-
ధోని రనౌట్తో పోలుస్తున్నారు.. శాంసన్ కెరీర్ ముగిసినట్లా!
వెస్టిండీస్తో జరిగిన తొలి టి20 మ్యాచ్లో టీమిండియా అనూహ్యంగా ఓటమి పాలైంది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు విండీస్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్కు నిర్ణీత 20 ఓవర్లల 9 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసి నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. టీమిండియా బ్యాటింగ్లో ఒక్క బ్యాటర్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. దీనికి తోడు సంజూ శాంసన్ బ్యాటింగ్ ఆర్డర్ను మార్చడం జట్టును దెబ్బతీసిందని చెప్పొచ్చు. ఇదే అనుకుంటే శాంసన్ రనౌట్ కావడం మరింత ఆశ్చర్యపరిచింది. జాసన్ హోల్డర్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ మూడో బంతిని అక్షర్ పటేల్ కవర్స్ దిశగా ఆడాడు. అక్షర్ పటేల్ వద్దని చెప్పినా సంజూ శాంసన్ అనవసరంగా సింగిల్కు ప్రయత్నించాడు. సంజూ శాంసన్ క్రీజులోకి చేరేలోపే బంతిని అందుకున్న కైల్ మేయర్స్ నేరుగా వికెట్లను గిరాటేయడంతో 12 పరుగులు వద్ద రనౌట్గా వెనుదిరిగాడు. అయితే సంజూ శాంసన్ రనౌట్ను ఎంఎస్ ధోని రనౌట్తో పోలుస్తున్నారు. 2019 వన్డే వరల్డ్కప్లో సెమీఫైనల్లో ధోని రనౌట్ అయిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్తో జరిగిన సెమీస్లో ధోని అప్పటికే 51 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఫెర్గూసన్ బౌలింగ్లో షాట్ ఆడిన ధోని రెండు పరుగుల కోసం ప్రయత్నించాడు. అయితే సింగిల్తో సరిపెట్టుకొని ఉంటే బాగుండేది. కానీ ధోని అనవసరంగా రెండో పరుగు కోసం ప్రయత్నించగా.. మార్టిన్ గప్టిల్ అద్బుతమైన డైరెక్ట్ హిట్కు రనౌట్గా వెనుదిరగాల్సి వచ్చింది. ధోని రనౌట్ కావడంతో అభిమానులు గుండె బరువెక్కిపోయింది. ఈ మ్యాచే ధోనికి అంతర్జాతీయంగా ఆఖరి మ్యాచ్గా మారిపోయింది. ఆ తర్వాత ధోని మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ఇక 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్కు ధోని రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా సంజూ శాంసన్ రనౌట్ను ధోని రనౌట్తో పోల్చడంతో అభిమానులు వినూత్న కామెంట్స్ చేశారు. ''ధోని రనౌట్తో పోలుస్తున్నారు బాగానే ఉంది.. కానీ ధోని అంతర్జాతీయ కెరీర్కు ఎండ్కార్డ్ పడింది ఇక్కడే.. అలా అయితే సంజూ శాంసన్ కెరీర్ కూడా ముగిసినట్లేనా''.. మీ లాజిక్లు తగలయ్యా.. బోలెడు కెరీర్ ఉన్న శాంసన్ ఔట్ను ధోని రనౌట్తో పోల్చకండి.. అతనికి మంచి భవిష్యత్తు ఉంది'' అంటూ పేర్కొన్నారు. pic.twitter.com/cAl95iDMV7 — No-No-Crix (@Hanji_CricDekho) August 3, 2023 WHAT A MOMENT OF BRILLIANCE! Martin Guptill was 🔛🎯 to run out MS Dhoni and help send New Zealand to their second consecutive @cricketworldcup final! #CWC19 pic.twitter.com/i84pTIrYbk — ICC (@ICC) July 10, 2019 చదవండి: Deodhar Trophy: రియాన్ పరాగ్ మెరుపులు వృథా.. దేవధర్ ట్రోఫీ విజేత సౌత్జోన్ -
మిస్టర్ మోర్గాన్.. లార్డ్స్ బయట ధర్నా చేయాల్సింది
Virender Sehwag Knocks Eoin Morgan.. ఐపీఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్లో అశ్విన్- మోర్గాన్ మధ్య వివాదం ముదిరి పాకాన పడుతోంది. అశ్విన్దే తప్పు అని కొందరు విమర్శిస్తుంటే.. మోర్గాన్ది తప్పంటూ మరికొందరు పేర్కొంటున్నారు. తాజాగా టీమిండియా మాజీ విధ్వంసకర ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ అశ్విన్కు మద్దతిస్తూ మోర్గాన్పై ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కేకేఆర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ అశ్విన్- మోర్గాన్ విషయంలో జరిగిన గొడవ గురించి ప్రస్తావించాడు. రిషబ్ పంత్- అశ్విన్ జోడి రెండో పరుగు కోసం ప్రయత్నించడమే ఇక్కడ తప్పని.. అందుకే మోర్గాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడని చెప్పుకొచ్చాడు. కార్తిక్ కామెంట్స్పై సెహ్వాగ్ స్పందించాడు. చదవండి: Ashwin Vs Morgan: మోర్గాన్ తప్పు లేదు.. అశ్విన్ను అడ్డుకునే హక్కు ఉంది ''అది జూలై 14.. 2019 ప్రపంచకప్ ఫైనల్. ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ ఫైనల్ ఓవర్లో బెన్ స్టోక్స్ బ్యాట్కు తగిలి అదనంగా రెండు పరుగులు వచ్చాయి. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీయడం.. సూపర్ ఓవర్లో ఇంగ్లండ్ విజయం సాధించడం జరిగిపోయాయి. మోర్గాన్ ప్రకారం న్యాయంగా ఉంటే ఓవర్ త్రోకు పరుగులు తీయకూడదు.. కానీ స్టోక్స్ రన్స్ తీశాడు. దీని ప్రకారం మోర్గాన్ స్టోక్స్కు వ్యతిరేకంగా లార్డ్స్ బయట ధర్నా చేయాలి.. అంతేగాక మోర్గాన్ ఒక కెప్టెన్గా ట్రోఫీని అందుకోవడానికి నిరాకరించాలి.. న్యాయబద్ధంగా న్యూజిలాండ్కు ట్రోఫీ అందించాలి. మరి మోర్గాన్ అప్పుడు అలా ఎందుకు చేయలేదు.. పైగా ఇప్పుడేమో అశ్విన్ను తప్పుబడుతూ ఆగ్రహం వ్యక్తం చేయడం ఎంతవరకు న్యాయం చెప్పండి'' అంటూ వ్యంగ్యంగా స్పందించాడు. ప్రస్తుతం సెహ్వాగ్ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: IPL 2021: ఫామ్లో లేకపోతే అంతే.. మూలకు కూర్చోవాల్సిందే On July 14th , 2019 when it ricocheted of Ben Stokes bat in the final over, Mr Morgan sat on a Dharna outside Lord’s and refused to hold the World cup trophy and New Zealand won. Haina ? Bade aaye, ‘doesn’t appreciate’ waale 😂 pic.twitter.com/bTZuzfIY4S — Virender Sehwag (@virendersehwag) September 29, 2021 -
భీకరమైన ఫామ్; మెగా టోర్నీలో 5 సెంచరీలు.. నేటితో రెండేళ్లు
సాక్షి, వెబ్డెస్క్: టీమిండియా ఓపెనర్.. హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఇంగ్లండ్ వేదికగా జరిగిన 2019 ప్రపంచకప్లో భీకరమైన ఫామ్లో ఉన్నాడు. సెంచరీలు కాదని డబుల్ సెంచరీలను మంచీనీళ్ల ప్రాయంగా మలిచిన రోహిత్ ఆ మెగా టోర్నీలో ఏకంగా ఐదు సెంచరీలు బాది ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. అప్పటివరకు ఒక ప్రపంచకప్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కర పేరిట ఉండేది. రోహిత్ ఆ రికార్డును చెరిపేస్తూ కొత్త చరిత్రను సృష్టించాడు. రోహిత్ ఆ రికార్డు సాధించి నేటితో సరిగ్గా రెండేళ్లు. ఈ సందర్భంగా అప్పటి ఆసక్తికర విషయాలను ఒకసారి గుర్తుచేసుకుందాం. లీగ్ దశలో న భూతో భవిష్యత్తు అనేలా రోహిత్ ఆటతీరు సాగింది. కొడితే భారీ స్కోర్లు ఖాయం అనేలా అతని ఇన్నింగ్స్లు సాగాయి. లీగ్ దశలో దక్షిణాఫ్రికాపై 122* పరుగులు, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 140 పరుగులు, ఇంగ్లండ్పై 102, బంగ్లాదేశ్పై 104 పరుగులు చేశాడు. ఇక శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 103 పరుగులతో శతకం సాధించిన రోహిత్ ఒక మేజర్ టోర్నీలో అత్యధిక సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అయితే ఆఫ్గానిస్తాన్, వెస్టిండీస్లపై మాత్రం విఫలమైన రోహిత్ ఆసీస్తో జరిగిన మ్యాచ్లో 57 పరగులు చేశాడు. రోహిత్ జోరుతో టీమిండియా మరోసారి విజేతగా నిలుస్తుందని అంతా భావించారు. కానీ రోహిత్ ఇదే టెంపోనూ కివీస్తో జరిగిన సెమీఫైనల్లో చూపెట్టలేకపోయాడు. ఆ మ్యాచ్లో రోహిత్ ఒక్క పరుగుకే వెనుదిరగడంతో అభిమానుల ఆశలు గల్లంతయ్యాయి. అయితే రోహిత్ ఇదే ప్రపంచకప్లో మరో రికార్డును కూడా సాధించాడు. ఒక్క ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ మూడో స్థానంలో నిలిచాడు. మొత్తంగా రోహిత్ శర్మ ఐదు సెంచరీల సాయంతో 648 పరుగులు చేశాడు. అంతకముందు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(673 పరుగులు, 2003 ప్రపంచకప్), ఆసీస్ మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్( 659 పరుగులు, 2007 ప్రపంచకప్) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. అంతేగాక టీమిండియా తరపున సచిన్ తర్వాత ఒక ప్రపంచకప్లో 600 పైచిలుకు పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్ నిలవడం విశేషం. -
కొత్త జగజ్జేత అవతరించిన రోజు
న్యూఢిల్లీ: నరాలు తెగే ఉత్కంఠభరితమైన పోరు. ఆకాశమే హద్దుగా చెలరేగిన బ్యాట్స్మెన్, వికెట్లే లక్ష్యంగా బంతి విసిరిన బౌలర్లు. చివరకు మ్యాచ్ టై. ఓ సూపర్ ఓవర్. అది చాలక బౌండరీల లెక్కింపుతో విజేత నిర్ధారణ. క్రికెట్లో వీటిలో ఏదో ఒకటి అప్పుడప్పుడూ జరగడం సాధారణం. కానీ అన్నీ ఒకేసారి ఒకే మ్యాచ్లో కనిపిస్తే.. అది 2019 ప్రపంచకప్ ఫైనల్ అవుతుంది.వన్డేల హిస్టరీలోనే ఓ మైలురాయిగా నిలిచిన ఈ ఫైనల్కు నేటితో(జులై 14) ఓ ఏడాది నిండింది. ఈ చారిత్రాక మ్యాచ్ ఇంగ్లండ్ జట్టు బౌండరీ ఆధారంగా న్యూజిలాండ్పై నెగ్గి జగజ్జేతగా అవతరించింది. ఛేజింగ్లో ఇంగ్లండ్ బ్యాట్స్మన్ బెన్ స్టోక్స్ పోరాటంతో ఆఖరి ఓవర్లో ఆ జట్టు 15 పరుగులు చేయాల్సివుంది. అంతకుముందు డీప్ వద్ద స్టోక్స్ ఇచ్చిన క్యాచ్ను ట్రెంట్ బౌల్ట్ జారవిడిచాడు.(‘గంగూలీలా ధోని చేయలేదు’) ఆరు బంతులు.. 15 పరుగులు ఆఖరి ఓవర్లో బంతిని అందుకున్న బౌల్ట్ తొలి రెండు డెలివరీలను డాట్స్గా మలిచాడు. స్టైక్లో ఉన్న స్టోక్స్ మూడో బంతిని సిక్సర్గా మలిచి ఇంగ్లండ్ శిబిరంలో ఆనందం నింపాడు. ఆ తర్వాతి బంతిని ఆడిన స్టోక్స్ పరుగు కోసం డైవ్ చేశాడు. ఫీల్డర్ గప్టిల్ శరవేగంగా బంతిని త్రో చేశాడు. అది స్టోక్స్ బ్యాట్ను బలంగా తాకి బౌండరీ దాటింది. దీంతో న్యూజిలాండ్ జట్టు నివ్వెరపోయింది. ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాలి. ఇంగ్లండ్ బ్యాట్స్మన్ మార్క్ వుడ్ రనౌట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్లో స్టోక్స్, జోస్ బట్లర్ కలిసి న్యూజిలాండ్కు 16 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.న్యూజిలాండ్ బ్యాట్స్మన్ జేమ్స్ నీషమ్ ఓ సిక్సర్ బాదాడు. చివరి బంతికి రెండు పరుగులు చేస్తే న్యూజిలాండ్ విశ్వవిజేతగా నిలుస్తుంది. రెండు పరుగుల కోసం ఊపిరి బిగబట్టి చేసిన ప్రయత్నంలో గప్టిల్ రనౌట్ అయ్యాడు. దాంతో న్యూజిలాంట్ టీమ్ నిరాశలో కూరుకుపోయింది.ఇంగ్లండ్ క్రీడాకారుల విజయనాథంతో లార్డ్స్ క్రికెట్ స్టేడియం ఉర్రూతలూగింది. ఈ మ్యాచ్లో బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లండ్(26), న్యూజిలాండ్(17)పై గెలుపొందింది. వన్డే వరల్డ్కప్ చరిత్రలో క్రికెట్కు పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్కు అదే తొలి కప్. -
భారత అభిమానుల గుండె పగిలిన రోజు
ముంబై : 2019.. జూలై 10వ తేది.. ప్రపంచకప్లో భాగంగా ఇండియా, న్యూజిలాండ్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్. భారత విజయలక్ష్యం 240 పరుగులు. అప్పటికే టీమిండియా 92 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తోంది. ఈ దశలో క్రీజులో ఉన్న ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజాలు జట్టును ఓటమి నుంచి తప్పించే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఇద్దరు కలిపి 7వ వికెట్కు అబేధ్యమైన 116 పరుగులు జోడించారు. కాగా జట్టు స్కోరు 207 పరుగుల వద్ద ఉన్నప్పుడు 77 పరుగులు చేసిన జడేజా క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. అయినా భారత అభిమానులు ఏ మాత్రం బెదరలేదు .. ఎందుకంటే అప్పటికే ధనాదన్ ధోని క్రీజులో పాతుకుపోయాడు. ధోని ఉన్నాడన్న ధైర్యం అభిమానులను కుంగిపోకుండా చేసింది. 2011 ఫైనల్ ప్రదర్శనను మరోసారి పునరావృతం చేస్తాడని, లార్డ్స్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఉంటుందని అంతా భావించారు.అయితే విజయానికి 24 పరుగుల దూరంలో ఉన్నప్పుడు ధోని రనౌట్ అయ్యాడు. అంతే స్టేడియం మొత్తం ఒక్కసారిగా నిశబ్ధంగా మారిపోయింది. ఇది నిజమా కాదా అని నిర్థారించుకునేలోపే ధోని పెవిలియన్ బాట పట్టాడు. అప్పటిదాకా ధోని ఉన్నాడనే ధైర్యంతో ముందుకు సాగిన అభిమానుల గుండెలు పగిలాయి. టీమిండియాను ఫైనల్లో చూస్తామన్న వారి కలల ఆవిరయ్యాయి. చూస్తుండగానే భారత ఇన్నింగ్స్ కుప్పకూలింది. కేవలం 18 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది.('కెప్టెన్గా నాకు పూర్తి స్వేచ్ఛనివ్వలేదు') అప్పటిదాకా ధోని మీద అభిమానం ఉన్నవాళ్లు కూడా.. ధోని ఎందుకిలా చేశాడు.. ఒక్క పరుగుతో సరిపెట్టుకుంటే ఫలితం వేరేలా వచ్చి ఉండేది అంటూ దుమ్మెత్తిపోశారు. యాదృదశ్చికమె లేక దురదృష్టమో తెలియదు గాని మహీ చివరిసారిగా మైదానంలో కనిపించింది ఆరోజే. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు బ్లూ జెర్సీ ధరించలేదు.ఈ బాధ భారత్ క్రికెట్తో పాటు అభిమానులను కూడా చాలా కాలం వెంటాడింది. సరిగ్గా ఈ ఘటన జరిగి ఈ రోజుకు ఏడాది. ఐసీసీ ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ ట్విటర్లో ధోని రనౌట్ వీడియోను షేర్ చేసింది. 'భారత అభిమానుల గుండె పగిలిన సన్నివేశం ఇది' అంటూ క్యాప్షన్ జత చేశారు. WHAT A MOMENT OF BRILLIANCE! Martin Guptill was 🔛🎯 to run out MS Dhoni and help send New Zealand to their second consecutive @cricketworldcup final! #CWC19 pic.twitter.com/i84pTIrYbk — ICC (@ICC) July 10, 2019 కాగా అప్పటి 2019 ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డే రోజు కూడా ఆడాల్సి వచ్చింది. జూలై 9, 2019న టాస్ గెలిచి బ్యాటింగ్ ఏంచుకున్న కేన్ విలియమ్సన్ సేనను భూవీ, బుమ్రా జోడి కట్టుదిట్టమైన బౌలింగ్తో ముప్పతిప్పలు పెట్టింది. కివీస్ జట్టులో కెప్టెన్ విలియమ్సన్, రాస్ టేలర్ అర్థసెంచరీలతో రాణించడంతో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. ఈ దశలో మ్యాచ్కు వర్షం అంతరాయం కలగడంతో మ్యాచ్ను రిజర్వ్ డేకు వాయిదా వేసింది. మరుసటి రోజు 240 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ టాప్ ఆర్డర్ విఫలంతో 49.3 ఓవర్లలో 221 పరుగులు వద్ద ఆలౌటైంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement