-
వివాహితపై అత్తింటివారి దాడి
మదనపల్లె: కాపురం చేసేందుకు అత్తారింటికి వచ్చిన భార్యపై భర్త, అత్తామామలు దాడిచేసి, విచక్షణారహితంగా కొట్టి గాయపరిచిన ఘటన బుధవారం సాయంత్రం మదనపల్లె మండలంలో జరిగింది. తట్టివారిపల్లె పంచాయతీ దేవతానగర్లో నివాసం ఉంటున్న రెడ్డెప్ప, రామలక్ష్మమ్మల కుమారుడు ఎం.నరసింహులు(34)కు సోమల మండలం పెద్ద ఉప్పరపల్లెకు చెందిన స్వప్న(28)తో వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. భర్తతో విభేదాల కారణంగా స్వప్న ఆరునెలలుగా పుట్టినింటిలోనే ఉంటోంది.ఈ క్రమంలో భర్త నరసింహులు, మౌనిక అనే వేరొక అమ్మాయిని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడని తెలియడంతో, కాపురం నిలబెట్టుకునే ఉద్దేశంతో తల్లి శకుంతల, అన్న మురళితో కలిసి బుధవారం భర్త నరసింహులు ఇంటికి వెళ్లింది. కోడలు స్వప్నను ఇంటిలోకి రానివ్వకుండా, గుమ్మంలోనే మామ రెడ్డెప్ప, అత్త రామలక్షుమ్మలు అడ్డుకున్నారు. ఇన్నాళ్లుకు మొగుడు గుర్తుకు వచ్చాడా... ఇంట్లోకి రానవసరం లేదంటూ బయటకు నెట్టేందుకు ప్రయతి్నంచారు. తన భర్త ఇంటిలోకి రావద్దని చెప్పడానికి మీరెవరని, స్వప్న మొండిగా లోనికి వెళ్లేందుకు ప్రయతి్నంచడంతో అత్తమామలు, కోడలిపై దాడికి పాల్పడ్డారు.కుమార్తెను అత్తామామలు విచక్షణారహితంగా కొడుతుండటంతో అడ్డుకునేందుకు వెళ్లిన తల్లి శకుంతలను సైతం వారు కాలితో తన్ని గెంటేయడంతో ఇద్దరూ కిందపడ్డారు. ఈలోపు అక్కడకు చేరుకున్న భర్త నరసింహులు చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చేందుకు నీకెంత ధైర్యమంటూ రోడ్డుమీద అందరూ చూస్తుండగానే, కాలితో తన్నుతూ, కొడుతూ వీరంగం సృష్టించాడు. భార్య, అత్తను తీవ్రంగా గాయపరిచాడు. దీంతో బాధితులు పోలీసులకు సమాచారం అందించి, చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి వెళ్లారు. తల్లి శకుంతలకు కడుపునకు శస్త్రచికిత్స జరిగిన ప్రదేశంలో బలంగా కాలితో తన్నడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తాలూకా సీఐ ఎన్.శేఖర్ తెలిపారు. -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం : ఇష్టాయిష్టాలు కలిసాయా!?
గృహస్థాశ్రమ ప్రవేశం చేయడానికి ఒక యువకుడికి, ఒక యువతికి ఉండవలసిన సాధారణ లక్షణాలు ఐదింటిని శ్రీరామాయణం నిర్దేశించింది. వాటిలో మొదటిది శీలం. అంటే స్వభావం. అది పుట్టుకతో వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. కొంతమందికి సంగీతం, కొంతమందికి ఆధ్యాత్మిక చింతన, మరికొందరికి చిత్రలేఖనం.... అలా అది వారికి బాగా ఇష్టమైన విషయంగా ఉంటుంది. పెళ్ళి సంబంధం చూసేటప్పుడు ఒకరికి ఇష్టమైన విషయం మరొకరికి కూడా ఇష్టమేనా, అయిష్టం లేదు కదా.. అని చూస్తారు. ఆ పరిశీలన పెద్దలు చేస్తారు.తరువాత వయస్సు. ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్నది ఉండదు. రెండు కళ్ళల్లో ఏది మంచిదంటే ఏమని చెప్పగలం? బండి చక్రాలు రెండూ సమన్వయంతో పనిచేయాలి. జీవితం నుండి మొదట ఆయన నిష్క్రమిస్తే.. ఆవిడ పుణ్యకార్యం చేయదు. ఆమె వెళ్ళి΄ోతే...ఆయన తమ కడుపున పుట్టిన కూతురును కూడా కన్యాదానం చేయలేడు. ఆవిడ నిష్క్రమణతోనే ఆయనకు పుణ్యకార్యం చేసే అధికారం కూడా ΄ోతుంది. అందువల్ల ఇద్దరూ సమానమే. ఇద్దరూ కలిసి ఉంటేనే సౌభాగ్యం, సంతోషం. అంటే వాళ్ళ వయసులో ఎవరు పెద్దయితే గొప్ప అన్నదానికన్నా ప్రధానమైనది– ఒకరు నడిపించాలి, మరొకరు నడవాలి–అనేది. ఇక్కడ నడిపించేవారిది ఎక్కువ, నడిచేవారిది తక్కువ అనుకోకూడదు. అన్వయం జాగ్రత్తగా చేసుకోవాలి. వరుడి వయసు పెద్దదయి ఉండాలి–అన్నారు. వయస్సు అంటే కాలం. కాలం అనుభవానికి, అవగాహనకు గుర్తు. ఎవరు ముందు ప్రపంచంలోకి వచ్చారో.. వాళ్ళుఅనుభవాన్ని, అవగాహనను ఎక్కువ సాధిస్తారు. మనం ఎంత చదివాం అన్నదానికన్నా... దానికి అనుభవం ఎంత తోడయింది... అన్నది ప్రధానం. ఒక ఉద్యోగానికి వెడితే అనుభవం ఎంత అన్నదాని ప్రాధాన్యత ఇస్తారు. అలాగే వివాహం విషయంలో.. లోకజ్ఞానం, లోక ప్రవృత్తిని సరిగా అర్థం చేసుకుని భార్యకు అవగాహన కలిగించగలిగిన వాడయి ఉండాలి.అనుభవం అన్నమాటలోనే అంతర్లీనంగా ఉండే విషయం– భార్యపట్ల పరమ ప్రేమతో మెలుగుతూ ఆమెకు రక్షకుడయి ఉండాలన్నది. ఆమె గుణాలు, ప్రతిభ ప్రకాశించడానికి ఆయన అవకాశం కల్పించగలగాలి. ఆమె బలహీనతలు... శారీరకం కావచ్చు, నడవడిరీత్యా కావచ్చు... వాటిని కప్పగలగడంతోపాటూ ఆమె గౌరవమర్యాదలు తగ్గకుండా చూడగలగాలి. సంసారాన్ని సాఫీగా నడపడంలో ఆమెకు ఆయన అనుక్షణం అండగా నిలవాలి. ఒక అమాయకురాలైన కూతురు తెలిసీ తెలియక చేసే తప్పులను తల్లిదండ్రులు ఎలా సరిదిద్దుతూ కాపాడుతుంటారో భార్యను అలా కాపాడుకోగలిగి ఉండాలి. అది భర్త లక్షణం. భార్యది – అంకిత భావం. పిచ్చి ప్రేమ. భర్త ప్రేమకు కారణం ఉంటుంది. భార్య ప్రేమకు కారణం ఉండదు. అనుగమించడం, అంకితభావంలో మసులు కోవడం ఆమె కర్తవ్యం. ఆమెకు ప్రేమను పంచడం, ప్రతి కష్టంలో ఆమెకు రక్షణగా నిలవడం ఆయన బాధ్యత. ఆమెది పాతివ్రత్యం. ఆయనది ఏకపత్నీవ్రతం. అందువల్ల ఎక్కువ తక్కువలను వారి మధ్య ΄ోల్చిచూడకూడదు. కామసంబంధమైన ప్రవత్తి కలిగినా ఆయన దృష్టిలో ఆమె వినా మరొకరికి స్థాన ఉండదు. ఆమెకు ఆయనే సర్వస్వం. ఇది దాంపత్యం. ఇదే గృహస్థాశ్రమం. ఇది సనాతన ధర్మ వైభవం.-చాగంటి కోటేశ్వరరావు -
‘మేం కలిసి బతుకుతాం.. కలిసే చనిపోతాం’ భార్య మృతి తట్టుకోలేక..
వివాహ సమయంలో పెద్దలు, వేదమంత్రాలు, అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన దంపతులు.. చివరి మజిలీలో కూడా కలిసే ప్రయాణం చేశారు. జీవితాంతం తోడు నీడగా ఉంటానని చేసిన పెళ్లి నాటి ప్రమాణాన్ని పాటిస్తూ భార్య వెంటే తుదివరకు నడిచాడు ఆ భర్త.. రోడ్డు ప్రమాదంలో భార్య తనువు చాలించిన గంటల వ్యవధిలోనే.. ఆమె దూరమవ్వడాన్ని తట్టుకోలేక అతడు కూడా ప్రాణాలు విడిచిన ఘటన ఉత్తర ప్రదేశ్లో వెలుగుచూసింది.వివరాలు.. హర్దోయికి చెందిన యోగేష్ కుమార్కు(36) మణికర్ణిక కుమారి(28)కు ఆరేళ్ల కిత్రమే వివాహమైంది. యోగేష టీచర్గా విధులు నిర్వర్తిస్తుండగా.. కుమారి హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది. అయితే ఎప్పటిలాగే ఆసుపత్రికి వెళ్తుండగా సుర్సా పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్నో-హర్దోయ్ హైవేపై సోమవారం జరిగిన ప్రమాదంలో మణికర్ణిక మృతి చెందింది. ఆమె ప్రయాణిస్తున్న స్కూటీని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టటడంతో అక్కడికక్కడే మృత్యువాతపడింది.ఆమె గుర్తింపు కార్డు, మొబైల్ నంబర్ సహాయంతో భర్తకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న యోగేష్ తన భార్య వస్తువులను తీసుకొని ఇంటికి వచ్చాడు. భార్య తనను వదిలి వెళ్లడం జీర్ణించుకోలేక మనోవేదనతో గదిలోకి వెళ్లి ఉరేసుకొని ప్రాణాలు విడిచాడు. భార్య మృతికి సంతాపం తెలిపేందుకు వచ్చిన ఇరుగుపొరుగు వారు తలుపు తట్టినా స్పందించకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా యోగేష్ సీలింగ్కు ఉరివేసుకుని కనిపించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. యోగేష్ సూసైడ్ నోట్ కూడా రాశాడు. ‘మేమిద్దరం కలిసి బతుకుతాం.. కలిసే చనిపోతాం’ అని అందులో రాసి ఉంది. చదవండి: గన్ మిస్ఫైర్.. డీఎస్పీ మృతి -
హబ్బీతో మౌనీరాయ్ విషు సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
Viveka Case : సత్యమేవ జయతే
వివేకా హత్య కేసుకు సంబంధించి సునీతారెడ్డి నిజాలను దాస్తున్నారా. అసలు వాస్తవాలు బయటకు రాకుండా ఉండేందుకు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారా. నిజాలు బయటకు వస్తే సునీతారెడ్డి దంపతులు కేసులో ఇరుక్కోవడం ఖాయమా. అసలు వివేకా హత్యకేసు విచారణలో బయటపడ్డ వాస్తవాలేంటి… సునీతారెడ్డి చేస్తున్న అబద్ధపు ప్రచారం ఏంటి? వివేకా హత్యకేసులో కుమార్తె సునీతారెడ్డి వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు దారితీస్తోంది. ఓ వైపు తన తండ్రి హంతకులను పట్టుకోవాలని చెబుతున్న సునీతా…మరోవైపు కేసులో వాస్తవాలు బయటకు రాకుండా కుట్రలు చేస్తోంది. ఇప్పటికే విచారణ పూర్తయిన ఈ కేసులో సునీతారెడ్డి ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పాత్రపై ఎన్నో అనుమానాలున్నాయి. హత్య జరిగినప్పటి నుంచి ఈ దంపతుల తీరు… సాక్ష్యాలను తారుమారు చేయడానికి యత్నించిన వైనంపై ఇప్పటికీ పూర్తి విచారణ జరగలేదు. సీబీఐ అధికారులతో కలిసి సాక్ష్యులను బెదిరించడానికి సునీతారెడ్డి దంపతులు చేసిన ప్రయత్నాలపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో MP అవినాష్రెడ్డిని