-
Hyderabad: హాట్సాఫ్.. ఆడపడుచును ఎప్పటికీ గుండెల్లో నిలుపుకొనేందుకు!
కుటుంబంలో ఓ వ్యక్తి దూరమైతే కలిగే దుఃఖం ఎవరూ తీర్చలేనిది. కానీ, మన గుండెల్లోని దయాగుణం ఎదుటివారి మోములో చిరునవ్వుగా మారినప్పుడు శోకం కూడా సంతోషంగా మారుతుంది అంటారు సాజిదా. హైదరాబాద్లోని సరూర్నగర్ హుడా కాంప్లెక్స్లో ఉంటున్న సాజిదా ఖాదర్ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ప్రస్తావించినప్పుడు తన ఆడపడుచు పేరును తలచుకున్నారు. అనారోగ్యంతో తమకు దూరమైన ఆడపడుచు హసీనాను ఎప్పటికీ తమ గుండెల్లో నిలుపుకుంటున్నామని బదులిచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ‘‘నా కూతురు ఏడాది వయసున్నప్పుడు మా ఆడపడచు హసీనా బ్రెయిన్ ట్యూమర్తో చనిపోయింది. ఇప్పటికి ఇరవై ఏళ్లయ్యింది హసీనా చనిపోయి. కానీ, ఇప్పటికీ తను మా కళ్లముందున్నట్టే ఉంటుంది. అందంగా నవ్వుతుండేది. పేదవారి పట్ల దయగా ఉండేది. మా ఇంట్లో అందరికీ హసీనా అంటే చాలా అభిమానం. ఆమె గుర్తుగా ప్రతి యేటా పేదలకు మాకు తోచిన సాయం చేసేవాళ్లం. ఉద్యోగాలు మాని, సొంతంగా వ్యాపారం చేసినప్పుడు, వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని హసీనా పేరున దానం చేసేవాళ్లం. దానిని ట్రస్ట్గా ఏర్పాటు చేసి, ఒక పద్ధతి ప్రకారం చేస్తే మరింత బాగుంటుందని ఆలోచన వచ్చి దానిని అమలులో పెట్టాం. అవసరమైన వారికి ఏం చేయగలమా అని ఆలోచించాం. అప్పుడే.. పేద పిల్లలకు చదువు, స్లమ్స్లోని వారికి వైద్యం అందించాలన్న ఆలోచన వచ్చింది. వెంటనే ఆ ఆలోచనను అమలు చేశాం. అప్పటినుంచి పదిహేనేళ్లుగా మా చుట్టుపక్కల స్లమ్స్కి వెళ్లి అక్కడ అవసరమైనవారికి ప్రతీ నెలా రేషన్ ఇచ్చి రావడాన్ని క్రమం తప్పకుండా పాటిస్తున్నాం. అలాగే వృద్ధాశ్రమం ఏర్పాటు చేయడంలో భవన నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఐరన్ వంటివి ఇస్తూ వచ్చాం. మా భార్యాభర్తల ఇద్దరి ఆదాయం నుంచే ఈ సేవలు అందిస్తున్నాం. వేరే ఎవరి దగ్గరా తీసుకోవడం లేదు. ఎంత చేయగలిగితే అంతే చేస్తున్నాం. ఫ్యామిలీ కౌన్సెలర్గా మార్చిన డే కేర్ మా స్వస్థలం గుంటూరు. పాతికేళ్ల క్రితం పెళ్లి అయ్యాక ఇద్దరమూ హైదరాబాద్ వచ్చేశాం. మొదట్లో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తుండేవాళ్లం. డబుల్ డిగ్రీ చేసిన నేను ప్రైవేట్ టీచర్గా చేసేదాన్ని. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వారిని పగటి వేళ ఉంచడానికి సరైన కేర్ సెంటర్ కోసం చాలా ప్రయత్నించాను. కానీ, ఏదీ సరైనది అనిపించలేదు. దాంతో ఉద్యోగం మానేసి బేబీ కేర్ సెంటర్ను ప్రారంభించాను. దీంతో సెంటర్కు వచ్చే తల్లులు, కాలనీల వాళ్లు కొన్ని సందర్భాలలో తమ సమస్యలను చెప్పినప్పుడు, నాకు తోచిన సలహా ఇచ్చేదాన్ని. డే కేర్ సెంటర్ కొన్నాళ్లకు ఫ్యామిలీ కేర్ సెంటర్గా మారిపోయింది. న్యాయ సేవ వైపు అడుగులు.. కొన్ని సమస్యలు ఎంత కౌన్సెలింగ్ చేసినా పరిష్కారం అయ్యేవి కావు. అప్పుడు అక్కడ నుంచి పారా లీగల్ సేవలు వైపుగా వెళ్లాను. సామరస్యంగా సమస్యలను పరిష్కార దిశగా తీసుకెళ్లేదాన్ని. అలా చాలా కేసుల పరిష్కారానికి కృషి చేశాను. నా సర్వీస్ను గమనించి, జిల్లా న్యాయసేవా సదన్ వారు పారా లీగల్ వలంటీర్గా నియమించారు. అలా కొన్నాళ్లు కౌన్సెలింగ్ చేస్తూ వచ్చాను. ఒక సందర్భంలో నటి జయసుధ దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడకు వచ్చిన వ్యక్తి ద్వారా హ్యూమన్ రైట్స్లోకి వెళ్లాను. మానవహక్కులను కాపాడటంలో ఎవరికీ భయపడలేదు. చాలాసార్లు బెదిరింపులు కూడా వచ్చాయి. కానీ, పోలీస్ డిపార్ట్మెంట్, న్యాయవ్యవస్థ అండగా ఉండటంతో ఎన్నో కేసుల్లో విజయం సాధించాను. మహిళలకు ఉచిత శిక్షణ ఎన్ని పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసినా హసీనా ట్రస్ట్ మాత్రం వదల్లేదు. ఈ ట్రస్ట్ ద్వారా ఉచిత విద్య, వైద్యంతో పాటు వికలాంగులు నిలదొక్కుకునేలా సహాయం అందిస్తున్నాం. మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి కాలనీల్లో వెల్ఫేర్ అసోసియేషన్లు ఏర్పాటు చేసి, వాటి ద్వారా టైలరింగ్, ఎంబ్రాయిడరీలలో శిక్షణ ఇప్పిస్తున్నాను. మా అమ్మాయి పేరు హుస్నా. కానీ, చాలా మంది తెలియక హసీనా మీ కూతురా అని అడుగుతుంటారు. నేను కూడా ‘అవును నా పెద్ద కూతురు’ అని సమాధానమిస్తుంటాను. సేవ అనేది చేస్తున్న ప్రతి పనిలో భాగమైంది. హసీనా మా సేవకు ఒక రూపు అయ్యింది. పేదల నవ్వుల్లో చెరగని దివ్వె అయ్యింది’ అని వివరించారు సాజిదా. – నిర్మలారెడ్డి -
అభిమానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విడదల రజని అండ
సాక్షి, కరీంనగర్: చామన్పల్లి గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు దూడం అనిల్కుమార్ ఆంధ్రప్రదేశ్లోని చిలకలూరిపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రజిని అభిమాని. ఆమె ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాలను ఫాలో అవుతూ.. ఎమ్మెల్యే చేపట్టే కార్యక్రమాలకు ఆకర్షితుడయ్యాడు. 3 నెలల క్రితం జరిగిన ప్రమాదంలో అనిల్కు కాలు విరిగింది. ఈ విషయాన్ని ట్విట్టర్లో ఎమ్మెల్యేకు తెలుపగా రూ.10 వేలు ఆర్థికసాయం అందించారు. అప్పటినుంచి ఆమెకు వీరాభిమానిగా మారాడు. ఇటీవల చేతిపై ఎమ్మెల్యే రజిని చిత్రాన్ని టాటూ వేయించుకున్నాడు. ఈ ఫొటోను ఆమెకు పోస్టు చేయగా ప్రత్యక్షంగా కలవాలని సూచించారు. దీంతో శుక్రవారం చిలుకలూరిపేట వెళ్లి ఎమ్మెల్యేను కలిశారు. టాటూ చూసి ఇలాంటి పనులు చేయవద్దని చెప్పారు. కాసేపు అనిల్తో మాట్లాడి, కుటుంబ ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భోజనం పెట్టి, సన్మానించారు. తన స్వగ్రామంలో ఇల్లు కట్టుకుంటున్నానని అనిల్ చెప్పగా మొదటి దఫాగా రూ.50 వేల చెక్కు అందజేశారు. మరింత సహాయం చేస్తానని, అన్నివిధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. చదవండి: నా భర్తను వెతికి పెట్టండి: కెనడాలో తెలుగు మహిళ ఆవేదన -
చేతులెత్తి నమస్కరించిన న్యాయమూర్తి
ఖమ్మం క్రైం: మానవత్వం ఎల్లలు దాటింది.. గ్రామం, మండలం, జిల్లా దాటి పక్క రాష్ట్రాలకు చేరిన సేవా తత్పరుడికి అక్కడి ప్రజలు పాదపూజ చేశారు. ఏకంగా జిల్లా జడ్జి చేతులెత్తి నమస్కరించి.. సేవలను అభినందించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ‘అన్నం’ ఫౌండేషన్ కొనసాగుతోంది. దిక్కులేని వారినేగాక మతిస్థిమితం లేనివారికి ఆశ్రయం కల్పించి బాగు చేసే వరకు బాధ్యత తీసుకుంటారు. అస్సాంలోని గోలాఘాట్ జిల్లా బోటియాపూరికి చెందిన చునీల్ గొగొయ్ నాలుగేళ్ల క్రితం, జార్ఖండ్ లోని ఖుర్దేగ్ జిల్లాకు చెందిన మర్కస్ ఖుజూర్ రెండేళ్ల క్రితం మతిస్థిమితం తప్పడంతో ఎక్కడెక్కడో తిరుగుతూ ఖమ్మం చేరారు. శ్రీనివాసరావుకు అస్సాంవాసుల పాదపూజ వారిని అన్నం ఫౌండేషన్ చేరదీసింది. ఇటీవల వారి ఆరోగ్యం కుదుటపడింది. చునీల్ గొగొయ్ ఆశ్రమంలో వంటలు చేస్తూ ఉంటున్నాడు. అతను చెప్పిన వివరాల ఆధారంగా కొత్తగూడెం జిల్లా ఇల్లెందువాసి అయిన గుహవాటి ఐఐటీ ప్రొఫెసర్ నందకిషోర్ సహకారంతో కుటుంబీకుల సమాచారం తెలుసుకున్నారు. అలాగే ఖజూర్ వివరాలు కూడా తెలిశాయి. దీంతో ఈ నెల 3న శ్రీనివాసరావు, ఆశ్రమం బాధ్యులు వారిని తీసుకుని ఆ రాష్ట్రాలకు బయలుదేరారు. జార్ఖండ్ వెళ్లి అక్కడ ఖుజూర్ను జిల్లా జడ్జి సమక్షంలో ఆయన కుటుంబానికి అప్పగించారు. ఖుజూర్కు రూ.25 వేల నగదు అందించారు. ఫౌండేషన్ సేవలను తెలుసుకున్న జడ్జి శ్రీనివాస్రావుకు నమస్కరించారు. ఆపై గోలాగాట్ జిల్లా కేంద్రానికి 7న చేరుకుని జిల్లా జడ్జి ఎదుట చునీల్ గొగొయ్ను కుటుంబానికి అప్పగించారు. ఆయనకు కూడా రూ.50 వేల నగదు అందించారు. ఈ సందర్భంగా చునీల్ కుటుంబం శ్రీనివాసరావుకు పాదపూజ చేసింది. -
మేడిపల్లి వినయ్ రెడ్డి దాతృత్వం
హైదరాబాద్ : ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ డివిజన్లో స్థానిక ప్రతినిధి మేడిపల్లి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో 400 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పీడిస్తున్న తరుణంలో వైరస్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దినసరి కూలీ పని చేసుకునే నిరుపేదలు నిత్యావసర సరుకులు దొరక్క అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. స్థానిక నిరుపేదల ఇబ్బందులను తెలుసుకున్న వినయ్ రెడ్డి వారికి అండగా నిలుస్తూ దాతృత్వం ప్రదర్శించారు. తనవంతు సహాయంగా నిరుపేదలకు సహాయంగా ఆదివారం 400 మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా కూడా పేదలకు సరుకులు పంపిణీ చేయించారు. పేదలకు సహాయం చేయాలని సహృదయంతో ఆలోచన చేసిన వినయ్ రెడ్డిని వారు అభినందించారు. ఆయన దాతృత్వాన్ని కొనియాడారు. పేదల ఆకలి తీర్చేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున జరిగిన ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఏసీపీ, ఉప్పల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
లాక్డౌన్ కాలంలో సాయం చేస్తున్న మహానుభావులు!
ఆ దేశం ఈ దేశం అనే తేడా లేకుండా కరోనా వైరస్ కాటుకు అన్ని దేశాలు బలవుతున్నాయి. ఎక్కడ చూసిన ప్రజలు కరోనా మహమ్మారి పేరు వింటేనే భయపడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనా వైరరస్ ఒకరి నుంచి మరొకరికి నోటి తుంపర్ల ద్వారా వేగంగా విస్తరిస్తుండటంతో ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం లాక్డౌన్ను విధించింది. లాక్డౌన్ కారణంగా అందరూ ఇంటికే పరిమితమయ్యి పనులన్ని ఆగిపోవడంతో చాలా మంది పేదవారు నిత్యవసరాల కోసం, ఆహారం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే చాలా మంది స్వచ్చందంగా వారికి అండగా నిలుస్తున్నారు. వారిలో కొంత మంది సాక్షికి వారు చేస్తున్న సేవ కార్యక్రమాలను తెలియజేశారు. వాటిని ఒకసారి పరిశీలిద్దాం. హైదరాబాద్ మణికొండలోని నక్షత్ర గంగోత్రి అపార్ట్మెంట్స్, అలోక టౌన్షిప్ వారు వారికి దగ్గరలో ఉన్న రోజు వారి కూలీ కుటుంబాలకు 55 బ్యాగుల నిత్యవసర సరుకులను అందించి సాయంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో నక్షత్ర అపార్ట్మెంట్స్ ప్రెసిడెంట్ బాల్రెడ్డి, జనరల్ సెక్రటరీ దిలీప్, నరేంద్ర పాల్గొన్నారు. అపార్ట్మెంట్లో ఉంటున్న స్థానికులు సహకారంతో పేదలకు సాయం అందించామని వారు తెలిపారు. కరోనావైరస్ నుంచి ప్రజలను కాపాడటానికి డాక్టర్లు, పోలీసుల వారు ప్రాణాలకు తెగించి తమ విధులను నిర్వహిస్తున్నారు. అయితే ఎండలో పనిచేస్తున్న పోలీసు వారికి నిమ్మరసం అందించి మానవత్వం చాటుకున్నారు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఖమ్మం వాసి వెంకటరామిరెడ్డి. కరోనా కాలంలో చిన్నదో పెద్దదో తోటి వారికి ఏదో ఒక సాయం చేస్తూ చాలా మంది వారి సహృదయాన్ని తెలియజేస్తున్నారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన ప్రతాప్రెడ్డి మూడు రోజుల నుంచి మినరల్ వాటర్, కూల్ వాటర్ పంపిణీ చేసి మంచి మనసు చాటుకుంటున్నారు. అదేవిధంగా హైదరాబాద్లో పలు చోట్ల అనేకమంది అన్నదాన కార్యక్రమాలు చేపడుతూ దినసరి కూలీలకు, వలసకూలీలకు, పేదలకు, భిక్షాటన చేసుకునే వారికి అండగానిలుస్తున్నారు. బషీర్, ఉమేష్ తమ బృందానికి చెందిన కొంత మందితో కలిసి యల్బీ నగర్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా కూకట్పల్లిలో సాంబిరెడ్డి, భాస్కర్, నర్సింగ్రావు, ఝన్సీ బృందం వారికి తోచిన సాయం చేశారు. పేదలకు సాయం అందించారు. కరోనా మహమ్మారి కారణంగా అనాధ శరణలయాలు, వృద్ధాశ్రమలు ఆహారం లేక విలవిలలాడుతున్నాయి. ఉప్పల్లోని అభిసాయి శత ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాధాశ్రమంలోని ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న గుప్తా కోట్ల వారికి సాయం అందించారు. తన స్నేహితుడు ప్రణీత్ మేరుగతో కలిసి హబ్సీగూడలో ఉంటున్న ప్రణీత్ 120 కేజీల కూరగాయలను అనాధాశ్రమానికి అందించారు. లాక్డౌన్ కారణంగా కొంతమంది తమ ఊరికి దూరంగా వేరే ప్రాంతాల్లో చిక్కుకుపోయిన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారి సాయాన్ని అందిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా పూణేలో చిక్కుకుపోయిన జుట్టు సింహాచలం ఆంధ్రప్రదేశ్ సీఎం రీలీఫ్ ఫండ్కు 20 వేల రూపాయలు విరాళంగా ఇచ్చి మానవత్వం చాటుకున్నారు. నెల్లూరు జిల్లా నందిగుంట మాజీ సర్పంచ్ శ్రీవాణి తన సొంత డబ్బులతో పేదలకు కూరగాయాలు, సోప్లు పంచిపెట్టారు. కరోనా సయంలో పేదలకు అండగానిలిచారు. కృష్ణజిల్లాకు చెందిన అగ్రీ పైప్లైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న వారికి చేయూతనందించారు. నిత్యవసరవస్తువులు 500 కిట్లు నిరుపేదలకు, రోజువారి కూలీలకు, కార్మికులకు అందించారు. ఈ కార్యక్రమంలో అక్కినేని దామోదర్, కారుపర్తి సాయికుమార్, గుబ్బల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రగతినగర్కు చెందిన శ్రీనిలయం ఓనర్స్ అసోసియేషన్ వారు లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి 50 వేల రూపాయల విలువగల నిత్యవసర సరుకులను 300 మందికి పంపిణీ చేశారు. లోకల్ వాచ్మ్యాన్లు, సెక్యూరిటికీ 25కేజీల బియ్యం బ్యాగ్లు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రగతినగర్ యస్ఐ, శ్రీనిలయం యాజమాన్యం పాల్గొన్నారు. ఇలా ఎవరికి తోచిన సాయం వారు చిన్నదో పెద్దదో చేస్తూ కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకుంటూ అండగా నిలుస్తున్నారు. ఇలాంటి వారు ఎందరిలో స్ఫూర్తి నింపుతున్నారు. మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంటే మీరు సాక్షి.కామ్ ద్వారా ప్రపంచానికి తెలియజేయండి. మీరు వివరాలు పంపించాల్సిన మెయిల్ఐడీ: webeditor@sakshi.com
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement