ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై అనవసర రాద్ధాంతం | Sakshi
Sakshi News home page

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై అనవసర రాద్ధాంతం

Published Mon, May 6 2024 4:06 AM

Unnecessary comment on Land Titling Act: Eswariah

వందేళ్ల నాటి చట్టాలతో ఏళ్ల తరబడి భూ వివాదాలు

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ ఒక మహత్తర చట్టం

వివాదాలు లేకుండా భూ యజమానులకు శాశ్వత హక్కులు 

సీఎం వైఎస్‌ జగన్‌పై బురద చల్లడం తగదు

అఖిల భారత బీసీ సమాఖ్య అధ్యక్షుడు జస్టిస్‌ వి.ఈశ్వరయ్య

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమ­ల్లోకి తెచ్చేందుకు ప్రతిపాదించిన ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై అనవసర రాద్ధాంతం చేస్తూ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారని అఖిల భారత బీసీ సమాఖ్య అధ్యక్షుడు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వి.ఈశ్వరయ్య అన్నారు. ఆయన ఆదివారం గుంటూరులోని ఐటీసీ హోటల్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వందేళ్ల కిందట బ్రిటీష్‌కాలంలో భూముల సర్వే చేశారని, అనంతరం మళ్లీ సమగ్రమైన సర్వే జరగలేదని చెప్పారు.

భూ యాజమాన్య హక్కులు, హద్దులపై రాష్ట్ర­వ్యాప్తంగా కోర్టుల్లో వేలాది కేసులు ఏళ్ల తర­బడి పెండింగ్‌లో ఉన్నాయన్నారు. భూ వివా­దా­లతో ప్రజలు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగు­తున్నారని పేర్కొన్నారు. ఈ తరుణంలో సమగ్ర భూసర్వే ద్వారా భూములకు యజమా­నులను గుర్తించి, సంబంధిత భూములపై వారికే శాశ్వత­రీతిలో హక్కులను కల్పించేందుకు సీఎం జగన్‌ ప్రభు­త్వం ల్యాండ్‌ టైట్లింగ్‌ అనే మహత్తరమైన చట్టాన్ని అమల్లోకి తీసుకు­వచ్చేందుకు చర్యలు చేపట్టిందని వివరించారు.

భూము­లకు సంబంధించిన వివాదా­ల­ను పరిష్క­రించి, యజ­మానులకు శాశ్వత హక్కు­లు కల్పించడంతో­పాటు డిజిటల్‌ రికార్డుల రూపంలో వాటిని భద్ర­పర్చడం ఎంతో గొప్ప కార్యక్రమమని చెప్పారు. గత ప్రభుత్వాలే కాకుండా దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లో ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏ ముఖ్యమంత్రి చేపట్టలేదని వివరించారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై రాజకీయ నేతలు కనీస అవగా­హన లేకుండా మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొ­ట్టడం, సీఎం జగన్‌పై బురదచల్లడం తగదన్నారు. 

అడ్డగోలుగా ఫిలిం సిటీ కట్టిన రామోజీ 
రైతుల భూములు ఆక్రమించి అడ్డగోలుగా ఫిలిం సిటీని నిర్మించిన రామోజీరావు తన ఈనాడు పత్రిక ద్వారా నిత్యం తప్పుడు వార్తలు రాస్తూ సీఎం వైఎస్‌ జగన్‌పై అభాండాలు వేస్తున్నారని జస్టిస్‌ ఈశ్వ­రయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల భూము­లు లాగేసుకుంటారంటూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై నిత్యం ఈనాడులో తప్పుడు రాతలు రాస్తున్న రామో­జీరావు... గతంలో రామోజీ ఫిలింసిటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైకోర్టు జడ్జిగా తాను స్టే ఇచ్చిన విషయం మరిచారా.. అని ప్రశ్నించారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెబు­తున్న బీజేపీతో జట్టు కట్టిన టీడీపీ, జన­సేనలను ప్రజలు నమ్మబోరని చెప్పారు. బీసీ రిజర్వే­షన్లను కూడా రద్దు చేసే ఆలోచనలో బీజేపీ ఉందన్నారు.

బీసీ విద్యార్థులకు న్యాయంచేసిన సీఎం జగన్‌
వైద్య విద్య సీట్ల కేటాయింపులో సీఎం జగన్‌ బీసీ విద్యార్థులకు న్యాయంచేశా­రని జస్టిస్‌ ఈశ్వరయ్య చెప్పారు. బీసీ కోటాలో సీటు పొంది, ఓపెన్‌ మెరిట్‌లోకి వెళ్లిన విద్యా­ర్థుల సీట్లను తిరిగి బీసీ కోటాలోనే భర్తీచే­యాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గత ప్రభుత్వంలో చంద్రబాబు అమలు చేయలే­ద­న్నారు. ఫలితంగా బీసీ కోటాలో ఏటా దాదాపు 500 ఎంబీబీ­ఎస్‌ సీట్లను బీసీ విద్యా­ర్థులు కోల్పోతున్న విష­యాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసు­కెళ్లగా... బీసీ కోటా సీట్లు బీసీ విద్యా­ర్థులతోనే భర్తీ చేసేవిధంగా ఆదే­శాలు ఇవ్వడంతోపాటు సక్ర­మంగా అమలు చేయి­స్తున్నారని వివరించారు.

బీసీల సామా­జిక, ఆర్థిక, రాజకీయ అభ్యు­న్నతి కోసం పాటు­­పడుతున్న సీఎం జగన్‌కు బీసీలు అండగా నిలవాలని ఆయన పిలుపుని­చ్చారు. ప్రస్తుత ఎన్నికలు పేదలకు, పెత్తందారు­లకు మధ్య జరుగు­తు­న్నవేనని, అభివృద్ధి, సంక్షేమ పాల­న కొనసా­గా­లంటే వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉండాలని జస్టిస్‌ ఈశ్వరయ్య స్పష్టంచేశారు. హై­కోర్టు న్యాయ­వాది ఠాగూర్‌ యాదవ్, ప్రభుత్వ మాజీ న్యాయవాది పోకల వెంకటేశ్వర్లు, బీసీ సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement