-
ఎస్బీఐ లాభం రికార్డ్
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి (క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 18 శాతం ఎగసి రూ. 21,384 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2022–23) క్యూ4లో రూ. 18,094 కోట్లు మాత్రమే ఆర్జించింది. స్టాండెలోన్ లాభం సైతం రూ. 16,695 కోట్ల నుంచి రూ. 20,698 కోట్లకు దూసుకెళ్లింది. మొత్తం ఆదాయం రూ. 1.06 లక్షల కోట్ల నుంచి రూ. 1.28 లక్షల కోట్లకు బలపడింది. నిర్వహణ వ్యయాలు రూ. 29,732 కోట్ల నుంచి రూ. 30,276 కోట్లకు పెరిగాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 3,315 కోట్ల నుంచి సగానికి తగ్గి రూ. 1,609 కోట్లకు పరిమిత మయ్యాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.78 శాతం నుంచి 2.24 శాతానికి తగ్గాయి. పూర్తి ఏడాదికి సైతం.. ఇక పూర్తి ఏడాదికి ఎస్బీఐ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 21 శాతం జంప్చేసింది. రూ. 67,085 కోట్లకు చేరింది. 2022–23లో రూ. 55,648 కోట్లు ఆర్జించింది. వెరసి అటు క్యూ4, ఇటు పూర్తి ఏడాదికి రెండు శతాబ్దాల బ్యాంక్ చరిత్రలోనే అత్యధిక లాభాలు ఆర్జించినట్లు ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా పేర్కొన్నారు. క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 3 శాతం బలపడి రూ. 41,655 కోట్లను తాకింది. 3.46 శాతం నికర వడ్డీ మార్జిన్లు సాధించింది. మొత్తం ప్రొవిజన్లు రూ. 8,049 కోట్ల నుంచి రూ. 7,927 కోట్లకు తగ్గాయి. స్లిప్పేజీలు రూ. 3,185 కోట్ల నుంచి రూ. 3,867 కోట్లకు పెరిగాయి. స్థూల మొండిబకాయిలు 2.78 శాతం నుంచి 2.42 శాతానికి దిగివచ్చాయి. వడ్డీయేతర ఆదాయం 24 శాతం జంప్చేసి రూ. 17,369 కోట్లకు చేరింది. గత నాలుగేళ్లలో 27,000 మంది ఉద్యోగులు తగ్గినప్పటికీ రిటైర్ అవుతున్న సిబ్బందిలో 75 శాతంమందిని విధుల్లోకి తీసుకుంటున్నట్లు ఖారా వెల్లడించారు. టెక్నాలజీ, ఏఐలపై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలియజేశారు. -
ఫెడరల్ బ్యాంక్ ఫ్లాట్
ముంబై: ప్రైవేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం నామమాత్ర వృద్ధితో రూ. 906 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2022–23) క్యూ4లో రూ. 903 కోట్లు ఆర్జించింది. ఇందుకు పెన్షన్ ప్రొవిజన్లు కారణమయ్యాయి. నికర వడ్డీ ఆదాయం 15 శాతం ఎగసి రూ. 2,195 కోట్లను తాకింది. 20 శాతం రుణ వృద్ధి ఇందుకు సహకరించగా.. నికర వడ్డీ మార్జిన్లు 3.36 శాతం నుంచి 3.21 శాతానికి నీరసించాయి. పెన్షన్లకు రూ. 162 కోట్ల ప్రొవిజన్లు చేపట్టింది. ఇక పూర్తి ఏడాదికి బ్యాంక్ రూ. 3,720 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2022–23లో రూ. 3,010 కోట్లు మాత్రమే నమోదైంది. ఈ ఏడాది(2024–25) 18 శాతం రుణ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. తాజా స్లిప్పేజీలు రూ. 436 కోట్ల నుంచి రూ. 352 కోట్లకు తగ్గాయి. స్థూల మొండిబకాయిలు 2.13 శాతానికి చేరగా.. కనీస మూలధన నిష్పత్తి 16.13 శాతంగా నమోదైంది. ఎండీ, సీఈవో శ్యామ్ శ్రీనివాసన్ సెప్టెంబర్లో బాధ్యతల నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో కొత్త చీఫ్ ఎంపికకు బోర్డు కసరత్తు చేస్తున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. అభ్యర్ధుల జాబితాలను కొద్ది వారాలలో సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. ఫెడరల్ బ్యాంక్ షేరు ఎన్ఎస్ఈలో 3.2 శాతం బలపడి రూ. 168 వద్ద ముగిసింది. -
Q4 results: బజాజ్ ఆటో లాభం హైజంప్
న్యూఢిల్లీ: ద్విచక్ర, త్రిచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో స్టాండెలోన్ నికర లాభం 35 శాతం జంప్చేసింది. రూ. 1,936 కోట్లను తాకింది. 2022–23 ఇదే కాలంలో రూ. 1,433 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదా యం సైతం 29% వృద్ధితో రూ. 11,485 కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 33 శాతం ఎగసి రూ. 7,479 కోట్లయ్యింది. 2022–23లో కేవలం రూ. 5,628 కోట్లు ఆర్జించింది. మొత్తం టర్నోవర్ రూ. 36,248 కోట్ల నుంచి రూ. 44,685 కోట్లకు వృద్ధి చెందింది. వాటాదారులకు షేరుకి రూ. 80 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. వాహన విక్రయాలు జూమ్ క్యూ4లో బజాజ్ ఆటో మొత్తం వాహన విక్రయాలు 24 శాతం పెరిగి 10,68,576 యూనిట్లకు చేరాయి. వీటిలో ద్విచక్ర వాహనాలు 26 శాతం పుంజుకుని 9,16,817ను తాకగా.. 13 శాతం అధికంగా 1,51,759 వాణిజ్య వాహనాలు విక్రయించింది. బజాజ్ ఆటో షేరు బీఎస్ఈలో 1.1 శాతం లాభంతో రూ. 9,018 వద్ద ముగిసింది. -
ఇన్ఫోసిస్ ఓకే
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం వార్షికంగా 30 శాతం జంప్ చేసింది. రూ. 7,969 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2022–23) ఇదే కాలంలో రూ. 6,128 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్ర(1 శాతం) వృద్ధితో రూ. 37,923 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 37,441 కోట్ల టర్నోవర్ నమోదైంది. తయారీ రంగ సేవలు నెమ్మదించగా.. 20.1 శాతం నిర్వహణ మార్జిన్లను అందుకుంది. క్యూ4లో 84.8 కోట్ల డాలర్ల ఫ్రీక్యాష్ ఫ్లో సాధించింది. గత 11 త్రైమాసికాలలోనే ఇది అత్యధికం. 1–3 శాతం వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25)లో ఇన్ఫోసిస్ ఆదాయంలో 1–3 శాతం వృద్ధిని అంచనా(గైడెన్స్) వేసింది. 