-
రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు చిత్రం
పెళ్లి తర్వాత డిఫరెంట్ కాన్సెప్టులకే ఓటేస్తోంది హన్సిక. అలా ఆమె ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్, హారర్ మూవీ 105 మినిట్స్. రాజు దుస్సా దర్శకత్వం వహించిన ఈ సినిమాను బొమ్మక్ శివ నిర్మించారు. ఈ మూవీ అంతా హన్సిక పాత్ర ఒక్కటే ఉండటం విశేషం. ఇందులో 34 నిమిషాల షాట్ను సింగిల్ టేక్లో పూర్తి చేసింది. అలా ఎన్నో పెద్ద సన్నివేశాల్లో కట్ చెప్పకుండా అలవోకగా నటించేసింది. రెండు నెలల తర్వాత ఓటీటీలో ఈ హారర్ మూవీ జనవరి 26న థియేటర్లలో విడుదలవగా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. రెండు నెలల తర్వాత 105 మినిట్స్ ఓటీటీలోకి వచ్చేసింది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్లో రిలీజైంది. కాకపోతే రెంట్ పద్ధతిలో అందుబాటులో ఉంది. వంద రూపాయలు కడితేనే ఈ సినిమా చూడొచ్చని కండీషన్ పెట్టింది. కథేంటంటే.. జాను (హన్సిక) కారులో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుంది. మార్గమధ్యంలో ఓ అదృశ్య శక్తి తనను వెంటాడుతున్నట్లు అనిపిస్తుంది. భయంగా ఇంటికి చేరగానే భారీ వర్షం కారణంగా కరెంట్ పోతుంది. కొవ్వొత్తి వెలిగించగానే ఏవేవో భయంకర శబ్దాలు వస్తుంటాయి. తనను వెంటాడిన శక్తి.. ఇంట్లోకి వచ్చి జానును ఇనుప గొలుసుతో బంధించి చిత్రహింసలు పెడుతుంది. తన మరణానికి నువ్వే కారణమంటూ.. అందుకే అనుభవించంటూ మేల్ వాయిస్తో భయపెడుతుంది. ఆ అదృశ్య శక్తి మరణానికి, జానుకు సంబంధం ఏంటి? ఆ శక్తి నుంచి జాను తప్పించుకుందా? లేదా? అనేది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే! చదవండి: చిరంజీవి, మోహన్బాబు మధ్య గొడవ.. వాళ్లకు ఎప్పుడూ అదే పని.. -
స్మశానంలో షూటింగ్.. హన్సిక హారర్ మూవీ రిలీజ్
వివాహానంతరం కథానాయకిగా బిజీగా ఉన్న కొద్దిమంది నటీమణుల్లో హన్సిక ఒకరు. ఈ బహుభాషా నటి యాక్ట్ చేసిన చిత్రాలు వరుసగా తెరపైకి వస్తున్నాయి. అలా తాజాగా హన్సిక నటించిన చిత్రం గార్డియన్. హారర్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో హన్సిక ఒక అందమైన యువతిగా, దెయ్యంగా ద్విపాత్రాభినయం చేసింది. ఫిలిం వర్క్స్ పతాకంపై విజయ్చందర్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శక ద్వయం శబరి, గురుశరవణన్ దర్శకత్వం వహించారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, కేఏ.శక్తివేల్ చాయాగ్రహణం అందించారు. ఈ మూవీ శుక్రవారం (మార్చి 8న) తెరపైకి వచ్చింది. అరణ్మణై 1, 2 చిత్రాల తరువాత హన్సిక నటించిన హారర్ మూవీ ఇది. హన్సిక తన అనుభవం గురించి మాట్లాడుతూ.. గార్డియన్ చిత్రంలో నటించడం సరికొత్త అనుభవంగా పేర్కొంది. ఈ చిత్రంలో దెయ్యం పాత్ర కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టి నటించినట్లు చెప్పింది. ఈ పాత్ర గెటప్ ప్రత్యేకంగా ఉంటుందని తెలిపింది. ఇందుకోసం స్పెషల్ లెన్స్ పెట్టినట్లు వెల్లడించింది. చిత్రంలోని కొన్ని సన్నివేశాలను స్మశానంలో అర్ధరాత్రి 12 గంటలకు చిత్రీకరించారని, అదీ తలకిందులుగా వేలాడుతూ దెయ్యంగా అరిచే సన్నివేశాల్లో నటించడం సవాలుగా మారిందని తెలిపింది ఆ సమయంలో దెయ్యం గెటప్లో ఉన్న తనను చూసి తానే భయపడ్డానని హన్సిక చెప్పుకొచ్చింది. వివాహానంతరం నటించడంలో తనకెలాంటి వ్యత్యాసం అనిపించడం లేదని హన్సిక పేర్కొన్నారు. తన తల్లి, భర్త చాలా మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. తర్వాత తాను నటిస్తున్న గాంధారి, ది మెన్ చిత్రాలు వరుసగా విడుదల కానున్నాయంది. -
హన్సిక హారర్ మూవీ.. సమ్మర్లో రిలీజ్!
గ్లామర్కు కేరాఫ్ అడ్రస్.. హన్సిక. ఆమె ఇప్పుడు గాంధారిగా మారి తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఆర్. కన్నన్ స్వీయ దర్శకత్వం వహించడంతోపాటు మసాలా పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈయన దర్శకత్వంలో, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన ది గ్రేట్ ఇండియన్ కిచెన్ చిత్రం విశేష ఆదరణ పొందింది. అదేవిధంగా ఇంతకు ముందు జయం కొండాన్, కండెన్ కాదలై, సేటై, ఈవెన్ తందిరన్, బిస్కోత్ వంటి పలు వైవిధ్యమైన కథా చిత్రాలను తెరకెక్కించారు. తాజాగా గాంధారి పేరుతో చిత్రాన్ని చేస్తున్నారు. ఇది ఆయన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కమర్షియల్ అంశాలతో కూడిన హారర్ నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుందని తాజాగా ఆయన వెల్లడించారు. ఇందులో పురావస్తు శాఖ అధికారిగా పనిచేసే యువతిగా హన్సిక నటిస్తున్నారని తెలిపారు. పురాతన కాలంలో ఓ రాజు నిర్మించిన గాంధర్వ కోటను పరిశోధించడానికి వెళ్లగా, అక్కడ ఆమెకు పలు ఆశ్చర్యకరమైన ఘటనలు ఎదురవుతాయన్నారు. ఇందులో హన్సిక పురావస్తు శాఖ అధికారిగా, ఓ ప్రాచీన తెగకు చెందిన యువతిగా దిపాత్రాభినయం చేస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రం కోసం చైన్నె సముద్ర తీరంలో రూ.60 లక్షల వ్యయంతో బ్రహ్మాండమైన కొండ ఇంటి సెట్ వేసి అందులో 1943 నాటి సన్నివేశాలను చిత్రీకరించినట్లు చెప్పారు. ఇందులో మెట్రో శిరీష్, మయిల్ సామి, తలైవాసల్ విజయ్, ఆడుగళం నరేన్, స్టంట్ సిల్వ, వినోదిని, పవన్ కుడివేలు మురుగన్, కలైరాణి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. చిత్రాన్ని సమ్మర్ స్పెషల్గా ఏప్రిల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆర్.కన్నన్ చెప్పారు. చదవండి: త్రిష,చిరంజీవి కేసు విషయంలో మన్సూర్ అలీఖాన్కు ఊరట -
ఈ ఫోటోతో వివాదంలో చిక్కుకున్న టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
అల్లు అర్జున్ దేశముదురు సినిమాతో తెలుగు సినిమాలకు ఎంట్రీ ఇచ్చిన హన్సిక.. యూత్ గుండెల్లో చెరగిపోని ముద్రే వేసింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. దీంతో ఎడా పెడా సినిమాలు చేయడం అవి పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో పూర్తిగా అవకాశాలు తగ్గాయి. ఈ మధ్యే మై నేమ్ ఈజ్ శృతి,105 మినిట్స్ సినిమాలతో మళ్లీ తెరపైకి కనిపించింది ఈ బ్యూటీ. తాజాగా హన్సిక చైల్డ్వుడ్ ఫోటో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. ముంబయికి చెందిన హన్సిక పలు హిందీ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. 2003లో రిలీజైన హృతిక్ రోషన్ 'కోయి మిల్ గయా'లో యాక్ట్ చేసింది. ఆ సమయంలోని ఫోటో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. కానీ ఈ ఫోటో వల్ల ఆమె కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. 2003లో చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్న హన్సిక కేవలం నాలుగేళ్ల గ్యాప్లో అంటే 2007లో దేశముదురు చిత్రంతో హీరోయిన్ అయిపోయింది. నాలుగేళ్ల గ్యాప్లో హన్సిక మార్పు చూసి, త్వరగా ఎదిగేందుకు ఆమె ఇంజెక్షన్స్ తీసుకుందని కొందరు కామెంట్స్ చేశారు. కానీ ఆ రూమర్స్ను ఆమె కొట్టిపారేసింది. కానీ తన అమ్మగారు చాలా బాధపడినట్లు ఆమె చెప్పుకొచ్చింది. దాదాపు 20 ఏళ్లుగా సినిమాలు చేస్తున్న హన్సిక రెండేళ్ల క్రితం ఓ బిజినెస్మ్యాన్ని పెళ్లి చేసుకొని లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. -
105 Minutes Movie Review: ‘105 మినిట్స్’ మూవీ రివ్యూ
టైటిల్: 105 మినిట్స్ నటీనటులు:హన్సిక నిర్మాత: బొమ్మక్ శివ దర్శకుడు: రాజుదుస్సా సంగీతం: సామ్ సి. ఎస్ సినిమాటోగ్రఫీ : కిషోర్ బోయిదాపు విడుదల తేది: జనవరి 26, 2024 కథేంటంటే.. ఒకే పాత్ర చుట్టూ తిరిగే కథ ఇది. జాను(హన్సిక) కారులో ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరుతుంది. మార్గ మధ్యలో ఓ అదృశ్య శక్తి తనను వెంటాడుతున్నట్లు కనిపిస్తుంది. దీంతో ఆందోళన చెందిన జాను..భయం భయంతో ఇంట్లోకి వెళ్తుంది. భారీ వర్షం కారణంగా ఇంట్లో కరెంట్ పోతుంది. కొవ్వొత్తి వెలిగించగానే కొన్ని భయానక శబ్దాలు వస్తుంటాయి. తనను వెంటాడిన అదృశ్య శక్తి .. ఇంట్లోకి వచ్చి ఇనుప గొలుసుతో జానును బంధించి చిత్ర హింసలు పెడుతుంది.మేల్ వాయిస్లో మధ్య మధ్యలో తన మరణానికి నువ్వే కారణమంటూ.. అందుకే ఇదంతా అనుభవించాలంటూ భయపెడతుంది. ఇంట్లో నుంచి పారిపోయేందుకు జాను ప్రయత్నించినా.. ఆ అదృశ్య శక్తి బయటకు పోనివ్వదు. మరి జాను ఆ అదృశ్య శక్తి నుంచి ఎలా బయటపడుతుంది? ఆ మేల్ వాయిస్ ఎవరిది? తన మరణానికి జాను ఏ విధంగా కారణమైంది? చివరకు ఏం జరిగింది అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఒక సినిమా తీయాలంటే నటీనటులు ఎంతో కీలకం. చాలా పాత్రలు ఉంటాయి. ప్రతి పాత్రకు డైలాగ్స్ ఉండాలి. పాటలు, కామెడీ ఇవన్నీ ఉండాలి. కానీ అలాంటివేమీ లేకుండా సింగిల్ క్యారెక్టర్తో సినిమా తీయడం అంటే కత్తిమీద సామే అని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఇలాంటి సినిమాను తీయాలంటే దర్శకుడికి చాలా ధైర్యం ఉండాలి. అలాంటిదీ చేసి చూపించారు దర్శకుడు రాజుదుస్సా. ఇలాంటి ప్రయోగం చేసిన దర్శక నిర్మాతలను అభినందించాల్సిందే. అయితే ఒక్క క్యారెక్టర్తో రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని థియేటర్లో కూర్చోబెట్టాలంటే.. బలమైన కథ, ఆసక్తికరమైన సన్నివేశాలు ఉండాలి. లేదంటే ప్రేక్షకుడు ఒక్క పాత్రనే చూస్తూ కుర్చిలో కూర్చోలేడు. 105 మినిట్స్లో అది మిస్సయింది. కాన్సెప్ట్ బాగున్నా.. దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో దర్శకుడు తడబడ్డాడు. ఒక కనిపించని మనిషి పంచభూతాలని గుప్పెట్లో పెట్టుకొని అమ్మాయిని ఏడిపించే ఆటే ఈ సినిమా కథ. చాలా ఆసక్తికరంగా కథను ప్రారంభించాడు దర్శకుడు. భారీ వర్షం.. ఉరుములు మెరుపులు.. కారులో హీరోయిన్.. సడెన్గా ఓ అదృశ్య శక్తి ప్రత్యేక్షం అవ్వడం.. ఇలాంటి భయపెట్టే సన్నివేశాలన్నీ ప్రారంభంలోనే చూపించాడు. హీరోయిన్ ఇంట్లోకి వెళ్లిన తర్వాత కథ ముందుకు సాగదు. జాను కాళ్లకు కట్టిన సంకెళ్లను విడిపించేందుకు ప్రయత్నించడం.. అదృశ్య శక్తి దాన్ని అడ్డుకోవడం.. ఇంటర్వెల్ వరకు ఇదే సీన్ రిపీట్ అవుతుంటుంది. సినిమా మొత్తం హీరోయిన్ ఏడుస్తూనే ఉంటుంది. ప్రతిసారి ఆత్మ బెదిరించడం.. హీరోయిన్ అక్కడ నుంచి వేరే చోటుకి మారిపోవడం ఇదే జరుగుతుంది. అసలు ఆ ఆత్మ ఎందుకు జానుని వేధిస్తుందో అనేది కూడా బలంగా చూపించలేకపోయారు. క్లైమాక్స్ కూడా ఆసక్తికరంగా ఉండడు. హన్సిక ఇంట్లో ఎందుకు ఇరుక్కుంది? ఆ ఆత్మ నేపథ్యం ఏంటి అనేది క్లారిటీగా చూపిస్తే బాగుండేది. చివర్లో ఒక్క డైలాగ్తో ప్రేక్షకుడే కథను అర్థం చేసుకునేలా చేశారు. సింగిల్ షాట్ మూవీ కాబట్టి ఇతర పాత్రలు, ఎలిమెంట్స్ తీసుకొచ్చే అవకాశం ఉండడు. ఉన్న ఒక్క పాత్ర చుట్టు అయినా ఆసక్తికరమైన సన్నివేశాలు రాస్తే బాగుండేది. కానీ పలు సవాళ్ల మధ్య ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రయోగం అయితే బాగుంది కానీ..అది మాత్ర పూర్తిగా ఫలించలేదనే చెప్పాలి. ఎవరెలా చేశారంటే.. జాను పాత్రకు హన్సిక పూర్తి న్యాయం చేసింది. ఆమెకు ఇది ఒక డిఫరెంట్ మూవీ. తొలిసారి ఇలాంటి క్యారెక్టర్ చేసి మెప్పించింది. అయితే అయితే కథలో బలం లేనప్పుడు నటీనటులు ఎంత చక్కటి నటనను కనబర్చిన అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. సాకేంతిక పరంగా సినిమా బాగుంది. సామ్ సి. ఎస్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. కథలో బలం లేకున్నా.. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల భయపెట్టాడు. సినిమాటోగ్రపీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
క్షమాపణలు చెప్పిన హన్సిక
-
'నా జీవితంలో ఇదొక అద్భుతమైన క్షణం'.. అల్లు అర్జున్ ట్వీట్ వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డ్ కూడా అందుకున్నారు. గంగోత్రి సినిమాతో కెరీర్ ప్రారంభించిన అల్లు అర్జున్ టాలీవుడ్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బన్నీ మూవీ సూపర్ హిట్ కావడంతో ప్రేక్షకుల గుండెల్లో బన్నీగా స్థిరపడిపోయారు. అనంతరం 2007లో అల్లు అర్జున్ దేశముదురు అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాలో హన్సిక మోత్వానీ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం రిలీజై సరిగ్గా నేటికి 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. దేశముదురు డైరెక్టర్ పూరి జగన్నాధ్, నిర్మాత డీవీవీ దానయ్యకు అభినందనలు తెలిపారు. అల్లు అర్జున్ తన ట్వీట్లో రాస్తూ.. 'దేశముదురు చిత్రం ఈ రోజుకు 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. నా జీవితంలో ఇదొక అద్భుతమైన క్షణం. డైరెక్టర్ పూరి జగన్నాధ్, నిర్మాత డీవీవీ దానయ్య, చిత్రబృందానికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నా కెరీర్లో చిరస్మరణీయమైన విజయం అందించిన నా అభిమానులకు, ప్రేక్షకులకు ఎప్పటికీ కృతజ్ఞతలు' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు బన్నీకి సైతం అభినందనలు చెబుతున్నారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. కాగా.. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిస్తోన్న పుష్ప-2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఐకాన్ స్టార్కు జోడీగా శ్రీవల్లి రష్మిక మందన్నా నటిస్తోంది. Celebrating 17 MASSive years of Icon Star @alluarjun's #Desamuduru 🤙🏻 Every dialogue and song from this film continues to send electrifying chills down our spine!#PuriJagannadh @ihansika #Chakri#17YearsForDesamuduru pic.twitter.com/AxxFJpo4Kd — DVV Entertainment (@DVVMovies) January 12, 2024 17 years of #Desamuduru Movie . What a beautiful moment in time . Thanks to my director @PuriConnects , my producer @DVVMovies and the entire cast & crew . Gratitude forever to my fans and audience for a memorable blessing 🙏🏽 — Allu Arjun (@alluarjun) January 12, 2024 -
పెళ్లైనా తగ్గేదేలే అంటోన్న స్టార్ హీరోయిన్.. ఏకంగా బికినీలో!
సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం అన్నది అందరికీ తెలిసిందే. ఇక్కడ ప్రతిభతో పాటు అందానికి కూడా అధిక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అందం అనేది చాలా ముఖ్యం. అందుకే చాలామంది హీరోయిన్లు తమ గ్లామర్ను కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. అందుకు తగిన ఆహారపు అలవాట్లతో పాటు కసరత్తు చేస్తుంటారు. అలాంటి హీరోయిన్లలో దేశముదురు భామ హన్సిక ఒకరు. 32 ఏళ్ల ఈ ముంబయి బ్యూటీ హిందీలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన కొన్ని చిత్రాలలో నటించారు. ఆ తరువాత పదహారేళ్ల ప్రాయంలోనే దేశముదురు అనే తెలుగు చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు ఆ తరువాత తమిళంలో ధనుష్ సరసన మాప్పిళ్లై చిత్రంతో మెప్పించారు. ఈ రెండు భాషల్లోనూ స్టార్ హీరోల సరసన నటించి పాపులర్ అయ్యారు. నటిగా అర్ధసెంచరీ కొట్టిన హన్సిక గతేడాది డిసెంబర్లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. సొహైల్ కుతురియాను పెళ్లాడినా ముద్దుగుమ్మ.. ఆ తర్వాత కూడా నటనకు మాత్రం దూరం కాలేదు. ఒక పక్క మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే సినిమాల్లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో 105 అనే తెలుగు చిత్రం, రౌడీ బేబీ, గార్డియన్, మెన్ అనే తమిళ చిత్రాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న హన్సిక ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లో ఉంటోంది. హీరోయిన్గా నటిస్తూ తన గ్లామర్పై ప్రత్యేక కసరత్తు చేస్తూ ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటోంది. తాజాగా తన భర్తతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లిన ముద్దుగుమ్మ ఫుల్గా చిల్ అవుతున్నారు. బికినీ దుస్తుల్లో ప్రత్యేకంగా ఫొటో షూట్ చేయించుకున్నారు. తాజాగా ఆమె ఫొటోలను తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. స్విమ్మింగ్ చేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
నెల రోజులకే ఓటీటీ రానున్న స్టార్ హీరోయిన్ క్రైమ్ థ్రిల్లర్!
గతేడాది ప్రియుడిని పెళ్లాడిన దేశముదురు ఫేమ్ హన్సిక మోత్వానీ ఇటీవలే మొదటి వివాహా వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంది. తన భర్త సోహెల్ కతూరియాతో కలిసి కేక్ కట్ చేసింది. అయితే పెళ్లయ్యాక పెద్దగా సినిమాల్లో కనిపించని హన్సిక.. ఇటీవలే మై నేమ్ ఈజ్ శృతి అనే చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీతో దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్లో కనిపించింది. క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకొచ్చింది. (ఇది చదవండి: ముంబైలో లగ్జరీ ఇల్లు, ఖరీదైన కార్లు.. రామ్ చరణ్ ఆస్తులెంతో తెలుసా?) స్కిన్ మాఫియా అనే కొత్త కాన్సెప్ట్తో దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతస్థాయిలో సక్సెస్ కాలేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రిలీజ్పై క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈనెల 17 నుంచే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే రిలీజ్ తేదీ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆ రోజే స్ట్రీమింగ్కు వస్తే రిలీజైన నెల రోజులకే ఓటీటీ ప్రేక్షకులను అందుబాటులోకి రానుంది. కాగా.. ఈ చిత్రంలో మురళీశర్మ, నరేన్, పూజా రామచంద్రన్ కీలక పాత్రలు పోషించారు. (ఇది చదవండి: బండ్ల గణేష్ డబ్బులు ఎగ్గొట్టాడు.. ఒక మనిషి చెప్పడంతో..: డైరెక్టర్) -
'16 ఏళ్లకే హార్మోన్ ఇంజెక్షన్స్.. నా గుండె పగిలిందన్న స్టార్ హీరోయిన్'
టాలీవుడ్లో దేశముదురు మూవీతో ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ హన్సిక మోత్వానీ. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన ఇటీవలే 'మై నేమ్ ఈజ్ శృతి' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో బురుగు రమ్య ప్రభాకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. స్కిన్ మాఫియా కాన్సెప్ట్తో తీసిన ఈ మూవీ నవంబర్ 17న థియేటర్లలో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషా చిత్రాల్లో నటించింది. దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన హన్సిక ఇటీవలే తన మొదటి వివాహా వార్షికోత్సవాన్ని జరుపుకుంది. తన భర్త సోహెల్ కతురియాలో వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది. అయితే హన్సిక సినీ కెరీర్ కంటే ఎక్కువగా వ్యక్తిగతంగానే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. అయితే గతంలో హన్సిక 16 ఏళ్ల వయసులోనే హార్మోన్ల ఇంజెక్షన్లు తీసుకుందని పెద్దఎత్తున వార్తలొచ్చాయి. ఈ వివాదంలో ఇప్పటి వరకు ఏదో ఓ సందర్భంలో చర్చ జరుగుతూనే ఉంది. హన్సిక తల్లి మోనా మోత్వానీ వృత్తిరీత్యా స్కిన్ స్పెషలిస్ట్ కావడంతో హన్సిక మరింత యంగ్గా కనిపించేందుకు ఆమెకు హార్మోన్ల ఇంజెక్షన్లు ఇచ్చిందని రూమర్స్ వచ్చాయి. అయితే ఈ విషయంపై హన్సిక చాలాసార్లు వివరణ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన హన్సిక మరోసారి ఈ వివాదంపై నోరు విప్పింది. అయితే హన్సికకు హార్మోన్ల ఇంజెక్షన్లు ఇచ్చానన్న వార్తలను ఆమె తల్లి మోనా మోత్వానీ కొట్టిపారేశారు. హన్సిక మాట్లాడుతూ.. 'ఇలాంటి వార్తలు మా అమ్మను బాధపెట్టినంతగా నన్ను బాధించలేదు. ఎందుకంటే ఈ వార్తలు పూర్తిగా తప్పు ప్రచారమే. నాపై వచ్చినవన్నీ రూమర్స్. దానికి మా అమ్మ చాలా బాధపడింది. అమ్మ పరిస్థితిని చూసి మేమే ఏడ్చాం. ఇలాంటివి వార్తలు మా కుటుంబ సభ్యులు ఎప్పుడు వినలేదు. ఇలాంటి పుకార్లు నా హృదయాన్ని విచ్ఛిన్నం చేశాయి. సోషల్ మీడియాలో ఎవరికైనా ఏదైనా చెప్పే స్వేచ్ఛ ఉంది. కానీ ఒకరి వ్యక్తిగత జీవితం ఎలా పడితే అలా రాయమని చెప్పలేదు కదా.' అని అన్నారు. కాగా.. డిసెంబర్ 2, 2022న ప్రియుడు సోహైల్ కతురియాను హన్సిక వివాహం చేసుకుంది. జైపూర్లోని జరిగిన వీరి పెళ్లికి కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. -
‘మై నేమ్ ఈజ్ శృతి’ మూవీ రివ్యూ
టైటిల్: మై నేమ్ ఈజ్ శృతి నటీనటులు:హన్సిక, ఆడుక్కాలమ్ నరేన్, రాజా రవీంద్ర, మురళీ శర్మ, ఆర్ నారాయణ్, జయప్రకాష్, వినోదిని, సాయి తేజ్, పూజా రామచంద్రన్, తదితరులు నిర్మాత:బురుగు రమ్య ప్రభాకర్ దర్శకత్వం: శ్రీనివాస్ ఓంకార్ సంగీతం: మార్క్ కె రాబిన్ ఎడిటర్ : చోటా కే ప్రసాద్ విడుదల తేది: నవంబర్ 17, 2023 కథేంటంటే.. శృతి(హన్సిక) ఓ యాడ్ ఏజెన్సీలో పని చేస్తుంది. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో అమ్మ పెంపకంలో పెరిగి పెద్దదవుతుంది. సోషల్ మీడియా ద్వారా చరణ్(సాయి తేజ)తో ప్రేమలో పడుతుంది. అతన్ని కలిసేందుకు హైదరాబాద్ వెళ్లిన శృతి..అనుకోకుండా స్కిన్ మాఫీయా ముఠా వలలో చిక్కుకుంటుంది. ఆ ముఠా లీడర్, ఎమ్మెల్యే గురుమూర్తి(నరేన్) చేసే అరచకాలన్నీ శృతికి తెలుస్తాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? శృతిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? పోలీసు అధికారి రంజిత్(మురళీ శర్మ) ఈ కేసును ఎలా విచారించాడు? స్కిన్ మాఫీయా వెనుక ఉన్నదెవరు? ఎమ్మెల్యే గురుమూర్తికి, స్కిన్ స్పెషలిస్ట్ కిరణ్మయి(ప్రేమ)కు ఉన్న సంబంధం ఏంటి? స్కిన్ మాఫియా ముఠాను అరికట్టేందుకు శృతి చేసిన పోరాటం ఏంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. మెడికల్ మాఫియా నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కొంతమంది డబ్బు కోసం గుండె, కిడ్నీ లాంటి అవయవాలతో ఎలాంటి వ్యాపారం చేస్తారో చాలా సినిమాల్లో చూశాం. అందం కోసం పిండాలను అమ్మేసే మాఫియా ఉందని ‘యశోద’ చిత్రం ద్వారా తెలుసుకున్నాం. కానీ స్కిన్ డ్రాప్టింగ్ మాఫియా నేపథ్యంలో మాత్రం ఇంతవరకు ఏ సినిమా రాలేదు. ఆ సరికొత్త కాన్సెప్ట్తో తెరకెక్కిన చిత్రమే `మై నేమ్ ఈజ్ శృతి`. చర్మంతో కూడా వ్యాపారం చేస్తున్నారనే కొత్త అంశాన్ని ప్రేక్షకులను తెలియజేశాడు దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికే.. తెరపై అంతే కొత్తగా చూపించడంలో మాత్రం కాస్త తడబడ్డాడు. స్కిన్ డ్రాప్టింగ్ అంశంతోనే కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు. మర్డర్ని రివీల్ చేసి చేసి.. అందులోని ట్విస్ట్ను సస్పెన్స్లో పెట్టాడు. ముందు, వెనుక అంటూ ఫస్టాఫ్ అంతా సస్పెన్స్గానే సాగుతుంది. అయితే ప్రతిసారి కథ ముందుకు, వెనక్కు వెళ్లడంతో ప్రేక్షకుడు పూర్తిగా కథలో లీనం కాలేడు. కానీ ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీని మాత్రం కొనసాగిస్తూ సెకండాఫ్పై ఆసక్తిని కలిగించేలా ఫస్టాఫ్ సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. ఫస్టాఫ్లోని పలు ప్రశ్నలకు సెకండాఫ్లో సమాధానం దొరుకుతుంది. స్కిన్ మాఫియాకి, శృతికి ఉన్న సంబంధం, స్కామ్ని బయట పెట్టేందుకు శృతి వేసే ప్లాన్.. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు థ్రిలింగ్గా ఉంటాయి. అయితే కొన్ని సన్నివేశాలు వాస్తవానికి దూరంగా.. సినిమాటిక్గా అనిపిస్తాయి. స్కిన్ మాఫియా గురించి మరింత లోతుగా చర్చించి, స్క్రీన్ప్లే మరింత గ్రిప్పింగ్గా తీసుకెళ్తే బాగుండేది. ఎవరెలా చేశారంటే.. శృతి పాత్రకి హన్సిక న్యాయం చేసింది. అమాయకంగా కనిపిస్తూనే..ముఖంతోనే అనేక భావోద్వేగాలను పలికించి ఆకట్టుకుంది. ఎమోషన్తో పాటు యాక్షన్ సీన్లలో కూడా ఆకట్టుకుంది. విలన్గా పూజా రామచంద్రన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. డబ్బుకోసం ఎంతకైనా తెగించే యువతి పాత్ర తనది. ఇక అలనాటి హీరోయిన్ ప్రేమ ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న స్కిన్ స్పెషలిస్ట్ కిరణ్మయి పాత్రలో నటించి, మెప్పించింది. అయితే ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉంటుంది. నరేన్, మురళీ శర్మ, ప్రవీణ్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతిక పరంగా ఈ సినిమా పర్వాలేదు. మార్క్ కె రాబిన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాల పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
మై నేమ్ ఈజ్ శృతి ఆలోచింపజేస్తుంది
‘‘ప్రేక్షకులు థ్రిల్లర్ చిత్రాలను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. స్కిన్ (చర్మం) మాఫియా ముప్పును చూపించే డార్క్ థ్రిల్లర్ చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. ఈ నేపథ్యంలో ఓ మూవీ చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చడమే కాదు.. ఆలోచింపజేస్తుందని నమ్మకంగా చెప్పగలను’’ అని హీరోయిన్ హన్సిక మోత్వాని అన్నారు. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో హన్సిక మోత్వాని లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బూరుగు రమ్య ప్రభాకర్ నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హన్సిక మోత్వాని మాట్లాడుతూ.... ► మా అమ్మ డెర్మటాలజిస్ట్(చర్మ వైద్య నిపుణురాలు). ‘మై నేమ్ ఈజ్ శృతి’ సమయంలో నిజంగా స్కిన్ మాఫియా ఉందా? అని అమ్మను అడిగాను. ‘ఇలాంటి ఘటన ఎక్కడో జరిగినట్లు చదివాను’ అని చెప్పింది అమ్మ. ఈ మాఫియా ద్వారా సామాన్యుడి జీవితంలో చీకటి వ్యాపిస్తుంది. ఈ సినిమా కోసం శ్రీనివాస్ ఓంకార్ పరిశోధన చేస్తున్న సమయంలో కొన్ని అనుకోని సంఘటనలను ఎదుర్కొన్నారు. ఇటువంటి సున్నితమైన అంశాన్ని టచ్ చేస్తూ.. సినిమా చేయడం సవాలుతో కూడుకున్న అంశం. ఊహించని ట్విస్ట్లతో చూస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ మూవీ థ్రిల్ ఇస్తుంది. ఇలాంటి థ్రిల్లర్ స్పేస్లో భాగమైనందుకు చాలా సంతోషంగా అనిపించింది. ►ఈ సినిమాలో నా పాత్ర పేరు శృతి. ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఎలాంటి అడ్డంకులు వచ్చినా వాటిని దాటుకుంటూ వెళ్తుంది. ఓ యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్న శృతి స్కిన్ మాఫియా ట్రాప్లో పడుతుంది. ఆ మాఫియా నుంచి తను ఎలా బయటపడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్రతి కుటుంబాన్ని ఈ చిత్ర కథ కదిలిస్తుంది. కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతుంది. రమ్యగారు ఈ సినిమాని ఎంతో ఫ్యాషన్తో తీశారు. మార్క్ కె.రాబిన్ నేపథ్య సంగీతం సినిమాకి హైలెట్గా ఉంటుంది. ►2019లో వచ్చిన ‘తెనాలి రామకృష్ణ’ సినిమా తర్వాత నేను నటించిన తెలుగు చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. దాదాపు నాలుగేళ్లు గ్యాప్ వచ్చింది. అయితే తమిళ చిత్రాలతో చాలా బిజీగా ఉండటం వల్లే తెలుగులో గ్యాప్ వచ్చింది. ఒక నటిగా సంతృప్తి చెందలేదు.. ఇంకా ఎన్నో గొప్ప పాత్రలు చేయాలని ఉంది. నా కెరీర్ ప్రారంభంలో అల్లు అర్జున్, ప్రభాస్ వంటి వారితో కలిసి పనిచేసినందుకు గర్వపడుతున్నాను. వారి సినిమాలిప్పుడు సరిహద్దులను చెరిపిస్తూ పాన్ ఇండియా రేంజ్కి చేరుకున్నాయి. వారి కష్టానికి ఆ గుర్తింపు వచ్చిందని నేను భావిస్తాను. ఎంత పెద్ద స్టార్స్ అయినప్పటికీ ఎప్పటిలాగే వినయంగా ఉండటం వారి గొప్పతనానికి నిదర్శనం. అల్లు అర్జున్కి జాతీయ అవార్డు వచ్చినప్పుడు అభినందనలు తెలిపాను. -
Hansika Motwani First Diwali Celebrations: భర్తతో పండగ చేసుకున్న హన్సిక.. ఎంత పద్ధతిగా ఉందో (ఫోటోలు)
-
'పెళ్లి తర్వాత అదొక్కటే మారింది'.. హన్సిక ఆసక్తికర కామెంట్స్!
దేశముదురు భామ, హీరోయిన్ హన్సిక ప్రస్తుతం మై నేమ్ ఈజ్ శృతి అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. పెళ్లి తర్వాత సినిమాలతో బిజీ అయిపోయిన ముద్దుగుమ్మ. ఇటీవలే మై 3 అనే వెబ్ సిరీస్తో ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్ హాట్స్టార్లో స్ట్రీమీంగ్ అవుతూ విశేష ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం తమిళంలో నటిస్తున్న గార్డియన్, తెలుగులో నటిస్తున్న మై నేమ్ ఈజ్ శృతీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తన ప్రియుడితో పెళ్లి తర్వాత హన్సిక వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. తాజాగా మై నేమ్ ఈజ్ శృతీ ప్రమోషన్లలో పాల్గొన్న హన్సిక పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. పెళ్లి తర్వాత తన జీవితంలో పెద్దగా మార్పులు ఏం రాలేదని చెప్పుకొచ్చింది. హన్సిక మాట్లాడుతూ.. ' సోహైల్తో పెళ్లయ్యాకం నా లైఫ్ పెద్దగా ఏం మారలేదు. సినిమా షూటింగ్ సమయంలో క్యారెక్టర్లో ఉంటాను. ఇంటికెళ్లాక నా భర్తతో ఎక్కువ టైం కేటాయిస్తాను. అలాగే పెళ్లి తర్వాత కేవలం నా అడ్రస్ మాత్రమే మారింది. అంతే తప్ప నా ఇంటి పేరులో ఎలాంటి మార్పులేదు. హన్సిక మోత్వానీ అనే గుర్తింపు కోసం చాలా కష్టపడ్డా. అందుకే ఇంటి పేరును అలాగే ఉంచా.' అంటూ వివరించింది. 'మై నేమ్ ఈజ్ శ్రుతి అనే చిత్రం మాఫియా బ్యాక్డ్రాప్లో శ్రీనివాస్ ఓంకార్ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించారు. ఈ చిత్రంలో మురళీశర్మ, నరేన్, జయప్రకాష్, సీవీఎల్ నరసింహారావు ముఖ్యపాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నవంబర్ 17న రిలీజ్ చేయనున్నారు. -
ఓటీటీలో దూసుకుపోతున్న హన్సిక మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హీరోయిన్ హన్సికకు అందం అలంకారం అయితే చిరునవ్వు అదనపు ఆకర్షణ. ఈమె నటన గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 50కు పైగా చిత్రాల్లో నటించి తన అభినయంతో ప్రేక్షకుల ఆదరణను గెలుచుకుందీ బ్యూటీ. వివాహానంతరం కూడా చెక్కు చెదరని అందాలతో తగ్గని ఆదరణతో, పెరుగుతున్న అవకాశాలతో పుల్ జోష్లో ఉందీ అమ్మడు. తాజాగా తమిళంలో నటిస్తున్న గార్డియన్ చిత్రం టీజర్, తెలుగులో నటిస్తున్న మై నేమ్ ఈజ్ శృతీ చిత్రం టీజర్ ఒకేసారి విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. విభిన్న కథలతో రూపొందుతున్న ఈ రెండు చిత్రాలపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈమె బహుభాషా నటిగా నిరూపించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ తమిళం, తెలుగు భాషల్లో బిజీగా చిత్రాలు చేస్తున్నారు. అంతే కాకుండా వెబ్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చిన హన్సిక హిందీలో మై 3 అనే వెబ్ సిరీస్లో నటించారు. ఈ సిరీస్ హాట్స్టార్లో స్ట్రీమీంగ్ అవుతూ విశేష ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా హన్సిక మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ప్రేక్షకుల ఆదరాభిమానాలతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు. గార్డియన్, మై నేమ్ ఈజ్ శృతీ చిత్రాలు తనకు చాలా ప్రత్యేకమైనవి అన్నారు. కాగా ప్రస్తుతం తెలుగులో 105 నిమిడంగళ్, తమిళంలో మ్యాన్ చిత్రాల్లో నటిస్తున్నారు. కాగా 2024 తనకు చాలా స్పెషల్ అని ఈ బ్యూటీ పేర్కొంది. చదవండి: అమర్ దీప్కు షాకిచ్చిన బిగ్ బాస్.. తెలియకుండానే ఏడ్చాను అంటూ.. -
భయపెట్టేందుకు రెడీగా ఉన్న గ్లామర్ బ్యూటీ
ఇప్పటివరకు హీరోలకే పెళ్లి, వయసుతో పనిలేదు అనుకొనే వాళ్లం. ఇప్పుడు హీరోయిన్లూ ఆ కోవలోకి చేరిపోతున్నారు. పెళ్లయితే గ్లామర్ పోతుంది, హీరోయిన్ అవకాశాలు రావు అనే కాలం పోయింది. పిల్లలకు తల్లిలు అయిన తర్వాత కూడా ఈ కాలం నటీమణులు హీరోయిన్లుగా నటిస్తూనే ఉన్నారు. నటి కాజల్ అగర్వాల్, నయనతార వంటి వాళ్లను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఇక మరో అందాల తార హన్సిక గురించి చెప్పాలంటే ఇటీవలే పెళ్లి చేసుకున్నా అందాల ఆరబోతలో తగ్గేదెలే అంటోంది. నటిగా ఈమె వయసు 20 ఏళ్లు. 2003లో దేశముదురు అనే తెలుగు చిత్రంతో దక్షిణాదిలో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళం తదితర భాషల్లో నటిస్తూ నేటికీ బిజీ కథానాయకిగా రాణిస్తున్నారు. ఇటీవలే నటిగా అర్ధ సెంచరీ కొట్టిన హన్సిక హీరోయిన్గా ఇంకా పరుగులు తీస్తూనే ఉంది. ప్రస్తుతం తెలుగు, తమిళం భాషల్లో నాలుగు ఐదు చిత్రాలు ఈ భామ చేతిలో ఉన్నాయి. ముఖ్యంగా తమిళంలో గార్డియన్ అనే హారర్ర్ చిత్రంలో దెయ్యంగా భయపెట్టోందుకు సిద్ధమవుతోంది. ఇది లేడీ ఓరియంటెడ్ కథా చిత్రం కావడం గమనార్హం. దర్శకుడు విజయ్ చందర్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా ఇప్పటివరకు హన్సికలోని గ్లామర్ను చూసిన ప్రేక్షకులకు ఆమెలోని మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఈ గార్డియన్ రాబోతుంది. నటుడు సురేష్ మీనన్, శ్రీమాన్, మొట్టై రాజేంద్రన్, ప్రదీప్ రాయన్, తంగదురై ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శబరి, గురుశరవణన్ ద్వయం దర్శకత్వం వహించారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్కు మంచి స్పందన వస్తోంది. నవంబర్ 30న తమళ్,తెలుగు భాషలలో గార్డియన్ చిత్రం విడుదల కానుంది. -
పెళ్లి తర్వాత కూడా తగ్గేదే లేదంటున్న క్రేజీ బ్యూటీ
పెళ్లి తర్వాత కూడా బిజీగా ఉన్నా అతి కొద్దిమంది హీరోయిన్లలలో హన్సికా మోత్వాని ఒకరు. ఈ ముంబై బ్యూటీ కథానాయకిగా ఎక్కువ పేరు, డబ్బు గడిచింది మాత్రం తెలుగు, తమిళం భాషా చిత్రాలతోనే. టాలీవుడ్లో దేశముదురు చిత్రంతో బ్లాక్బస్టర్ కొట్టింది. మాప్పిళై చిత్రంతో తమిళంలోనూ కథానాయకిగా రంగ ప్రవేశం చేసి అక్కడ కూడా హిట్ కొట్టింది హన్సిక. సౌత్లో ఈ రెండు భాషల్లోనూ గట్టి పునాదినే వేసుకుంది. ముఖ్యంగా తమిళంలో ధనుష్, విజయ్, సూర్య, శింబు స్టార్ హీరోల సరసన గుర్తింపు తెచ్చుకుంది. అన్ని భాషల్లోనూ కలిపి 50 చిత్రాల మైలురాయిని అధిగమించిన హన్సిక గత ఏడాది పెళ్లి కూడా చేసుకుంది. అయినప్పటికీ ఈ బ్యూటీ నటనకు దూరం కాలేదు. ఇంకా చెప్పాలంటే అంతకుమించి అందాలను మెరుగు పరచుకోవడంపై ఏమాత్రం అశ్రద్ధ వహించడం లేదు. మొదట్లో కొంచెం బొద్దుగా ఉండి జూనియర్ కుష్బూగా ముద్ర వేసుకున్న హన్సిక ఆ తర్వాత చాలా స్లిమ్గా తయారైంది. ఇప్పటికీ ఈ అమ్మడు జిమ్లోనే ఎక్కువ సమయం గడుపుతుందట. అందాన్ని కాపాడుకోవడానికి తలకిందులుగా వర్కౌట్స్ చేస్తోంది. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. అది ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కాగా హన్సిక చేతిలో ఇప్పటికీ తెలుగులో 4, తమిళంలో 4 చేస్తూ బిజీగా ఉంది. ఇక ఎప్పుడూ అభిమానులకు టచ్లో ఉండే విషయంలోనూ తగ్గేదేలే అంటోంది. తరచూ తన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ వారిని అలరిస్తోంది. View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
హన్సిక సంగతేంటి నెల్సన్..?
రజనీకాంత్ కథానాయకుడిగా జైలర్ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై వసూళ్ల వర్షం కురుస్తోంది. దీంతో ఈ చిత్ర దర్శకుడు నెల్సన్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నయనతార ప్రధాన పాత్ర పోషించిన కోలమావు కోకిల చిత్రంతో దర్శకుడిగా ఈయన పేరు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత శివకార్తికేయన్ హీరోగా డాక్టర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం అనూహ్య విజయంతో రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. దాని తర్వాత విజయ్ కథానాయకుడిగా బీస్ట్ చిత్రానికి దర్శకత్వం వహించారు. మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం కూడా రూ.200 కోట్లు వసూలు చేసింది. అసలు విషయం ఏమిటంటే ఈయన వీటన్నిటికంటే ముందుగా శింబు కథానాయకుడిగా వేట్టై మన్నన్ అని చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. నటి హన్సిక నాయకిగా నటించిన ఈ చిత్రం కొంత భాగం షూటింగులు జరుపుకొని ఆ తర్వాత అనివార్య కారణాలతో ఆగిపోయింది. కాగా జైలర్ చిత్ర విజయం ఇచ్చిన ఉత్సాహంతో దర్శకుడు నెల్సన్ తన తొలి చిత్రం వేట్టై మన్నన్ను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై నటుడు శింబు దర్శకుడు నెల్సన్తో సంప్రదించినట్లు తెలిసింది. ఇదే కనుక నిజమైతే ఈ చిత్రం కథానాయకి హన్సిక సంగతి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. (ఇదీ చదవండి: ' చావును దగ్గరి నుంచి చూశా'.. విశాల్ కామెంట్స్ వైరల్!) శింబు హన్సికల ప్రేమ వ్యవహారం తెలిసిందే. పెళ్లి చేసుకునే వరకు వెళ్లిన వీరి ప్రేమ చివరిలో ఆగిపోయింది. ఆ తర్వాత హన్సిక కథానాయకిగా ప్రధాన పాత్రలో నటించిన ఆమె 50వ చిత్రం మహాలో శింబు అతిథి పాత్రలో నటించారు. అదేవిధంగా వేట్టై మన్నన్ చిత్రాన్ని ఈ జంట కలిసి పూర్తి చేస్తారా అన్నదే ప్రశ్న. ఇదిలా ఉండగా దర్శకుడు నెల్సన్ తదుపరి ధనుష్ కథానాయకుడిగా చిత్రం చేయనున్నారనే ప్రచారం మరో పక్క జరుగుతోంది. దీంతో ఆయన తదుపరి చిత్రం ఏమిటన్నది క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
జిమ్లో అన్వేషి.. వర్షంలో కృతి శెట్టి ఫోజులు
► నీతోనే డ్యాన్స్ అంటూ పొట్టి గౌన్లో రచ్చ చేస్తున్న శ్రీముఖి ► డిస్నీ ల్యాండ్లో ఎంజాయ్ చేస్తున్న హన్సిక మోత్వానీ ► ఫుల్ వర్షంలో సూపర్బ్ ఫోటోలను షేర్ చేసిన కృతి శెట్టి ► జిమ్లో వర్కౌట్స్ సెల్ఫీలతో అన్వేషి జైన్ ► కలర్ఫుల్ డ్రెస్ మెరిసిపోతున్న జాన్వీ కపూర్ ► అదిరిపోయే ఫోజులతో అందరి మనసుదోచే ఫోటోలు షేర్ చేసిన సోనాలి బింద్రే View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by sitara 🍓 (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Sanjay Dutt (@duttsanjay) View this post on Instagram A post shared by Dimple Hayathi (@dimplehayathi) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Nikita Dutta 🦄 (@nikifying) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
గ్లామర్ స్టిల్స్తో అలజడి రేపుతున్న హన్సిక (ఫోటోలు)
-
టచ్ చేసేందుకు ఒప్పుకోలేదు.. హీరోయిన్ తీరుపై నటుడు కామెంట్స్!
ప్రియుడితో పెళ్లి తర్వాత హీరోయిన్ హన్సిక మోత్వానీ నటిస్తోన్న చిత్రం 'పార్ట్నర్'. తమిళంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఆది హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రోబో శంకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. చెన్నైలో నిర్వహించిన ఈవెంట్లో రోబో శంకర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. (ఇది చదవండి: ఈ ఏడాది ఆస్కార్ బరిలో.. ఆ చిత్రంపైనే భారీ అంచనాలు!) అయితే ఈవెంట్లో నటుడు రోబో శంకర్ వివాదస్పద కామెంట్స్ చేశారు. హన్సిక మోత్వానీ తీరుపై విమర్శలు గుప్పించారు. ఈ మూవీ షూటింగ్లో హన్సిక తన కాలును తాకేందుకు నిరాకరించిందని ఆరోపించారు. దర్శకుడు ఆమెను ఎంత బతిమాలిని ఒప్పుకోలేదని.. ఆమె తీరు అందరికీ ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. దీంతో రోబో శంకర్ చేసిన కామెంట్స్ వివాదస్పదమయ్యాయి. దీంతో రోబో శంకర్ చేసిన కామెంట్స్పై ఈవెంట్కు హాజరైన మీడియా ప్రతినిధులు మండిపడ్డారు. రోబో శంకర్కు మర్యాద, వృత్తి నైపుణ్యం లేవంటూ ఓ మహిళ జర్నలిస్ట్ ఆయన ప్రవర్తనను తప్పబట్టారు. అయితే రోబో శంకర్ ఆరోగ్యం బాగోలేదని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. అతనికి జాండిస్ నిర్ధారణ అయిందని.. అందుకోసం చికిత్స పొందుతున్నాడని రోబో శంకర్ భార్య వెల్లడించారు. ప్రస్తుతం ఆయన మానసికి పరిస్థితి బాగాలేదని ఆమె అన్నారు. (ఇది చదవండి: గతేడాదే బ్రేకప్.. మాజీ లవర్తో మళ్లీ కనిపించిన హీరోయిన్! ) -
ఇండస్ట్రీలో అదంతా గ్యాంబ్లింగ్, నేనేమీ పట్టించుకోను: హన్సిక
పైళ్లె ఏడు నెలలే అయ్యింది. ఒక పక్క వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే మరో పక్క హీరోయిన్గా బిజీగా ఉంది హన్సిక. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ కథానాయికగా అర్ధ సెంచరీ దాటేసింది. కాగా హన్సిక హీరో ఆదిపినిశెట్టితో కలిసి నటించిన పార్ట్నర్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి చైన్నెకి వచ్చిన ఈ ముంబై బ్యూటీ ఆదివారం మీడియాతో ముచ్చటించారు. ఆమె మాట్లాడుతూ వివాహ జీవితం చాలా హ్యాపీగా సాగుతోందని, నట జీవితానికి తన భర్త ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారని చెప్పింది. తన తల్లి అంతకుమించి అండగా ఉంటున్నారని పేర్కొంది. తనకు నటించడం చాలా ఇష్టమని చెప్పిన ఆమె నటిగా చాలా డ్రీమ్స్ ఉన్నాయంది. అయితే లక్ష్యం అంటూ ఏమీలేదని మంచి నటిగా అందరి మనసుల్లో నిలిచిపోవాలన్నదే తన ఆశ అని చెప్పుకొచ్చింది. పలు భాషల్లో 50కి పైగా చిత్రాల్లో నటించడం ఆనందంగా ఉందని తెలిపింది. ఆ అనుభవం చాలా నేర్పిందని పేర్కొంది. 50వ చిత్రం మహాలో కథానాయిక ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించడంతో ఆ తరహా పాత్రలోనే నటించాలని కోరుకోవడం లేదని, పాత్ర నచ్చితే ఎలాంటి చిత్రంలోనైనా నటించడానికి రెడీ అంది. ఇండస్ట్రీలో జయాపజయాలు అన్నవి గ్యాంబ్లింగ్ అని.. సీనియర్ దర్శకులైనా, వర్ధమాన దర్శకులైనా కథ నచ్చితే నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించింది. పార్ట్నర్ చిత్రంలో పురుషుడిగా మారే పాత్రను పోషించానని, ఇది పూర్తిగా విలువైన కథా చిత్రంగా ఉంటుందని తెలిపింది. తాను ఎప్పుడు చాలా జాలీగా ఉంటానని, అందుకే ఈ సినిమాలో నటించానని చెప్పుకొచ్చింది. మీరు నిజజీవితంలో ఎవరుగా మారాలనుకుంటున్నారన్న ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్గా మారాలని కోరుకుంటానంది. భవిష్యత్తులో చిత్ర నిర్మాణం చేపట్టే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు అందుకు అవకాశమే లేదని, అదేవిధంగా దర్శకత్వం వహించే ఆలోచన కూడా లేదని స్పష్టం చేసింది. నటిగా చాలా హ్యాపీగా ఉన్నట్లు హన్సిక పేర్కొంది. చదవండి: రూ.20 కోట్లతో ఇల్లు కొన్న హీరోయిన్ -
బొద్దుగా ఉండే హన్సిక ఇప్పుడెలా అయిందో చూడండి (ఫోటోలు)
-
పెళ్లి తర్వాత బాగా సన్నబడిన హన్సిక.. లేటెస్ట్ ఫిక్స్ వైరల్
తమిళసినిమా: అందమైన నటీమణులకు బరువు అనేది పెద్ద భారం అనే చెప్పాలి. ఎందుకంటే బరువు పెరగడంతో దాన్ని తగ్గించుకోవడానికి నానా కష్టాలు పడాల్సి ఉంటుంది. నటి అనుష్క వంటి వారికి ఇది కష్ట సాధ్యంగానే మారిందని చెప్పక తప్పదు. అయితే మరో బ్యూటీ హన్సిక మాత్రం బరువు తగ్గడం అనేదాన్ని సుసాధ్యం చేసుకున్నారు. ఇదే ఇప్పుడు సినీ వర్గాల్లో టాపిక్గా మారింది. ముంబయి భామ హన్సిక బాల నటిగా హిందీలో కొన్ని చిత్రాలు చేశారు. ఆ తర్వాత దేశముదురు చిత్రం ద్వారా టాలీవుడ్కు పరిచయం అయ్యారు. ఇక కోలీవుడ్లో ధనుష్ సరసన మాప్పిళై చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా ఇక్కడ వరుసగా అవకాశాలు వరించాయి. విజయ్కు జంటగా వేలాయుధం, సూర్య సరసన సింగం 2, శింబుతో వాలు, జయంరవికి జంటగా రోమియో జూలియట్, కార్తీ సరసన బిరియానీ ఇలా ఇక్కడ స్టార్ నటులతో నటించినా హన్సిక తెలుగులోనూ జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి పలువురు హీరోలతో నటించి పాపులర్ అయ్యారు. హిందీ, మలయాళం భాషలతో కలిసి అర్ధ సెంచరీ దాటేశారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతుల్లో పలు చిత్రాలు ఉన్నాయి. కాగా మొదట్లో కాస్త బొద్దుగా ఉండడంతో ఈమెను చిన్న కుష్బూ అని పిలిచేవారు. అయితే ఇటీవల బరువు తగ్గి నాజుగ్గా తయారయ్యారు. యోగా దినోత్సవం సందర్భంగా తను యోగాసనాలు చేస్తున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. బాగా స్లిమ్గా ఉండడంతో హన్సిక సన్నబడడానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు అనే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వాటిపై స్పందించిన హన్సిక తాను ఇలా కనిపించడానికి కఠిన శ్రమ అవసరం అయ్యిందన్నారు. యోగా కూడా ఇందుకు చాలా తోడ్పడిందని ఆమె పేర్కొన్నారు. (చదవండి: యాసలందు అన్ని యాసలూ లెస్స) -
సౌత్ హీరోయిన్ అని నాకు డ్రెస్సులు ఇచ్చేవారు కాదు: హన్సిక
బాల నటిగా సినీరంగ ప్రవేశం చేసిన హన్సిక మొత్వానీ దేశముదురు సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైంది. అమాయకపు చూపులతో సన్యాసిగా నటించిన హన్సిక నటనకు, అందానికి ప్రేక్షకులు దాసోహమయ్యారు. మా కళ్లతో చూడు మామా అంటూ తెలుగబ్బాయిలు ఆమె ఫ్యాన్స్ లిస్టులో చేరిపోయారు. తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న హన్సిక ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకుంది. తాజాగా ఆమె గతంలో ఎదురైన చేదు అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 'ఒకప్పుడు ఎలా ఉండేదంటే డిజైనర్లు మాకు డ్రెస్సులు ఇచ్చేవాళ్లే కాదు. ఓహ్, మీరు దక్షిణాది హీరోయినా? మీకు మేము దుస్తులివ్వం అని ముఖం మీదే చెప్పేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. వారంతట వారే స్వయంగా వచ్చి మరీ మీకు ఏదో ఈవెంట్ ఉన్నట్లుంది.. ట్రైలర్ లాంచ్ లాంటివి.. మరి అలాంటప్పుడు మేము డిజైన్ చేసిన డ్రెస్ వేసుకోవచ్చు కదా? అని బతిమాలుతున్నారు. అప్పటి మాటలకు, ఇప్పటి మాటలకు చాలా తేడా ఉంది కదా! గతంలో వాళ్లు అలా చులకనగా మాట్లాడినప్పుడు నేనేమీ వాళ్లపై పగ పెంచుకోలేదు. దానికి బదులుగా నేనింకా కష్టపడాలి. వాళ్లను నా పనితో తిరిగి రప్పించేలా చేయాలని కసిగా ఉండేదాన్ని. ఎప్పుడైతే ఛీ కొట్టినవాళ్లే తిరిగి వచ్చారో అప్పుడు నాకే ఆశ్చర్యం వేసేది. ఏంటి? మీరిప్పుడు నన్ను రెడీ చేయాలనుకుంటున్నారా? అది కూడా మీ కాస్ట్యూమ్తో అని ఒక సెకన్ ఆలోచించి ఓకే చెప్పేదాన్ని అని చెప్పుకొచ్చింది. కాగా హన్సిక ప్రస్తుతం మ్యాన్ అనే సినిమా చేస్తోంది. చదవండి: 20 ఏళ్లుగా బుల్లితెరకు దూరం.. అదే నేను చేసిన తప్పు: నటుడు
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్హాసన్ 'థగ్ లైఫ్'.. ఆ హీరోను రిప్లేస్ చేశారు!
RCB vs PBKS: ధర్మశాలలో గర్జించేదెవరు?
హర్యానాలో మరో ట్విస్ట్.. గవర్నర్కు లేఖ రాసిన జేజేపీ
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
SRH vs LSG: ఏమా పరుగుల విధ్వంసం.. లక్నో చిత్తు
తొలిసారి ఆ జానర్ టచ్ చేయనున్న విజయ్!
Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
రేపే పసిడి కొనుగోలు జాతర.. దిగొచ్చిన బంగారం!
ఆ ప్రేమ జంట టీ దుకాణానికి వినియోగదారుల క్యూ!
Watch Live: కళ్యాణదుర్గంలో సీఎం జగన్ ప్రచార సభ
తప్పక చదవండి
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- Mona Patel: ‘ఎవరీ మోనా?’ అని సెర్చ్ చేసేలా...
- Playoffs: పాండ్యాకు పరాభవం.. ముంబై కథ ముగిసిందిలా!
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement