-
కోలీవుడ్ స్టార్ హీరో మూవీ.. నిర్మించనున్న టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ!
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తన ప్రస్తుత 'విడాయమర్చి' చిత్రంతో నటిస్తున్నారు. ఇటీవలే అజర్బైజాన్లో మూవీ షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది. కొద్ది రోజుల క్రితమే అజిత్ ఇండియాకు చేరుకున్నారు. అయితే సీన్స్ కోసం టీమ్ మరోసారి అదే లొకేషన్కి వెళ్లినున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ల కోసం యూఏఈకి చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. అజిత్ తన 63వ చిత్రం కోసం మార్క్ ఆంటోనీ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో పని చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్పై తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు కోలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ను మైత్రీ మూవీ మేకర్స్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీనిపై నిర్మాత గోపీచంద్ మలినేని సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. -
రవితేజ సినిమాకు ఇలాంటి కష్టాలా.. నో ఛాన్స్
డాన్ శీను, బలుపు, క్రాక్ ఈ హిట్ సినిమాలన్నీ రవితేజ - గోపీచంద్ మలినేని కలయికలో వచ్చినవే... ఇంతటి క్రేజీ కాంబినేషన్లో మరో సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ ఆగుతారా..? అందుకే ఈ కాంబోపై భారీ అంచనాలు పెట్టుకున్నారు రవితేజ ఫ్యాన్స్.. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు, నటుడు సెల్వ రాఘవన్తోపాటు ఇందుజ రవిచంద్రన్ కీలక పాత్రల్ని పోషిస్తున్నారని కూడా మేకర్స్ ప్రకటించారు. కె.రాఘవేంద్రరావు ఈ సినిమాకు గౌరవ దర్శకత్వం వహిస్తే... ఆ సన్నివేశానికి దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్నిచ్చారు. ఇలా ఎంతో క్రేజీగా ప్రారంభం అయిన ఈ ప్రాజెక్ట్పై పలు రూమర్స్ వస్తున్నాయి. బడ్జెట్ కారణంగా ఈ సినిమా ఆగిపోయిందని ప్రచారం జరుగుతుంది. ఈ మూవీ బడ్జెట్ భారీగా పెరిగిపోతుందని.. ఈ విషయంలో మేకర్స్ మరోసారి లెక్కలు వేస్తున్నారట. మార్కెట్ లెక్కలకి, సినిమాకి అనుకున్న బడ్జట్కు మధ్య చాలా డిఫరెన్స్ ఉండడంతో ఈ ప్రాజెక్ట్ను తాత్కాలికంగా ఆపేయాలని చూస్తున్నారట. సమాజంలో జరిగిన నిజ జీవితాల సంఘటనలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుమారు రూ.100 కోట్ల బడ్జెట్ అవుతుందని టాక్. దీంతో రిస్క్ చేయడం ఎదుకని చిత్ర నిర్మాతలు ఆలోచిస్తున్నారట. ఈ ప్రచారంలో ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. రవితేజ ఇప్పటికే వరుసగా రెండు చిత్రాలు రూ. 100 కోట్ల కలెక్షన్స్ మార్క్ను దాటిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ లాంటి బిగ్ ప్రొడక్షన్ భాగస్వామ్యం కావడం విశేషం. ఇలాంటి క్రేజీ కాంబినేషన్ సినిమాకు మార్కెట్,బడ్జెట్ కష్టాలు అనేవి ఉండకపోవచ్చు. -
రష్మిక, శ్రీలీల ఔట్.. కృతి, సాక్షి ఇన్
క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అందుకే స్టార్ హీరోల సినిమాలకు ట్రెండింగ్ హీరోయిన్లను సెట్ చేయడానికి దర్శకులు ప్రయత్నిస్తుంటారు. కానీ ఒక్కోసారి అంతా ఫిక్స్ అయి.. సినిమా సెట్స్పైకి వెళ్లిన తర్వాత కూడా.. క్యాస్టింగ్ మార్పులు జరుగుతుంటాయి. దానికి ముఖ్య కారణం డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం. ముఖ్యంగా హీరోయిన్ డేట్స్ లాక్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు ఆ కష్టాలను యంగ్ డైరెక్టర్స్ గోపీచంద్ మలినేని, గౌతమ్ తిన్నానూరి పడుతున్నారు. వీర సింహారెడ్డి తర్వాత గోపీచంద్ మలినేని రవితేజతో పవర్ ఫుల్ మూవీ తెరకెక్కిస్తున్నాడు.ఇటీవలే ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. త్వరలో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. రవితేజకు జోడిగా రష్మిక పేరును ఆల్ మోస్ట్ ఫైనల్ చేశారు. అయితే షూటింగ్ ప్రారంభం అయ్యే నాటికి డేట్స్ ఇష్యూ వల్ల రష్మిక తప్పుకుంది. ఇప్పుడు రష్మిక స్థానంలో కృతి శెట్టి లేదా ప్రియాంక అరుల్ మోహన్ ఎంపిక చేయాలనుకుంటున్నాడు గోపీచంద్ మలినేని. ఇక జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్నానూరి ఇప్పుడు విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో ముందుగా టాలీవుడ్ హార్ట్ త్రోబ్ శ్రీలీలను అనుకున్నారు. కాని ఖుషి ఫ్లాప్ తో దేవరకొండ తన డేట్స్ మొత్తాన్ని ‘ఫ్యామిలీ స్టార్’ కు డైవర్ట్ చేయడంతో గౌతమ్ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. దాంతో శ్రీలీల ఇప్పుడు డేట్స్ లేవు అనే రీజన్ తో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. దర్శకుడు గౌతమ్ ఇప్పుడు శ్రీలీల స్థానంలో ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్యను ఎంపిక చేసేందుకు సంప్రదింపులు జరుపుతున్నాడట. -
#RT4GM: రవితేజ కొత్త చిత్రం ప్రారంభం (ఫోటోలు)
-
కొత్త క్యారెక్టర్కి క్లాప్
హీరో రవితేజ కెరీర్లో కొత్త చిత్రం ప్రారంభమైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి అన్మోల్ శర్మ కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత అల్లు అరవింద్ మేకర్స్కు స్క్రిప్ట్ను అందించారు. ‘‘ఒక పవర్ఫుల్ కథాంశంతో రూపొందించనున్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ చూడని ఒక కొత్త పాత్రలో ప్రేక్షకులు రవితేజను చూస్తారు’’ అని యూనిట్ పేర్కొంది. సెల్వ రాఘవన్, ఇందూజ రవి చంద్రన్ కీ రోల్స్ చేయనున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: జీకే విష్ణు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement