపర్ సాంగ్!
-
శ్రుతికి స్వాగతం పలికిన 'దేవర'
మరాఠీ, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్న గుజరాతీ అమ్మాయి శ్రుతీ మరాఠే తెలుగు చిత్ర పరిశ్రమకు వస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ సినిమాతో శ్రుతి తెలుగుకు పరిచయం కానున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న ‘దేవర’ షూటింగ్లో శ్రుతి జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మాధ్యమాల వేదికగా వెల్లడించారు శ్రుతి. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న షెడ్యూల్ పూర్తి కాగానే పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ కేరళ వెళ్లాలనే ఆలోచనలో ఉందని సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్న ‘దేవర’ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ఈ ఏడాది అక్టోబరు 10న విడుదల కానుంది. -
రామ్ చరణ్తో సినిమా.. క్లారిటీ ఇచ్చిన 'దేవర' బ్యూటీ
రామ్ చరణ్తో జాన్వీ కపూర్ నటిస్తున్న చిత్రం త్వరలో ఆరంభం కానుందని కొద్దిరోజుల క్రితం బోనీకపూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో దేవర చిత్రం తర్వాత టాలీవుడ్లో మరొక ఛాన్స్ జాన్వీకి దక్కిందని పలు వార్తలు ట్రెండ్ అయ్యాయి. ఈ విషయంపై తాజాగా జాన్వీ కపూర్ ఇలా స్పందించారు. ' నా సినిమాల అప్డేట్స్ గురించి మా నాన్న (బోనీ కపూర్) పలు విషయాలు పంచుకున్నారు. నన్ను సంప్రదించకుండానే నాన్నగారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఏ సినిమాల్లో నటించబోతున్నానని ఆయన చెప్పారో వాటి గురించి ఇప్పట్లో మాట్లాడలేను. ప్రస్తుతం నేను తెలుగులో 'దేవర' మాత్రమే చేస్తున్నాను.' అని చెప్పారు. ‘ఉప్పెన’తో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సన ద్వితీయ చిత్రంగా రామ్చరణ్ హీరోగా ఓ సినిమా (‘RC 16’ వర్కింగ్ టైటిల్) తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్కి జోడీగా ఎవరు నటిస్తారు? అంటూ తెరపైకి వచ్చిన హీరోయిన్ల పేర్లలో జాన్వీ కపూర్ పేరు ప్రముఖంగా ఉంది. దీంతో ఈ విషయం గురించి బోనీకపూర్ను ప్రశ్నించగా.. రామ్ చరణ్తో జాన్వీ సినిమా చేస్తుందని ప్రకటించారు. ఆపై కోలీవుడ్ హీరో సూర్యకు జోడీగా ఓ చిత్రంలో నటించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారికంగా ప్రకటన లేదు. కానీ, బోనీకపూర్ ఈ విషయాన్ని వెల్లడించడంతో గత కొద్దిరోజులగా వైరల్గా మారింది. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా రూపొందనున్న ‘ఆర్సీ 16’ ఏప్రిల్లో సెట్స్పైకి వెళ్లనుందని టాక్. -
దేవర డేట్ ఫిక్స్
రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాడు ‘దేవర’. ఈ ఏడాది అక్టోబరు 10న ‘దేవర’ చిత్రం తొలి భాగం విడుదల కానుంది. ‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. నందమూరి కల్యాణ్ రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. కాగా తొలి భాగాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయాలనుకున్నారు. కానీ వాయిదా వేశారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అక్టోబరు 10న సినిమాని విడుదల చేయనున్నట్లు శుక్రవారం వెల్లడించారు మేకర్స్. -
దేవర రిలీజ్ పై దిల్ రాజు కీలక వ్యాఖ్యలు
-
అభిమానులకు దేవర స్పెషల్ విషెస్!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు, అభిమానులకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ విష్ చేశారు. పండుగ సందర్భంగా ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఇది చూసిన అభిమానులు సైతం యంగ్ టైగర్కు విషెస్ చెబుతున్నారు. కాగా.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం ద్వారానే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది శ్రీదేవి ముద్దుల కూతురు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ సైతం కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే దేవరకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ కాగా.. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్లింప్స్లో సముద్రంలో ఫైట్ సీన్ను చూసిన ఫ్యాన్స్ దేవర కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. Wishing everyone a very Happy Pongal. — Jr NTR (@tarak9999) January 14, 2024 -
అందుకేనేమో ఎర్ర సముద్రం అంటారు!
‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్–డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘దేవర’. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కల్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్పై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రం తొలి భాగం ‘దేవర పార్ట్ 1’ ఏప్రిల్ 5న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. కాగా ఈ సినిమా గ్లింప్స్ను ఆయా భాషల్లో సోమవారం విడుదల చేశారు మేకర్స్. ‘ఈ సముద్రం సేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్ని ఎక్కువ సూసుండాది.. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు’ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్తో గ్లింప్స్ రిలీజైంది. ‘‘దేవర’ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఆ అంచనాలను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్, కెమెరా: రత్నవేలు. -
గోవా టు హైదారాబాద్
హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘దేవర’. జాన్వీ కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. ఇటీవల గోవాలో మొదలైన ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తయినట్లు తెలిసింది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్, జాన్వీ.. ఇలా ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. అలాగే ‘దేవర’ నెక్ట్స్ షెడ్యూల్ డిసెంబరులో హైదరాబాద్లో ప్రారంభం కానుందని సమాచారం. కల్యాణ్రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని తొలి భాగం ‘దేవర పార్ట్ 1’ ఏప్రిల్ 5న విడుదల కానుంది. -
మొన్నటివరకు రిలాక్స్.. ఇకపై దబిడి దిబిడే
షార్ట్ బ్రేక్ తీసుకున్నారు... ఫుల్లుగా రిలాక్స్ అయ్యారు. గెట్ సెట్ గో అంటూ హుషారుగా షూటింగ్లో పాల్గొనడానికి రెడీ అయ్యారు. కొంత గ్యాప్ తర్వాత సెట్స్లోకి అడుగుపెడుతున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం. బిజీ బిజీ దాదాపు యాభై రోజులు యూఎస్లో గడిపి, ఇటీవలే హైదరాబాద్కు వచ్చారు ప్రభాస్. ఇక సినిమా షూటింగ్లతో బిజీ కావాలనుకుంటున్నారు. ఇందుకు తగ్గ యాక్షన్ ΄్లాన్ను రెడీ చేసుకున్నారు. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’, ‘రాజా డీలక్స్’ (వర్కింగ్ టైటిల్), ‘సలార్’ చిత్రాలు ఉన్నాయి. ముందుగా ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్లో పాల్గొననున్నారట. మరో మూడు, నాలుగు రోజుల్లో ఈ చిత్రం కొత్త షెడ్యూల్ను ్రపారంభించాలనుకుంటున్నారట. ఈ షెడ్యూల్లో ప్రధానంగా ప్రభాస్, దీపికా పదుకోన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలి సింది. గతంలో చిత్ర యూనిట్ ప్రకటించిన ప్రకారం ‘కల్కి 2898 ఏడీ’ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కావాల్సింది. అయితే వాయిదా పడుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ప్రభాస్ మరో చిత్రం ‘రాజా డీలక్స్’ విషయానికి వస్తే.. మారుతి దర్శకత్వంలో రూ΄÷ందుతున్న ఈ చిత్రాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నారట ప్రభాస్. మరోవైపు ప్రభాస్ డైరీలో ఉన్న ‘సలార్’ షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ సినిమా తొలి భాగం ‘సలార్: సీజ్ ఫైర్’ సెప్టెంబరు 28న రిలీజ్ కానుంది. సో.. మలి భాగం షూటింగ్ని ఆరంభించడానికి ΄్లాన్ చేస్తున్నారట. మొత్తం మీద ప్రభాస్ బిజీ బిజీ. టార్గెట్ ఫిక్స్ ‘దేవర’ సినిమా విషయంలో హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ స్పీడ్ మామూలుగా లేదు. ఈ సినిమా వరుస షూటింగ్ షెడ్యూల్స్ చకా చకా పూర్తవుతున్నాయి. అయితే గత నెల మూడో వారంలో ఓ యాక్షన్ షెడ్యూల్ను పూర్తి చేశాక ఈ టీమ్ చిన్న గ్యాప్ తీసుకుంది. రెండు వారాల గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ మళ్లీ అంటే.. జూలై 31న ‘దేవర’ కొత్త షూటింగ్ షెడ్యూల్లో జాయిన్ అయ్యారు. ఈ కొత్త షెడ్యూల్ రెండు వారాల పాటు సాగుతుందని, ఓ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తారని తెలిసింది. పీటర్ హెయిన్స్ అండ్ టీమ్ ఈ యాక్షన్ సీక్వెన్స్ను డిజైన్ చేసిందట. ఈ షెడ్యూల్తో ‘దేవర’ మేజర్ యాక్షన్ పార్ట్ పూర్తవుతుందని, తదుపరి షెడ్యూల్స్లో ఇతర ప్రధాన తారాగణమైన ఈ చిత్రం విలన్ సైఫ్ అలీఖాన్, హీరోయిన్ జాన్వీ కపూర్ వంటి వారు పాల్గొనగా, టాకీ పార్ట్ను షూట్ చేస్తారని తెలిసింది. నవంబరు కల్లా ఈ సినిమా షూటింగ్ని పూర్తి చేసేలా ఎన్టీఆర్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారని ఫిల్మ్నగర్ టాక్. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదల కానుంది. షూటింగ్ కాస్త ముందుగానే ముగిసినా.. గ్రాఫిక్స్, పోస్ట్ప్రొడక్షన్ వర్క్స్ కోసం ‘దేవర’ టీమ్ ఎక్కువ టైమ్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక ‘దేవర’ తర్వాత హిందీ ‘వార్ 2’, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని చిత్రాలతో ఎన్టీఆర్ బిజీ అవుతారు. ఏప్రిల్లో రిలీజ్? హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ సూపర్ డూపర్ హిట్ సాధించింది. ప్రస్తుతం మలి భాగం ‘పుష్ప: ది రూల్’ సెట్స్లో ఉంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్కు ఇటీవల కాస్త గ్యాప్ వచ్చింది. మళ్లీ ఈ నెల మొదటివారంలో ‘పుష్ప: ది రూల్’ సినిమాను సెట్స్ పైకి తీసుకుని వెళ్లాలని సుకుమార్ సన్నాహాలు చేశారని తెలిసింది. ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్ కూడా జాయిన్ అవుతారట. అలాగే ‘పుష్ప: ది రూల్’ను తొలుత ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ షెడ్యూల్స్కి గ్యాప్ రావడంతో వచ్చే ఏడాది ఏప్రిల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఇక ఈ సినిమా కాకుండా... దర్శకుడు త్రివిక్రమ్తో ఓ సినిమా, ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్రెడ్డి వంగాతో ఓ సినిమాను అల్లు అర్జున్ కమిటైన సంగతి తెలిసిందే. -
స్టార్ట్ యాక్షన్
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. కల్యాణ్రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో ‘దేవర’ లోని ఓ యాక్షన్ షెడ్యూల్ పూర్తయింది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ఆగస్టు తొలివారంలో ప్రారంభం అవుతుందనీ, ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తారని టాక్. ఈ ఫైట్ ఇంట్రవెల్ సమయంలో వస్తుందని ఫిల్మ్నగర్ భోగట్టా. స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ ్స ఈ యాక్షన్ సీక్వెన్ ్సను డిజైన్ చేయనున్నట్లు టాక్. అలాగే ఈ సినిమాలోని ప్రధాన తారాగణం అయిన సైఫ్ అలీఖాన్ , జాన్వీకపూర్లతో పాటు, కొందరు కీలక పాత్రధారులపై ఈ షెడ్యూల్లోనే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారట కొరటాల. ‘దేవర’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. -
'దేవర' తర్వాత జాన్వీని తమిళ్కు పరిచయం చేయనున్న టాప్ హీరో
నటి శ్రీదేవి ఈ పేరే అందానికి బ్రాండ్ అంబాసిడర్. మొదట కోలీవుడ్లో బాలనాటిగా తెరంగేట్రం చేసిన ఈమె ఆ తర్వాత టాప్ హీరోయిన్గా పేరు పొందారు. అలా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ప్రముఖ హీరోల సరసన నటించి ఇండియన్ సినీ చరిత్రలో తన పేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకున్నారు. ఆమె జీవితం కథానాయకిగానే ముగిసింది. ఇక శ్రీదేవి వారసురాలిగా రంగప్రవేశం చేస్తున్న పెద్ద కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్లో ఇప్పటికే క్రేజీ కథానాయకిగా రాణిస్తోంది. నటన కంటే తన అందాలతో సోషల్ మీడియాను ఊపేస్తున్న జాన్వీకపూర్పై దక్షిణాది సినిమా చూపు చాలా కాలం క్రితమే పడింది. పలువురు ప్రముఖ దర్శక, నిర్మాతలు తమ చిత్రాల ద్వారా పరిచయం చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఆమెకు దక్షిణ చిత్రాల్లో నటించాలన్న కోరిక ఉన్నా సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూ వచ్చింది. అలా ఇటీవలే తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన 'దేవర' చిత్రంలో నటించడానికి అంగీకరించింది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. (ఇదీ చదవండి: పుష్ప-2లో ఐటం సాంగ్.. రెమ్యునరేషన్ అన్ని కోట్లా!) కాగా జాన్వీకపూర్ దక్షిణాదిలో తన రెండవ చిత్రాన్ని కోలీవుడ్లో చేయబోతున్నారని తాజా సమాచారం. కోలీవుడ్లో కమలహాసన్, శ్రీదేవిలది సూపర్ హిట్ కాంబో. కాగా శ్రీదేవి వారసురాలు జాన్వీకపూర్ను కమలహాసన్ కోలీవుడ్లో పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. ఇటీవల విక్రమ్ చిత్రంతో బంపర్ హిట్ కొట్టిన ఆయన ప్రస్తుతం తన 233వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్న్స్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. (ఇదీ చదవండి: ‘భాగ్ సాలే’మూవీ రివ్యూ) కాగా మరోపక్క ఆయన వరుసగా చిత్రాలు నిర్మిస్తున్నారు. నటుడు శింబు హీరోగా ఒక చిత్రం, శివకార్తికేయన్తో మరో చిత్రం చేస్తున్న కమలహాసన్, ఇటీవల చిన్నచిత్రంగా విడుదలై సంచలన విజయాన్ని సాధించిన 'లవ్ టుడే' చిత్ర దర్శకుడు, కథానాయకుడు ప్రదీప్ రంగనాథం హీరోగా, నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని కమల్ నిర్మాతగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రంలోనే నటి జాన్వీకపూర్ను కథానాయకిగా నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇందులో కమల్ ఒక కీలక పాత్రలో చేయనున్నట్లు సమచారం. -
దేవర మూవీ కోసం ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్...
-
దేవర టైటిల్ నాదే.. కొట్టేశారు: బండ్ల గణేష్ ట్వీట్ వైరల్
యంగ్ టైగర్ జూనియర్ నటిస్తోన్న తాజా చిత్రం 'ఎన్టీఆర్ 30'. ఈ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఇప్పటికే ‘దేవర’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారనే టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. దీంతో దీనిపై నిర్మాత బండ్ల గణేశ్ చేసిన నెట్టింట్లో వైరలవుతోంది. ఆ టైటిల్ను కొట్టేశారంటూ ఆరోపిస్తూ ఆయన ట్వీట్ చేశారు. (ఇది చదవండి: బాలీవుడ్ హీరో ఇంట్లో తీవ్ర విషాదం..!) అయితే ఈ సినిమాకు దేవర అనే టైటిల్ను మూవీ యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ పేరునే ఖరారు చేస్తున్నారని తెగ ప్రచారం జరుగుతోంది. టైటిల్ ఆసక్తికరంగా ఉండడంతో తారక్ అభిమానులు సైతం ఈ పేరుతో ఇమేజ్లు తయారు చేసి షేర్ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తాజాగా చేసిన ట్వీట్ తెగ వైరలవుతోంది. బండ్ల గణేశ్ ట్వీట్లో రాస్తూ..'దేవర అనే టైటిల్ నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. నేను మర్చిపోవడం వల్ల.. నా టైటిల్ను కొట్టేశారు' అంటూ పోస్ట్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ‘నాకేం ప్రాబ్లం లేదు బ్రదర్. ఇది మన యంగ్ టైగర్ సినిమాకే కదా. ఆయన కూడా నాకు దేవరే’ అని మరో ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అసలు టైటిల్ ఏదో తెలియాలంటే మాత్రం సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. (ఇది చదవండి: వారికి అచ్చిరానీ టాలీవుడ్.. రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' పరిస్థితి ఏంటీ?) దేవర నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న నా టైటిల్ నేను మర్చిపోవడం వల్ల నా టైటిల్ కొట్టేశారు 😡 https://t.co/Y4guc8Yl34 — BANDLA GANESH. (@ganeshbandla) May 19, 2023 -
తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు
గుడిపాడు (గూడూరు రూరల్): దేవరకు హాజరై తిరుగు ప్రయాణంలో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. గుడిపాడు గ్రామంలో సోమవారం ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మునగాలకు చెందిన చాకలి మద్దిలేటి (ఆటో డ్రైవర్), సురేష్ ఇద్దరూ బంధువులు. వీరు కర్నూలులో జీవిస్తున్నారు. మూడు రోజుల క్రితం గూడూరులో బం«ధువులు చేపట్టిన దేవర కార్యక్రమానికి ఇద్దరూ కుటుంబీకులతో హాజరయ్యారు. సోమవారం మధ్యాహ్నం మద్దిలేటి ఆటోలో కర్నూలుకు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో గూడూరు మీదుగా మంత్రాలయం వెళ్తున్న ఎమ్మిగనూరు డిపో గుడిపాడు వద్ద ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు కావడంతో అందులో ఉన్న ముగ్గురు ఎగిరి రోడ్డుపై పడ్డారు. చాకలి సురేష్ తలకు గాయమై అధిక రక్త స్రావం కావడంతో ఆసుపత్రికి తరలించేలోపు మృత్యువాతపడ్డాడు. మద్దిలేటి కాలు, చెయ్యి విరిగి తీవ్ర గాయాలపాలు కాగా, ఏడు నెలల గర్భిణి అతని భార్య ఎల్లమ్మ తీవ్రంగా గాయపడి అపస్మాకరస్థితికి చేరుకుంది. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ పవన్కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని రోడ్డు ప్రమాదంపై స్థానికులను అడిగితెలుసుకున్నారు. మృతుడు సురేష్కు భార్య వెంకటేశ్వరమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- ధాన్యం తడవకుండా.. కాపాడే మంచె!
- గాజాలో ఆగని దాడులు.. భారతీయుడి మృతి
- శ్రీనగర్: రెండు దశాబ్ధాల ఓటింగ్ రికార్డు బద్దలు!
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
- ఆగని టీడీపీ అరాచకాలు
- Lok Sabha Election 2024: నేడు వారణాసిలో మోదీ నామినేషన్
- గన్నవరంలో టీడీపీ గలాటా
- పోలింగ్ సిబ్బంది ‘పచ్చ’పాతం
- TS: 64.93% పోలింగ్! ప్రశాంతంగా ముగిసిన లోక్సభ ఎన్నికలు
- ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ ఛాన్స్ . అలా జరిగితేనే?
Advertisement