-
Janata Party: కేంద్రంలో తొలిసారి కాంగ్రెసేతర సర్కారు
ప్రజల హక్కులను కాలరాస్తే, ప్రజాస్వామ్యా నికి పాతరేస్తే ఏమవుతుందో ఆరో లోక్సభ ఎన్నికల్లో ఇందిరాగాం«దీకి అనుభవంలోకి వచి్చంది. ఇందిరకు, కేంద్రంలో కాంగ్రెస్కు తొలి ఓటమి రుచి చూపడమే గాక తొలి కాంగ్రెసేతర సర్కారుకు బాటలు పరిచిన ఎన్నికలుగా అవి చరిత్రలో నిలిచిపోయాయి. ఎమర్జెన్సీ ముసుగులో ప్రతిపక్షాల నేతలందరినీ జైల్లోకి నెట్టిన ఇందిర వారి చేతుల్లోనే మట్టికరిచారు. జనతా పతాకం కింద ప్రధాన విపక్షాలన్నీ ఒక్కటై ‘ఇందిర హటావో, దేశ్ బచావో’ నినాదంతో కాంగ్రెస్ను ఓడించాయి... 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 దాకా 21 నెలల కొనసాగిన ఎమర్జెన్సీ దేశ ప్రజలకు పీడకలగా మారింది. పౌర హక్కులను హరించడం మొదలుకుని తీవ్ర నిర్బంధం అమలైంది. పత్రికా స్వేచ్ఛను కాలరాశారు. మగవాళ్లకు బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వంటి చేష్టలతో ఇందిర సర్కారు బాగా చెడ్డపేరు తెచ్చుకుంది. మొరార్జీ దేశాయ్ మొదలుకుని జయప్రకాశ్ నారాయణ్ దాకా విపక్ష నేతలంతా జైలుపాలయ్యారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విపక్షాల కార్యకర్తలు ఊచలు లెక్కించారు. ఎమర్జెన్సీ అనంతరం ఏడాది ఆలస్యంగా 1977లో ఇందిర ఎన్నికలకు వెళ్లారు. ఆమెను ఢీ కొట్టేందుకు కమ్యూనిస్టేతర ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి. భారతీయ జనసంఘ్, భారతీయ లోక్దళ్, సంయుక్త సోషలిస్ట్ పార్టీ, కాంగ్రెస్ ఫర్ డెమక్రసీతో పాటు కాంగ్రెస్ (వో) కూడా జేపీ స్థాపించిన జనతా పారీ్టలో కలసిపోయాయి. మొరార్జీ దేశాయ్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. జేపీ ‘ఇందిరా హటావో, దేశ్ బచావో’ నినాదం దుమ్మురేపింది. ఎమర్జెన్సీపై జనాగ్రహం ఎన్నికల ఫలితాల్లో ప్రతిఫలించింది. జనతా పార్టీ 41.32 శాతం ఓట్లతో 295 స్థానాలు సాధించింది. మిత్రపక్షాలతో కలిపి జనతా బలం 330కి చేరింది. 492 స్థానాల్లో పోటీ చేసిన ఇందిర కాంగ్రెస్ (ఆర్) కేవలం 154 స్థానాలతో కుదేలైంది. అంతటి ప్రజా వ్యతిరేకతలోనూ దక్షిణాది 92 స్థానాలతో ఇందిరకు అండగా నిలిచింది. వాటిలో 41 ఆంధ్రప్రదేశ్ చలవే. హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచింది రెండే సీట్లు! రాయ్బరేలీలో ఇందిర ఓటమి చవిచూశారు! ఎమర్జెన్సీ వేళ రాజ్యాంగేతర శక్తిగా మారిన చిన్న కొడుకు సంజయ్గాంధీ కూడా అమేథీలో పరాజయం పాలయ్యారు. తొలి కాంగ్రెసేతర ప్రధాని మొరార్జీ తొలి కాంగ్రెసేతర ప్రధానిగా మొరార్జీ దేశాయ్ 1977 మార్చి 24న ప్రమాణం చేశారు. అయితే మూడేళ్లకే సర్కారులో లుకలుకలు మొదలయ్యాయి. నేతలు జనతా పార్టీని వీడడంతో లోక్సభలో బలం తగ్గింది. దాంతో మొరార్జీ గద్దె దిగాల్సి వచి్చంది. రాజ్ నారాయణ్... జనతాలో ముసలం ఈ సందర్భంగా రాజ్ నారాయణ్ గురించి తప్పక చెప్పుకోవాలి. 1977 ఎన్నికల్లో రాయ్బరేలిలో ఇందిరను ఓడించిన ఈయన తదనంతరం జనతాపారీ్టలో ముసలానికీ కారకుడయ్యారు. జనతాను వీడి జేడీ(ఎస్)ను స్థాపించారు. మొరార్జీ రాజీనామాతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహా్వనించాలంటూ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిని అభ్యరి్థంచారు. కానీ ఇందిరా కాంగ్రెస్ సహకారంతో జనతా పార్టీ నేత చౌధరీ చరణ్సింగ్ 1979 జూలై 28న ప్రధాని అయ్యారు. అయితే ఇందిర బ్లాక్మెయిల్ రాజకీయాలకు విసిగి నెలలోపే రాజీనామా చేశారు! విశేషాలు... పెరిగిన ఓటింగ్ ► 1977 లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం 60.49 శాతానికి పెరిగింది. ► 1971 జనాభా లెక్కల ఆధారంగా లోక్సభ స్థానాలను 542కు పెంచారు. ► 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరిగాయి. ► ఐదు జాతీయ పార్టీలు, 15 రాష్ట్ర పారీ్టలు, 14 రిజిస్టర్డ్ పారీ్టలు లోక్సభ ఎన్నికల్లో పాల్గొన్నాయి. ► ఎమర్జెన్సీ విధింపు పట్ల ఇందిర ఏనాడు పశ్చాత్తాపడలేదు. మరో దారి లేకపోయిందంటూ సమర్థించుకున్నారు. షెడ్యూల్ ప్రకారం 1976లోనే ఎన్నికలు జరిపి ఉంటే తానే గెలిచేదాన్నని కూడా ఇందిర అభిప్రాయపడటం విశేషం! ఆరో లోక్సభలో పారీ్టల బలాబలాలు (మొత్తం స్థానాలు 542) పారీ్ట స్థానాలు జనతా పారీ్ట 295 కాంగ్రెస్ 154 సీపీఎం 22 అన్నాడీఎంకే 18 ఇతరులు 43 స్వతంత్రులు 10 – సాక్షి, నేషనల్ డెస్క్ -
Indira Gandhi: ముందస్తు ఎమర్జెన్సీ పరాజయం
సొంత పార్టీయే బయటకు పొమ్మంది. అయినా, ఆమె తగ్గలేదు. ఉక్కు సంకల్పంతో పోరాడారు. ప్రజాక్షేత్రంలోనే బలం నిరూపించుకున్నారు. తిరుగులేని ఎత్తులతో ప్రతిపక్షాలతో పాటు స్వపక్షంలోని తస్మదీయులనూ చిత్తు చేశారు. లోక్సభను ఏడాది ముందే రద్దు చేసి ప్రజాతీర్పు కోరిన ఇందిరాగాంధీ అనుకున్నది సాధించారు. ఘర్షణకు దిగిన పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పడమే గాక పోఖ్రాన్ అణు పరీక్షతో మన శక్తిని ప్రపంచానికి చాటారు. కానీ దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే అత్యంత చీకటి కోణంగా చెప్పదగ్గ ఎమర్జెన్సీ విధింపు నిర్ణయంతో చెరగని మచ్చ మిగుల్చుకున్నారు. ఇలాంటి ఎన్నో విశేషాలకు 1971–77 ఐదో లోక్సభ కాలం సాక్షిగా నిలిచింది... సాక్షి, నేషనల్ డెస్క్: నాలుగో లోక్సభను ప్రధాని ఇందిర 1970 డిసెంబర్లో ఏడాది ముందే రద్దు చేయడం వెనుక గట్టి కారణాలే ఉన్నాయి. కాంగ్రెస్ అప్పటికే రెండుగా చీలింది. ఇందిర తీరు నచ్చని వ్యతిరేక వర్గం సిండికేట్గా ఏర్పడ్డారు. రాష్ట్రపతి ఎన్నిక ఇరు వర్గాల బలపరీక్షకు వేదికైంది. నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ అభ్యర్థిగా సిండికేట్ ప్రకటించింది. తన విశ్వాసపాత్రుడే ఆ పదవిలో ఉండాలని ఇందిర భావించారు. ఉప రాష్ట్రపతి వి.వి.గిరిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దించారు. విప్ జారీ చేయకున్నా, ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలంటూ పార్టీ నేతలకు పిలుపునిచ్చి అనుకున్నది సాధించారు. గిరిని గెలిపించుకున్నారు. కాంగ్రెస్ నుంచి ఇందిర బహిష్కరణ తర్వాత 68 ఎంపీలు కాంగ్రెస్ (ఓ) వైపు నిలిచారు. దాంతో లోక్సభలో ఇందిర సారథ్యంలోని కాంగ్రెస్ (ఆర్) బలం 220 మంది ఎంపీలకు పడిపోయింది. డీఎంకే, అకాలీదళ్, లెఫ్ట్, స్వతంత్రుల మద్దతుతో ఆధికారాన్ని నిలబెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు ఇందిర. నాలుగో లోక్సభను ప్రధాని ఇందిర 1970 డిసెంబర్లో ఏడాది ముందే రద్దు చేయడం వెనుక గట్టి కారణాలే ఉన్నాయి. కాంగ్రెస్ అప్పటికే రెండుగా చీలింది. ఇందిర తీరు నచ్చని వ్యతిరేక వర్గం సిండికేట్గా ఏర్పడ్డారు. రాష్ట్రపతి ఎన్నిక ఇరు వర్గాల బలపరీక్షకు వేదికైంది. నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ అభ్యర్థిగా సిండికేట్ ప్రకటించింది. తన విశ్వాసపాత్రుడే ఆ పదవిలో ఉండాలని ఇందిర భావించారు. ఉప రాష్ట్రపతి వి.వి.గిరిని స్వతంత్ర అభ్యరి్థగా బరిలో దించారు. విప్ జారీ చేయకున్నా, ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలంటూ పార్టీ నేతలకు పిలుపునిచ్చి అనుకున్నది సాధించారు. గిరిని గెలిపించుకున్నారు. కాంగ్రెస్ నుంచి ఇందిర బహిష్కరణ తర్వాత 68 ఎంపీలు కాంగ్రెస్ (ఓ) వైపు నిలిచారు. దాంతో లోక్సభలో ఇందిర సారథ్యంలోని కాంగ్రెస్ (ఆర్) బలం 220 మంది ఎంపీలకు పడిపోయింది. డీఎంకే, అకాలీదళ్, లెఫ్ట్, స్వతంత్రుల మద్దతుతో ఆధికారాన్ని నిలబెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు ఇందిర. విపక్షాలు గుంపుగా వచ్చిన... ఇందిరను ఏకాకిని చేసేందుకు భారతీయ జనసంఘ్, స్వతంత్ర, సోషలిస్టు పార్టీలతో కాంగ్రెస్ (ఓ) చేతులు కలిపినా లాభం లేకపోయింది. 238 స్థానాల్లో పోటీ చేసి కాంగ్రెస్ (ఓ) గెలిచింది 16 మాత్రమే. బ్యాంకుల జాతీయీకరణ, రాజ భరణం రద్దు వంటి నిర్ణయాల ప్రాతిపదికన ప్రజామోదం కోరి ఇందిర ఘనవిజయం సాధించారు. అభ్యర్థులను కాకుండా తనను చూసి ఓటేయాలన్న ఆమె పిలుపు బాగా క్లిక్కయింది. అలాగే ‘గరీబీ హటావో, దేశ్ బచావో’ నినాదమూ సూపర్హిట్టయింది. ఇందిరా కాంగ్రెస్43.68 శాతం ఓట్లతో ఏకంగా 352 సీట్లు సొంతం చేసుకుంది. ప్రాంతీయ పారీ్టల ఎదుగుదలను మాత్రం ఇందిర అడ్డుకోలేకపోయారు. సీపీఎం 25, సీపీఎం 23, భారతీయ జనసంఘ్ 22 సీట్లు నెగ్గగా స్వతంత్ర పార్టీ 8 స్థానాలతో సరిపెట్టుకుంది. డీఎంకే 23 లోక్సభ స్థానాలతో బలమైన ప్రాంతీయ పారీ్టగా నిలదొక్కుకుంది. విశేషాలు... ► ఐదో లోక్సభ ఎన్నికల పోలింగ్ 1971 మార్చి 1 నుంచి 10 మధ్య కేవలం పది రోజుల్లోనే పూర్తయింది. ► 1952 నుంచి లోక్సభ, దేశవ్యాప్తంగా అసెంబ్లీలకు జమిలిగా కొనసాగుతూ వస్తున్న ఎన్నికలకు ఇందిర ముందస్తు నిర్ణయంతో తొలిసారి తెర పడింది. ► దేశ ఆర్థిక పరిస్థితి మెరుగైంది. హరిత విప్లవ ఫలాలు అందివచ్చాయి. ► 1971లో పాక్ మనపై యుద్ధానికి తెగబడింది. తూర్పు పాకిస్తాన్ ప్రజల స్వతంత్ర పోరాటానికి మద్దతుగా భారత బలగాలు బరిలో దిగి 13 రోజుల్లోనే పాక్ పీచమణిచాయి. పాక్ ► ఆర్మీ చీఫ్ జనరల్ నియాజీ ఏకంగా 93,000 మంది సైనికులతో లొంగిపోయారు. ► డిసెంబర్ 16న బంగ్లాదేశ్ అవతరించింది. ► 1974 మే 18న రాజస్తాన్లోని పోఖ్రాన్లో తొలి అణ్వస్త్ర పరీక్షలు విజయవంతంగా జరిగాయి. అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా తర్వాత అణు సామర్థ్యమున్న దేశంగా భారత్ అవతరించింది. చెరగని మరక... ఎమర్జెన్సీ 1975 జూన్ 25. ఎమర్జెన్సీ విధిస్తూ ఇందిర నిర్ణయం తీసుకున్న రోజు. భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే దుర్దినంగా మిగిలిపోయింది. ప్రజల సాధారణ హక్కులనూ కర్కశంగా కాలరాసిన ఈ కఠిన నిర్ణయానికి ఇందిర మొగ్గు చూపడానికి పలు కారణాలు చెబుతుంటారు. వాటిలో ముఖ్యమైంది మాత్రం 1971 లోక్సభ ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి ఎంపీగా ఆమె గెలుపు చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచి్చన తీర్పే! అధికార యంత్రాంగాన్ని ఇందిర దుర్వినియోగం చేశారని, అనుమతించిన పరిమితికి మించి ఖర్చు చేశారని ఆమె చేతిలో ఓడిన రాజ్ నారాయణ్ కోర్టుకెక్కారు. ఇందిర ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారంటూ 1975 జూన్ 12న కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆమె ఎన్నికను రద్దు చేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ సిన్హా ప్రకటించారు. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా, ఏ పదవినీ చేపట్టకుండా నిషేధం విధించారు. ఇందిర సుప్రీంకోర్టుకు వెళ్లగా కొన్ని షరతులతో హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ జూన్ 24న తీర్పు వెలువరించింది. మర్నాడే లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఢిల్లీ రామ్లీలా మైదానంలో లక్ష మందితో కూడిన ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీని ఉద్దేశించి ఉర్రూతలూగించే ప్రసంగం చేశారు. దాంతో అదే రోజు ఇందిర ఎమర్జెన్సీ విధించారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా వెనక్కు తగ్గలేదు. 1977 మార్చి 21 దాకా ఎమర్జెన్సీ అరాచకాలు కనీవినీ ఎరగని రీతిలో కొనసాగాయి. ఫలితంగా 1977 ఎన్నికల్లో ఇందిర ఘోర ఓటమి చవిచూడటంతో కేంద్రంలో తొలి కాంగ్రెసేతర సర్కారు గద్దెనెక్కింది. -
‘అమ్మ చనిపోయింది.. ఆఖరి చూపులకూ వెళ్లలేకపోయా’
ఢిల్లీ, సాక్షి: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశంలో విధించిన 'ఎమర్జెన్సీ' రోజులను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గుర్తు చేసుకున్నారు. తనను 18 నెలల పాటు జైలులో పెట్టిన నాటి ప్రభుత్వం తన తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కూడా పెరోల్ ఇవ్వలేదన్నారు. బీజేపీపై కాంగ్రెస్ పార్టీ చేసిన 'నియంతృత్వ' ఆరోపణలపై స్పందింస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. వార్తా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ బ్రెయిన్ హెమరేజ్తో మరణించిన తన తల్లి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయానని భావోద్వేగానికి గురయ్యారు. "ఎమర్జెన్సీ సమయంలో మా అమ్మ అంత్యక్రియలకు హాజరు కావడానికి నాకు పెరోల్ ఇవ్వలేదు. ఇప్పుడు వారు ( కాంగ్రెస్ ) మమ్మల్ని నియంతలు అంటున్నారు" అని ఆయన పేర్కొన్నారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించినప్పుడు రాజ్నాథ్ సింగ్ వయస్సు 24 సంవత్సరాలు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా 1977 మార్చి వరకు కొనసాగిన జేపీ ఉద్యమంలో మిర్జాపూర్-సోన్భద్రకు ఆయన కన్వీనర్గా పనిచేశారు. "అప్పుడు నాకు కొత్తగా పెళ్లైంది. రోజంతా కష్టపడి ఇంటికి వచ్చిన నన్ను అర్ధరాత్రి సమయంలో పోలీసులు జైలుకు తీసుకెళ్లారు. ఏకాంత నిర్బంధంలో ఉంచారు" అని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఒక సంవత్సరం జైలులో గడిపిన తరువాత, ఆయన్ను విడుదల చేస్తారా అని అడిగిన రాజ్నాథ్ సింగ్ తల్లికి ఎమర్జెన్సీని మరో సంవత్సరం పొడిగించారని బంధువు ఆమెకు తెలియజేశారు. ఆ దిగులుతో ఆమెకు బ్రెయిన్ హెమరేజ్ వచ్చి 27 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. తనకు పెరోల్ రాకపోవడంతో తల్లి అంత్య క్రియలకు వెళ్లలేకపోయానని, దీంతో తన సోదరులే అంత్యక్రియలు నిర్వహించారని వివరించారు. తాను జైలులోనే గుండు గీయించుకున్నానని తెలిపారు. -
Liquor Case: సుప్రీం కోర్టులో ఎమర్జెన్సీ పిటిషన్
న్యూఢిల్లీ, సాక్షి: లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. తన అరెస్ట్ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. దీంతో సర్వోన్నత న్యాయస్థానంలో ఆయన ఈ ఉదయం అత్యవసర పిటిషన్ వేయబోనున్నట్లు సమాచారం. బుధవారం ఉదయం కోర్టు ప్రారంభం కాగానే చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు ఈ పిటిషన్ను స్పెషల్ మెన్షన్ చేయాలని, అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరేందుకు కేజ్రీవాల్ తరఫు న్యాయవాది సిద్ధమయ్యారు. దీంతో సుప్రీం విచారణకు స్వీకరిస్తుందా? లేదా? అనే ఉత్కంఠ ఆప్ శ్రేణుల్లో నెలకొంది. లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్ అభియోగాలపై మార్చి 21వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది. అయితే ఆ సమయంలోనే ఆయన సుప్రీం కోర్టులో తన అరెస్ట్ను సవాల్ చేస్తూ ఓ పిటిషన్ వేశారు. అయితే ఢిల్లీ హైకోర్టు, రౌస్ అవెన్యూ కోర్టుల్లో పిటిషన్లు పెండింగ్లో ఉండడం, కింది కోర్టుల్లో విచారణతో క్లాష్ అయ్యే అవకాశం ఉండడంతో ఆ టైంలో ఆయన ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. ఇక.. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ అసలైన సూత్రధారిగా ఈడీ ఆరోపిస్తోంది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఈడీ తమ కస్టడీకి తీసుకొని విచారించగా.. ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ రిమాండ్లో భాగంగా ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు. అరెస్ట్ చట్టవిరుద్ధం కాదు కేజ్రీవాల్ అరెస్టుకు ఈడీ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని పిటిషన్పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం పేర్కొంది. హవాలా ద్వారా డబ్బు తరలింపుపై ఈడీ ఆధారాలు చూపించిందని, గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లు అప్రూవర్ చెప్పారని న్యాయస్థానం పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధం కాదని వ్యాఖ్యానించింది. ‘‘సీఎంకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం ఉండదు. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేమీ ఉండవు. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనవసరం లేదు. నిందితుడి వీలును బట్టి విచారణ జరపడం సాధ్యం కాదు’’ అని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
'ఆ రోజే ఎమర్జన్సీ'.. రిలీజ్ డేట్ వచ్చేసింది!
గతేడాది తేజస్, చంద్రముఖి-2 సినిమాలతో మెప్పించిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. ప్రస్తుతం ఆమె ఎమర్జన్సీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కంగనా దర్శకత్వం వహించడమే కాకుండా.. నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ కనిపించనున్నారు. 1975లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన పరిణామాలే కథాంశంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అప్పట్లో ఎమర్జన్సీ సమయంలో జరిగిన సంఘటనలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది జూన్ 14న రిలీజ్ చేయనున్నట్లు కంగనా రనౌత్ ట్వీట్ చేసింది. ఆమె ట్విటర్లో రాస్తూ.. 'ఇండియా చీకటి రోజుల వెనక స్టోరీని చూడండి. జూన్ 14న ఎమర్జెన్సీ రిలీజ్ అవుతుంది. చరిత్ర మరోసారి కళ్ల ముందుకురానుంది' ట్వీట్లో రాసుకొచ్చింది. కాగా.. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, శ్రేయాస్ తల్పాడే, విశాక్ నాయర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎమర్జెన్సీ జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. Unlock the story behind India’s darkest hour. Announcing #Emergency on 14th June,2024 Witness history come alive as the most feared & fiercest Prime Minister #IndiraGandhi thunders into cinemas 🔥#Emergency in cinemas on 14th June,2024@AnupamPKher #SatishKaushik… pic.twitter.com/hOBRnXt4uu — Kangana Ranaut (@KanganaTeam) January 23, 2024 -
ఇందిరమ్మ రాజ్యమంటే ఎమర్జెన్సీలు.. ఎన్కౌంటర్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్/ సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యమట.. ఆ రాజ్యంలో ఏం జరిగిందో మనకు తెల్వదా?, అంత తొందరగా మరచిపోతమా?. ఇందిరమ్మ రాజ్యమంటే ఎన్కౌంటర్లు, ఎమర్జెన్సీలు.. జైలు పాలు చేసే బానిస బతుకులే కదా. తెలంగాణ ప్రజలు అరిగోస పడ్డది ఆ పాలనలోనే కదా. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో సంపదను పెంచుకుంటూ అభివృద్ధి పథంలో సాగే పాలన కావాలా? రైతుబంధు, ఉచిత విద్యుత్, ధరణిలపై అక్కసు వెళ్లగక్కుతూ దళారీల పాలన తెస్తామంటున్న ఇందిరమ్మ రాజ్యం కావాలా? మీరంతా ఆలోచించాలి. రాష్ట్ర సాధన తర్వాత తొమ్మిదేళ్లలో ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి పథంలో దేశంలోనే నంబర్ వన్గా ఎదిగాం. ఇలాంటి ప్రభుత్వాలను బలపరిస్తేనే భవిష్యత్ తరాలకు కూడా మంచి జరుగుతుంది. కాబట్టి అధికార బీఆర్ఎస్ను బలపరచాలి..’ అని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లా నస్పూర్, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన మాట్లాడారు. తల్లులకు మొక్కినం..రాష్ట్రం సాధించుకున్నం ‘సమ్మక్క సారలమ్మ నేలకు వందనం. రాష్ట్రం కోసం తల్లులకు మొక్కినం. ఎన్నోసార్లు మా తెలంగాణ రావాలని బంగారం ఇచ్చాం. మొక్కులు చెల్లించినం. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం. 15 ఏళ్లు మడమ తిప్పకుండా పోరాటం చేసి సాధించుకున్నాం. అంతకుముందు ఈ జాతరకు అంత ఆదరణ లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్లతో బ్రహా్మండంగా నిర్వహిస్తున్నాం. ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది. తొలుత ప్రజా సంక్షేమ సంకల్పంతో విధి వంచితులైన వితంతువులు, వృద్ధులు, వికలాంగుల లాంటి వారిని పరిగణనలోకి తీసుకొని బిర్యానీ కాకపోయినా పప్పు, చారుతోనైనా తినాలని, ఆసరా పింఛన్ రూ.200 నుంచి రూ.2 వేలకు పెంచాం. ఈ ఎన్నికల తర్వాత రూ.5 వేల వరకు పెంచుతాం. చందూలాల్ ఉన్నప్పుడు ములుగు తండావాసీ బాధ చూసి కూతురి పెళ్లికి సాయం చేశాం. ఆ తర్వాత కల్యాణలక్ష్మి ప్రారంభించాం. యాభై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇలాంటి పథకాలు ఒక్కటైన తెచ్చారా? పక్కన గోదావరి, కృష్ణానది ఉన్నా.. ఎక్కడా తాగునీటి కల్పనకు చర్యలు తీసుకోలేదు. కానీ బీఆర్ఎస్ పాలనలో నల్లగొండ జిల్లా ఆరోగ్య సమస్య పరిష్కారానికి మిషన్ భగీరథ పథకం అమలు చేశాం. 44,861 ఎకరాల పోడు భూములు పంపిణీ చేయడమే గాకుండా కేసులు ఎత్తేసి, రైతుబంధు అమలు చేసి, త్రీఫేజ్ కరెంటు సరఫరా పనులు చేపట్టాం. పల్లె, బస్తీ దవాఖానాల్లో ఉచితంగా పరీక్షలు చేస్తున్నాం. కేసీఆర్ కిట్లు ఇస్తున్నాం. గిరిజనేతర పోడు భూమి రైతులకు కూడా పట్టాలు ఇప్పిస్తాం..’ అని కేసీఆర్ చెప్పారు. దొంగల చేతిలో రాష్ట్రాన్ని పెట్టొద్దు ‘ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా సుమారు 80 నియోజకవర్గాల్లో పర్యటించా. ఇంకో ఇరవై తిరుగుతా. కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదు.. తుస్సుమంది. వచ్చేది లేదు.. చచ్చేదీ లేదు. తప్పిదారి ఆ పారీ్టకి అధికారం ఇస్తే వైకుంఠం ఆటలో పెద్దపాము మింగినట్లే. తెలంగాణలోనూ కర్ణాటక తరహాలోనే దగా చేస్తారు. మళ్లీ దొంగల చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టొద్దు. రైతులకు ఉచిత కరెంటు ఇస్తుంటే కాంగ్రెస్ 3 గంటలు సరిపోతుందంటోంది. 30 లక్షల పంపుసెట్లను 10 హెచ్పీకి పెంచితే అయ్యే రూ.50 వేల కోట్లు ఎవరు ఇస్తారు?. భూ భద్రతతో పాటు రైతుబంధు డబ్బులు నేరుగా ఖాతాల్లో పడే సాంకేతికతతో కూడిన ధరణిని ఎద్దు ఎవుసం తెలియని రాహుల్గాంధీ బంగాళాఖాతంలో పడేస్తరట. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగాలను పునరుద్ధరించుకున్నాం. మొన్ననే సింగరేణి కారి్మకులకు బోనస్ కానీ, లాభాల్లో వాటా కానీ..రూ.1,000 కోట్ల వరకు పంచినం. సింగరేణి తెలంగాణకు సిరులతల్లి.. దీన్ని మరింత విస్తరిస్తాం. బయ్యారం ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్రం నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. ఇకపై దాని బాధ్యతలను సైతం సింగరేణి తీసుకుంటుంది. రాష్ట్రంలో ఎక్కడ మైనింగ్కు అవకాశాలున్నా సింగరేణి ఆధ్వర్యంలో చేపడతాం. బీజేపీకి ఓటేస్తే మోరీలో వేసినట్లే. దేశంలో 157 మెడికల్ కాలేజీలు పెడితే రాష్ట్రంలో పెట్టాలని వంద లేఖలు రాసినా పట్టించుకోలేదు. బొగ్గు గనులు ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రతి జిల్లాకు నవోదయ, మెడికల్ కాలేజీ ఇయ్యని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి?..’ అని కేసీఆర్ ప్రశ్నించారు. మంచి ఎమ్మెల్యే గెలిస్తే, మంచి గవర్నమెంట్ వస్తది ‘ఓటేసే ముందు పారీ్టల చరిత్ర, నడవడిక, దృక్పథం పరిగణనలోకి తీసుకోవాలి. మంచి ఎమ్మెల్యే గెలిస్తే, మంచి గవర్నమెంట్ వస్తది. ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే బాగా అభివృద్ధి చెందుతుందో ఆలోచించాలి. కాంగ్రెస్ 50 సంవత్సరాల్లో దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించిన తీరు, బీఆర్ఎస్ పాలన తీరు బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఎవరైతే న్యాయంగా అవసరమైన పేదలకు పని చేయగలుగుతారో చూసి ఓటెయ్యాలి..’ అని కేసీఆర్ కోరారు. ‘గతంలో ములుగులో ఓడించారు. మీమీద అలిగిన. ఇప్పుడు గెలిపించకుంటే మీతో పంచాయితీ పెట్టుకుంటా..’ అని అన్నారు. ఆయా సభల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు బడే నాగజ్యోతి (ములుగు), గండ్ర వెంకటరమణా రెడ్డి (భూపాలపల్లి), నడిపెల్లి దివాకర్రావు (మంచిర్యాల), కోరుకంటి చందర్ (రామగుండం), మంత్రులు సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ఎంపీలు కవిత, వెంకటేశ్ నేత, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, సిరికొండ మధుసూదనాచారి, వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
14 గంటల్లో..ఎనిమిది వందలసార్లు కంపించిన భూమి
రేగ్యావిక్: ఒక భూ కంపం వస్తేనే ప్రజలు వణికిపోతారు.పరిస్థితులు గందరగోళంగా తయారవుతాయి.అలాంటిది ఐస్లాండ్ దేశంలో కేవలం 14 గంటల్లో ఎనిమిది వందల సార్లు భూమి కంపించిందంటే ఆ దేశ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.వరుస భూ కంపాలు బెంబేలిత్తిస్తుండడంతో అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. ఐస్లాండ్ మెట్ ఆఫీస్ తెలిపిన దాని ప్రకారం రిక్టర్ స్కేల్పై 5.2 తీవ్రతతో గ్రిండావిక్ గ్రామంలో భారీ భూ ప్రకంపనలు సంభవించాయి.రాజధాని రేగ్యావిక్కు 40 కిలోమీటర్ల దూరంలో వచ్చిన ప్రకంపనల కారణంగా ఇళ్లలోని కిటికీల తలుపులు, వస్తువులు కొద్దిసేపు ఊగాయి.వరుస భూ ప్రకంపనలు సంభవించినపుడు అగ్నిపర్వతం బద్దలయ్యే చాన్సులు ఎక్కువగా ఉంటాయని అధికారులు తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను తరలించేందుకు అత్యవసర షెల్టర్లు ఏర్పాటు చేశారు. ఐలాండ్ దేశంలో 33 యాక్టివ్ అగ్నిపర్వతాలు ఉన్నాయి.యూరప్లోనే ఇది అత్యధికం. ఇదీ చదవండి...అమెరికా ఎంక్యూ–9 డ్రోన్ పేల్చివేత -
ఎమర్జెన్సీపై ఇందిరా గాంధీ వ్యాఖ్యలు.. విలేకరుల ముఖంపై చిరునవ్వులు
భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీపై మాయని మచ్చ ఎమర్జెన్సీ. దీని వల్ల భారత ప్రజలకు, ముఖ్యంగా జర్నలిస్టుల ఆగ్రహానికి గురైంది. దీని కారణంగా ఆమె పార్టీ ఘోరంగా తదుపరి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది కూడా. ఆ టైంలో మళ్లీ మీడియా ముందుకుగానీ జర్నలిస్టులను ఎదుర్కొడం గానీ చేయలేక ఏ నాయకుడు లేదా నాయకురాలైనా ఇబ్బంది పడతారు. కానీ తన తప్పును అంగీకరిస్తూ మీడియాను ఎదుర్కొవడమే కాదు జర్నలిస్టులు ఆవేశంతో సంధించే ప్రశ్నల బాణాలకు బెదరకుండా తనదైన శైలిలో సమాధానంచెప్పి వారి కోపాన్ని ఉపశమించేలా చేసింది. వారి ముఖాల్లో నవ్వు తెప్పించి మరో ప్రశ్న తావివ్వకుండా చేసి "దటీజ్ ఇందిరా" అనుపించుకుంది. నేడు ఇందిరాగాంధీ వర్ధంతి(అక్టోబర్ 31) సందర్భంగా ఆమెకు సంబంధించిన ఆసక్తికర విషయాలు చూద్దాం. నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఏకపక్షంగా విధించిన అత్యవసర పరిస్థితి లేదా ఎమర్జెన్సీని 71 ఏళ్ల ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి కాలంగా అభివర్ణిస్తారు. అప్పటి రాష్ట్రపతి ఫకృదీన్ అలీ "ప్రబలిన అంతర్గత కలవరం" అని పేర్కొంటూ ఉత్తర్వు జారీ చేయడంతో భారతదేశ ప్రజలు ఒక్కసారిగా తమ హక్కులను కోల్పోపయారు. ఈ ఎమర్జెన్సీ 1977 జూన్ 25 అర్థరాత్రి 11.45 నిమిషాల వరకు కొనసాగింది. దీని కారణంగా ఆమె తదుపరి ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలయ్యి పదవినీ కోల్పోయింది. సరిగ్గా ఆ టైంలో ఆగ్రహావేశాలతో విదేశీ జర్నలిస్టులు ఆమె వద్దకు వచ్చి ప్రశ్నల వర్షం కురిపించే యత్నం చేశారు. ఆ సమయంలో తన సంయమనాన్ని, స్థైర్యాన్ని కోల్పోకుండా వారిని ఎదర్కొవడమే గాక ఆమె చేసిన వ్యాఖ్యలు విలేకరులను మరో ప్రశ్న అడగకుండా చేసి తనకు సాటి లేరని నిరూపించింది. ఇంతకీ ఆమె చేసిన వ్యాఖ్యలు ఏంటంటే.. ఆ విదేశీ విలేకరులంతా చాలా ఆగ్రహంగా..మీరు విధించిన ఎమర్జెన్సీతో పొందిన ప్రయోజనం ఏమిటి అని సూటిగా ప్రశ్నించారు. వాళ్లంతా ఆమె ఏం చెబుతుందా అన్నట్లు అందరూ కళ్లు పెద్దవిగా చేసుకుని చెవులు రిక్కరించి మరీ కుతూహులంగా చూస్తున్నారు. ఆమె చాలా స్థైర్యంతో ఓటమిని ఒప్పుకుంటూ..తాము భారతీయ ప్రజలలోని అన్ని వర్గాలను సమగ్రంగా దూరం చేసుకున్నాం లేదా దూరం చేయగలిగాను అని తెలుసుకున్నా అని చెప్పారు ఇందిరా గాంధీ. ఆ వ్యాఖ్యకు ఒక్కసారిగా జర్నలిస్టులంతా పెద్దగా నవ్వారు. ఆ తర్వాత చాలా నిశబ్ధం..అంతా కామ్ అయిపోయి మళ్లీ మరో ప్రశ్న కూడా వేయకుండా వెనుదిరిగారు. ఆమె మాట్లాడిన తీరు విలేకరుల మనసులను ద్రవింపచేసింది. 1978లో జనిగిన ఈ ఆసక్తికర విషయాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2017లో తన వీడ్కోలు ప్రసంగంలో పంచుకున్నారు. ఆవిడ ఆ టైంలో కూడా ధైర్యంగా తన ఓటమిని అంగీకరిస్తూ.. మాట్లాడిన మాటలు జర్నలిస్ట్ల ముఖాల్లో నవ్వు తెప్పించినా..వారి ప్రశ్న పరంపరకు అడ్డుకట్ట వేయగలిగిందంటూ నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంలో జవహర్ లాల్ తరుచుగా చెప్పే వ్యాఖ్యలను గుర్తుచేసుకున్నారు ప్రణబ్. "మార్పు" కొనసాగింపు, సమతుల్యత ఎప్పుడూ ఉంటుందని నెహ్రు తరుచుగా చెప్పేవారని అన్నారు. నాయకురాలిగా ఆమె విధానం.. 1971 నాటికి ప్రధాని ఇందిరా గాంధీ ప్రభుత్వంపైనా, కాంగ్రెస్ పార్టీపైనా పూర్తి ఆధిక్యతను సాధించింది. అలాగే తన పార్టీలోని తన ప్రత్యర్థులను తీవ్రంగా అణచివేయడంతో 1949లో కాంగ్రెస్ ఓ, ఆర్ అనే రెండు గ్రూప్లగా విడిపోయింది. కాంగ్రెస్(ఆర్) అంటే ఇందిరకు అనుకూలమైన మంత్రులని, ఓ అంటే ఆర్గనైజేషన్, సిండికేట్ గా పేరొందిన కాంగ్రెస్ పాతనేతలు కింద విడిపోయింది. ఆలిండియా కాంగ్రెస్ కమిటీలోనూ, పార్టీ ఎంపీల్లోనూ ఎక్కువభాగం ప్రధాని ఇందిర పక్షం వహించారు. అలాగే తన మాట చెల్లించుకునేలా హఠాత్తుగా ఆర్డినెన్స్లు తీసుకొచ్చి ప్రత్యర్థులను షాక్ గురిచేసేది. ఇక 1969లో బ్యాంకుల జాతీయకరణ, 1970లో రాజభరణాల రద్దు వంటి వామపక్ష అనుకూల, ప్రజారంజకమైన కార్యకలాపాలు, గరీబీ హఠావో! వంటి నినాదాలు ఇందిరకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలాగే అగర్భ శత్రువైనా పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించడంతో ఇందిరా గాంధీ తూర్పు పాకిస్తాన్గా ఉన్న ప్రాంతాన్ని బంగ్లాదేశ్గా ఏర్పరిచి పాకిస్తాన్ని చావుదెబ్బ కొట్టింది. అందుకుగానే భారతర్న పురస్కారాన్ని అందుకుంది. అలాగే ఆమెకు మంచి ఎకనమిస్ట్ , భారత సామ్రాజ్ఞి వంటి బిరుదులు అందుకుంది. నియంతలా వ్యవహరిస్తున్నారు అన్న ప్రత్యర్థుల చేతే దుర్గ, చండి వంటి ప్రశంసలు అదుకుంది. ఆమె ప్రధానిగా 1966 నుంచి 1977 వరకు, మళ్లీ 1980 నుంచి 1984లో ఆమె హత్యకు గురయ్యేంత వరకు భారతదేశానికి మూడవ ప్రధానిగా సేవలందించారు. ఆమె దూకుడుగా తీసుకున్న ఎమర్జెన్సీ విధింపు నిర్ణయమే ఆమె జీవితంలో చెరగని మచ్చగా మిగిలిందని చెప్పాలి. (చదవండి: వికీపీడియాలో మహిళా శాస్త్రవేత్తల బయోగ్రఫీ ఉందా? గమనించారా?) -
సౌత్ పాపులర్ హీరోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కంగనా
బాలీవుడ్ సంచలన నటి కంగనా రనౌత్. వివాదాస్పద నటిగా ముద్రవేసుకున్న ఈ భామ నటిగా మాత్రం బిజీబిజీగా ఉన్నారు. దర్శకురాలిగా, నిర్మాతగాను రాణిస్తున్న కంగనారనౌత్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తున్న ఎమర్జెన్సీ చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఇందులో ఆమె దివంగత ప్రధాని ఇందిరా గాంధీగా నటిస్తున్నారు. కాగా కంగనారనౌత్ తాజాగా నటించిన తేజాస్ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. ఇక తమిళంలోనూ మంచి క్రేజ్ ఉన్న ఈమె ఇటీవల తమిళంలో నటించిన చంద్రముఖి–2 చిత్రం విడుదల కావడం, ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం జరిగిపోయింది. చంద్రముఖి–2 చిత్రం ప్రచారం అంతా ఈమైపెనే జరిగినా, చిత్రంలో కనిపించింది మాత్రం ఇంటర్వెల్ తరువాతనే. ఇదే ప్రేక్షకులను నిరాశ పరిచిన విషయం. కాగా తరచూ వార్తల్లో ఉండే కంగనారనౌత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ ప్రస్తుతం తాను నటిస్తున్న చిత్రాలు కాకుండా మరో మూడు చిత్రాలు అంగీకరించినట్లు చెప్పారు. అందులో అను వెడ్స్ మను చిత్రానికి సీక్వెల్తో పాటు విజయ్సేతుపతి సరసన నటించే చిత్రం కూడా ఉందన్నారు. అయితే విజయ్సేతుపతితో నటించేది హిందీలోనా, తమిళంలోనా అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే విజయ్సేతుపతి ఇప్పుడు హిందీలోనూ బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. -
ఎమర్జెన్సీ అలర్ట్ సివియర్..ఈ ఫ్లాష్ మెసేజ్మీకూ వచ్చిందా?
Emergency Alert -Severe: స్మార్ట్ఫోన్లలో ఎమర్జెన్సీ అలర్ట్ మరోసారి మొబైల్ వినియోగదారులను గందరగోళంలో పడేసింది. గతంలో మాదిరిగి దేశవ్యాప్తంగా చాలా మంది యూజర్లకు ప్లాష్ మెసేజ్ఒకటి వచ్చింది. ఫ్లాష్ మెసేజ్తోపాటు పాటు బిగ్గరగా బీప్ సౌండ్ కూడా వచ్చింది. అయితే ఈ అత్యవసర సందేశానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. స్మార్ట్ఫోన్లలో టెస్ట్ ఫ్లాష్ ద్వారా ఇండియాలో అత్యవసర హెచ్చరిక వ్యవస్థను మళ్లీ పరీక్షించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు(సెప్టెంబరు 21) బీప్ సౌండ్తోపాటు మెసేజ్లు వచ్చాయి. అలాగే ఆందోళన వద్దు అన్న మెసేజ్లు కూడా స్మార్ట్ఫోన్ యూజర్లకు వచ్చాయి. భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం రా సెల్ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ సెండ్ చేసిన టెస్టింగ్ మెసేజ్ ఇది. అలర్ట్ టెక్స్ట్ సిస్టమ్ టెస్టింగ్లో భాగంగానే ఈ మెసేజ్ పంపినట్లు తెలిపింది. ముఖ్యంగా ఏదైనా ఎమర్జెన్సీ సమయాల్లో ప్రజల్ని ఎలా అప్రమత్తం చేయాలో పరీక్షిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది. అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో మెసేజ్ వచ్చింది. (తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ ఘనత: దిగ్గజ కంపెనీల ప్లేస్ ఎక్కడ?) మొబైల్ ఆపరేటర్లు , సెల్ ప్రసార వ్యవస్థల అత్యవసర హెచ్చరిక ప్రసార సామర్థ్యాల సామర్థ్యం , ప్రభావాన్ని అంచనా వేయడానికి వివిధ ప్రాంతాలలో ఇటువంటి పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తుంటామని టెలి కమ్యూ నికేషన్ విభాగం సెల్ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ తెలిపింది.భూకంపాలు, సునామీ, ఆకస్మిక వరదలు వంటి విపత్తుల కోసం మరింత సన్నద్ధంగా ఉండటానికి ప్రభుత్వం జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీతో కలిసి పనిచేస్తోంది. కాగా జూలై 20,ఆగస్టు 17న కూడా ఫోన్ వినియోగదారులకు ఇలాంటి టెస్ట్ మెసేజ్లు వచ్చాయి. -
ఉత్తరకొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగం మళ్లీ విఫలం
సియోల్: ఉత్తరకొరియా రెండో సారి చేపట్టిన నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. గత మేలో చేపట్టిన నిఘా ఉపగ్రహం మొదటి ప్రయోగం కూడా విఫలమైన విషయం తెలిసిందే. మూడో దశలో ఎమర్జెన్సీ బ్లాస్టింగ్ వ్యవస్థలో లోపం వల్లే గురువారం పసిఫిక్ సముద్ర జలాల్లో ఉపగ్రహాన్ని మోసుకెళ్లే చొల్లిమ–1 రాకెట్ కూలిందని వివరించింది. వచ్చే అక్టోబర్లో మూడోసారి మరింత మెరుగ్గా ఈ ప్రయోగం చేపడతామని ఉత్తరకొరియా గురువారం ప్రకటించింది. ఈ ప్రయోగం కారణంగా జపాన్ ప్రభుత్వం ఒకినావా దీవుల్లోని తన ప్రజలను అప్రమత్తం చేసింది. ఉత్తరకొరియాలోని తొంగ్చాంగ్–రి తీరం నుంచి గురువారం మధ్యాహ్నం 3.50 గంటలకు ఈ ప్రయోగం జరిగినట్లు దక్షిణకొరియా మిలటరీ తెలిపింది. -
కార్చిచ్చును వంటింట్లో మంటలతో పోల్చిన జో బైడెన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మౌయి ప్రమాద బాధితులను కలిసి ఓదార్చే క్రమంలో కార్చిచ్చును 15 ఏళ్ల క్రితం తన వంటింట్లో జరిగిన అగ్నిప్రమాదంతో పోల్చారు. ఆనాడు తాను తన భార్య ఇలాంటి ప్రమాదంలోనే ఇంటిని కోల్పోయిన సంఘటనను గుర్తుచేస్తూ ఆ బాధని వివరించే ప్రయత్నం చేశారు. . ఆగస్టు 8న హవాయిలోని మౌయి ద్వీపంలో చెలరేగిన కార్చిచ్చు పెనువిషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 114 మంది మరణించగా ఎందరో నిరాశ్రయులయ్యారు. జో బైడెన్ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. అనంతరం ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడిన వారిని కలిసి ఓదార్చారు. బాధితులతో జో బైడెన్ మాట్లాడుతూ ఈ శతాబ్దంలోనే ఇది అత్యంత విషాదకరమైనదిగా వర్ణించారు. నేను ఈ పరిస్థితులను పోల్చడం లేదు కానీ ఉన్న ఇంటిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసన్నారు. 15 ఏళ్ల క్రితం నేను నా భార్య జిల్ బైడెన్ ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నాము. నా నివాసానికి సమీపంలోని ఒక చెరువులో పిడుగు పడటంతో ఎయిర్ కండీషన్ వైరు ద్వారా ఆ మంటలు మా ఇంటిలో కూడా వ్యాపించాయి. ఇల్లు మొత్తం తగలబడింది. ప్రమాదంలో నా కారును, నా పెంపుడు పిల్లిని కోల్పోయానని.. ఆరోజు అగ్నిమాపక దళాలు సమయానికి స్పందించడంతో నేను నా కుటుంబం ప్రాణాలతో బయటపడ్డామని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కొలిన్ రగ్ అనే మీడియా ప్రతినిధి అమెరికాఅధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను తన ఎక్స్(ఒకపుడు ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఎందరో ప్రాణాలను హరించిన దావానలాన్ని అమెరికా అధ్యక్షుడు ఒక కట్టు కథ చెప్పి ఓదార్చే ప్రయత్నం చేశారు. ఆయన ఇంట్లో జరిగిందని చెప్పిన అగ్నిప్రమాదం గురించి అగ్నిమాపక సిబ్బందిని అడిగితే అదంతా వట్టి కట్టు కథని అలాంటిదేమీ జరగలేదని తోసిపుచ్చారని తెలిపారు. ఈ ప్రమాదాన్ని నియంత్రించడంలోనూ, సహాయక చర్యలు చేపట్టడంలోనూ చాలా నిదానంగా వ్యవహరించిందని ప్రభుత్వం ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో జో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. సుదీర్ఘ చరిత్ర కలిగిన లాహైన్ నగరంలో ఎక్కడ చూసినా శిధిలాల కుప్పలే దర్శనమిస్తున్నాయి. ప్రమాదంలో 114 మంది మరణించగా కార్చిచ్చు ధాటికి వేల సంఖ్యలో నివాసాలు, వాహనాలు కాలి బూడిదయ్యాయి. అనేక జంతువులు ప్రాణాలు కోల్పోగా ఎందరో నిరాశ్రయులై అత్యవసర సహాయ శిబిరాల్లో తల దాచుకున్నారు. NEW: President Biden once again tries to make the Maui fire that killed ~500 people about himself by telling a story about how he almost lost his corvette in a house fire. You can always count on Biden to tell a story that didn’t happened. “I don't want to compare difficulties,… pic.twitter.com/FI4bR85erR — Collin Rugg (@CollinRugg) August 22, 2023 ఇది కూడా చదవండి: BRICS 2023: జోహన్నెస్బెర్గ్కు పయనమైన ప్రధాని మోద -
ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. నాలుగో అంతస్తు నుండి దట్టమైన పొగలు బయటకు రావడంతో చుట్టుపక్కల వార్డుల్లోని రోగులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి విషయం చేరవేయడంలో వారు సమయానికి ఆసుపత్రికి చేరుకొని ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎయిమ్స్ ఆసుపత్రిలోని ఎండోస్కోపీ విభాగంలో మంటలు రావడంతో ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు ఆసుపత్రి సిబ్బంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఎమర్జెన్సీ విభాగానికి కూడా వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన ఆసుపత్రి వర్గాలు వెంటనే స్పందించి ఎమర్జెన్సీ వార్డులోని రోగులను సురక్షిత వార్డులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించడంతో ఆరు ఫైరింజన్లతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది సమయానికి స్పందించి రోగులను సురక్షిత వార్డులకు తరలించడంతో ఎటువంటి అనర్ధం జరగలేదు. ప్రమాదానికి కారణమైతే ఇంకా తెలియరాలేదు కానీ షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగి ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఆసుపత్రి వర్గాలు. -
వయోధిక పాత్రికేయులకు అత్యవసర నిధి ఏర్పాటు
పంజగుట్ట: వయోధిక పాత్రికేయుల అత్యవసర నిధి ఏర్పాటుకు తన వంతుగా రూ. లక్ష ప్రకటిస్తున్నట్లు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో వయోధిక పాత్రికేయ సంఘం ఆధ్వర్యంలో వయోధిక పాత్రికేయ ప్యాకెట్ డైరీ ఆవిష్కరణ, ఇటీవల మృతి చెందిన సీనియర్ పాత్రికేయులు వి.పాండురంగారావు సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్బంగా సీనియర్ పాత్రికేయులు మధు వాకాటి వయోధిక పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అల్లం నారాయణ మాట్లాడుతూ పాత్రికేయులు వయస్సు పెరుగుతున్నా రచనలు మానకూడదన్నారు. ఏ.బీ.కే లాంటి వారు ఇంకా రాస్తున్నారని ఇప్పటికీ వారి అక్షరాల్లో పదును తగ్గలేదని, ఆయన భావాలు మారలేదన్నారు. పాత్రికేయరంగంలో ఉన్న వారిలో కొందరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అత్యవసర పరిస్థితుల్లో వారిని ఆదుకునేందుకు వయోధిక అత్యవసర నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఆ నిధికి మొదటగా తానే రూ. లక్ష ఇస్తున్నట్లు తెలిపారు. అక్రిడిటేషన్ సమస్య కూడా తమ దృష్టికి తెచ్చారని 60 సంవత్సరాలు దాటిన పాత్రికేయునికి ఎలాంటి పత్రాలు లేకున్నా, గతంలో పనిచేసిన ఆనవాళ్లు ఉంటే తప్పకుండా అక్రిడిటేషన్ కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికీ ఎవరికైనా లేకపోతే తనను సంప్రదిస్తే వెంటనే వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టు హెల్త్ స్కీం ఎంతో అద్భుతమైనదని గతంలో అపోలో, యశోదా ఆసుపత్రుల్లోనూ కొనసాగేదని, కాని ప్రస్తుతం కేవలం నిమ్స్లో మాత్రమే నడుస్తుందన్నారు. వయోధిక పాత్రికేయులకు ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే, అత్యవసర పరిస్థితుల్లో కార్పోరేట్ ఆసుపత్రికి వెళితే తాను మాట్లాడి హెల్త్కార్డుల ద్వారా చికిత్స అందేలా చూస్తానన్నారు. నిమ్స్లోనూ వయోధిక పాత్రికేయులకు వెంటనే చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని నిమ్స్ డైరెక్టర్కు చెబుతానన్నారు. మీడియా అకాడమీలో యూనియన్ కార్యాలయాలకు గదులు ఇవ్వరని కానీ వయోధిక పాత్రికేయుల కార్యాలయం ఏర్పాటుకు గదిని కేటాయిస్తానని హామీ ఇచ్చారు. వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షులు దాసు కేషవరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వయోధిక పాత్రికేయ ప్యాకెట్ డైరీ రూపకర్త ఎన్.శ్రీనివాస్ రెడ్డి, సంఘం ఉపాధ్యక్షులు టి.ఉడయవరులు, సెక్రటరీ లక్ష్మణ్రావు, జాయింట్ సెక్రటరీ రాజేశ్వరరావు, రామమూర్తి, సభ్యులు ఎ.జీ.ప్రసాద్, జి.భగీరధ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఇథియోపియాలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం..
అడిస్ అబాబా: ఇథియోపియాలో ఆ దేశ ప్రభుత్వం శుక్రవారం ఎమర్జెన్సీని ప్రకటించింది. గత కొంతకాలంగా ఉత్తర అమ్హారా ప్రాంతంలో ఫెడరల్ భద్రతా దళాలకు స్థానిక మిలీషియాలకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇక ఇదే వారంలో ఇథియోపియన్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్, ఫానో మిలీషియా గ్రూప్ మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరిగినట్లు స్థానిక మీడియా నివేదించింది. పొరుగున ఉన్న టైగ్రే ప్రాంతంలో రెండు సంవత్సరాల పాటు జరిగిన అంతర్యుద్ధం కారణంగానే ఈ ఘర్షణలు చెలరేగినట్లు చెబుతోంది ఇథియోపియా ప్రభుత్వం. సాధారణ న్యాయ వ్యవస్థ ఆధారంగా ఈ దారుణాలను నియంత్రించడం కష్టతరంగా మారినందుకే అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిందని ప్రధాన మంత్రి అబీ అహ్మద్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మొదటగా ప్రభుత్వం తరపున ఆర్డర్ను తిరిగి అమలు చేయాల్సిందిగా ఫెడరల్ అధికారుల సాయం కోరామని అయినా కూడా ఘర్షణలను నియంత్రించడం కష్టతరం కావడంతో ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో ఎమర్జెన్సీని ప్రకటించాల్సి వచ్చిందని ప్రధాన మంత్రి అబీ అహ్మద్ కార్యాలయం ప్రకటించింది. ఎమర్జన్సీ అమల్లో ఉండగా బహిరంగ సభలను నిషేధం.. అలాగే ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారెంట్లు లేకుండా అరెస్టులు జరుగుతాయని ఏ ప్రకటనలో పేర్కొంది. అవసరాన్ని బట్టి కర్ఫ్యూ విధించదానికి కూడా వెనుకాడమని ప్రకటనలో తెలిపింది. ఇది కూడా చదవండి: రష్యా యుద్ధనౌకపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. -
అంబులెన్స్ సైరన్ ఎమర్జెన్సీలోనే.. మీ ఇష్టమున్నట్టు కాదు..
హైదరాబాద్: రోగులను ఆస్పత్రికి వేగంగా తరలించడానికి అంబులెన్స్ సర్వీస్ను ఉపయోగిస్తారు. ఆ సైరన్ వినపడగానే రోడ్డుపై ఆ వాహనానికి దారి ఇస్తాం. ట్రాఫిక్ పోలీసులు సైతం తక్షణ అవసరాన్ని గుర్తించి అంబులెన్స్లకు దారి ఇచ్చేలా సిగ్నల్స్ను సైతం అందుకు తగ్గట్టుగా మారుస్తుంటారు. కానీ కొందరు ఈ అంబులెన్స్ సేవలను దుర్వినియోగం చేస్తుంటారు. అవసరం లేకున్నా సైరన్ మోగిస్తారు. ఇటీవల ఇలాంటి ఘటనే తెలంగాణలో వెలుగులోకి వచ్చింది. దీనిపై రాష్ట్ర పోలీసు శాఖ సీరియస్ అయ్యింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంబులెన్స్ సైరన్ను ఉపయోగించాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ ట్వీట్ చేశారు. #TelanganaPolice urges responsible use of ambulance services, citing misuse of sirens. Genuine emergencies require activating sirens for swift and safe passage. Strict action against abusers is advised. Together, we can enhance emergency response and community safety. pic.twitter.com/TuRkMeQ3zN — Anjani Kumar IPS (@Anjanikumar_IPS) July 11, 2023 ఓ ఆస్పత్రికి చెందిన అంబులెన్స్ ట్రాఫిక్లో సైరన్ మోగిస్తూ వచ్చింది. ఎమర్జెన్సీని గుర్తించిన ట్రాఫిక్ పోలీసు.. సిగ్నల్స్ను మార్చి ఆ వాహనానికి తక్షణం దారి ఇచ్చారు. కానీ సిగ్నల్ దాటిన తర్వాత డ్రైవర్ ఆ అంబులెన్స్ను ఆపి టిఫిన్ తిన్నట్లు ట్రాఫిక్ పోలీసు గుర్తించారు. రోడ్డు పక్కనే అగి ఉన్న అంబులెన్స్ వద్దకు వచ్చి డ్రైవర్ను ప్రశ్నించగా.. నీరసం వస్తుందంటూ పొంతన లేని సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు. దీంతో ఈ విషయం పోలీసు ఉన్నతాధికారులకు చేరింది. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర పోలీసు యంత్రాంగం.. ఆ అంబులెన్స్ డ్రైవర్ తీరుపై సీరియస్ అయ్యింది. అంబులెన్స్ సైరన్ ఎమర్జెన్సీలోనే వాడాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇష్టమున్నట్టు ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే ఆస్పత్రికి వెళ్లడానికి సైరన్ను ఉపయోగించాలని సూచించింది. సమాజ శ్రేయస్సుకు మనమంతా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరింది. ఇదీ చదవండి: చేతులెత్తేసిన పోలీసులు.. పీఎస్లో హిజ్రాల రణరంగం -
ఆ చీకటి రోజులను మరచిపోలేము.. ప్రధాని మోదీ
భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 48 సంవత్సరాలు పూర్తైన నేపథ్యంలో 21 నెలల పాటు సాగిన ఆనాటి చీకటి రోజులను మరువలేమని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 1975, జూన్ 25న ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. నేటికి ఆ ఘట్టం జరిగి 48 సంవత్సరాలు పూర్తైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో భావోద్వేగభరితమైన ట్వీట్ చేశారు. ఆనాడు ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేస్తూ ఎమర్జెన్సీని ధైర్యంగా వ్యతిరేకించిన ప్రతి ఒక్కరికీ నా నివాళులు సమ్పర్పిస్తున్నాను. రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా సాగిన ఆ ఎమర్జెన్సీ చీకటి రోజులను ఎన్నటికీ మరువలేమని రాశారు. I pay homage to all those courageous people who resisted the Emergency and worked to strengthen our democratic spirit. The #DarkDaysOfEmergency remain an unforgettable period in our history, totally opposite to the values our Constitution celebrates. — Narendra Modi (@narendramodi) June 25, 2023 భారతీయ జనతా పార్టీ నేత స్మృతి ఇరానీ కూడా ట్విట్టర్ వేదికగా ఈ ఘట్టాన్ని గుర్తు చేసుకున్నారు. చిత్రహింసలు, అరెస్టులు, హత్యలు, పత్రికా స్వేచ్ఛను తుంగలో తొక్కి వారి స్వరాన్ని అణచివేయడం వంటి ఎన్నో దురాగతాలకు ప్రతీక 1975 నాటి జూన్ 25. ఆనాటి ఎమర్జెన్సీ పరిస్థితులను అర్ధం చేసుకోవడానికి ఈ వీడియోని చూడండి. కాంగ్రెస్ సమర్ధత ఏమిటో మీకు అర్ధమవుతుందని రాసి వీడియోని కూడా జత చేశారు. Torture , imprisonment, murder , stifling the voice of free press - 25 th June 1975 symbolises all that and more. Lest you forget what the Emergency imposed on India and Indians entailed ; do watch this video & see what the Congress party is capable of ! #DarkDaysOfEmergency pic.twitter.com/kBlGbcKBSR — Smriti Z Irani (@smritiirani) June 25, 2023 వీరితోపాటు కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లు కూడా ఆనాటి ఎమర్జెన్సీ పరిస్థితుల గురించి ప్రస్తావించారు. ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్ధి అయితే మద్దతివ్వం -
చరిత్ర చెప్పడానికి రెడీ అవుతున్న రెండు సినిమాలు
డైనమిక్ ఫ్రీడమ్ ఫైటర్గా చరిత్రలో నిలిచిపోయిన బెంగాలీ స్వాతంత్య్రోద్యమకారుడు జతీంద్రనాథ్ ముఖర్జీ బయోపిక్ ‘బాఘా జతిన్’, డైనమిక్ లేడీ ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీ ఎందుకు విధించారు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. జతీంద్రనాథ్గా దేవ్ అధికారి, ఇందిరా గాంధీగా కంగనా రనౌత్ నటించారు. హిస్టరీ నేపథ్యంలో రూపొంది, రిలీజ్కి రెడీ అవుతున్న ఈ రెండు చిత్రాల తాజా అప్డేట్స్ ఈ విధంగా... అందుకే ఆయన పేరులో ‘బాఘా’ చేరింది ‘దౌర్జన్యం ప్రబలినప్పుడు విధ్వంసం ఎంతో దూరంలో ఉండదు. ఈ దురాగతాలను అంతం చేయడానికి మనకు ఒక వీర రక్షకుడు కావాలి. భారతదేశపు పుత్రుడు బాఘా జతీన్ కథను మొదటిసారిగా వెండితెరపై చూపించబోతున్నాం’ అంటూ ‘భాఘా జతీన్’ చిత్రంలో టైటిల్ రోల్ చేస్తున్న బెంగాలీ నటుడు దేవ్ అధికారి తాజా లుక్ని విడుదల చేసింది చిత్ర యూనిట్. భారత దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన స్వాతంత్య్రోద్యమకారుడు బాఘా జతీన్ (జతీంద్రనాథ్ ముఖర్జీ) బయోపిక్గా అరుణ్ రాయ్ దర్శకత్వంలో బెంగాలీ, హిందీ భాషల్లో రూపొందిన చిత్రం ‘బాఘా జతీన్’. ఈ చిత్రంలో బాఘా జతీన్గా నటించి, నిర్మించారు దేవ్ అధికారి. 1879 డిసెంబర్ 7న జన్మించిన జతీంద్రనాథ్ ముఖర్జీ 1915 సెప్టెంబర్ 10న మరణించారు. తుపాకీ కాల్పులకు గురై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా, జతీంద్రనాథ్కి బాఘా జతీన్ అని పేరు రావడానికి కారణం ఆయన ఎలాంటి మారణాయుధాలు లేకుండా ఒట్టి చేతులతో పులిని చంపడం. ‘బాఘా’ అంటే బెంగాలీలో పులి అని అర్థం. 1906లో పులిని అంతం చేశాక జతీంద్రనాథ్ పేరు ‘భాఘా జతీన్’గా మారింది. స్వాతంత్య్రం కోసం జతీన్ చేసిన వీర పోరాటాలతో పాటు ఇలాంటి పలు విశేషాలతో ‘భాఘా జతీన్’ తెరకెక్కింది. ‘‘నవరాత్రి శుభ సందర్భంగా దేవ్ఎంటర్టైన్మెంట్స్ నుంచి అక్టోబర్ 20న ‘భాఘా జతీన్’ థియేటర్లకు రానుంది’’ అంటూ తాజా పోస్టర్తో పాటు, చిత్రం విడుదల తేదీని ప్రకటించారు దేవ్ అధికారి. భారత్ అంటే ఇందిరా...! ‘దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత నా చేతుల్లో ఉంది. ఎందుకంటే భారత్ అంటే ఇందిరా.. ఇందిరా అంటే భారత్’ అనే డైలాగ్స్తో ‘ఎమర్జెన్సీ’ చిత్రం టీజర్ విడుదలైంది. ఇంకా టీజర్లో ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం, టీవీ ప్రసారాలు నిలిపివేయడం, ఆందోళనకారులపై దాడి వంటివి చూపించారు. 1975 జూన్ 25 తేదీతో టీజర్ ఆరంభమవుతుంది. ‘రక్షకురాలా లేక నియంతా? మన దేశ నేత తన ప్రజలపై యుద్ధం ప్రకటించిన చీకటి రోజులకు సాక్షిగా చరిత్రలో నిలిచిన ఘట్టం ఇది..’ అంటూ కంగనా రనౌత్ ఈ టీజర్ని షేర్ చేశారు. భారత ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ (1975–1977) ఎందుకు విధించారు? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందిరా గాంధీగా కంగనా రనౌత్ ఒదిగిపోయినట్లు ఆమె లుక్ స్పష్టం చేస్తోంది. ఈ చిత్రానికి కంగనాయే దర్శకత్వం వహించి, ఓ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఈ చిత్రాన్ని నవంబర్ 24న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. -
ఎమర్జెన్సీ.. ఒక చీకటి యుగం
న్యూఢిల్లీ: దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి యుగం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.1975 జూన్ 25న అప్పట్లో దేశ ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ప్రజాస్వామ్యవా దుల్ని అత్యంత క్రూరంగా వేధించారని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి అకృత్యాల వల్ల దేశ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ప్రమాదంలో పడతాయని ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆందోళన వ్యక్తం చేశారు. ‘మన దేశంలో రాజ్యాంగమే అత్యుత్తమం. ప్రజాస్వామ్య విలువలున్న ఈ దేశంలో జూన్ 25ని ఎప్పటికీ మర్చిపోలేము. అది దేశ చరిత్రలో ఒక చీకటి యుగం’’ అని ప్రధాని అన్నారు. కొద్ది రోజుల క్రితం ఎమర్జెన్సీపై రాసిన టార్చర్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ ఇన్ ఇండియా అనే పుస్తకం గురించి తెలుసుకున్నానని తెలిపారు. అందులో ఎన్నో కేస్ స్టడీల్లో ఇందిర ప్రభుత్వం ఎంత క్రూరంగా వ్యవహరించిందో తెలుస్తుందన్నారు. ప్రతీ నెల చివరి ఆదివారం జరగాల్సిన మన్కీ బాత్ ప్రధాని అమెరికా పర్యటనతో ముందే ప్రసారమైంది. యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి ఈ నెల 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ప్రతీ ఒక్కరూ యోగాని జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతీ రోజూ యోగా చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ ఏడాది యోగా దినోత్సవం రోజు యూఎన్ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనే అరుదైన అవకాశం వచ్చిందని ప్రధాని చెప్పారు. తుపాన్లను సమర్థంగా ఎదుర్కొనే స్థాయికి మనం చేరుకున్నామని ప్రధాని చెప్పారు. గుజరాత్లో బిపర్జోయ్ తుపాన్ బీభత్సం నుంచి కచ్ ప్రజలు వేగంగా కోలుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. -
అనూహ్యంగా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..నలుగురు ప్రయాణికులు అరెస్టు
ఇటీవల విమానంలో ప్రయాణికుల వికృత ప్రవర్తనకు సంబంధించిన ఘటనలను చూశాం. వాటిని తలదన్నేలా విమానంలో మరో దారుణ ఘటన జరిగింది. ముగ్గురు ప్రయాణికుల కారణంగా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ షాకింగ్ ఘటన కెయిర్న్స్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్తున్న విమానంలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఏప్రిల్ 20న కెయిర్న్స్ నుంచి నార్తర్న్ టెరిటరీ ఆఫ్ ఆస్ట్రేలియాకు వెళ్తున్న విమానంలో ముగ్గురు ప్రయాణికులు ఘోరంగా ప్రవర్తించారు. ఆ విమానంలో ఆ ముగ్గురు ప్రయాణికుల మద్య వివాదం తలెత్తింది. దీంతో వారంతా దారుణంగా కొట్టుకున్నారు. వారు ప్రయాణిస్తున్నది విమానం అన్న స్ప్రుహ లేకుండా అత్యంత హేయంగా ప్రవర్తించారు. ఆ బృందంలోని 23 ఏళ్ల మహిళ, మరో 22 ఏళ్ల ప్రయాణికుడు చాలా దారుణంగా కొట్లాడుకున్నారు. ఇతర ప్రయాణికులకు భయం కలిగించేలా.. విమానంలోని ఫర్నిచర్ డ్యామేజ్ అయ్యేలా పోట్లాడుకున్నారు. విమాన సిబ్బంది సైతం వారిని నియంత్రించడంలో విఫలం కావడంతో విమానాన్ని క్వీన్ల్యాండ్స్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు దారి మళ్లించాల్సి వచ్చింది. చివరికి విమానం టేకాఫ్ అయినప్పుడూ కూడా ఆ గుంపు ఏ మాత్ర తగ్గలేదు. మరోసారి గొడవపడ్డారు. వారి రగడ కారణంగా విమానం కిటికి అద్దం కూడా పగిలిపోయింది. దీంతో విమానం దిగిన వెంటనే ఆ సముహన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కాగా, ప్రయాణికుడి వద్ద మాదక ద్రవ్యాలను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు సదరు విమానంలో నలుగురు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Departing Cairns today.. Just someone trying to glass someone. More fighting amongst themselves. Complete disregard for other passengers and the plane. I wonder if there were any consequences. #VoteNO 🇦🇺 #VoiceToParliament pic.twitter.com/v5iKWbWRtM — Jet Ski Bandit (@fulovitboss) April 20, 2023 (చదవండి: పియానో వాయించిన చిన్నారికి ప్రధాని మోదీ ఫిదా.. వైరలవుతున్న వీడియో) -
గాల్లో ఉండగానే పెద్ద శబ్దాలతో ఇంజన్లో మంటలు..ఆ తర్వాత విమానం..
విమానం గాల్లో ఉండగానే ఇంజన్లో మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన కొలంబస్ ఎయిర్పోర్ట్లో ఆదివారం చోటు చేసుకుంది. అమెరికన్ ఎయిర్లైన్స్కి చెందిన బోయింగ్ 737 విమానం 1958లో ఈ ప్రమాదం జరిగింది. కొలంబస్ నుంచి ఫీనిక్స్కి వెళ్తున్న ఆ విమానాన్ని ఓ పక్కుల మంద ఢీ కొట్టాయి. దీంతో విమానంలోని కుడి ఇంజన్లో మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే పైలెట్ అత్యవసర ల్యాండింగ్ని ప్రకటించి కొలంబస్లోని జాన్ గ్లెన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొద్ది నిమిషాల్లోనే తిరిగి వచ్చింది. ఐతే విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. అత్యవసర సిబ్బింది కూడా వెంటనే స్పందించారని, ఆ సమయానికి ఎయిర్పోర్ట్ తెరిచే ఉందని జాన్గ్లెన్ విమానాశ్రయం ట్విట్టర్లో పేర్కొంది. ఐతే ఆ విమానం ఇంజన్లో కొద్దిపాటి సాంకేతిక సమస్యలున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రయాణికుడు మాట్లాడుతూ..విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పెద్ద పెద్ధ శబ్దాలు వినిపించాయని చెప్పాడు. ఆ తర్వాత పైలట్ పక్షుల ఢీకొట్టాయని చెబుతూ ప్రయాణికులను అప్రమత్తం చేశాడని అన్నారు. కొద్ది సేపటికే ఎయిర్పోర్ట్లో సురక్షితం ల్యాండ్ అయ్యిందని, ఆ తర్వాత తమను వేరే విమానంలో గమ్యస్థానాలకు తరలించినట్లు వెల్లడించాడు. Taken from Upper Arlington, Ohio. AA1958. pic.twitter.com/yUSSMImaF7 — CBUS4LIFE (@Cbus4Life) April 23, 2023 (చదవండి: నైట్ షోలో అగ్ని ప్రమాదం..ఎగిసిపడ్డ అగ్నికీలలు) -
మళ్లీ పిలిపించే అవసరం రాకుండా చూసుకోండి! బతుకుజీవుడా అని బయటపడ్డా!
ఏ ప్రభుత్వానికైనా ఆబ్కారి ఆదాయం ముఖ్యమైందే. తెలుగు రాష్ట్రాల్లో కల్లుగీత అనుమతులు, అమ్మకాలు మొదట్లో వేలం ద్వారా జరిగేవి. తర్వాత కల్లుగీత సహకార సంఘాలు ఏర్పాటుచేసారు. అవి కూడా సక్రమంగా పని చేయడం లేదని వాటిని కుదించి దున్నే వాడికే భూమి అన్నట్లుగా గీసేవాడికే చెట్టు Tree for Tapper అన్నారు. పథకం ఏదైనా, ఏ పార్టీ అధికారం లోనున్నా ప్రభుత్వ ఆదాయం దెబ్బతినకుండా చూసే పని చేసేది ఎక్సైజ్ శాఖ, వాళ్ళ పనితీరుకు అదే గీటురాయి. ప్రభుత్వ ఖజానా నిండినంత కాలం ఆ శాఖ అవినీతి గురించి పాలకులు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అబ్కారి శాఖలో మామూళ్లు మామూలే! కాదు కూడదు అంటే తప్పు చేసినా చేయకున్నా కల్తీకల్లు కేసులు తప్పవని గీత కార్మికులకు తెలుసు. హైదరాబాద్ నగర శివార్లలో ముఖ్యంగా దూల్ పేట ప్రాంతంలో విచ్చలవిడిగా గుడుంబా తయారీ, అమ్మకాలు జరిగిన రోజుల్లో తమ కల్లు అమ్మకాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని గీత సంఘాలు రోడ్డెక్కిన రోజుల్లో మాచర్ల జగన్నాధం గారి' పరిశ్రమ' పత్రికలో ' కల్తీ సారా కల్పతరువు రాజధానిలో దూల్ పేట ' పేర నేనొక వ్యాసం రాస్తూ అబ్కారి శాఖ, స్థానిక పోలీస్ సిబ్బంది అవినీతి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. అది 22 అక్టోబర్ 1974 సంచికలో ప్రచురితమై, అంచెలంచెలుగా ఆనాటి ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లోనున్న అధికారులు అనధికారుల దృష్టిలో పడి చివరికి విచారణకు దారితీసింది. నేనా రోజుల్లో హైదరాబాద్ లోని ఒక సహకార సంస్థలో ఉద్యోగం చేస్తూ చాదర్ ఘాట్ ప్రాంతంలో ఉండేవాణ్ణి. తెల్లవారక ముందే ఒక పోలీస్ జవాన్ నన్ను వెతుక్కుంటూ వచ్చి గిట్టనివాడు గుడ్ మార్నింగ్ చెప్పినట్టు నాకు సమ్మన్స్ ఇచ్చి పోలీస్ కమీషనర్ స్థాయి అధికారి ముందు హాజరు కమ్మని చెప్పి వెళ్ళాడు. నేను అద్దెకుంటున్న ఇంటి యజమానే కాదు కొత్తగా కాపురానికి వచ్చిన మా ఆవిడ కూడా భయపడిపోయింది నేనేం నేరం చేసానో? అని. నిజం చెప్పాలంటే నేనూ గాబరాపడిపోయాను, ఎందుకంటే అవి ఎమర్జెన్సీ రోజులు. కేంద్రంలో ఇందిరా గాంధి రాష్ట్రంలో జలగం వెంగలరావు గారల పాలన నడుస్తున్న కాలం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ ఒక్క మాట మాట్లాడినా జైలుకూడు తినాల్సిన పరిస్థితులు. ఎందుకైనా మంచిదని సలహా కోసం ముందుగా పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఒక బంధువు దగ్గరికి వెళ్ళాను. అతను అంతా విని 'అబ్కారి శాఖ ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెడుతుంది, పోలీస్ ప్రభుత్వ పీఠాలను కాపాడుతుంది. ఈ రెండు శాఖలను విమర్శించడానికి మీకు ఎన్ని గుండెలండీ 'అన్నాడు. నాకున్న ఒక్క గుండె అయన మాటలతో దడదడలాడిపోయింది. 'లాభంలేదు, ఎవరన్నా లీడర్ను తీసుకొని వెళ్ళండి, రోజులు బాగాలేవు! 'అని చివరగా సలహా కూడా ఇచ్చి పంపాడు. అసలు నాయకులే లేని రోజులవి, ఉన్నవాళ్లు జైలు ఊచలు లెక్కబెడుతున్నారాయె. అధికారి మంచివాడైతే ఆయనే అర్థం చేసుకుంటాడని పోలీస్ కమీషనర్ గారి కార్యాలయంలో ఒక్కణ్ణే విచారణకు హాజరయ్యాను. ఆయనో యువఅధికారి, అదృష్టవశాత్తు సౌమ్యుడు కూడా. ఒక ఫైల్ తీసి నా ముందు పెట్టాడు. అందులో దూల్ పేట గుడుంబా వ్యాసమే కాకుండా అదే పరిశ్రమ పత్రికలో నేను రాసిన 'దేశ రాజధానిలో నల్లమందు వ్యాపారం విచ్చలవిడి (ఆనంద ఉగాది సంచిక )' మత్తు పదార్థాలకు బానిసలవుతున్న మన విద్యార్థులు (18జూన్ 1974 సంచిక ), పోలీసులను దొంగలుగా మారుస్తున్న తమిళనాడు ప్రోహిభిషన్ చట్టం (31డిసెంబర్ 1974 సంచిక )కాక మరో మూడు వ్యాసాల పేపర్ కటింంగ్స్ ఉన్నాయి. ' మీరు హైదరాబాద్ లో ఉన్నారు, దూల్ పేట వ్యాపారం గురించి తెలిసుండొచ్చు, గీత కార్మికుల కుటుంబం నుండి వచ్చారు, కల్లు గురించి రాసుంటారు కానీ డ్రగ్స్ గురించి ఎలా రాస్తున్నారు?' అన్నాడాయన. జాతీయ స్థాయి పత్రికల్లో వచ్చిన వార్తలే నా వ్యాసాలకు ఆధార మన్నాను. 'చట్ట సభల్లో ప్రభుత్వ అవినీతి గురించి ప్రజా ప్రతినిధులు ఎన్ని ఆరోపణలు చేసినా వాళ్లకు రక్షణ ఉంటుంది,కానీ జర్నలిస్ట్ రచనలు పక్కా ఆధారాలు లేందే రాస్తే ఇబ్బందుల్లో పడతారు 'అన్నాడు. నిజమే కానీ జర్నలిస్టులు పూర్తి స్థాయి దర్యాప్తు చేయలేరు కదా! వాళ్ళిచ్చిన క్లూను ప్రభుత్వం వాడుకొని సమగ్ర విచారణ చేస్తే వాస్తవాలు బయటికొస్తాయి అన్నాను నేను. ' మీ వ్యాసల్లోనున్న సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విచారణ ను ఇంతటితో ముగిస్తున్నాను, మళ్ళీ ఇంకోసారి మిమ్మల్ని పిలిపించే అవసరం రాకుండా చూసుకొండి 'అన్నాడు. నేను బతుకుజీవుడా! అని బయట పడ్డాను. -వేముల ప్రభాకర్ -
ఇందిరా గాంధీ టైంలోనే హక్కులను హరించబడ్డాయ్!: కేంద్ర మంత్రి
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ లండన్లో భారత ప్రజావస్వామ్యంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమై పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ నేతలు ఆయన్ను క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు కూడా. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాహుల్ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన లండన్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకుగానూ క్షమాపణలు చెప్పాల్సిందేనన్నారు. ఐనా ఏ వ్యక్తికి అయినా దేశం వెలుపల మాట్లాడే స్వేచ్ఛ కచ్చితంగా ఉంటుంది, కానీ ఆ స్వేచ్ఛ తోపాటు బాధ్యతయుతంగా ప్రవర్తించడం అనేది అత్యంత ముఖ్యం అని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని ఇందిగా గాంధీ ప్రస్తావన తీసుకొచ్చారాయన. ఆమె హయాంలోనే పౌర హక్కులు హరించడం జరిగిందంటూ నాటి ఘటనను గుర్తు చేస్తూ విమర్శలు ఎక్కుపెట్టారు. అంతేగాదు రాహుల్ నానమ్మ(ఇందిరా గాంధీ) చట్టబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడానికి ఆర్టికల్ 356ని 150 సార్లు ప్రయోగించారన్నారు. అలాగే చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ను గురించ చెబుతూ ..దాన్ని దూరదృష్టితో కూడిన చర్యగా అభివర్ణించారు. చైనాకు సంబంధించిన బీఆర్ఐ ప్రాజెక్టు పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా వెళ్తోందని ఆయనకు తెలుసా? అని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, అదానీ సమస్యపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కారణంగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒకరినొకరు లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసుకోవడంతో వాగ్వాదం తలెత్తింది. దీంతో సోమవారం లోక్సభ, రాజ్యసభలో కార్యకలాపాలు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే వాయిదాపడ్డాయి. అదానీ స్టాక్స్ ఇష్యూపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాల చేయడంతో ఐదో రోజు కూడా సభా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడి వాయిదా పడింది. (చదవండి: సహజీవనానికి రిజిస్ట్రేషనా?.. పిల్పై సుప్రీం చీఫ్ జస్టిస్ మండిపాటు) -
కాలిఫోర్నియాలో వరదల బీభత్సం..ఎమర్జెన్సీ ప్రకటించిన జో బైడెన్
ఎడతెగని వర్షాల కారణంగా కాలిఫోర్నియాలో వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో కొండ చరియలు విగిగిపడి చెట్లుకూలడం, హిమపాతం వెల్లువలా రావడం తదితర కారణాలతో రహాదారులన్ని తెగిపోయి నీళ్లతో దిగ్బంధమయ్యి. దీనికి తోడు సమీపంలోని పజారో నదిపై కట్ట తెగి ఉద్ధృతంగా ప్రవహించడంతో పలు లోతట్టు ప్రాంతాలన్ని మునిగిపోయాయి. దీంతో అధ్యక్షుడు జోబైడెన్ అత్యవసర పరస్థితిని ప్రకటించారు. పజారో నది సమీపంలో సుమారు 17 వందల మందికి పైగా నివాసితులు ఉన్నారని, వారిలో చాలమంది లాటినో వ్యవసాయ కార్మికులే. ఇప్పటి వరకు అధికారులు ఆ నది చుట్టుపక్కల ప్రాంతాల్లోని సుమారు 8 వేల మంది ప్రజలను ఖాళీ చేయించినట్లు తెలిపారు. వాస్తవానికి ఈ పంజారో వ్యాలీ ప్రాంత స్ట్రాబెర్రీలు, యాపిల్స్, కాలీప్లవర్, బ్రోకలీ, ఆర్టిచోక్లను పండించే తీర ప్రాంతం. ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో ..సంఘటనా స్థలానికి చేరుకున్న డజన్ల కొద్ది రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకున్న 96 మందిని రక్షించి కౌంటీ షెల్టర్లో ఉంచారు. ఈ వరదలు కారణంగా వేలాది మంది నిరాశ్రయులైనట్లు అధికారులు చెబుతున్నారు. అంతేగాదు ఈ వరదల బీభత్సం కారణంగా కాలిపోర్నియా రాష్ట్రం దారుణంగా దెబ్బతిందని, మళ్లీ యాథాస్థితికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుందని చెబుతున్నారు. ఈ మేరకు పజరా నది సమీపంలోని ప్రాంతాల పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నట్లు గవర్నర్ గావిన్ న్యూసోమ్ కార్యాలయం పేర్కొంది. అలాగే రోజలులు సియెర్రా నెవాడా, గోల్డ్ కంట్రీకి దక్షిణంగా ఉన్న ఫ్రెస్నో కౌంటీ ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది. Mandatory Evacuation orders issued for the Community of #Pajaro due to a #LeveeBreak. Please heed evac warnings/orders. Pajaro River levee broke early this morning resulting in active flooding. #Evacuate if told. #TurnAroundDontDrown @Cal_OES @CaltransHQ @CAgovernor pic.twitter.com/tDttiTcaC0 — California Governor's Office of Emergency Services (@Cal_OES) March 11, 2023 (చదవండి: ఇద్దరు అమెరికన్ ఇండియన్లకు.. కీలక పదవులు) -
Italy Crisis: దుర్భిక్షం దిశగా ఇటలీ.. చుక్క నీరు లేక విలవిల..
రోమ్: ఐరోపా దేశం ఇటలీ నీటి సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నదులు, జలాశయాలు, కొలనులలో చుక్క నీరు లేక విలవిల్లాడుతోంది. 70 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా భూగర్భ జలాలు అడుగంటాయి. గతేడాదితో పోల్చితే వర్షపాతం 40 శాతం పడిపోయింది. వేసవికాలం ముగిసి చాలా రోజులవుతున్నా వర్షాలు పడకపోడవంతో ప్రజలు పరిస్థితి వర్ణణాతీతంగా మారింది. తాగడానికి మంచి నీరు కూడా లేని పరిస్థితి వచ్చింది. దీంతో ఇటలీ ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. నీటి కొరతను అధిగమించేందు 35 మిలియన్ యూరోలను కేటాయిస్తున్నట్లు తెలిపింది. ప్రజలు నీటిని పరిమితంగా ఉపయోగించేలా ఆంక్షలు విధించింది. ఎవరైనా నీటిని పరిమితి కంటే ఎక్కువగా ఉపయోగించినా, వృథా చేసినా 500 యూరోల జరిమానా విధించేందుకు సిద్ధమైంది. ఎమర్జెన్సీ ప్రకటించినందున ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవచ్చు. నీటి సంక్షోభం కారణంగా ఇటలీలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. నీటి స్థాయిలు సాధారణం కంటే 85 శాతం క్షీణించడంతో రైతుల పంటలకు సాగనీరు లేని దుస్థితి నెలకొంది. దీంతో దేశ ఆహార ఉత్పత్తి మూడింట ఒక వంతు తగ్గే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల జంతువులు కూడా ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇటలీలో ఈ పరిస్థితికి వాతావరణ మార్పులే ప్రధాన కారణమని పర్యావరణ నిపుణులు చెప్పారు. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం, సకాలంలో వర్షాలు కురవకపోవడం ప్రపంచానికి ఓ అలర్ట్ అని పేర్కొన్నారు. చదవండి: ఒక్కరోజు నిద్రలేకపోతే ఇంత జరుగుతుందా? పరిశోధనలో షాకింగ్ నిజాలు!
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
అందరూ తప్పకుండా ఓటు వేయండి..సీఎం జగన్ ట్వీట్
చేతిలోని బ్రహ్మాస్త్రాన్ని వినియోగించుకోవాలి..
ఉత్తరప్రదేశ్లో పోలింగ్ ప్రారంభం.. బారులు తీరిన ఓటర్లు!
మేం ఓటేశాం.. మరి మీరో?(ఫొటోలు)
గూగుల్కు ఓటింగ్ శోభ!
క్యూలో నిలబడిన విజయ సాయి రెడ్డి
Lok sabha elections 2024: సామాన్యుడిలా క్యూలో నిలబడి ఓటేసిన ఎన్టీఆర్, అల్లు అర్జున్
శ్రీనగర్లో భారీ బందోబస్తు మధ్య మొదలైన పోలింగ్!
ఏపీ ఎన్నికల పోలింగ్ వేళ సీఎం జగన్ సందేశం
నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ వస్తే.. ఏమవుతుందో తెలుసా?
తప్పక చదవండి
- నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ వస్తే.. ఏమవుతుందో తెలుసా?
- నయవంచనకు చెక్ పెడదాం
- ఈసీ ద్వంద్వ వైఖరి
- జనస్వామ్యమా! జయీభవ!!
- మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
- వైఎస్ విజయమ్మ పేరుతో టీడీపీ తప్పుడు లేఖ
- ఐరాస కాంక్షించే అభివృద్ధికి ఏపీయే వేదిక
- పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
Advertisement