ఇరికించేందుకు యత్నించిన సునీతారెడ్డి… ఇప్పుడు వారిపై రాజకీయంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ లబ్దికోసమే ఈ కేసును సునీతారెడ్డి వాడుకుంటున్నారనే దానికి ఆమె ప్రకటనలే సజీవసాక్ష్యాలు. గత ఐదేళ్లలో వివేకా హత్య కేసును జాగ్రత్తగా పరిశీలిస్తే… వివేకా హత్యకు సంబంధించి సునీతారెడ్డి దంపతులు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. వివేకా హత్య జరిగిన స్థలంలో దొరికిన లేఖను దాచిపెట్టమని పీఏ కృష్ణారెడ్డికి చెప్పింది సునీత దంపతులు కాదా? షమీమ్ను వివేకానందరెడ్డి రెండో పెళ్లి చేసుకుంటే… ఆయనతో సునీతకు, నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి గొడవలు ఉన్న మాట వాస్తవం కాదా? షమీమ్ కొడుకుకు ఆస్తిలో వాటా వస్తోందనే భయంతోనే తప్పుడు సాక్ష్యం చెప్పాలని PA కృష్ణారెడ్డిని బెదిరించారా? వివేకా చెక్ పవర్ తీసేసి ఆయనను ఆర్ధికంగా తీవ్ర ఇబ్బంది పెట్టింది సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కాదా? అవినాష్రెడ్డి పేరు చెప్పకపోతే… తన భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి జైలుకు వెళ్లాల్సి వస్తుందని పీఏ కృష్ణారెడ్డితో అన్నది నిజమా కాదా? వివేకానంద రెడ్డిని నరికానని బాహాటంగా ప్రకటించిన దస్తగిరి బెయిల్కు సునీత సహకరించిందా? లేదా? హత్య గురించి సుదీర్ఘ ప్రకటనలు చేస్తున్న వారు వివేకా రెండో పెళ్లి గురించి, ఆస్తుల సెటిల్మెంట్ల గురించి ఎందుకు మాట్లాడడం లేదు? వివేకా హత్య తర్వాత ఆస్తులన్నీ హడావిడిగా మీ పేరిట ఎందుకు మార్చుకున్నారు? రాజకీయ ఆకాంక్షతోనే TDPకి అనుకూలంగా రాజకీయాలు చేస్తున్నారా? మార్చి 15, 2019న వివేకానందరెడ్డి హత్యకేసు వెలుగులోకి వచ్చింది. వివేకానందరెడ్డి చనిపోయిన విషయాన్ని PA కృష్ణారెడ్డి మొదట ఆయన కుటుంబ సభ్యులకే తెలిపారు. పీఏ కృష్ణారెడ్డి హత్య విషయం తెలియగానే ముందుగా వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఉదయం 6 గంటల 18నిమిషాలకు ఫోన్ చేసి విషయం చెప్పారు. కేవలం కొన్ని సెకన్ల పాటు జరిగిన ఈ ఫోన్ సంభాషణలో … వివేకా బాత్రూమ్లో రక్తపు మడుగులో పడి ఉన్నారు అని పీఏ కృష్ణారెడ్డి… వివేకా అల్లుడు రాజశేఖరరెడ్డికి చెప్పారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహం, ఆ ప్రదేశాన్ని వివేకా అనుచరుడు ఇనయతుల్లా తన సెల్ఫోన్ ద్వారా ఫొటోలు, వీడియోలు తీసి నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్రెడ్డిలకు వాట్సాప్ చేశారు. వాటిని చూసిన తర్వాత కూడా శివప్రకాశ్రెడ్డి.. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి తనకు ఫోన్ చేస్తే వివేకా గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. అదే విషయాన్ని ఆదినారాయణరెడ్డి మీడియాకు వెల్లడించారు కూడా. ఇక్కడ అత్యంత కీలకమైన అంశం వివేకా స్వదస్తూరితో రాసిన లేఖ, ఆయన వాడుతున్న సెల్ఫోన్. వీటి విషయంలో సొంత కుటుంబ సభ్యులు పాటించిన గోప్యత అనుమానస్పదంగా ఉంది. వివేకా రాసినట్లు చెబుతున్న లేఖ, సెల్ఫోన్ను తాము వచ్చే వరకు పోలీసులకు అప్పగించవద్దని పీఏ కృష్ణారెడ్డికి వివేకా అల్లుడు రాజశేఖరరెడ్డి ఆదేశించారు. వీరంతా పులివెందుల చేరుకున్న తర్వాతే సెల్ఫోన్లోని మెసేజ్లు, ఇతర వివరాలను డిలీట్ చేసి వాటిని పోలీసులకు అప్పగించారనే చర్చ ఉంది. వివేకానందరెడ్డి రాజకీయ వారసత్వం ఆశిస్తున్న అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావమరిది శివ ప్రకాశ్రెడ్డి ఆయనపై కక్ష పెంచుకుని హత్యకు కుట్రపన్ని ఉండొచ్చు. నిజం తెలిసిన తరువాత కూడా ఎందుకు వివేకా అల్లుడు రాజశేఖర్రెడ్డి అబద్ధం చెప్పారు. లేఖను దాచిపెట్టారు అనేది తేలితే కేసు సగం కొలిక్కి వచ్చినట్లే. వివేకా హత్యకేసులో మరో కీలకమైన అంశం ఆయన రెండో వివాహం. షమీమ్ అనే మహిళను 2010లో వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్నారు. వివాహం పూర్తిగా ముస్లిం సాంప్రదాయం ప్రకారం జరిగింది. తన పేరును అక్బర్గా మార్చుకున్న వివేకా షమీమ్ను వివాహం చేసుకున్నారు. ఈ విషయంపై వివేకా కుమార్తె, అల్లుడు, బావమరిది ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పెళ్లి కారణంగా వివేకానందరెడ్డికి, ఆయన కుమార్తె సునీతారెడ్డికి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ విషయం కారణంగానే దాదాపు 2013 నుంచి సునీతారెడ్డి తండ్రితో మాట్లాడడం లేదని ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పాడు. వైఎస్ వివేకానందరెడ్డి షమీమ్ను రెండో వివాహం చేసుకోవడంతో ఆయన కుటుంబంలో తలెత్తిన విభేదాలే ఈ హత్యకు దారి తీశాయనే వాదన ఉంది. తన రెండో భార్య ద్వారా జన్మించిన కుమారుడిని వివేకా వారసుడిగా ప్రకటిస్తారనే ప్రచారం జరిగింది. ముఖ్యంగా సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివేకా రెండో భార్య షమీమ్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. తన కొడుకుకు ఆస్తిలో వాటా ఇస్తానని వివేకా చెప్పినట్లు షమీమ్ తన వాంగ్మలంలో చెప్పారు. తన కొడుకుకు ఆస్తి వస్తుందనే కారణంతో వివేకా మొదటి భార్య కుటుంబం తనపై కక్ష్య గట్టిందని… చాలాసార్లు తనను బెదిరించినట్లు షమీమ్ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పూసగుచ్చినట్లు వివరించారు. ఇక ఎర్రగంగిరెడ్డిని తమ ఇంటికి పంపి… వివేకాతో పూర్తిగా సంబంధాలు తెంచుకోవాలని బెదిరించినట్లు షమీమ్ స్పష్టంగా సీబీఐకి చెప్పింది. వివేకా తన వారసుడిగా షమీమ్కు కుమారుడు షెహన్షాను ప్రకటిస్తారనే అనుమానంతోనే… సునీతారెడ్డి దంపతులు వివేకా చెక్పవర్ తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో వివేకా చనిపోవడానికి ముందు తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నట్లు చాలామంది వాంగ్మూలంలో చెప్పారు. వివేకా హత్య కేసులో సాక్ష్యులను బెదిరించేందుకు సునీతారెడ్డి దంపతులు తీవ్రంగా యత్నించారు. వివేకానందరెడ్డి వద్ద దశాబ్దాలుగా పనిచేస్తున్న పీఏ కృష్ణారెడ్డిని తప్పుడు సాక్ష్యం చెప్పని నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సునీతారెడ్డిలు తీవ్రంగా వేధించారు. వివేకా హత్య కేసులో భాస్కర్రెడ్డి, అవినాష్రెడ్డికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని సునీతారెడ్డి పీఏ కృష్ణారెడ్డిపై ఒత్తిడి తీసుకువచ్చింది. అయితే తాను అబద్ధపు సాక్ష్యం చెప్పదిలేదని కృష్ణారెడ్డి తెగేసి