20–22 శాతం నిర్వహణ లాభ మార్జిన్లను ఆశిస్తోంది. అయితే గతేడాది ప్రకటించిన 4–7 శాతం వృద్ధితో పోలిస్తే తాజాగా బలహీన గైడెన్స్ను వెలువరించింది. గతేడాది సాధించిన ఫలితాలతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి అంచనాలు(గైడెన్స్) అధికమేనని సీఈవో పరేఖ్ పేర్కొన్నారు. విభాగాలవారీగా చూస్తే గతేడాదికంటే రానున్న 12 నెలల్లో ఫైనాన్షియల్ సరీ్వసుల్లో ఉత్తమ పనితీరు చూపేందుకు అవకాశమున్నట్లు తెలియజేశారు. విచక్షణా వ్యయాల తీరు, కన్సాలిడేషన్, వ్యయ నియంత్రణపై దృష్టి ద్వారా గైడెన్స్ను ప్రకటించినట్లు వెల్లడించారు. కాగా.. మార్చితో ముగిసిన గతేడాదికి 20.7 శాతం నిర్వహణ మార్జిన్లు సాధించింది. ఈ కాలంలో నికర లాభం 9% ఎగసి రూ. 26,233 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 4.7% బలపడి రూ. 1,53,670 కోట్లయ్యింది. 2022–23లో రూ. 24,095 కోట్ల నికర లాభం, రూ. 1,46,767 కోట్ల టర్నోవర్ నమోదైంది. వ్యూహాత్మక, నిర్వహణ సంబంధ నగదు అవసరాలను పరిగణించాక రానున్న ఐదేళ్ల కాలానికి పెట్టుబడుల కేటాయింపుల విధానాన్ని బోర్డు సమీక్షించడంతోపాటు, అనుమతించినట్లు సీఎఫ్వో జయే‹Ù.ఎస్ పేర్కొన్నారు. ఈ కాలంలో వాటాదారులకు వార్షికంగా డివిడెండ్ను పెంచడం ద్వారా 85 శాతం కేటాయింపుల(రిటర్నులు)కు వీలున్నట్లు అంచనా వేశారు. ఇతర విశేషాలు.. ► పూర్తి ఏడాది(2023–24)కి కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 17.7 బిలియన్ డాలర్ల విలువైన భారీ కాంట్రాక్టులు(టీసీవీ) కుదుర్చుకుంది. వీటిలో 52 శాతం కొత్త ఆర్డర్లు. ► షేరుకి రూ. 28 తుది డివిడెండ్ ప్రకటించింది. దీనిలో రూ. 8 ప్రత్యేక డివిడెండ్ కలసి ఉంది. ► పూర్తి ఏడాదిలో 25,994 మంది ఉద్యోగులు తగ్గారు. దీంతో 2001 తదుపరి మొత్తం ఉద్యోగుల సంఖ్య(7.5%) క్షీణించింది. 3,17,240కు పరిమితమైంది. 2022–23లో సిబ్బంది సంఖ్య 3,43,234గా నమోదైంది. ► ఉద్యోగ వలసల (అట్రిషన్) రేటు 12.6% గా నమోదైంది. రూ. 4,000 కోట్లతో.. జర్మనీ సంస్థ ఇన్టెక్లో 100 శాతం వాటాను పూర్తి నగదు చెల్లింపు ద్వారా కొనుగోలు చేయనున్నట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఇందుకు 45 కోట్ల యూరోలు(రూ. 4,000 కోట్లు) వెచి్చంచనుంది. ఈమొబిలిటీ, కనెక్టెడ్, అటానమస్ డ్రైవింగ్, ఈవీలు, ఆఫ్రోడ్ వాహనాల విభాగంలో కంపెనీ సొల్యూషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు ఇన్ఫోసిస్ పేర్కొంది. ఈ కొనుగోలుతో జర్మన్ ఓఈఎం క్లయింట్లను పొందడంతోపాటు 2,200 మంది సుశిక్షిత సిబ్బందిని సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ఈ ఏడాది తొలి అర్ధభాగానికల్లా డీల్ పూర్తికాగలదని అంచనా వేస్తోంది. డీల్స్లో రికార్డ్ గతేడాది భారీ డీల్స్లో కొత్త రికార్డు సాధించాం. ఇది కంపెనీపట్ల క్లయింట్లకున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. జనరేటివ్ ఏఐలో సిబ్బంది సామర్థ్యాల విస్తరణ కొనసాగుతుంది. క్లయింట్ల ప్రోగ్రామ్లు, విభిన్న లాంగ్వేజీలపై పనిచేయడం, కస్టమర్ సపోర్ట్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ వినిమయం తదితరాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. – సలీల్ పరేఖ్, ఎండీ, సీఈవో, ఇన్ఫోసిస్ లిమిటెడ్ -
మరోసారి టీసీఎస్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవ లకు దేశంలో నంబర్ వన్.. టాటా కన్సల్టెన్సీ సర్విసెస్(టీసీఎస్) మరోసారి పటిష్ట ఫలితాలు సాధించింది. మార్చితో ముగిసిన గతేడాది (2023–24)తోపాటు చివరి త్రైమాసికంలోనూ ప్రోత్సాహకర పనితీరు ప్రదర్శించింది. కన్సాలిడేట్ ప్రాతిపదికన క్యూ4 (జనవరి–మార్చి)లో రూ. 12,434 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2022–23) ఇదే కాలంలో సాధించిన రూ. 11,392 కోట్లతో పోలిస్తే 9 శాతం అధికం. త్రైమాసిక ప్రాతిపదికన(రూ. 11,058 కోట్లు) సైతం 12 శాతంపైగా వృద్ధి నమోదైంది. ఇందుకు మెరుగుపడిన మార్జిన్లు, దేశీ బిజినెస్లో వృద్ధి దోహదపడ్డాయి. మొత్తం ఆదాయం వార్షికంగా 3.5 శాతం పుంజుకుని రూ. 61,237 కోట్లను తాకింది. అంతక్రితం రూ. 59,162 కోట్ల టర్నోవర్ సాధించింది. కంపెనీ బోర్డు షేరుకి రూ. 28 చొప్పున వాటాదారులకు మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. పూర్తి ఏడాదిలో.. గత ఆర్థిక సంవత్సరానికి టీసీఎస్ 9 శాతం అధికంగా రూ. 45,908 కోట్ల నికర లాభం ప్రకటించింది. నిర్వ హణ లాభ మార్జిన్లు 1.5 శాతం బలపడి 26 శాతాన్ని తాకా యి. మొత్తం ఆదాయం 7% వృద్ధితో రూ. 2,40,893 కోట్లయ్యింది. టర్నోవర్లో అతిపెద్ద మార్కెట్ ఉత్తర అమెరికా వాటా 2.3% తగ్గి 50 శాతానికి పరిమితమైంది. 24.6% నిర్వహణ మార్జిన్లు సాధించింది. దేశీ బిజినెస్ 38% ఎగసింది. దీంతో మొత్తం ఆదాయంలో దేశీ వాటా 5% నుంచి 6.7 శాతానికి బలపడింది. 40ఏళ్లపాటు బాధ్యతలు నిర్వహించిన సీవోవో ఎన్.గణపతి సుబ్రమణ్యం వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నట్లు కంపెనీ సీఈవో కృతివాసన్ పేర్కొన్నారు. అయితే కొత్త సీవోవోగా ఎవరినీ ఎంపిక చేయబోమని, సీనియర్లకు బాధ్యతలు పంపిణీ చేస్తామని తెలియజేశారు. ఉద్యోగు లకు 4.7% వార్షిక వేతన పెంపును చేపట్టనున్నట్లు హెచ్ఆర్ చీఫ్ మిలింద్ లక్కడ్ వెల్లడించారు. అత్యుత్తమ పనితీరు చూపినవారికి రెండంకెలలో పెంపు ఉంటుందని తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో టీసీఎస్ 0.5% పెరిగి రూ. 4,005 వద్ద ముగిసింది. ఇతర విశేషాలు ► క్యూ4లో కంపెనీ చరిత్రలోనే గరిష్టస్థాయిలో 13.2 బిలియన్ డాలర్ల ఆర్డర్లు పొందింది. ► పూర్తి ఏడాదికి 42.7 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ కుదుర్చుకుంది. ► క్యూ4లో యూకే బీమా దిగ్గజం అవైవాతో 15 ఏళ్ల కాలానికి మెగా డీల్ను సాధించింది. ► ఉద్యోగ వలసల (అట్రిషన్) రేటు 13.3 శాతం నుంచి 12.5 శాతానికి దిగివచి్చంది. ► క్యూ4లో సుమారు 2,000 మంది తగ్గడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 6,01,546కు చేరింది. ► వరుసగా మూడు త్రైమాసికాలలో మొత్తం 13,249 మంది సిబ్బంది తగ్గారు. ► 2004లో టీసీఎస్ లిస్టింగ్ తదుపరి గతేడాదిలోనే తొలిసారి ఉద్యోగుల సంఖ్యలో కోతపడింది. అనిశ్చితిలోనూ లాభాల మార్జిన్, ఆర్డర్ బుక్ సమర్ధవంత ఎగ్జిక్యూషన్, పటిష్ట బిజినెస్ మోడల్ కంపెనీ విలువను తెలియజేస్తున్నాయి. ప్రపంచ అనిశ్చితిలోనూ కీలకమైన, ప్రాధాన్యతగల అంశాలలో మెరుగైన సేవలను అందించాం. విభిన్న ఆఫరింగ్స్, కొత్తతరహా సామర్థ్యాలు, నాయకత్వ సలహాల ద్వారా కస్టమర్లకు మద్దతిచ్చాం. – కె.కృతివాసన్, సీఈవో, ఎండీ, టీసీఎస్ -
ఈజీ ట్రిప్ ప్లానర్స్ లాభం అప్
న్యూఢిల్లీ: ఆన్లైన్ ట్రావెల్ సరీ్వసుల కంపెనీ ఈజీ ట్రిప్ ప్లానర్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 10 శాతం వృద్ధితో రూ. 46 కోట్లకు చేరింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 42 కోట్లు ఆర్జించింది. ఈజ్మైట్రిప్ బ్రాండుతో సరీ్వసులందించే కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ. 136 కోట్ల నుంచి 161 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 83 కోట్ల నుంచి రూ. 105 కోట్లకు పెరిగాయి. ఎయిర్ టికెటింగ్ బిజినెస్కుతోడు హోటళ్లు, హాలిడేస్, ట్రాన్స్పోర్టేషన్ తదితర విభాగాలలోనూ సేవలను విస్తరిస్తున్నట్లు కంపెనీ సహవ్యవస్థాపకుడు, సీఈవో నిశాంత్ పిట్టి పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో ఈజీ ట్రిప్ షేరు బీఎస్ఈలో 3 శాతం పతనమై రూ. 51 వద్ద ముగిసింది. -
మారుతీ లాభం స్పీడ్
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికం(క్యూ3) లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 33 శాతం వృద్ధితో రూ. 3,207 కోట్లను తాకింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 2,406 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 15 శాతం పుంజుకుని రూ. 33,513 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 29,251 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. ఈ కాలంలో 8 శాతం అధికంగా 5,01,207 వాహనాలను విక్రయించింది. వీటిలో దేశీ అమ్మకాలు 4,29,422 యూనిట్లుకాగా.. 71,785 వాహనాలను ఎగుమతి చేసింది. ఇవి ఒక త్రైమాసికానికి కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా.. గత క్యూ3లో దేశీయంగా 4,03,929, విదేశాలలో 61,982 యూనిట్ల చొప్పున విక్రయించింది. ఈ ఏడాది తొలి 9 నెలల్లో(ఏప్రిల్–డిసెంబర్) మారుతీ సుజుకీ 7 శాతం వృద్ధితో మొత్తం 15,51,292 వాహనాలను విక్రయించింది. ఇది సరికొత్త రికార్డుకాగా.. ఆదాయం, నికర లాభాల్లోనూ రికార్డులు నమోదయ్యాయి. మొత్తం ఆదాయం రూ. 1,03,387 కోట్లను తాకగా.. నికర లాభం 9,536 కోట్లు ఆర్జించింది. ఫలితాల నేపథ్యంలో మారుతీ షేరు 2.3 శాతం బలపడి రూ. 10,183 వద్ద ముగిసింది. -
సన్ ఫార్మా లాభం అప్
న్యూఢిల్లీ: హెల్త్కేర్ రంగ దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 17 శాతం వృద్ధితో రూ. 2,524 కోట్లను తాకింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 2,166 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 11,241 కోట్ల నుంచి రూ. 12,381 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 8,943 కోట్ల నుంచి రూ. 9,561 కోట్లకు పెరిగాయి. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 8.5 చొప్పున మధ్యంతర డివిడెండు ప్రకటించింది. గ్లోబల్ స్పెషాలిటీసహా విస్తారిత వృద్ధిని సాధించినందుకు సంతోíÙస్తున్నట్లు కంపెనీ ఎండీ దిలీప్ సంఘ్వీ పేర్కొన్నారు. రానున్న నెలల్లో నైడెల్జీ ఈఎంఏ ఫైలింగ్పై దృష్టిపెట్టనున్నట్లు తెలియజేశారు. మెలనోమాతోపాటు, మెలనోమాయేతర చర్మ కేన్సర్ల చికిత్సలో వినియోగించే బయోఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్ ఇది. విభాగాలవారీగా ప్రస్తుత సమీక్షా కాలంలో దేశీయంగా సన్ ఫార్మా ఫార్ములేషన్ల అమ్మకాలు 11 శాతంపైగా పుంజుకుని రూ. 3,779 కోట్లకు చేరాయి. టారోసహా యూఎస్ విక్రయాలు 13 శాతం ఎగసి 47.7 కోట్ల డాలర్లను తాకాయి. వర్ధమాన మార్కెట్లలో ఇవి 2 శాతం నీరసించి 25.2 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. ఇతర ప్రపంచ మార్కెట్ల నుంచి 13 శాతం అధికంగా 21.4 కోట్ల డాలర్ల అమ్మకాలు సాధించింది. ఏపీఐ విక్రయాలు 10 శాతం క్షీణించి రూ. 466 కోట్లకు చేరాయి. ఈ కాలంలో పరిశోధన, అభివృద్ధిపై రూ. 825 కోట్ల పెట్టుబడులు వెచి్చంచింది. గత క్యూ3లో ఇవి రూ. 670 కోట్లు మాత్రమే. ఫలితాల నేపథ్యంలో సన్ ఫార్మా షేరు బీఎస్ఈలో 3.5 శాతం లాభపడి రూ. 1,419 వద్ద ముగిసింది. -
ఐటీసీ లాభం రూ. 5,401 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 6 శాతంపైగా వృద్ధితో రూ. 5,401 కోట్లను తాకింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 5,070 కోట్లు ఆర్జించింది. సిగరెట్లుసహా ఎఫ్ఎంసీజీ బిజినెస్ లాభాలకు దన్నునిచి్చంది. వాటాదారులకు షేరుకి రూ. 6.25 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇందుకు ఫిబ్రవరి 8 రికార్డ్ డేట్గా ప్రకటించింది. కాగా.. నాన్ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అతుల్ సింగ్, స్వతంత్ర డైరెక్టర్గా పుష్ప సుబ్రహ్మణ్యంను బోర్డు ఎంపిక చేసినట్లు ఐటీసీ పేర్కొంది. 2024 ఏప్రిల్ 2 నుంచి ఐదేళ్లపాటు బాధ్యతలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఆదాయం అప్ ప్రస్తుత సమీక్షా కాలంలో ఐటీసీ స్థూల ఆదాయం 2 శాతం పుంజుకుని రూ. 19,338 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 18,902 కోట్ల టర్నోవర్ నమోదైంది. కాగా.. మొత్తం కార్యకలాపాల టర్నోవర్ రూ. 19,484 కోట్లుగా నమోదైంది. ఆదాయంలో సిగరెట్లతోపాటు ఎఫ్ఎంసీజీ బిజినెస్ నుంచి 4.5 శాతం అధికంగా రూ. 13,513 కోట్లు లభించగా.. సిగరెట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ. 8,295 కోట్లు సమకూర్చుకుంది. ఎఫ్ఎంసీజీలో ఇతర విభాగాలు 8 శాతం ఎగసి రూ. 5,218 కోట్ల టర్నోవర్ను సాధించాయి. ఐటీసీ హోటళ్ల నుంచి 18 శాతం అధికంగా రూ. 872 కోట్ల ఆదాయం లభించింది. ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు 1.5 శాతం నష్టంతో రూ. 449 వద్ద ముగిసింది. -
ఎస్బీఐ లైఫ్ లాభం అప్
ముంబై: ప్రయివేట్ రంగ జీవిత బీమా దిగ్గజం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 15 శాతం ఎగసి రూ. 1,083 కోట్లకు చేరింది. ప్రీమియం ఆదాయం, మార్జిన్లు పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. వ్యక్తిగత కొత్త బిజినెస్ ప్రీమియం 17 శాతం జంప్చేసి రూ. 17,762 కోట్లను తాకింది. వార్షిక ప్రీమియం పాలసీల ఆదాయం(ఏపీఈ) 17 శాతం పుంజుకుని రూ. 14,389 కోట్లయ్యింది. కొత్త బిజినెస్ విలువ(వీఎన్బీ) 11 శాతం బలపడి రూ. 4,038 కోట్లకు చేరింది. వీఎన్బీ మార్జిన్ 28.1 శాతంగా నమోదైంది. కొత్త బిజినెస్ ప్రీమియం రూ. 21,512 కోట్ల నుంచి రూ. 26,000 కోట్లకు పురోగమించింది. రక్షణ సంబంధ కొత్త బిజినెస్ ప్రీమియం 17 శాతం అధికమై రూ. 2,972 కోట్లుగా నమోదైంది. యాన్యుటీ, పెన్షన్ కొత్త బిజినెస్ 12 శాతం వృద్ధితో రూ. 6,787 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో ఎస్బీఐ లైఫ్ షేరు బీఎస్ఈలో 2 శాతం క్షీణించి రూ. 1,381 వద్ద ముగిసింది. -
కొటక్ మహీంద్రా క్యూ3 గుడ్
ముంబై: ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం కొటక్ మహీంద్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 7 శాతం వృద్ధితో రూ. 4,265 కోట్లకు చేరింది. స్టాండెలోన్ నికర లాభం సైతం రూ. 2,792 కోట్ల నుంచి రూ. 3,005 కోట్లకు బలపడింది. డిబెంచర్ల జారీ ద్వారా రూ. 10,000 కోట్లు సమీకరించేందుకు బోర్డు అనుమతించినట్లు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. వడ్డీ ఆదాయం అప్ ప్రస్తుత సమీక్షా కాలంలో కొటక్ మహీంద్రా బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 16 శాతం పుంజుకుని రూ. 6,554 కోట్లకు చేరగా.. నికర వడ్డీ మార్జిన్లు 5.47 శాతం నుంచి 5.22 శాతానికి స్వల్ప వెనకడుగు వేశాయి. ఇతర ఆదాయం రూ. 1,948 కోట్ల నుంచి రూ. 2,2,97 కోట్లకు ఎగసింది. మొత్తం ప్రొవిజన్లు రూ. 149 కోట్ల నుంచి రూ. 579 కోట్లకు పెరిగాయి. ఫలితంగా లాభాల్లో వృద్ధి పరిమితమైనట్లు వెల్లడించింది. బ్యాంక్ ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్(ఏఐఎఫ్లు)లో పెట్టుబడులకు రూ. 190 కోట్లమేర కేటాయింపులు చేపట్టినట్లు పేర్కొంది. అన్సెక్యూర్డ్ రుణాల కారణంగా తాజా స్లిప్పేజీలు రూ. 748 కోట్ల నుంచి రూ. 1,177 కోట్లకు పెరిగాయి. బ్యాంక్ పటిష్టస్థితిలో ఉన్నట్లు ఎండీ, సీఈవోగా కొత్తగా ఎంపికైన అశోక్ వాస్వాని స్పష్టం చేశారు. కనీస మూలధన నిష్పత్తి 20 శాతం నుంచి 19 శాతానికి వెనకడుగు వేసింది. వారాంతాన బీఎస్ఈలో కొటక్ మహీంద్రా షేరు 2.3 % బలపడి రూ. 1,806 వద్ద ముగిసింది. -
ఐసీఐసీఐ లాభం జూమ్
ముంబై: ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 26 శాతం జంప్చేసి రూ. 11,053 కోట్లకు చేరింది. ప్రొవిజన్లు తగ్గడం ఇందుకు సహకరించింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 24 శాతం ఎగసి రూ. 10,272 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం 13 శాతం పుంజుకుని రూ. 18,678 కోట్లకు చేరగా.. నికర వడ్డీ మార్జిన్లు 4.65 శాతం నుంచి 4.43 శాతానికి స్వల్ప వెనకడుగు వేశాయి. ఇతర ఆదాయం 20 శాతం పురోగమించి రూ. 5,975 కోట్లయ్యింది. ఏఐఎఫ్ల ఎఫెక్ట్ ఆర్బీఐ ఆదేశాల ప్రకారం మదింపుచేస్తే ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్(ఏఐఎఫ్లు)లో పెట్టుబడులకు రూ. 627 కోట్లమేర దెబ్బతగిలినప్పటికీ ప్రొవిజన్లు రూ. 2,257 కోట్ల నుంచి రూ. 1,049 కోట్లకు తగ్గినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ బాత్రా పేర్కొన్నారు. మొత్తం ఏఐఎఫ్లకు కేటాయింపులు చేపట్టినట్లు తెలియజేశారు. నిజానికి గతేడాది చేపట్టిన కంటింజెన్సీ ప్రొవిజన్లు, అవలంబించిన ప్రొవిజన్ విధానాలు కేటాయింపుల తగ్గింపునకు దోహదపడినట్లు తెలియజేశారు. కాగా.. ఐసీఐసీఐ బ్యాంక్ అనుబంధ సంస్థలలో లైఫ్ ఇన్సూరెన్స్ విభాగం నికర లాభం రూ. 227 కోట్లకు స్వల్పంగా పుంజుకుంది. సాధారణ బీమా నికర లాభం 22 శాతం జంప్చేసి రూ. 431 కోట్లను తాకగా.. అసెట్ మేనేజ్మెంట్ విభాగం నుంచి 30 శాతం అధికంగా రూ. 546 కోట్లు ఆర్జించింది. బ్రోకరేజీ బిజినెస్ నికర లాభం 66 శాతం దూసుకెళ్లి రూ. 466 కోట్లయ్యింది. వారాంతాన బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు 1 శాతం బలపడి రూ. 1,008 వద్ద ముగిసింది. -
పైలట్ రహిత ప్రయాణం
మానవ రహిత డ్రోన్ల వినియోగం ప్రపంచమంతటా విస్తృతమవుతోంది. రిమోట్ కంట్రోల్ టెక్నాలజీతో వీటిని ఆపరేట్ చేస్తుంటారు. ఇదే టెక్నాలజీ ఆధారంగా పైలట్ రహిత విమానాలపై చాలా ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ దిశగా అమెరికాకు చెందిన రిలయబుల్ రోబోటిక్స్ సిస్టమ్స్ సంస్థ సత్పలితాలు సాధించింది. సెమీ–అటోమేటెడ్ ఫ్లయింగ్ సిస్టమ్పై ఈ సంస్థ 2019 నుంచి పరిశోధనలు సాగిస్తోంది. పైలట్ లేకుండా కార్గో విమానాన్ని విజయవంతంగా నడిపించింది. అమెరికాలో ఉత్తర కాలిఫోరి్నయాలోని హోలిస్టర్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరిన ఈ సెస్నా కేరవాన్ విమానం దాదాపు 12 నిమిషాల పాటు గాల్లో 50 మైళ్ల మేర ప్రయాణించింది. గత నెలలో ఈ ప్రయోగం విజయవంతంగా చేపట్టామని రిలయబుల్ రోబోటిక్స్ సిస్టమ్స్ సీఈఓ రాబర్ట్ రోజ్ చెప్పారు. పైలట్ ప్రమేయం లేకుండా రిమోట్ కంట్రోలర్తోనే నడిపించినట్లు తెలిపారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఇలాంటి పైలట్ రహిత విమానాలతో కొన్ని సమస్యలు లేకపోలేదు. ఇవి గాల్లో తక్కువ ఎత్తులోనే ప్రయాణిస్తాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులను అధిగమించలేవు. ఇలాంటి సమస్యలను పరిష్కరించి, మెరుగైన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడానికి కొంత సమయం పడుతుందని రాబర్ట్ రోజ్ చెప్పారు. తాము అభివృద్ధి చేసిన సాంకేతికతను వాణిజ్యపరంగా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి రిలయబుల్ రోబోటిక్స్ సంస్థ అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్తో కలిసి పని చేస్తోంది. మరో రెండేళ్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పైలట్ రహిత విమానాల రిమోట్ ఆపరేటర్కు ఒక పైలట్ ఉండే అర్హతలన్నీ ఉండాలి. అలాగే పైలట్ లైసెన్స్ కలిగి ఉండాలి. సెస్నా కంపెనీ తయారు చేసిన సరుకు రవాణా విమానాలను కేరవాన్ అని పిలుస్తున్నారు. ఇది సింగిల్–ఇంజన్ ఎయిర్క్రాఫ్ట్. ఫ్లైట్ ట్రైనింగ్, టూరిజం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, సరుకు రవాణా కోసం వీటిని ఉపయోగిస్తుంటారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టైటన్ లాభం అప్
న్యూఢిల్లీ: జ్యువెలరీ, వాచీల తయారీ దిగ్గజం టైటన్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జూలై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 10 శాతం వృద్ధితో రూ. 916 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 835 కోట్లు ఆర్జించింది. నికర అమ్మకాలు సైతం 25 శాతం జంప్చేసి రూ. 10,708 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 8,567 కోట్ల అమ్మకాలు సాధించింది. అయితే మొత్తం వ్యయాలు 41 శాతం పెరిగి రూ. 11,402 కోట్లకు చేరాయి. ఇక మొత్తం కన్సాలిడేటెడ్ ఆదాయం 37 శాతం ఎగసి రూ. 12,653 కోట్లయ్యింది. దీనిలో జ్యువెలరీ విభాగం ఆదాయం 39 శాతం జంప్చేసి రూ. 11,081 కోట్లను తాకగా.. వాచీలు తదితర బిజినెస్ 32 శాతం వృద్ధితో రూ. 1,092 కోట్లకు చేరింది. వెరసి వాచీలు, వేరబుల్స్ విభాగం తొలిసారి రూ. 1,000 కోట్ల టర్నోవర్ను అందుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ఐకేర్ ఆదాయం 13 శాతం బలపడి రూ. 189 కోట్లయ్యింది. ఈ కాలంలో కొత్తగా 10 టైటన్ వరల్డ్ స్టోర్లతోపాటు, హీలియోస్ 5, ఫాస్ట్ట్రాక్ 5 చొప్పున స్టోర్లను ఏర్పాటు చేసింది. ఫలితాల నేపథ్యంలో టైటన్ షేరు బీఎస్ఈలో 2.3 శాతం బలపడి రూ. 3,273 వద్ద ముగిసింది. -
ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మెరుగైన పనితీరు
గురుగ్రామ్: సప్లయ్ చైన్, లాజిస్టిక్స్ సేవల్లోని ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించింది. స్టాండలోన్ ఆదాయం 6 శాతం వృద్ధితో రూ.912 కోట్లకు చేరింది. పన్ను అనంతరం లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 57 కోట్లతో పోలిస్తే 17 శాతం వరకు వృద్ధి చెంది రూ.67 కోట్లకు చేరింది. ఎబిట్డా మార్జిన్ 11.9 శాతంగా ఉంది. కన్సాలిడేటెడ్ (అనుబంధ సంస్థలతో కలిపి)గా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెపె్టంబర్) ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 6 శాతం పెరిగి రూ.1963 కోట్లుగా నమోదైంది. లాభం 13 శాతం వరకు పెరిగి రూ.171 కోట్లుగా ఉంది. -
యూనియన్ బ్యాంక్ లాభం రెట్టింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్తో ముగిసిన త్రైమాసికానికి (క్యూ2) మెరుగైన పనితీరు చూపించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు రెట్టింపై రూ.3,511 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.1,848 కోట్లుగానే ఉంది. మొత్తం ఆదాయం రూ.22,958 కోట్ల నుంచి రూ.28,282 కోట్లకు దూసుకుపోయింది. నిర్వహణ లాభం సైతం రూ.6,577 కోట్ల నుంచి రూ.7,221 కోట్లకు పెరిగింది. వడ్డీ ఆదాయం రూ.19,682 కోట్ల నుంచి రూ.24,587 కోట్లకు చేరగా, నికర వడ్డీ ఆదాయం 10 శాతం వృద్ధితో రూ.9,126 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్ 3.15 శాతం నుంచి 3.18 శాతానికి పెరిగింది. బ్యాంకు ఆస్తుల (రుణాలు) నాణ్యత మెరుగుపడింది. స్థూల ఎన్పీఏలు 6.38 శాతానికి క్షీణించాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికం చివరికి ఇవి 8.45 శాతంగా ఉన్నాయి. నికర ఎన్పీఏలు సైతం 1.30 శాతానికి పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలానికి ఇవి 2.64 శాతంగా ఉన్నాయి. బ్యాంక్ క్యాపిటల్ అడెక్వెసీ రేషియో 16.69 శాతానికి మెరుగుపడింది. కాసా రేషియో (కరెంట్, సేవింగ్స్ ఖాతాలు) 35.64 శాతం నుంచి 34.66 శాతానికి తగ్గింది. సెపె్టంబర్ క్వార్టర్లో అర్హులైన సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు (క్యూఐపీ) ద్వారా రూ.5,000 కోట్లను సమీకరించినట్టు బ్యాంక్ తెలిపింది. దీంతో బ్యాంక్లో కేంద్ర ప్రభుత్వం వాటా 83.49 శాతం నుంచి 76.99 శాతానికి తగ్గింది. -
ఇండియన్ బ్యాంక్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో నికర లాభం 62 శాతం జంప్చేసి రూ. 1,988 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,225 కోట్లు మాత్రమే ఆర్జించింది. వడ్డీ ఆదాయం సైతం రూ. 10,710 కోట్ల నుంచి రూ. 13,743 కోట్లకు ఎగసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 7.3 శాతం నుంచి రూ. 4.97 శాతానికి దిగివచ్చాయి. ఫలితాల నేపథ్యంలో ఇండియన్ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 2 శాతం బలహీనపడి రూ. 400 వద్ద ముగిసింది. -
కొటక్ బ్యాంక్ లాభం అప్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కొటక్ మహీంద్రా బ్యాంక్ ఈ ఏడాది (2023–24) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్ (క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 24% జంప్చేసి రూ. 4,423 కోట్లను తాకింది. వడ్డీ ఆదా యం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. స్టాండెలోన్ లాభం సైతం రూ. 2,581 కోట్ల నుంచి రూ. 3,191 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 21% వృద్ధితో రూ. 6,297 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 5.22 శాతాన్ని తాకాయి. ఇతర ఆదాయం రూ. 1,832 కోట్ల నుంచి రూ. 2,314 కోట్లకు పుంజుకుంది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.08% నుంచి రూ. 1.72%కి తగ్గాయి. అశోక్ వాశ్వానికి సై: కొటక్ మహీంద్రా బ్యాంక్ కొత్త ఎండీ, సీఈవోగా బయటి వ్యక్తి అశోక్ వాస్వాని ఎంపికకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కొటక్ నాలుగు నెలల ముందుగానే ఎండీ, సీఈవో బాధ్యతల నుంచి వైదొలగుతున్న నేపథ్యంలో అశోక్ను బ్యాంక్ బోర్డు ప్రతిపాదించింది. -
విప్రో లాభం ఫ్లాట్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్ (క్యూ2)లో నికర లాభం నామమాత్ర వృద్ధితో రూ. 2,667 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 2,649 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం నామమాత్ర క్షీణతతో రూ. 22,516 కోట్లకు పరిమితమైంది. గత క్యూ2లో రూ. 22,540 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. ఐదు అనుబంధ సంస్థలను కంపెనీలో విలీనం చేసుకునేందుకు బోర్డు అనుమతించినట్లు విప్రో తాజాగా వెల్లడించింది. వీటిలో విప్రో హెచ్ఆర్, ఓవర్సీస్ ఐటీ, టెక్నాలజీ ప్రొడక్టు సరీ్వసులు, వీఎల్ఎస్ఐ డిజైన్ సరీ్వసులు, విప్రో ట్రేడ్మార్క్ హోల్డింగ్ ఉన్నాయి. గైడెన్స్ వీక్.. ప్రస్తుత త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)క్యూ3లో ఐటీ సర్వీసుల ఆదాయం 3.5–1.5 శాతం మధ్య క్షీణించవచ్చంటూ విప్రో తాజా అంచనాల(గైడెన్స్)ను ప్రకటించింది. వెరసి కరెన్సీ నిలకడ ప్రాతిపదికన 261.7–267.2 కోట్ల డాలర్ల స్థాయిలో ఆదాయాన్ని ఊహిస్తోంది. అంటే రూ. 21,643–22,097 కోట్ల మధ్య టర్నోవర్ను అంచనా కట్టింది. ప్రస్తుత బలహీన ప్రపంచ ఆర్థిక ఔట్లుక్ నేపథ్యంలో తాజా గైడెన్స్ను ప్రకటించింది. ఇతర విశేషాలు ► నిర్వహణ మార్జిన్లు నామమాత్ర వృద్ధితో 16.1 శాతానికి చేరాయి. ► 3.78 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులను కుదుర్చుకుంది. ► క్యూ2కల్లా సిబ్బంది సంఖ్య 7 శాతం తగ్గి 2,44,707కు చేరింది. ► ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు గత 6 త్రైమాసికాల్లోనే తక్కువగా 15.5%కి పరిమితమైంది. అనిశి్చతులు ఉన్నాయ్... బిజినెస్ వాతావరణం అనిశి్చతిగా ఉన్నట్లు ఫలితాల విడుదల సందర్భంగా విప్రో సీఈవో థియరీ డెలాపోర్ట్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు గరిష్టస్థాయిలలో కొనసాగుతున్నాయని, పెట్టుబడులపట్ల క్లయింట్లు మరింత కఠిన వైఖరిని ప్రదర్శిస్తున్నారని తెలియజేశారు. ప్రస్తుత పెట్టుబడుల గరిష్ట వినియోగంపై దృష్టి పెడుతూనే కొత్త పెట్టుబడులపై వేగవంత రిటర్నులను ఆశిస్తున్నట్లు వివరించారు. విచక్షణా వ్యయాలు, ఆర్డర్లు నెమ్మదిస్తున్నట్లు వెల్లడించారు. ఇది ఆదాయ వృద్ధిపై ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. అయితే మార్జిన్లు నిలుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం నీరసించి రూ. 408 వద్ద ముగిసింది. -
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఫలితాలు బాగున్నాయ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 2023–24 రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ2 లో నికర లాభం 72% జంప్చేసి రూ. 920 కోట్లను తాకింది. వడ్డీ ఆదాయం పుంజుకోవడం, మొండి రుణాలు తగ్గడం ఇందుకు సహకరించింది. నిర్వహణ లాభం 31% బలపడి రూ. 1,920 కోట్లకు చేరినట్లు బ్యాంక్ ఎండీ ఏఎస్ రాజీవ్ పేర్కొన్నారు. బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 4,317 కోట్ల నుంచి రూ. 5,796 కోట్లకు పుంజుకుంది. స్థూల మొండిబకాయిలు 3.4% నుంచి 2.19%కి తగ్గాయి. -
క్యూ 2 లో టీసి 'ఎ స్'!
ముంబై: దేశీ సాఫ్ట్వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్).. మెరుగైన ఫలితాలతో బోణీ కొట్టింది. ఈ ఆరి్థక సంవత్సరం సెపె్టంబర్తో ముగిసిన రెండో త్రైమాసికంలో (2023–24, క్యూ2) కంపెనీ రూ. 11,342 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 10,431 కోట్లతో పోలిస్తే 8.7 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం సైతం 7.9 శాతం పెరుగుదలతో రూ. 55,309 కోట్ల నుండి రూ.59,692 కోట్లకు ఎగబాకింది. ఇక వాటాదారులకు టీసీఎస్ మరోసారి భారీ బైబ్యాక్ ఆఫర్ను ప్రకటించడం విశేషం. మరోపక్క, మందకొడి ఆరి్థక పరిస్థితుల నేపథ్యంలో ఐటీ రంగానికి ప్రతికూలతలు కొనసాగుతాయని కూడా కంపెనీ స్పష్టం చేసింది. త్రైమాసిక ప్రాతిపదికన ఇలా... ఈ ఆరి్థక సంవత్సరం జూన్ క్వార్టర్ (క్యూ1లో) నమోదైన రూ.11,074 కోట్లతో పోలిస్తే త్రైమాసిక ప్రాతిపదికన క్యూ2లో నికర లాభం 2.5% వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం క్యూ1లో రూ.59,381 కోట్లతో పోలిస్తే క్యూ2లో అర శాతం పెరిగింది. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు... ► క్యూ2లో కంపెనీ నిర్వహణ లాభం 9.1 శాతం వృద్ధితో రూ.14,483 కోట్లకు పెరిగింది. అదేవిధంగా నిర్వహణ మార్జిన్లు పావు శాతం పెరిగి 24.3 శాతానికి చేరాయి. ► భౌగోళికంగా చూస్తే, యూకే నుండి ఆదాయం 10.7 శాతం ఎగబాకగా, ఉత్తర అమెరికా నుండి స్వల్పంగా 0.1 శాతం వృద్ధి చెందింది. వర్ధమాన మార్కెట్లలో మధ్యప్రాచ్యం, ఆఫ్రికా ఆదాయం 15.9 శాతం వృద్ధి నమోదు కాగా, లాటిన్ అమెరికా 13.1 శాతం, ఆసియా పసిఫిక్ 4.1 శాతం, భారత్ ఆదాయం 3.9 శాతం చొప్పున పెరిగాయి. ► విభాగాల వారీగా.. ఇంధనం, వనరులు, యుటిలిటీల నుండి ఆదాయం 14.8 శాతం పెరిగింది. తయారీ రంగం నుండి ఆదాయం 5.8 శాతం, లైఫ్ సైన్సెస్–హెల్త్కేర్ 5 శాతం పెరగ్గా, బ్యాంకింగ్–ఫైనాన్షియల్ సరీ్వసెస్ (బీఎఫ్ఎస్ఐ) మాత్రం మైనస్ 0.5 శాతంగా నమోదైంది. ► సెపె్టంబర్ చివరి నాటికి టీసీఎస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,08,985కు చేరింది. క్యూ2లో నికరంగా 6,000 మంది సిబ్బంది తగ్గారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలన్న లక్ష్యంలో ఎలాంటి మార్పు లేదని టీసీఎస్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ చెప్పారు. క్యాంపస్ నియమకాలపై ఇప్పటికే దృష్టి పెట్టామన్నారు. ► క్యూ2లో కంపెనీ 11.2 బిలియన్ డాలర్ల విలువైన కొత్త కాంట్రాక్టులను కుదుర్చుకుంది. ఇందులో బీఎస్ఎన్ఎల్ 4జీ/5జీ, వాహన దిగ్గజం జేఎల్ఆర్కు సంబంధించిన డీల్స్ ప్రధానంగా ఉన్నాయి. ► ఇజ్రాయెల్లో 250 మంది కంపెనీ ఉద్యోగులు పని చేస్తున్నారని, యుద్ధ ప్రభావం అక్కడ తమ వ్యాపారాలపై పెద్దగా ప్రభావం చూపలేదని టీసీఎస్ సీఎఫ్ఓ ఎన్. గణపతి సుబ్రమణ్యం చెప్పారు. ► రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై కంపెనీ రూ. 9 చొప్పన రెండో మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. దీనికి రికార్డు తేదీ అక్టోబర్ 19 కాగా, నవంబర్ 7న చెల్లించనుంది. దాదాపు రూ.3,300 కోట్లు ఇందుకు వెచి్చంచనుంది. టీసీఎస్ షేరు ధర బుధవారం బీఎస్ఈలో అర శాతం నష్టంతో రూ. 3,610 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చాయి. బైబ్యాక్ బొనాంజా @ రూ.17,000 కోట్లు టీసీఎస్ బైబ్యాక్ పరంపరను కొనసాగిస్తోంది. రూ. 17,000 కోట్ల విలువైన షేర్లను వాటాదారుల నుంచి తిరిగి కొనుగోలు చేసేందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. బైబ్యాక్ షేరు ధరను రూ. 4,150గా నిర్ణయించింది. వర్క్ ఫ్రమ్ హోమ్కు ‘టాటా’ కరోనా మహమ్మారి కారణంగా కల్పించిన రిమోట్ వర్కింగ్ (వర్క్ ఫ్రమ్ హోమ్) సదుపాయానికి టీసీఎస్ టాటా చెప్పింది. ఇకపై తమ ఉద్యోగులందరూ ఆఫీసుల నుంచే విధులు నిర్వర్తించాలని కంపెనీ బుధవారం ప్రకటించింది. కో–వర్కింగ్ వల్ల వ్యవస్థ విస్తృతం అవుతుందని, ఉత్పాదకత పెరుగుతుందని టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ పేర్కొన్నారు. మా సరీ్వస్లకు కొనసాగుతున్న డిమాండ్, క్లయింట్లు దీర్ఘకాల ప్రాజెక్టులకు కట్టుబడి ఉండటం, జెన్ ఏఐ ఇంకా ఇతర కొత్త టెక్నాలజీలను ప్రయోగాత్మకంగా ఉపయోగించేందుకు చూపుతున్న ఆసక్తి.. మా దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలపై భరోసా కలి్పస్తోంది. ఆరి్థక అనిశ్చితి కొనసాగుతోంది. దీనివల్లే ఆదాయ వృద్ధి అంతంతమాత్రంగా నమోదైంది. అయితే పటిష్టమైన డీల్స్ జోరుతో ఆర్డర్ బుక్ భారీగా వృద్ధి చెందింది. మొత్తం కాంట్రాక్ట్ విలువ (టీసీవీ) పరంగా క్యూ2లో రెండో అత్యధిక స్థాయిని నమోదు చేసింది. – కె. కృతివాసన్, టీసీఎస్ సీఈఓ -
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో గెలుపు పక్కా
న్యూఢిల్లీ: రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలను సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ధీమా వ్యక్తంచేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కచి్చతంగా విజయం సాధిస్తుందన్న రాహుల్.. తెలంగాణలో నెగ్గే అవకాశాలున్నాయని చెప్పారు. ఇక రాజస్థాన్లో రెండు పారీ్టల మధ్య హోరాహోరీ పోటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పారీ్టయే విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిదిన్ మీడియా నెట్వర్క్ ఆఫ్ అసోమ్ సంస్థ ఆదివారం ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరైన రాహుల్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఐక్య పోరాటం చేస్తాయని, ఆ ఎన్నికల్లో బీజేపీని నివ్వెరపరిచే ఫలితాలు వస్తాయని అన్నారు. ఆయన ఇంకా ఏం అన్నారంటే.. ‘ప్రజా సమస్యల నుంచి పక్కదారి పట్టించడానికే బీజేపీ ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్న పాట పాడుతోంది. కులగణన వంటి అంశాలను పక్కదారి పట్టించడానికి బీజేపీ ఎన్నో వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ ఎంపీ రమేష్ బిధూరీ మరో ఎంపీ దాని‹Ùపై చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ప్రజా అంశాలను పక్కదారి పట్టించడానికే. ఆదాయ అసమానతలు, కొందరి చేతుల్లోనే సంపద పోగుపడిపోవడం, నిరుద్యోగం తీవ్ర రూపం దాల్చడం, వెనుకబడిన కులాలు, ఓబీసీలు, ఆదివాసీల పట్ల చిన్నచూపు, అధిక ధరలు వంటి సమస్యలు దేశాన్ని బాధిస్తున్నాయి. ఈ అంశాలపై దృష్టి సారించలేని బీజేపీ వాటిని పక్కదారి పట్టించే మార్గంలో నడుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల విషయానికొస్తే తెలంగాణలో కాంగ్రెస్కు గెలిచే అవకాశాలున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కచి్చతంగా గెలుస్తాం. రాజస్తాన్లో గట్టి పోటీ ఉంది. కానీ కాంగ్రెస్ పారీ్టయే గెలుస్తుంది. ఇది మా పార్టీ అంచనా కాదు. బీజేపీ చేసుకున్న అంతర్గత సర్వేల్లోనూ ఇదే విషయం తేలింది’ అని రాహుల్ గాంధీ వివరించారు. జిమ్ అంటేనే ఇష్టం విలేకరులు అడిగిన కొన్ని సరదా ప్రశ్నలకూ రాహుల్ హుషారుగా బదులిచ్చారు. తీరిక సమయాల్లో నెట్ఫ్లిక్స్ చూస్తారా, జిమ్ చేస్తారా అని ప్రశ్నిస్తే జిమ్ చేయడమంటేనే తనకు ఇష్టమని చెప్పారు. గెడ్డంతో ఉండడం ఇష్టమా, లేకపోతే ఇష్టమా అని అడిగితే కాంగ్రెస్ పారీ్టలో ఉన్నాను కాబట్టి వేసుకునే వీటిని పట్టించుకోవడం లేదని, ఎలా ఉన్నా ఫర్వాలేదని నవ్వారు. రాజకీయ నేత కాకపోయి ఉంటే ఏమై ఉండేవారు అని ప్రశ్నించగా ‘ఏదైనా అయి ఉండేవాడిని. నా మేనల్లుడు, వాడి స్నేహితుల్ని కలిసినప్పుడు టీచర్గా మారతా. వంటగదిలోకి అడుగు పెడితే చెఫ్ అయిపోతా. ఇలా నేను బహుముఖ పాత్రలు పోషిస్తుంటా’ అని రాహుల్ చెప్పారు. ‘క్రికెట్ కంటే ఫుట్బాల్ అంటే ఇష్టం. క్రీడాకారుడు మెస్సి రొనాల్డో అంటేఇష్టమన్నారు. గాడ్ఫాదర్, డార్క్నైట్ వీటిల్లో ఏ సినిమా అంటే ఇష్టం అని అడగ్గా.. రెండూ నాకు ఇష్టమే’ అని చెప్పారు. ఇండియా, భారత్లో దేశానికి ఏ పేరు ఉండాలని ప్రశ్నించగా ఇండియా అంటేనే భారత్ అని రాహుల్ చెప్పారు. -
ఐటీసీ లాభం జూమ్
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ప్రస్తుత ఆరి్థక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 16% ఎగసి రూ. 5,180 కోట్లను అధిగమించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 4,462 కోట్లు ఆర్జించింది. నిర్వహణ ఆదాయం మాత్రం రూ. 19,831 కోట్ల నుంచి రూ. 18,639 కోట్లకు తగ్గింది. ఇది 6% క్షీణతకాగా.. మొత్తం వ్యయాలు సైతం 13% తగ్గి రూ. 12,422 కోట్లకు పరిమితమయ్యాయి. ఇక మొత్తం టర్నోవర్ 4% నీరసించి రూ. 19,362 కోట్లుగా నమోదైంది. విభాగాలవారీగా..: తాజా క్యూ1లో ఐటీసీ.. ఎఫ్ఎంసీజీ విభాగం 13 శాతంపైగా వృద్ధితో రూ. 13,528 కోట్ల ఆదాయాన్ని సాధించింది. దీనిలో సిగరెట్ల బిజినెస్ నుంచి 12 శాతం అధికంగా రూ. 8,356 కోట్లు అందుకుంది. హోటళ్ల బిజినెస్ 8% బలపడి రూ. 625 కోట్ల ఆదాయం అందుకుంది. ‘హోటల్’ షేర్ల జారీ తీరిదీ..: ఐటీసీ హోటల్స్ పేరుతో ఆతిథ్య రంగ బిజినెస్ను ప్రత్యేక కంపెనీగా ఐటీసీ విడదీస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా కంపెనీ బోర్డు 1:10 నిష్పత్తిలో షేర్ల జారీకి ఆమోదముద్ర వేసినట్లు ఐటీసీ పేర్కొంది. వాటాదారులకు ఐటీసీలోగల ప్రతీ 10 షేర్లకుగాను 1 ఐటీసీ హోటల్ షేరును కేటాయించనుంది. షేర్ల జారీ తదుపరి ఐటీసీ హోటల్స్లో 60% వాటాను ఐటీసీ వాటాదారులు పొందనుండగా.. ఐటీసీ 40% వాటాను కలిగి ఉండనుంది. హోటల్ షేర్లు త్వరలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్కానున్నాయి. ఐటీసీ హోటల్స్ను ప్రత్యేక కంపెనీగా విడదీసి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ చేసేందుకు సుమారు 15 నెలలు పట్టవచ్చని ఐటీసీ తాజాగా అంచనాలు ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్ఈలో నామమాత్ర లాభంతో రూ. 449 వద్ద ముగిసింది. -
ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు 17 శాతం అప్
న్యూఢిల్లీ: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023 ఏప్రిల్–2024 మార్చి) ఆగస్టు 10వ తేదీ వరకూ గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 17 శాతం పెరిగి రూ.5.84 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఆర్థిక సంవత్సరం మొత్తం లక్ష్యంలో ఇది 32 శాతానికి సమానం. ఆదాయపు పన్ను శాఖ ప్రకటన ప్రకారం, స్థూల వసూళ్లు 15.73 శాతం పురోగతితో రూ.6.53 లక్షల కోట్లుగా ఉన్నాయి. వీటిలో రిఫండ్స్ రూ.69,000 కోట్లు. ఒక్క రిఫండ్స్ గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 3.73 శాతం అధికం. 2023–24లో ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యం రూ.18.23 లక్షల కోట్లు. 2022–23తో పోల్చితే (రూ.16.61 లక్షల కోట్లు) ఈ పరిమాణం 9.75 శాతం అధికం. -
ఎయిర్టెల్ లాభం ఫ్లాట్
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం దాదాపు యథాతథంగా రూ. 1,612 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,607 కోట్లు ఆర్జించింది. అయితే సర్దుబాటుకు ముందు నికర లాభం 91 శాతం జంప్చేసి రూ. 2,902 కోట్లుగా నమోదైంది. ఇక మొత్తం ఆదాయం 14 శాతం ఎగసి రూ. 37,440 కోట్లకు చేరింది. దేశీ మొబైల్ సరీ్వసుల ఆదాయం 13 శాతంపైగా పుంజుకుని రూ. 26,375 కోట్లను తాకినట్లు కంపెనీ పేర్కొంది. ఈ కాలంలో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 183 నుంచి రూ. 200కు బలపడింది. రూ. 19,746 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించగా.. 52.7 శాతం ఇబిటా మార్జిన్లను సాధించింది. 4జీ యూజర్లు అప్ తాజా సమీక్షా కాలంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 56 లక్షల మంది 4జీ వినియోగదారులను జత చేసుకున్నట్లు భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ పేర్కొన్నారు. నాణ్యమైన కస్టమర్లపై దృష్టి సారించడం ద్వారా 0.8 మిలియన్ పోస్ట్పెయిడ్ వినియోగదారులను జత కలుపుకున్నట్లు తెలియజేశారు. దీంతో వీరి సంఖ్య దాదాపు 2.05 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. ఇక మొబైల్ డేటా వినియోగం 22 శాతం ఎగసి ఒక్కో కస్టమర్పై నెలకు 21.1 జీబీకి చేరినట్లు వివరించారు. ఫలితాల నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు బీఎస్ఈలో 0.7 శాతం క్షీణించి రూ. 872 వద్ద ముగిసింది.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
మళ్లీ హానీమూన్కి వెళ్లిన రకుల్.. అనసూయ స్మైలీ పోజులు
అమెరికా ‘సాంత ఫె’లో విహారయాత్ర !
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం!
IPL 2024: చెల్లెలు కాదు.. అక్క! ఈమెను గుర్తుపట్టారా?
తప్పుడు ఆరోపణలపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా
Watermelon Seeds Benefits: పుచ్చకాయ గింజల ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు
ప్రియాంక చోప్రా న్యూ లుక్! ఏకంగా 200 క్యారెట్ల డైమండ్ నెక్లెస్..
TG క్రేజ్ ..రవాణా శాఖకు ఒకే రోజు 40 లక్షల ఆదాయం
T20 WC: అఫ్గానిస్తాన్ బౌలింగ్ కన్సల్టెంట్గా డ్వేన్ బ్రావో..
‘రైసీ’ మృతి కేవలం ప్రమాదమే: అమెరికా
తప్పక చదవండి
- సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో కుదుపులు.. ఒకరు మృతి
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- ‘సీఎం రేసులో ఉన్నానని చెప్పేందుకు ఢిల్లీకి రూ.100 కోట్లు’
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- IPL 2024: ధోనిని అవమానించిన ఆర్సీబీ ప్లేయర్లు!.. తప్పు ‘తలా’దేనా?
- కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన.. ఎందుకంటే?
- Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
- కొన్ని గంటల్లోనే నిర్ణయం వెనక్కి తీసుకున్న బీఐఏఎల్
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement