-
కళాతపస్వికి కన్నీటి వీడ్కోలు
ప్రముఖ దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్కు అశేష అభిమానగణం కన్నీటి వీడ్కోలు పలికింది. ఆయన అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం పంజగుట్ట హిందూ శ్మశానవాటికలో జరిగాయి. శుక్రవారం ఆయన నివాసం నుంచి పంజగుట్ట శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగింది. అంతకుముందు ఆయనకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. కళాతపస్విని కడసారి చూసేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చి అంతిమయాత్రలో పాల్గొన్నారు. బంజారాహిల్స్/సాక్షి, హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్ (92)కు అశేష అభిమానగణం కన్నీటి వీడ్కోలు పలికింది. ఆయన అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం పంజగుట్ట హిందూ శ్మశాన వాటికలో సంప్రదాయబద్ధంగా జరిగాయి. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి అపోలో ఆస్పత్రిలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. విశ్వనాథ్ పార్థివ దేహాన్ని ఆస్పత్రి నుంచి గురువారం రాత్రి ఒంటి గంటకు ఫిలింనగర్లోని స్వగృహానికి తరలించారు. రాత్రి నుంచే విశ్వనాథ్ భౌతికకాయాన్ని సందర్శించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు అభిమానులు భారీగా విచ్చేయడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. శుక్రవారం ఆయన నివాసం నుంచి పంజగుట్ట శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర సాగింది. కళాతపస్విని కడసారి చూసేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొన్నారు. అనంతరం శ్మశాన వాటికలో ఆయన పార్థివదేహాన్ని ఖననం చేశారు. కన్నీరుమున్నీరైన చంద్రమోహన్ విశ్వనాథ్ భౌతికకాయాన్ని శుక్రవారం మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎంపీ సంతోష్ కుమార్, సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, పవన్ కల్యాణ్, శరత్కుమార్, రాధిక, రాజశేఖర్, జీవిత, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, కె.రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, అల్లు అరవింద్, బోయపాటి శ్రీను, శేఖర్ కమ్ముల, ఆది శేషగిరిరావు, దగ్గుబాటి సురేష్బాబు తదితరులు సందర్శించి నివాళులర్పించారు. విశ్వనాథ్ కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. విశ్వనాథ్ దర్శకత్వంలో సిరిసిరిమువ్వ సినిమాలో హీరోగా నటించిన చంద్రమోహన్ కన్నీరుమున్నీరయ్యారు. విశ్వనాథ్ భౌతికకాయాన్ని చూడటంతోనే ఆయన విలపిస్తూ అక్కడే కుప్పకూలిపోయారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. విశ్వనాథ్ మృతి బాధాకరం: మంత్రి తలసాని కళాతపస్వి విశ్వనాథ్ మృతి బాధాకరమని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. తలసాని ఆయన నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలు, కళల విశిష్టతను చాటేలా అనేక చిత్రాలు నిర్మించిన గొప్ప దర్శకులంటూ కొనియాడారు. ఏపీ ప్రభుత్వం తరపున.. విశ్వనాథ్ అంత్యక్రియల్లో ఏపీ ప్రభుత్వం తరపున బీసీ సంక్షేమ, సమాచార, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. ఆయన విశ్వనాథ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, సంగీత సాహిత్యాలను సృజనాత్మక శైలిలో ప్రేక్షకులకు అందించిన కళాతపస్వి మరణించడం సినీ పరిశ్రమకు తీరని లోటని చెప్పారు. బహుముఖ ప్రజ్ఞాశాలి విశ్వనాథ్: ప్రధాని మోదీ సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ‘సినీ ప్రపంచంలో కె.విశ్వనాథ్ ఒక దిగ్గజం. సృజనాత్మక దర్శకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా సినీలోకంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. వివిధ ఇతివృత్తాలతో తీసిన అతని సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించాయి’.. అని శుక్రవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. అసమాన ప్రతిభావంతుడు: గవర్నర్ తమిళిసై కె.విశ్వనాథ్ మృతిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక దిగ్గజ దర్శకుడు, నటుడిని తెలుగు సినీ పరిశ్రమ కోల్పోయిందని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆయన తన అసమాన ప్రతిభతో సినీ పరిశ్రమపై చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. అరుదైన దర్శక దిగ్గజం: కేసీఆర్ ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ మృతికి సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. అతి సా మాన్యమైన కథను ఎంచుకొని.. తన అద్భుతమైన ప్రతిభతో.. వెండి తెర దృశ్య కావ్యంగా మలిచిన అరుదైన దర్శ కుడు కె.విశ్వనాథ్ అని కొనియాడారు. గతంలో విశ్వనాథ్ ఆరోగ్యం బాగా లేనప్పుడు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించిన సమయంలో.. సినిమాలు, సంగీతం, సాహిత్యంపై తమ మధ్య జరిగిన చర్చను సీఎం గుర్తు చేసుకున్నారు. తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారు: జగన్ సాక్షి, అమరావతి: సినీ దర్శక దిగ్గజం కె. విశ్వనాథ్ తెలుగు వారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కొనియాడారు. ఈ మేరకు శుక్రవారం ఆయన తన ట్విట్టర్ ఖాతాల్లో ట్వీట్ చేశా రు. ‘విశ్వనాథ్ గారి మరణం తీవ్ర విచారానికి గురిచేసింది. తెలుగు సంస్కృతికి, బారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్ గారు. ఆయన దర్శకత్వం రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీ రంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయి’ అని పేర్కొన్నారు. స్పీకర్, మంత్రుల సంతాపం కె.విశ్వనాథ్ మరణంపై స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఇంద్రకరణ్రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్గౌడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. సినిమా తీయాలనుకున్నా విశ్వనాథ్తో సినిమా తీయాలన్న తన ఆశ కలగానే మిగిలిపోయిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. కె.విశ్వనాథ్ మృతికి టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ వేర్వేరు ప్రకటనల్లో తీవ్ర సంతాపం తెలిపారు. -
దేనికైనా ఐదో షోకు అనుమతిస్తాం: సీఎం జగన్
-
సినీ ప్రముఖులతో భేటీ.. సీఎం జగన్ ఏమన్నారంటే..?
సాక్షి, అమరావతి: తెలుగు సినిమా ప్రముఖులతో తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం భేటీ అయ్యారు. సినీనటుడు చిరంజీవి, మహేష్బాబు, ప్రభాస్, రాజమౌళి, అలీ, ఆర్. నారాయణమూర్తి, పోసాని కృష్ణమురళి, కొరటాల శివ, నిరంజన్ రెడ్డి, మహి రాఘవ ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఐఎండ్ పీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, ఐఅండ్ పీఆర్ కమిషనర్, ఎఫ్డిసీ ఎండీ టి విజయ్కుమార్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: సమస్యలకు శుభం కార్డు.. సీఎం జగన్కు ధన్యవాదాలు: చిరంజీవి ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే... : ‘‘మంచి పాలసీ తీసుకురావాలని, తద్వారా పెద్ద సినిమాలకు, చిన్న సినిమాలకు న్యాయం జరగాలని గత కొద్ది కాలంగా కసరత్తు జరుగుతుంది. ఇందులో భాగంగానే అందరి అభ్యర్ధనలను పరిగణలోకి తీసుకుంటూ... దీనిపై ఒక కమిటీని కూడా నియమించాం. ఆ కమిటీ కూడా తరచూ సమావేశమవుతూ వాళ్లకొచ్చిన ఫీడ్ బ్యాక్ కూడా నాతో పంచుకున్నారు. ఇంకా విస్తృతంగా తెలుసుకునేందుకు మిమ్నల్ని కూడా రమ్మని చెప్పాం. సినిమా పరిశ్రమలో ఉన్న కొన్ని కొన్ని లోపాలను పూర్తిగా సరిదిద్దుకుని.. ఇండస్ట్రీ నిలబడ్డానికి ఒక మంచి వ్యవస్ధను క్రియేట్ చేసుకునేందుకు తపన, తాపత్రయంతోనే అడుగులు పడ్డాయి. మీరన్నట్టుగా ఏ సినిమాకైనా, ఎవరి సినిమాకైనా ఒకే రేటు ఉండాలి. ప్రాథమికంగా ఒక ప్రాతిపదిక లేనంతవరకు... కొద్దిమందికి ఎక్కువ వసూలు చేయడం, కొద్దిమందికి తక్కువ వసూలు చేయడం అనేది ఉంటుంది. ఈ పాయింట్ను కూడా చర్చించాను. నేను, చిరంజీవి అన్న ఇద్దరం కలిసి కూర్చుని దీనిపై చాలాసేపు విస్తృతంగా చర్చించాం. మంచి ధరలు తీసుకురావడం జరిగింది. ఇవి ఎవరికైనా కూడా మంచి రేట్లే... అందరికీ న్యాయం జరిగేలా మంచి ధరలు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. హీరో పారితోషకం, హీరోయిన్ పారితోషకం, దర్శకుడు పారితోషం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండానే నిర్మాణవ్యయం పరంగా కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ తరహా సినిమాలు చేయడంలో రాజమౌళి నిపుణుడు. అటువంటి వాటిని ప్రత్యేకంగా చూడాలి. అలా ప్రత్యేకంగా చూడకపోతే భారీ టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఖర్చుతో చేయడానికి ఎవరూ ముందుకురారు. హీరో, హీరోయిన్, డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా, వీటిని పక్కన పెట్టి కేవలం సినిమా కోసమే రూ.100 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అయిన భారీ బడ్జెట్ సినిమాలును ప్రత్యేకంగా ట్రీట్ చేయాలి. అటువంటి వాటికి వారం రోజుల పాటు కచ్చితంగా ప్రత్యేక ధరలు నోటిఫై చేసే విధంగా ట్రీట్ చేయాలని చెప్పాం. ఇక్కడ కూడా రాష్ట్రంలో షూటింగ్లు ప్రమోట్ చేయడం కోసం కొంత పర్సెంటేజ్ కేటాయించాం. ఏపీలో సినిమా షూటింగ్లు ప్రమోట్ చేయడం కోసం... ఇక్కడ షూటింగ్లు జరిపి ఉండాలి అన్న నిబంధనను తీసుకురాగలిగితే ఇక్కడ కూడా షూటింగ్లు పెరుగుతాయి. కనీసం ఎంత శాతం షూటింగ్ ఆంధ్రప్రదేశ్లో చేయాలన్న దానిపై ఇప్పటికే మంత్రి పేర్ని నాని దర్శకులు, నిర్మాతలతో మాట్లాడారు. వారందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నాతో కనీసం 20 శాతం పెడతాము అని చెప్పారు. రేట్లకు సంబంధించినంత వరకు... అందరికీ ఒకటే రేట్లు. ఆన్లైన్ పద్ధతిలో టిక్కెట్లు విక్రయం ప్రభుత్వానికి మంచిది, సినిమా ప్రొడ్యూసర్లకు కూడా మంచిది అన్న కోణంలో చూశాం. ఓటీటీలతో పోటీపడాల్సిన పరిస్థితిలో సమతుల్యత కూడా ఉండాలని చర్చించాం. ఏడాదికి వేయిరూపాయలతో అమెజాన్ ఇస్తుంది. నెలకు సగటున రూ.80లు పడుతుంది. దీన్నికూడా దృష్టిలో ఉంచుకోవాలి. చిరంజీవిగారితో కూడా సుదీర్ఘంగా ఇదే విషయంపై చర్చించాం. ఆలాగే కనీస ఆదాయాలు రాకపోతే సినిమాలు తీసే పరిస్థితి కూడా తగ్గిపోతుంది. దాన్ని కూడా సమతుల్యం చేసుకుని సినిమాలు తీసే పరిస్థితి ఎలా అన్న ఆలోచనతో రీజనబుల్రేట్లు దిశగా వెళ్లాం. సినిమా చూసే ప్రేక్షకులకు భారంకాకుండా, ఆ రేట్లు సినిమా పరిశ్రమను పెంపొందించేలా ఉండేలా రేట్లను మార్పు చేశాం. మరొక్క అంశం...మీరు ఐదో షోను కూడా తీసుకురావాలని అడిగారు. సినిమా శుక్రవారం, శనివారం, ఆదివారం.. ఆ తర్వాత వారం ఆడగలిగితే సూపర్హిట్ అవుతుంది. ఆ పాయింట్ అర్ధం చేసుకున్నాం. అదే సమయంలో అది అందరికీ వర్తిస్తుంది. చిన్న సినిమాలకు అవే రేట్లు వర్తిస్తాయి. వారిక్కూడా మంచి ఆదాయాలు వస్తాయి. ఐదో ఆట వల్ల ఇండస్ట్రీకి కూడా మేలు జరుగుతుంది. మల్టీప్లెక్స్లును కూడా మంచి ధరలతో ట్రీట్ చేయడం జరుగుతుంది. మీరు చెప్పిన అన్ని విషయాలను మనసులో పెట్టుకున్నా. మీ అందరికీ సంతోషం కలిగించినందుకు ఆనందంగా ఉంది. నెమ్మదిగా సినీపరిశ్రమకూడా విశాఖపట్నం రావాలి. అందరికీ విశాఖపట్నంలో స్థలాలు ఇస్తా. నెమ్మదిగా ఇక్కడ కూడా దృష్టిపెట్టండి. తెలంగాణాతో పోలిస్తే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆంధ్రా ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తోంది. తెలంగాణా 35 నుంచి 40 శాతం కంట్రిబ్యూట్ చేస్తోంది. ఆంధ్రా 60 శాతం వరకు కంట్రిబ్యూట్ చేస్తోంది. ఏపీలో జనాభా ఎక్కువ, ప్రేక్షకులు ఎక్కువ, ధియేటర్లు కూడా ఎక్కువ. ఆదాయపరంగా కూడా ఏపీ ఎక్కువ. వాతావరణం కూడా బాగుంటుంది. అందరికీ స్ధలాలు ఇస్తాం. స్టూడియోలు పెట్టేందుకు ఆశక్తి చూపిస్తే వాళ్లకు కూడా విశాఖలో స్థలాలు ఇస్తాం. జూబ్లీహిల్స్ తరహా ప్రాంతాన్ని క్రియేట్ చేద్దాం. విశాఖ బిగ్గెస్ట్సిటీ. కాస్త పుష్చేయగలిగే అవకాశాలున్న సిటీ విశాఖపట్నం. చైన్నె, బెంగుళూరు, హైదరాబాద్లతో విశాఖపట్నం పోటీపడగలదు. మనం ఓన్ చేసుకోవాలి, మనందరం అక్కడకి వెళ్లాలి... అప్పుడే విశాఖపట్నం, ఇవాళ కాకపోయినా పదేళ్లకో, పదిహేనేళ్లకో.. మహానగరాలతో పోటీపడుతుంది. దీనికి ముందడుగు పడాలంటే.. సినిమా పరిశ్రమ విశాఖ వెళ్లేందుకు అడుగులు పడాలి. అందరూ దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. అందరికీ స్థలాలు ఇస్తా... ఇళ్లస్థలాలతోపాటు, స్టూడియో స్థలాలు కూడా ఇస్తానని నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. రాజమౌళి మంచి సినిమాలు, పెద్ద సినిమాలు తీయాలి. చిన్న సినిమాలను కూడా రక్షించుకోవాలి. దీనికోసం కార్యాచరణ చేసుకోవాలని కోరుతున్నాను. సినిమా క్లిక్ కావాలంటే పండగ రోజు రిలీజ్ చేస్తే హిట్ అవుతుందని అందరికీ తెలుసు. ఇక్కడే చిన్నసినిమాను రక్షించుకోవడానికి కూడా కొంత సమతుల్యత అవసరం. పరిశ్రమనుంచే దీనికి తగిన కార్యాచరణ ఉండాలని కోరుతున్నాం. ఆ పండగ రోజు మాకు అవకాశాలు లేవని చిన్నసినిమా వాళ్లు అనుకోకుండా... కాస్త సమతుల్యత పాటించాలని విజ్ఞప్తి. ఈ విషయంలో కలిసి పనిచేద్దాం. వాళ్లు కూడా పరిశ్రమలో భాగమే. వాళ్లనూ భాగస్వామ్యులు చేయాలని’’ సీఎం జగన్ అన్నారు. -
అమ్మ చేతి తీపి రుచి
పిల్లల బాధ్యతలు తీరాక అమ్మలకు కొంత విశ్రాంతి లభిస్తుంది. అది బాగా డబ్బు ఉన్నవారికైనా, మధ్యతరగతి జీవితంతో నెట్టుకొస్తున్నవారికైనా. ఆ విశ్రాంత సమయాన్ని కొందరు మాత్రం ఉపయుక్తంగా, తమ కలలు నెరవేర్చుకోవడానికి కృషి చేస్తుంటారు. వారిలో నీలూ భండారి ఒకరు. 64 ఏళ్ల వయసులో ‘మదర్స్ మేడ్’ అనే పేరుతో ఆర్గానిక్ స్వీట్లు తయారుచేస్తూ దేశ విదేశాల నుంచి ఆర్డర్లు పొందుతూ తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం నీలూ భండారీ స్వీట్లు అంటే మక్కువ చూపుతుంటారు. ఐదేళ్లుగా ఆమె చేస్తున్న స్వీట్ జర్నీ గురించి అంతే స్వీట్గా చెప్పుకోవచ్చు. స్వీట్లు తయారుచేసే సమయంలో నీలూ భండారీని చూస్తే ఆమె మోముపై ఓ మెరుపు ఉంటుంది. ఆమె పెదవులు దైవ నామం జపిస్తూ ఉంటాయి. స్వీట్ల ద్వారా ఎంతో మందికి చేరవయ్యే అవకాశం ఆ భగవంతుడే తనకు కల్పించాడని, ఆ విధంగా తాను దైవానికి దగ్గరవుతున్నాను అని ఆమె నమ్ముతారు. కమ్మని వాసనల వంటకాలు ‘పిల్లలు బేకరీలలో లభించే జంక్ ఫుడ్ని ఇష్టపడుతుంటారు. కానీ, ఆ ఆహారం వల్ల వారి శరీరం బోలుగా తయారవుతుంది. ఊబకాయం వంటి సాధారణ సమస్యలు తలెత్తుతాయి. దీనివల్ల ఏ వ్యాధి అయినా వారిని సులభంగా చుట్టుముంటే అవకాశం ఉంది. పిల్లల ముందు పాలు, జున్ను, దేశీ ఆవు నెయ్యి.. గురించి మాట్లాడితే వారు ముఖముఖాలు చూసుకుంటారు. అలాంటి పదార్థాల గురించి ఈ తరం వారికి తెలియనే తెలియవు. అదే మన చిన్ననాటి రోజుల్లో చలికాలంలో దాదాపు ప్రతి ఇంట్లో అవిసె గింజలు, నువ్వులు, శనగపిండితో చేసిన కమ్మని వంటకాల వాసన వస్తుండేది’ అని చెప్పే నీలూ భండారి ఐదేళ్లుగా తన చేత్తో తయారు చేసిన స్వీట్ల వ్యాపారాన్ని ఆమె వృత్తిగా చేసుకున్నారు. ఆ స్వీట్లకు మన దేశంలోనే కాదు విదేశాలలోనూ మంచి డిమాండ్ ఉంది. చక్కెర, నెయ్యి లేకుండా స్వీట్లు! చక్కెర లేని, నెయ్యి లేని స్వీట్లను నీలూ స్నేహితులు రుచి చూసి తమ కోసమూ వాటిని అడిగి మరీ చేయించుకునేవారు. దీంతో ఆమె ఎక్కువ మొత్తంలో అలాంటి స్వీట్లు తయారుచేసి వారి కోసం ప్రదర్శన ఏర్పాటు చేసేది. స్నేహితులు, బంధువులు ఆ ప్రదర్శనలో పాల్గోవడమే కాదు, ఆర్గానిక్ స్వీట్ల కోసం డిమాండ్ పెరగడం ప్రారంభమైంది. బయట నుంచి కూడా ఆర్డర్లు రావడం ప్రారంభమయ్యాయి. డిమాండ్ పెరగడంతో ఆమె ‘మదర్స్ మేడ్’ అనే పేరుతో స్వీట్ల తయారీని పెంచింది. సెలబ్రిటీలకు చేరువ ఆమె చేతితో తయారు చేసిన శుభ్రమైన స్వీట్లు బాలీవుడ్ గాయని ఆశా భోంస్లే, జస్పిందర్ నరులా, కర్మవీర్ వోహ్రా, సుప్రియా, అబూ సూఫీ.. తదితరులు ఇష్టపడి మరీ ఆర్డర్ల మీద తెప్పించుకుంటారు. మన దేశంలోనే కాకుండా వర్జీనియా, ఫ్లోరిడా, కెనడా, ఆస్ట్రేలియా, పారిస్, జర్మనీ నుండి కూడా నీలూ భండారీ స్వీట్లను ఆర్డర్ల మీద తెప్పించుకుంటున్నారు. -
నాన్న అంటే ప్రేమ.. ధైర్యం
జూన్ 21.. ఫాదర్స్ డేని పురస్కరించుకుని పలువురు సినీ సెలబ్రిటీలు ‘హ్యాపీ ఫాదర్స్ డే’ అంటూ సోషల్ మీడియా వేదికగా తమ తండ్రికి శుభాకాంక్షలు చెప్పారు. ఓ కొడుకుగా తమ తండ్రితో ఉన్న బంధాన్ని.. ఓ తండ్రిగా తమ పిల్లలతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. హీరో చిరంజీవి తన తండ్రి వెంకట్రావు, తనయుడు రామ్చరణ్ తేజ్ కలిసి చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను షేర్ చేసి, ‘చిరుత.. విత్ మై ఛార్మింగ్ డాడ్. మా నాన్న నవ్వు... నా బిడ్డ చిరునవ్వు... రెండూ నాకు చాలా ఇష్టం. హ్యాపీ ఫాదర్స్ డే’’ అంటూ ఓ సందేశం పోస్ట్ చేశారు. తండ్రి చిరంజీవితో చిన్నప్పుడు, ఇప్పుడు కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన రామ్చరణ్ ‘కొన్ని బంధాల్ని వర్ణించాల్సిన అవసరం లేదు.. హ్యాపీ ఫాదర్స్ డే’ అని రాసుకొచ్చారు. తన తండ్రి చిరంజీవికి స్వయంగా హెయిర్ కట్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసి తండ్రి పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు సుష్మిత. తమ తండ్రి మోహన్బాబుతో కలిసి ఉన్న ఫొటోల్ని లక్ష్మీ మంచు, విష్ణు, మనోజ్ షేర్ చేశారు. తండ్రి కృష్ణతో బాల్యంలో దిగిన ఫొటోను మహేశ్బాబు షేర్ చేసి, ‘నా తండ్రి గురించి నిర్వచించమని చెబితే నా బలం, ధైర్యం, ప్రేమ, స్ఫూర్తి నాన్నే. ఈరోజు నేనేంటో అవి ఆయన నుంచి వచ్చినదే. ఆయన నాతో ఎలా ఉండేవారో నేను నా పిల్లలతోనూ అలా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. నువ్వు నన్ను ముందుండి నడిపించే వ్యక్తివి. హ్యాపీ ఫాదర్స్ డే’ అని పేర్కొన్నారు. అలాగే తన పిల్లలు గౌతమ్, సితారలతో మహేశ్బాబు ఉన్న ఫొటోల్ని ఆయన శ్రీమతి నమ్రత షేర్ చేశారు. తన ఇద్దరు కొడుకులతో కలిసి ఉన్న ఫొటోల్ని గోపీచంద్ షేర్ చేసి, ‘ఓ తండ్రిగా ఉండటం మంచి అనుభూతి. నా పిల్లల్ని చూసిన ప్రతిసారీ నా జీవితం సంపూర్ణమైందని అనిపిస్తుంది. నా బలం వారే.. ఇందుకు వారికి థ్యాంక్స్’ అని పోస్ట్ చేశారు. హీరోలు విజయ్ దేవరకొండ, నాగశౌర్య, సుశాంత్, అల్లు శిరీష్, హీరోయిన్లు రాశీ ఖన్నా, రకుల్, కాజల్, అనుపమా పరమేశ్వరన్, శ్రుతీహాసన్, శ్రద్ధా కపూర్, సోనమ్ కపూర్తో పాటు మరికొందరు నటీనటులు తమ తండ్రితో కలిసి ఉన్న ఫొటోల్ని షేర్ చేశారు. వెంకట్రావు, రామ్చరణ్; మోహన్బాబు, విష్ణు మహేశ్బాబు, కృష్ణ; కుమారులతో గోపీచంద్ గోవర్ధన్రావు, విజయ్ దేవరకొండ; నాగశౌర్య, శంకర్ ప్రసాద్ నిషా, వినయ్ అగర్వాల్, కాజల్; రాజేందర్ సింగ్, రకుల్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
'ప్రసన్నవదనం' బ్యూటీ చాలా ఘాటు గురూ.. రాశి సింగ్ (ఫొటోలు)
ఈ సమ్మర్ సీజన్లో.. నేరుగా 'చల్లని పెరుగుతోనే వెరైటీ కర్రీలు'!
వల్లభనేని వంశీ తో సాక్షి స్ట్రెయిట్ టాక్
ఆ విషయం తెలిశాక ఖుష్బు తట్టుకోలేకపోయింది: సుందర్
బిగ్ క్వశ్చన్: వాలంటీర్లపై కక్ష..అవ్వాతాతలకు శిక్ష
శంషాబాద్: ఆపరేషన్ చిరుత సక్సెస్
తగ్గిన ప్రపంచ నం1 కంపెనీ విక్రయాలు.. భారత్లో మాత్రం..
‘శబరి’ మూవీ రివ్యూ
Tirumala: తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ
నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే
తప్పక చదవండి
- Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
- బీజేపీతో జోడీ లేకపోతే ఈడీ
- సెలబ్రిటీలతో ఎయిర్బీఎన్బీ జట్టు..
- మోసాల బాబు మరో అబద్ధం..
- మోసాల బాబు మరో అబద్ధం..
- Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
- ఉద్యోగుల ఫ్రెండ్లీ సీఎం
- ‘పంపుసెట్ల’నూ కాపీ కొట్టేసిన బాబు!
- Central government: సీబీఐ మా నియంత్రణలో లేదు
- భువనగిరి ఖిలాపై ఏ జెండా ఎగిరేనో?
Advertisement