చెప్పడంతో… నర్రెడ్డి సునీతారెడ్డి తన అసలు స్వరూపం బయటపెట్టారు. సీబీఐ అధికారులతో కలిసి కృష్ణారెడ్డిని తీవ్రంగా హింసించారు. తన తండ్రి వద్ద 30ఏళ్లపాటు పనిచేసిన వ్యక్తిపైనే సునీతారెడ్డి ఇంతటి దారుణాలకు పాల్పడ్డారు. లేఖను దాచిపెట్టమని చెప్పింది కూడా కృష్ణారెడ్డికే. ఎన్నిరకాలుగా హింసించినా కృష్ణారెడ్డి అబద్ధపు సాక్ష్యం చెప్పకపోవడంతో… ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేశారు. పిఏ కృష్ణారెడ్డి కుమారులను పిలిపించి సీబీఐ అధికారి రాంసింగ్ ద్వారా బెదిరింపులకు దిగారు. ఇక సునీతారెడ్డి దంపతులు నేరుగా రంగంలోకి దిగి కృష్ణారెడ్డి కుమారుడి వివాహం రద్దు చేయించారు. అంతే కాకుండా అబద్ధపు సాక్ష్యం చెప్పకపోతే మరోసారి అరెస్టు చేయిస్తామని కృష్ణారెడ్డిపై బెదిరింపులకు దిగారు. ఇక అసహనంతో కృష్ణారెడ్డి అబద్ధం చెప్పకపోతే… తన భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సునీతారెడ్డి మాట జారింది. ఇంతే కాదు వివేకా హత్య కేసులో సునీతారెడ్డిపై అనుమానం రావడానికి మరో ప్రధాన కారణం… దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్ను వ్యతిరేకించకపోవడం. అప్రూవర్గా మారడానికి ముందే దస్తగిరి వేసిన బెయిల్ పిటిషన్ను సునీతారెడ్డి ఎందుకు వ్యతిరేకించలేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో వివేకాను తామే నరికామని… టీవీ చానెల్ల ముందు స్టేట్మెంట్లు ఇచ్చిన దస్తగిరికి వ్యతిరేకంగా సునీతారెడ్డి ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం… మరో అనుమానం. ఇప్పటికైనా దస్తగిరి బెయిల్ రద్దు చేయమని అడిగే అవకాశం ఉన్నా సునీతారెడ్డి… కనీసం మాట మాట్లాడటం లేదు. తండ్రిని హత్య చేసిన వ్యక్తి రోడ్డుపై తిరుగుతుంటే … సునీతారెడ్డి ఏమీ అనకపోవడం ఆమె ఉద్దేశాన్ని బహిర్గతం చేస్తోంది. ఈ కేసులో రాజకీయ కోణాన్ని మాట్లాడుతున్న సునీతారెడ్డి అబద్ధాలను పదే పదే వల్లె వేస్తున్నారు. కడప ఎంపీ టికెట్ కోసమే తన తండ్రి హత్య జరిగిందని చెబుతున్న సునీతారెడ్డి… తాను గతంలో మాట్లాడిన మాటలపై ఇప్పుడు నోరు మెదపడం లేదు. వివేకా హత్య జరగడానికి ముందే… కడప ఎంపీ సీటు ఖరారైందనే విషయం గతంలోనే సునీతారెడ్డి చెప్పారు. ఇప్పుడు మాత్రం వంశవృక్షాన్ని పవర్పాయింట్ ప్రెజంటేషన్ రూపంలో వేస్తూ… అవినాష్రెడ్డి కుటుంబంపై చాలా కాలంగా తనలోపల ఉన్న అక్కసును వెళ్లగక్కుతున్నారు. వివేకా హత్య కేసుకు సంబంధించి నిందితులకు శిక్షపడటం కన్నా… తన రాజకీయ ప్రత్యర్ధులపై బురదజల్లే ఆలోచనే సునీతారెడ్డిలో ఎక్కువగా కనిపిస్తోంది. ఇక తన తండ్రి హత్యకేసుతో పొలిటికల్ మైలేజ్ పొందాలనుకుంటున్న సునీతారెడ్డికి… ఆమె సోదరి షర్మిల తోడయ్యారు. కేవలం ఎన్నికల్లో లబ్దిపొందాలనే ఏకైక ఎజెండాతో షర్మిల ఏకంగా అవినాష్రెడ్డే హంతకుడంటూ తేల్చేశారు. రాజకీయంగా కడపలో తనకు ప్రత్యర్ధి అయిన వ్యక్తి అవినాష్రెడ్డిపై షర్మిల చేసిన కామెంట్స్ వెనక ఉన్న ఉద్దేశం… అందరికీ ఇప్పటికే అర్ధమైంది. ఎందుకు చాలా కాలంగా షర్మిల అవినాష్రెడ్డిని టార్గెట్ చేశారో… ఎన్నికల సమయం వచ్చాక మరింత స్పష్టంగా అర్ధమవుతోంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement