-
ఈ లింక్పై క్లిక్ చేయవద్దు
సాక్షి, హైదరాబాద్: భారత వాయుసేనలో చేరాలని యువతలో చాలా కలలు కంటుంటారు. ఇలాంటి కలల్నే తమకు అనుకూలంగా మార్చుకుని సైబర్ నేరగాళ్లు అనేక మోసాలకు తెరదీస్తున్నారు. ఇటువంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు యువతను హెచ్చరిస్తున్నారు. భారత వాయుసేనలో చేరాలంటే తాము ఇచ్చే ప్రకటనలోని లింక్పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలంటూ సామాజిక మాధ్యమాౖలెన ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ఎక్స్ వంటి వాటిల్లో సైబర్ నేరగాళ్లు నకిలీ ప్రకటనలు ఇస్తున్నారు. ఇలా అభ్యర్థుల నుంచి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఆ తర్వాత దరఖాస్తు కోసమని, వెరిఫికేషన్ చార్జీల పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరించారు. ఇలాంటి మోసపూరిత ప్రకటనలు నమ్మవద్దని వారు సూచించారు. అధికారిక వెబ్సైట్లలో మాత్రమే వివరాలు తీసుకోవాలని పేర్కొన్నారు. -
ప్రకాశం జిల్లా: కోరిశపాడు జాతీయ రహదారిపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ (ఫొటోలు)
-
HYD: నేటి నుంచి ఏవియేషన్ షో.. ఏ గేటు నుంచి ఎవరెవరికి ప్రవేశమంటే..
హైదరాబాద్: నగరానికే తలమానికమైన ఏవియేషన్ షోకు సర్వం సిద్ధమైంది. బేగంపేట్ ఎయిర్పోర్ట్ వేదికగా ‘వింగ్స్ ఇండియా–2024’ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 21 వరకు నిర్వహించే ఈ షోలో 25 వరకు విమానాలు, హెలికాప్టర్లను ప్రదర్శించనున్నారు. తొలిసారిగా ప్రదర్శనకు వస్తున్న బోయింగ్తో పాటు ఎయిర్ ఇండియా మొదటి హెలికాప్టర్ ఏ350 లాంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మొదటి 2 రోజులు వ్యాపార, వాణిజ్య వేత్తలకు, ఆ తర్వాత రెండు రోజులు సామాన్యులను సైతం అనుమతిస్తారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పాటు ఉన్నతాధికారుల రాకను పురస్కరించుకుని 600 మంది కానిస్టేబుళ్లు, 30 మంది ఇన్స్పెక్టర్లు, ఐదుగురు ఏసీపీలతో పాటు ట్రాఫిక్ సిబ్బంది బందోబస్తులో పాల్గొననున్నారు. విమానాశ్రయాన్ని డాగ్స్క్వాడ్తో అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. ఏ గేటు నుంచి ఎవరెవరు ప్రవేశం.. గేటు 1: చాలెట్ ఎగ్జిబిటర్లు, వీఐపీలు, అతిథులు గేటు 2: కాన్ఫరెన్స్ డెలిగేట్స్, సీఈఓ రౌండ్ టేబుల్కు హాజరయ్యేవారు గేటు 3: నిర్వాహకులు, చాలెట్ ఎగ్జిబిటర్స్, ప్రభుత్వ ప్రతినిధులు గేట్ 4: నిర్వాహకులు, ఎగ్జిబిటర్స్, మీడియా, బిజినెస్ విజిటర్స్ గేటు 5: ఎయిర్పోర్ట్ ఎంప్లాయీస్, ఎగ్జిబిటర్స్, వింగ్స్ ఇండియా విధులు నిర్వర్తించేవారు ► మీడియా, పాస్లు కలిగిన జనరల్ పబ్లిక్, ఎగ్జిట్ గేటు ద్వారా అందరూ బయటకు రావాల్సి ఉంటుంది. ఏవియేషన్ ఎగ్జిబిషన్లో హైలైట్స్ ► కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్య అతిథిగా హాజరై వింగ్స్ ఇండియా–2024ను ప్రారంభిస్తారు. ► ప్రపంప దేశాల నుంచి 130 ఎగ్జిబిటర్స్, 15 హాస్పిటాలిటీ చాలెట్స్.. 106 దేశాల నుంచి 1500 డెలిగేట్స్, 5,000 బిజినెస్ విజిటర్స్ పాల్గొంటారని అంచనా. ► 500కు పైగా బీ2జీ, బీ2బీ సమావేశాలు ► ప్రముఖ హెలికాప్టర్ తయారీ సంస్థలు అగస్తా వెస్ట్ల్యాండ్, బెల్ హెలికాప్టర్స్, రష్యన్ హెలికాప్టర్స్, ఎయిర్బస్ హెలికాప్టర్స్ ప్రదర్శన. ► ప్రముఖ ఇంజిన్ తయారీ సంస్థలు సీఎఫ్ఎం, యూటీసీ, జీఈ ఏవీయేషన్, రోల్స్ రాయిస్, ప్రట్ అండ్ వైట్నీల ఉత్పత్తుల ప్రదర్శన. ► యూఎస్ఏ, కెనడా, ఫ్రాన్స్, జమైకా, మారిషస్, బెల్జియం, జర్మనీ, న్యూజిలాండ్, సౌత్కొరియా, గ్రీక్, మలేసియా, యూఏఈ వంటి దాదాపు 25 దేశాల ప్రతినిధులు ఏవియేషన్ ఎగ్జిబిషన్కు హాజరు కానున్నారు. సారంగ్ టీం స్పెషల్.. ప్రపంచంలోనే ఏరోబాటిక్స్ చేసే ఏకై క జట్టుగా పేరొందిన ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన సారంగ్ టీం ఇప్పటికే నగరానికి చేరుకుంది. హుస్సేన్సాగర్ వద్ద బుధవారం 5 నిమిషాల పాటు తమ విన్యాసాలను ప్రదర్శించిన అనంతరం బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుని అక్కడ రిహార్సల్స్ను కొనసాగించింది. -
‘గగన’ విజయం
సాక్షి, హైదరాబాద్: కలలు కన్నారు.. ఆ కలను నిజం చేసుకునేందుకు కష్టపడ్డారు.. వ చ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటూ గగనతలంలో విజయబావుటా ఎగురవేశారు ఈ యువ ఫ్లయింగ్ కేడెట్లు. ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం అయినా..అంతిమ లక్ష్యం మాత్రం భరతమాత సేవలో తాము ఉండాలన్నదే. ఆదివారం దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో పాల్గొని భారత వాయుసేనలోని వివిధ విభాగాల్లోకి అడుగుపెట్టిన సందర్భంగా యువ అధికారులు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలు ఇలా పంచుకున్నారు. దేశ సేవలో నేను మూడో తరం.. దేశ సేవలో మా కుటుంబ నుంచి మూడో తరం అధికారిగా నేను ఎయిర్ఫోర్స్లో చేరడం ఎంతో సంతోషంగా ఉంది. మా తాతగారు పోలీస్ అఫీసర్గా చేశారు. మా నాన్న కర్నల్ రాజేశ్ రాజస్థాన్లో పనిచేస్తున్నారు. నేను ఇప్పుడు ఎయిర్ ఫోర్స్లో నావిగేషన్ బ్రాంచ్లో సెలక్ట్ అయ్యాను. వెపన్సిస్టం ఆపరేటర్గా నాకు బాధ్యతలు ఇవ్వనున్నారు. ఇది ఎంతో చాలెంజింగ్ జాబ్. శిక్షణ సమయంలో ఎన్నో కఠిన పరిస్థితులను దాటిన తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎలాంటి బాధ్యత అయినా నిర్వర్తించగలనన్న నమ్మకం పెరిగింది. మా స్వస్థలం జైపూర్. నేను బీటెక్ ఎల్రక్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ సిస్టం అమేథీలో చేశాను. – ఫ్లయింగ్ కేడెట్ థాన్యాసింగ్, జైపూర్ నాన్నే నాకు స్ఫూర్తి... మాది వికారాబాద్ జిల్లా చీమల్దరి గ్రామం. నాన్నపేరు శేఖర్. ప్రైవేటు ఉద్యోగి, అమ్మ బాలమణి టైలర్. చిన్నప్పటి నుంచి నాన్న స్ఫూర్తితోనే నేను డిఫెన్స్ వైపు రాగలిగాను. కార్గిల్ యుద్ధంలో సూర్యకిరణ్ పైలెట్ బృందం ఎంతో కీలకంగా పనిచేసిందన్న వార్తలను చూసి మా నాన్న నాకు సూర్యకిరణ్ అని పేరు పెట్టారు. చిన్నప్పటి నుంచే నన్ను డిఫెన్స్కు వెళ్లేలా ప్రోత్స హించారు. అలా నేను ఏడో తరగతిలో డెహ్రాడూన్లోని రాష్ట్రాయ ఇండియన్ మిలిటరీ కాలేజ్కు ప్రవేశ పరీక్ష రాసి 8వ తరగతిలో చేరాను. అందులో రాష్ట్రానికి ఒక్క సీటు మాత్రమే కేటాయిస్తారు. అంత పోటీలోనూ నేను సీటు సాధించాను. అక్కడే ఇంటర్మీడియెట్ వరకు చదివాను. ఆ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీలో రెండేళ్లు శిక్షణ తీసుకున్న తర్వాత ఇండియన్ ఎయిర్ఫోర్స్కి సెలక్ట్ అయ్యాను. – సూర్యకిరణ్, చీమల్దరి, వికారాబాద్ జిల్లా భారత సైన్యంలో చేరడం నా కల.. నా పేరు లతా కౌషిక్. మాది హరియాణా రాష్ట్రంలోని జజ్జర్ జిల్లా దుబల్దాన్ గ్రామం. మానాన్న రైతు. అమ్మ గృహిణి. నేను ఢిల్లీ యూనివర్సిటీలోని మిరండా కాలేజీలో బీఎస్సీ హానర్స్, మ్యాథ్స్ చదివాను. డిఫెన్స్ ఫోర్స్లో చేరడం ద్వారా దేశానికి, ప్రజల రక్షణకు పనిచేయవచ్చని నా కోరిక. ఆడపిల్ల డిఫెన్స్లోకి ఎందుకు అని ఏనాడు మా ఇంట్లో వాళ్లు అనలేదు. మా నాన్నతో సహా కుటుంబం అంతా నన్ను ప్రోత్సహించడంతోనే నేను ఎయిర్ఫోర్స్కి వచ్చాను. లక్ష్యం స్పష్టంగా ఉంటే ఏదీ మనల్ని అడ్డుకోలేదు. అన్ని పరిస్థితులు కలిసి వస్తాయి. – లతా కౌషిక్, ఫ్లయింగ్ ఆఫీసర్, హరియాణా ఎప్పుడూ ఫ్లైట్ ఎక్కని నేను ఫైటర్ పైలట్ అయ్యాను.. నాపేరు జోసెఫ్. నేను ఒక్కసారి కూడా ఫ్లైట్ ఎక్కలేదు. ఇప్పుడు ఏకంగా ఫైటర్ పైలెట్ కావడం సంతోషంగా ఉంది. మా సొంత ప్రాంతం గుంటూరు. నేను టెన్త్ వరకు గుంటూరులో చదివాను. ఎయిర్ఫోర్స్కి రావాలని అనుకోలేదు. ఇంటర్మిడియెట్ తర్వాత ఎన్డీఏ గురించి తెలుసుకుని ఈ కెరీర్ని ఎంచుకున్నాను. మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అయ్యాను. తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వెళ్లగలిగాను. అక్కడ నుంచి భారత వాయుసేనలో సెలక్ట్ అయ్యాను. మా తల్లిదండ్రు ల ప్రోత్సాహంతోనే నేను ఈ స్థాయికి చేరాను. పేరెంట్స్ సపోర్ట్ లేకుండా పిల్లలు ఏదీ సాధించలేరు. తల్లిదండ్రులు పూర్తిగా సహకరిస్తేనే పిల్లలు వారి కలలు నిజం చేసుకోగలుగుతారు. – జోసెఫ్, ఫైటర్ పైలట్, గుంటూరు -
రాజస్థాన్లో కుప్పకూలిన మిగ్-21 యుద్ధవిమానం.. ముగ్గురు మృతి
న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం రాజస్థాన్లో కుప్పకూలింది. హనుమాన్గఢ్ జిల్లా బహ్లోల్నగర్ సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ యుద్ధవిమానం సూరత్గఢ్ నుంచి బయలుదేరినట్లు తెలుస్తోంది. అయితే మిగ్-21 కూలిపోవడానికి ముందే పైలట్ పారాచూట్ సాయంతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ విమాన శకలాలు తగిలి ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు ప్రాణాలు కోల్పోయారు. వీరి ఇంటిపైనే విమానం కూలినట్లు తెలుస్తోంది. సాధారణ శిక్షణలో భాగంగానే బయలుదేరిన విమానం ప్రమాదానికి గురైనట్లు భారత వైమానిక దళం తెలిపింది. పైలట్ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడినట్లు పేర్కొంది. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించింది. #WATCH | Indian Air Force MiG-21 fighter aircraft crashed near Hanumangarh in Rajasthan. Two civilian women died and a man was injured in the incident, the pilot sustained minor injuries. pic.twitter.com/z4BZBsECVV — ANI (@ANI) May 8, 2023 చదవండి: టెక్సాస్ కాల్పుల ఘటన.. హైదరాబాద్ యువతి మృతి -
ముమ్మరంగా 'ఆపరేషన్ కావేరి'.. సూడాన్ నుంచి మరో 135 మంది తరలింపు
సూడాన్ అంతర్గత యుద్ధంలో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కావేరి’ పేరుతో చర్యలు చేపట్టింది. భారత వాయుసేన, నావికా దళాల ద్వారా దశల వారీగా భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా పూడాన్ నుంచి మూడో బ్యాచ్ కూడా బయల్దేరింది. సూడాన్ నుంచి మరో 135 మంది భారతీయులతో రెండో ఇండియన్ ఎయిర్ఫోర్స్ C-130J విమానం సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరుకున్నట్లు విదేశీవ్యవహారాల సహాయమంత్రి వి మురళీధరన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అంతకుముందు మొదటి బ్యాచ్లో భాగంగా భారత నావికాదళానికి చెందిన ‘ఐఎన్ఎస్ సుమేధ’ ద్వారా 278 మంది ప్రయాణికులు సూడాన్ పోర్టు నుంచి సౌదీకి చేరుకున్నారని విదేశీ వ్యవహారాలశాఖ పేర్కొంది. రెండో భాచ్లో 148 మంది భారతీయులను తొలి విమానంలో స్వదేశానికి తరలించినట్లు తెలిపింది. అయితే వీరిలో 160 మంది భారతీయులు ఢిల్లీ చేరుకున్నారు. కాగా సూడాన్లో 3 వేల మందికిపైగా భారతీయులు ఉన్నట్లు గుర్తించారు. Third batch comprising 135 Indians from Port Sudan arrived in Jeddah by IAF C-130J aircraft. Onward journey to India for all who arrived in Jeddah will commence shortly. #OperationKaveri pic.twitter.com/OHhC5G2Pg8 — V. Muraleedharan (@MOS_MEA) April 26, 2023 -
తవాంగ్ ఘర్షణ: ‘ఫైటర్ జెట్స్’ను రంగంలోకి దింపిన భారత్
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికుల నడుమ ఈనెల 9న ఘర్షణ తెలెత్తి మరోమారు సరిహద్దు వివాదంరాజుకుంది. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. అరుణాచల్ ప్రదేశ్లోని చైనా సరిహద్దుల్లో యుద్ధ విమానాలతో గస్తీ నిర్వహిస్తున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. సరిహద్దు ప్రాంతంలో చైనా గగనతల విహారం పెరిగినట్లు గుర్తించిన క్రమంలో ఈ మేరకు భారత్ అప్రమత్తమైనట్లు పేర్కొన్నాయి. చైనా బలగాలను తిప్పికొట్టేందుకు ఇటీవల రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఫైటర్ జెట్స్ గస్తీ పెంచినట్లు వెల్లడించాయి. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) సమీపంలో చైనా గగనతల కార్యకలాపాలు పెరిగిన క్రమంలో గగనతల పెట్రోలింగ్ పెంచినట్లు భారత వైమానిక దళ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. సరిహద్దులో తాజా ఉద్రిక్తతలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. పార్లమెంట్లో కీలక ప్రకటన చేయనున్నారు. తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద యాంగ్త్సే సమీపంలో భారత్, చైనా సైనికల నడుమ ఘర్షణ చోటు చేసుకుంది.ఈ నెల9న జరిగిన ఈ సంఘటన వివరాలను భారత సైన్యం సోమవారం బహిర్గతం చేసింది. ఘర్షణలో ఇరు దేశాల జవాన్లు కొందరు స్వల్పంగా గాయపడ్డారని ఒక ప్రకటనలో వెల్లడించింది. కయ్యానికి కాలుదువ్విన చైనా జవాన్లను మన సైనికులు ధీటుగా ఎదుర్కొన్నారని, గట్టిగా తిప్పికొట్టారని తెలియజేసింది. ఇదీ చదవండి: ఇండో-చైనా సైనికుల ఘర్షణపై రాజ్నాథ్ ఉన్నతస్థాయి సమీక్ష -
ఉన్ని టోపీల ప్రదర్శనలో గిన్నిస్ రికార్డు
న్యూఢిల్లీ: వైమానిక దళ సభ్యుల సతీమణుల సంక్షేమ సంఘం (ఏఎఫ్డబ్ల్యూడబ్ల్యూఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన 41,541 ఉన్ని టోపీల ప్రదర్శన గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. 3 వేల మంది మూణ్నెల్లు శ్రమించి నాలుగు టన్నుల ముడి ఉన్నితో వీటిని అల్లారు. ఏఎఫ్డబ్ల్యూడబ్ల్యూఏ 6వ వార్షికోత్సవం సందర్భంగా వీటిని ప్రదర్శించారు. వచ్చే శీతాకాలంలో అవసరమైన వారికి వాటిని అందించనున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ముఖ్య అతిథిగా హాజరై.. ప్రశంసించారు. గిన్నిస్ రికార్డు గుర్తింపు పత్రాన్ని శనివారం ఏఎఫ్డబ్ల్యూడబ్ల్యూఏ అధ్యక్షురాలు నీతా చౌధరికి అందజేశారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి రిషి నాథ్. గిన్నిస్ రికార్డు పత్రం అందుకున్న సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఐఏఎఫ్ చీఫ్ వీఆర్ చౌధరి తదితరులు ఇలా హర్షం వెలిబుచ్చారు. The culmination of the event was celebrated today on occasion of the AFWWA Day & was attended by Hon'ble RM Shri @rajnathsingh & Hon'ble Smt @smritiirani. A world record was set, as recognised by Guiness World Records,when the caps were put on display at the location.@GWR pic.twitter.com/cuicVVJKuJ — Indian Air Force (@IAF_MCC) October 15, 2022 ఇదీ చదవండి: ప్రిస్క్రిప్షన్పై ‘శ్రీహరి’ మధ్యప్రదేశ్ సీఎం వ్యాఖ్యలు -
భారత వైమానిక దళంలోకి మన ప్రచండ్ (ఫొటోలు)
-
వాయుసేన అమ్ములపొదిలోకి ప్రచండ్ హెలికాఫ్టర్లు
-
పాకిస్తాన్లోకి భారత క్షిపణులు మిస్ఫైర్.. ముగ్గురు అధికారులపై వేటు
సాక్షి,న్యూఢిల్లీ: పాకిస్తాన్లోకి పొరపాటున బ్రాహ్మోస్ క్షిపణులను ప్రయోగించిన ముగ్గురు వాయుసేన అధికారులను విధుల నుంచి తొలగించింది కేంద్రం. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఈ ఘటనపై న్యాయ విచారణ అనంతరం మంగళవారం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం విధుల నుంచి తొలగించిన అధికారుల్లో ఓ గ్రూప్ కెప్టెన్, వింగ్ కమాండర్, స్క్వాడ్రన్ లీడర్ ఉన్నారు. భారత వాయుసేన తాజాగా చెప్పిన వివరాల ప్రకారం ఈ ముగ్గురు అధికారులు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్(SOP)లో చేసిన పొరపాటు వల్లే క్షిపణులు ప్రమాదవశాత్తు పాకిస్తాన్ భూభాగంలో పడ్డాయి. మార్చి 9న జరిగిన ఈ ఘటన అనంతరం బ్రాహ్మోస్ క్షిపుణులు తమ భూభాగంలో పడ్డాయని పాకిస్తాన్ భారత్కు సమన్లు పంపి నిరసన వ్యక్తం చేసింది. అయితే సాంకేతిక లోపం వల్లే క్షిపణులు పొరపాటున పాక్లో పడినట్లు భారత్ వివరణ ఇచ్చింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదనే విషయాన్ని ప్రస్తావించింది. చదవండి: ‘రాజీ’ ఎరుగని బీజేపీ ఎమ్మెల్యే.. ఏడికైతే ఆడికైతది.. తగ్గేదెలే! -
దుండిగల్లో సీజీపీ పరేడ్.. అదుర్స్!
-
క్రమశిక్షణ, అంకితభావం ముఖ్యం
సాక్షి, హైదరాబాద్: భారత వైమానిక దళంలో చేరే అభ్యర్థులు నిరంతరం విజ్ఞాన సాధన కొనసాగించాలని, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీఓఏఎస్) జనరల్ మనోజ్ పాండే సూచించారు. క్రమశిక్షణ, అంకితభావం, వృత్తిపరమైన నైపుణ్యం ఏర్పరుచుకోవాలన్నారు. మన దేశ భద్రతా వ్యవస్థ చాలా విస్తృతమైందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్, రోబోటిక్స్, హైపర్సోనిక్స్ వంటి సాంకేతికతలు ఇకపై సిద్ధాంతాలకు మాత్రమే పరిమితం కావని, యుద్ధ ప్రదేశాల్లోనూ భౌతికంగా అవసరం అవుతాయని పేర్కొన్నారు. ‘ఆత్మనిర్భరత’లో భాగంగా సాయుధ దళాల్లోనూ పలు సంస్కరణలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ప్రతీ యువ అధికారులు ఇతరులకు మార్గదర్శకులుగా నిలిచేలా నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. మహిళలు సాయుధ దళాల్లోకి ప్రవేశించడం స్ఫూర్తిదాయకమని వివరించారు. దుండిగల్లోని ఎయిర్ఫోర్స్ అకాడమీలో శనివా రం కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ) జరిగింది. భారత వైమానిక దళంలోని ‘ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ’లకు చెందిన 165 మంది ఫ్లయిట్ కెడెట్ల శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు మనోజ్ పాండే ప్రెసిడెంట్ కమిషన్లను ప్రదానం చేశారు. భారత నావికాదళం, ఇండియన్ కోస్ట్గార్డ్కు చెందిన అధికారులకు కూడా వింగ్స్ అవార్డులను అందించారు. అనంతరం పిప్పింగ్ సెరిమనీ, కవాతు, తేజస్, సూర్యకిరణ్, సారంగ్ బృందంతో ఏరోబాటిక్ ప్రదర్శనలు జరిగాయి. పైలెట్ల కోర్సులో మొదటి స్థానంలో నిలిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ రాఘవ్ అరోరా.. రాష్ట్రపతి çపతకం, చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ స్వోర్డ్ ఆఫ్ హానర్ అవార్డులను అందుకున్నారు. -
మిస్సైల్ రచ్చ! భారత్పై పాక్ సంచలన ఆరోపణలు
భారత్పై దాయాది పాకిస్థాన్ సంచలన ఆరోపణలకు దిగింది. భారత్కు చెందిన సూపర్సోనిక్ మిస్సైల్ ఒకటి తమ సరిహద్దులో కుప్పకూలిందంటూ గురువారం ఒక ప్రకటన విడుదల చేసి కలకలం రేపింది. ఇది ఉల్లంఘనే అవుతుందని, దీనిపై భారత్ వివరణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. బుధవారం సాయంత్రం సిస్రా(హర్యానా) వైపు నుంచి సూపర్సోనిక్ మిస్సైల్ ఒకటి 124 కిలోమీటర్ల అవతల పాక్ సరిహద్దులో కూలిందని పాక్ ఆరోపించింది. ప్యాసింజర్ ఫ్లయిట్లు తిరిగే ఎత్తులోనే ఈ దూసుకొచ్చిందని, పైగా అది పడిన ప్రాంతం జనావాసమని ప్రకటన ఇచ్చింది. ఈ మేరకు పాక్ మేజర్ జనరల్, ISPR డీజీ అయిన బాబర్ ఇఫ్తికర్ ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు తెలిపాడు. పాకిస్థానీ వైమానిక దళానికి చెందిన ఎయిర్ డిఫెన్స్ ఆపరేషన్స్ సెంటర్.. భారత సరిహద్దు నుంచి వచ్చిన మిస్సైల్ అనుమానిత వస్తువును స్వాధీనం చేసుకుంది. మియా చన్ను సమీపంలో అది పడిపోయింది. ఇది పాకిస్తాన్ గగనతలాన్ని ఉల్లంఘించడమే. ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. కానీ, అక్కడే ఉన్న గోడ మాత్రం నాశనం అయ్యింది అని ఇఫ్తికర్ వెల్లడించాడు. శిథిలాను బట్టి.. అదొక సూపర్ సోనిక్ మిస్సైల్ అయి ఉంటుందని భావిస్తున్నాం (BrahMos supersonic cruise missile గా అనుమానిస్తోంది పాక్). కానీ, దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. భారత్ ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సి ఉంది. ఈ ఘోరమైన ఉల్లంఘనను తీవ్రంగా నిరసిస్తూ.. భవిష్యత్తులో అలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని భారత్ను హెచ్చరిస్తున్నాం అంటూ ప్రసంగించాడు ఇఫ్తికర్. ఇదిలా ఉంటే పాక్ ఆరోపణలపై అటు రక్షణ శాఖ, ఇటు భారత వాయు సేన గానీ స్పందించాల్సి ఉంది. 2005 ఒప్పందం ప్రకారం.. ఇరు దేశాల క్షిపణి పరీక్షలు గనుక నిర్వహిస్తే.. మూడు రోజుల ముందు తెలియజేయడంతో పాటు, ఇరు దేశాలకు ఇబ్బందులు తలెత్తకుండా, నష్టం జరగకుండా నిర్ణీత వ్యవధిలోనే ఆ పరీక్షలను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. -
రంగం లోకి దిగిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్
-
ఆపరేషన్ గంగాకి మోదీ పిలుపు..ముమ్మరంగా తరలింపు చర్యలు!
IAF C-17 Aircraft Bring back Indian Nationals: చర్చలు విఫలమైన నేపథ్యంలో ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ చర్యలు మరింత వేగవంతం చేసింది. అంతేకాదు రష్యా నేరుగా జనావాసాలపై దాడి చేయడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో యుద్ధం మరింత తీవ్రమవుతోందంటూ ఉక్రెయిన్లోని రాయబార కార్యాలయం విద్యార్థులను తక్షణమే కైవ్ని విడిచి వచ్చేయాలని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రధాని మోదీ ఉక్రెయిన్లోని భారతీయుల తరలింపు చర్యలను మరింత వేగవంతం చేసేలా ఆపరేషన్ గంగా చేపట్టాలని నిర్ణయించారు. ఆపరేషన్ గంగాలో భాగంగా సీ-17 భారత వైమానిక దళం తరలింపు ప్రయత్నాలు పాలుపంచుకోవాలని మోదీ పిలుపునిచ్చారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ఐఏఎఫ్ సీ-17 విమానం సుమారు 336 మందిని తీసుకువెళ్లగలదు. అంతేకాదు దీన్ని అఫ్గనిస్తాన్ తరలింపులో ఉపయోగించారు. మానవతా సాయాన్ని మరింత సమర్థవంతంగా అందించడంలో ఇది సహయపడుతుందని అంటున్నారు. అంతేకాదు ఈ భారత వైమానిక దళం ఈ రోజు నుంచే ఆపరేషన్ గంగాలో భాగంగా సీ-17 విమానాలు మోహరించే అవకాశం ఉందని చెప్పారు. ప్రదాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాదు ఈ సమావేశంలో మోదీ ఉక్రెయిన్లోని భారతీయుల భద్రతకు ప్రభుత్వం 24 గంటలూ పని చేస్తుందని చెప్పారని అన్నారు. ఇంకోవైపు ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులకు తాజా సలహాను జారీ చేసింది. కైవ్ను అత్యవసరంగా వదిలివేయాలని, అందుబాటులో ఉన్న రైళ్లలో లేదా మరేదైనా మార్గంలో వెళ్లాలని కోరింది. మరోవైపు భారత్ ఆపరేషన్ గంగా కింద తరలింపు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తోంది. అంతేకాదు ఉక్రెయిన్ చుట్టుపక్కల సరిహద్దుల నుండి తరలింపు ప్రక్రియను సమన్వయం చేయడానికి, వేగవంతం చేయడానికి ప్రభుత్వం నలుగురు కేంద్ర మంత్రులను పంపింది. ఈ మేరకు హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిరెన్ రిజిజు, జనరల్ వీకే సింగ్ సరిహద్దుల వద్ద మొత్తం ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు. (చదవండి: అమ్మా నాకు చాలా కష్టంగా ఉంది!..రష్యన్ సైనికుడి చివరి సందేశం) -
రక్షణమంత్రికి సీడీఎస్ చాపర్ క్రాష్ దర్యాప్తు నివేదిక
-
మేరా భారత్ మహాన్: భగవద్గీత స్ఫూర్తి.. ఆకాశాన్ని అంటిన కీర్తి
Indian Air Force Day 2021:దేశ రక్షణలో సైన్యం పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. మూడు విభాగాలతో రక్షణ, నిఘాతో సరిహద్దుల్లోనే కాదు.. అవసరం పడితే దేశం లోపల కూడా తమ సేవల్ని అందిస్తుంటాయి. అక్టోబర్ 8న అంటే ఇవాళ ఇండియన్ ఎయిర్ఫోర్స్ డే. ఈ సందర్భంగా భారత వాయు సేన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చూద్దాం. ►యునైటెడ్ కింగ్డమ్కి చెందిన రాయల్ ఎయిర్ఫోర్స్ ప్రోత్సాహంతో పుట్టుకొచ్చింది ఈ విభాగం. ►ప్రతీ ఏడాది ఉత్తర ప్రదేశ్ ఘజియాబాద్ ‘హిందాన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్’లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ఉత్సవాలను నిర్వహిస్తారు. ►ఐఏఎఫ్ చీఫ్, సీనియర్ అధికారులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ►ఎయిర్క్రాఫ్ట్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఈ వేడుకలకు. ►భారత వాయు సేన.. అక్టోబర్ 8, 1932న అధికారికంగా బ్రిటిష్ పాలనలో మొదలైంది. ►ఏప్రిల్ 1, 1933 నుంచి నుంచి సేవలు(కేవలం శిక్షణ కోసం) మొదలుపెట్టినప్పటికీ.. పూర్తిస్థాయిలో రెండో ప్రపంచ యుద్ధంలోనే రంగంలోకి దిగింది. ►ఆ టైంలో ఈ విభాగం పేరు.. రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ►ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF).. దేశం తరపున ఆకాశ మార్గానా గస్తీ కాచే, శత్రువులతో పోరాడే కీలక సైన్య విభాగం. ►పాక్, చైనాతో జరిగిన యుద్ధాల్లోనూ ఐఏఎఫ్ సేవలు మరువలేనివి. ►గత 89 ఏళ్లుగా.. ముఖ్యంగా స్వాతంత్ర్యం అనంతరం.. వాయు సేన క్రమక్రమంగా తన సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతోంది. ఈ క్రమంలో బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ను సైతం వెనక్కి నెట్టేసింది. ప్రస్తుతం అమెరికా, చైనా, రష్యాల తర్వాత అతిపెద్ద వాయుసేనను కలిగి ఉన్న వ్యవస్థగా భారత్ నిలిచింది. ►ఐఎఎఫ్ నినాదం ‘నభమ్ స్పర్శమ్ దీప్తమ్’(ఇంగ్లీష్లో టచ్ ది స్కై విత్ గ్లోరీ) అంటే.. ఆకాశాన్ని అంటే కీర్తి అని అర్థం. భగవద్గీతలోని పదకొండవ అధ్యయం నుంచి ఈ వాక్యాన్ని భారత వాయు సేన స్ఫూర్తిగా తీసుకోవడం విశేషం. ►భారత వాయు సేనలో ప్రస్తుతం సుమారు 1,400 ఎయిర్క్రాఫ్ట్లు, లక్షా డెబ్భై వేల మంది సిబ్బంది ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. ►యూపీ హిందాన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్.. ఆసియాలో అతిపెద్ద, ప్రపంచంలో 8వ పెద్ద ఎయిర్ బేస్. అందుకే ఇక్కడ ఉత్సవాల్ని నిర్వహిస్తారు. ►ఆపరేషన్ పుమాలై, ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ మేఘదూత్.. ఇలా ఎన్నో ఆపరేషన్లలో ఐఎఎఫ్ సేవలు మరువలేనిది. ►యుద్ధ సమయంలోనే కాదు.. జాతి ప్రయోజనాల కోసం సైతం పని చేస్తుంది భారత వాయు సేన. గుజరాత్ తుపాన్(1998), సునామీ(2004), ఉత్తరాది వరదల సమయంలో సేవలు అందించింది కూడా. ముఖ్యంగా ఉత్తరాఖండ్ వరదల సమయంలో ‘రాహత్’ ఆపరేషన్ ద్వారా 20 వేల మంది ప్రాణాలు కాపాడగలిగింది ఐఎఎఫ్. ►ఐక్యరాజ్య సమితి శాంతి చర్యల్లోనూ ఐఎఎఫ్ పాల్గొంటోంది. ►వాయు సేనలో మహిళలకు ఉన్నత ప్రాధాన్యం ఉంటోంది. నేవిగేటర్ల దగ్గరి నుంచి పైలట్లు, ఉన్నత స్థాయి పదవుల్లో కొనసాగుతున్నారు. - సాక్షి, వెబ్ స్పెషల్ -
Air Show: ఆకాశంలో అద్భుత విన్యాసాలు
-
జమ్ము కశ్మీర్లో భారత 'వైమాని దళ విన్యాసం'
-
ఉగ్రవాదుల్ని ఎదుర్కొనేలా భారత బలగాలకు వ్యూహాత్మక శిక్షణ !
న్యూఢిల్లీ: తాలిబన్లు అఫ్గనిస్తాన్ను ఆక్రమించిన నేపథ్యంలో సరిహద్దు భద్రతా అంశంలో ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో భారతదేశ సరిహద్దు ప్రాంతంలో మరింత కట్టుదిట్టమైన భద్రత చర్యలతో పాటు సాయుధ బలగాలకు సరికొత్త వ్యూహాత్మక శిక్షణ ఇవ్వాలని కేంద్ర భద్రత సంస్థ సూచించింది. అఫ్గన్ సరిహద్దు ప్రాంతంలో ఉగ్రవాదులు చొరబడకుండా మోహరించి ఉన్న దళాలను సరికొత్త వ్యూహంతో ఎదుర్కొనేలా సంసిద్ధం చేయాలని నొక్కి చెప్పింది. అఫ్గానిస్తాన్లో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వాన్ని చూస్తే అడుగడుగునా పాకిస్తాన్ ముద్ర స్పష్టంగా కనిపించడమే కాక భారత్పై దాడులు చేసిన హక్కానీలకు కీలక పదవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ సరిహద్దు ప్రాంతాలైన పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్, లోతట్టు ప్రాంతాలలో భద్రతా దళాలను మరింతగా బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోమని కోరింది. భద్రత దళాలైన బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, సీఆర్పీఎఫ్ దళాలు అత్యంత ధైర్య సాహసాలతో ఉగ్రవాదులను తిప్పికొట్టగల సామర్థ్యం కలవారని ఆర్మీ ఉన్నతాధికారి ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
జాతీయ రహదారిపై ఐఏఎఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
జైపూర్: కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్.కేఎస్ భదౌరియా కలిసి ప్రయాణిస్తున్న భారత వైమానిక దళానికి చెందిన సీ-130జె సూపర్ హెర్క్యులస్ రవాణా విమానం మాక్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఫెసిలిటీ(ఈఎల్ఎఫ్) డ్రిల్ లో భాగంగా రాజస్థాన్ బార్మర్ సమీపంలోని సట్టా-గాంధవ్ జాతీయ రహదారిపై ల్యాండ్ అయ్యింది. భారత వైమానిక దళానికి చెందిన రవాణా విమానం అత్యవసర ల్యాండింగ్ కోసం జాతీయ రహదారిని ఉపయోగించడం ఇదే మొదటిసారి. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రోడ్డు రవాణా & రహదారి మంత్రి నితిన్ గడ్కరీ కలిసి సంయుక్తంగా రాజస్థాన్ బార్మర్ సమీపంలో ఐఏఎఫ్ అత్యవసర ల్యాండింగ్ కోసం నిర్మించిన సట్టా-గాంధవ్ జాతీయ రహదారిని ప్రారంభించారు. ఈ మాక్ డ్రిల్ విజయవంతం కావడంతో రక్షణ మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. కేవలం 19 నెలల్లో నిర్మించిన సట్టా-గాంధవ్ జాతీయ రహదారిపై నేడు జరిగిన ఈఎల్ఎఫ్ విమాన కార్యకలాపాలను వారు వీక్షించారు. ఐఏఎఫ్ కు చెందిన 32 సైనిక రవాణా విమానం, మీ-17వి5 హెలికాప్టర్ కూడా ఈఎల్ఎఫ్ వద్ద దిగాయి. (చదవండి: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు వాయిదా..?) #WATCH | C-130J Super Hercules transport aircraft with Defence Minister Rajnath Singh, Road Transport Minister Nitin Gadkari & Air Chief Marshal RKS Bhadauria onboard lands at Emergency Field Landing at the National Highway in Jalore, Rajasthan pic.twitter.com/BmOKmqyC5u — ANI (@ANI) September 9, 2021 రాజస్థాన్లోని సట్టా-గాంధవ్ స్ట్రెచ్ను ప్రారంభించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజస్థాన్లోని బర్మేర్ జిల్లాలో సట్టా-గాంధవ్ జాతీయ రహదారి మాదిరిగానే ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 అత్యవసర ల్యాండింగ్ స్ట్రిప్స్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. యుద్ద సమయాలలో ఈ రహదారులు ముఖ్య భూమిక పోషిస్తాయి అని అన్నారు. కోవిడ్-19 ఆంక్షలు ఉన్నప్పటికీ ఐఎఎఫ్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ప్రైవేట్ రంగం చేతులు కలిపి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్ నిర్మాణాన్ని 19 నెలల్లో పూర్తి చేసినందుకు రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు. "బహుళ విభాగాలు, మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయానికి ఇది గొప్ప ఉదాహరణ" అని ఆయన అన్నారు. రాజ్ నాథ్ సింగ్ 3 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐఎఎఫ్ విమానాల ల్యాండింగ్ సరికొత్త ఇండియా చారిత్రాత్మక బలంగా నిర్వచించారు. భారత వైమానిక దళానికి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ కోసం మూడు కిలోమీటర్ల విభాగాన్ని ఎన్హెచ్ఏఐ అభివృద్ధి చేసింది. ఈ మొత్తం జాతీయ రహదారిని(196.97 కిలోమీటర్ల పొడవు) భారత్ మాల ప్రాజెక్టు కింద రూ.765.52 కోట్లు ఖర్చుతో నిర్మిస్తున్నారు. వీటి పనులు జూలై 2019లో ప్రారంభమైతే, జనవరి 2021లో పూర్తి అయ్యాయి. ఈ ప్రాజెక్టు అంతర్జాతీయ సరిహద్దులో ఉన్న బార్మర్, జలోరే జిల్లాల గ్రామాలను కలుపుతుంది. చైనా, పాకిస్తాన్ సహా ఉపఖండంలో శత్రువులు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి మరిన్ని జాతీయ రహదారులు అవసరమని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్ తో పాటు, సాయుధ దళాల అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు కింద కుందన్ పురా, సింఘానియా, బఖసర్ గ్రామాల్లో మూడు హెలిప్యాడ్ లను నిర్మించారు. -
జమ్మూలో మళ్లీ డ్రోన్ల కలకలం
జమ్మూ: జమ్మూలోని మూడు ప్రాంతాల్లో మళ్లీ డ్రోన్లు కనిపించడం కలకలం రేపింది. ఈ పరిణామంతో పోలీసులు, సరిహద్దు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. మిరాన్ సాహిబ్ ప్రాంతంలో మంగళవారం రాత్రి 9.23 గంటలకు ఒక డ్రోన్ కనిపించగా, కలుచక్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 4.40 గంటలకి ఒక డ్రోన్, కుంజ్వానిలో 4.52 గంటలకి మరో డ్రోన్ కనిపించిందని భద్రతా వర్గాలు వెల్లడించాయి. జమ్మూలోని ఎయిర్ఫోర్స్ స్టేషన్పై ఆదివారం డ్రోన్ దాడి జరిగిన దగ్గర్నుంచి ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట డ్రోన్లు కనిపిస్తూనే ఉన్నాయి. జమ్మూలోని భారత వైమానిక దళం స్థావరం వద్ద యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వైమానిక స్థావరంపైనే ఆదివారం డ్రోన్లతో తొలిసారిగా దాడి జరిగిన విషయం తెలిసిందే. డ్రోన్లతో ఏ క్షణంలో ఎలాంటి ముప్పు పొంచి ఉంటుందోనని ఈ వైమానిక స్థావరంలో రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్లు, సాఫ్ట్ జామర్లు ఏర్పాటు చేసినట్టుగా భద్రతా వర్గాలు వెల్లడించాయి. జమ్మూ వైమానిక స్థావరంపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో చైనాకు చెందిన డ్రోన్లు వాడినట్టుగా ఎన్ఐఏ విచారణలో వెల్లడైంది. డ్రోన్ల నుంచి పేలుడు పదార్థాలను జారవిడిచినట్టుగా భావిస్తున్నారు. నైట్ విజన్, నావిగేషన్ వ్యవస్థ కలిగిన డ్రోన్లను ముష్కరులు వాడినట్టుగా భద్రతా అధికారులు వెల్ల డించారు. మరోవైపు రాజౌరి జిల్లాలో ఏ అవసరానికైనా డ్రోన్లను వినియోగించడంపై అధికారులు నిషేధం విధించారు. -
భారత అమ్ములపొదిలో మరో అద్భుతం
భువనేశ్వర్: ప్రపంచంలోనే అత్యంత అధునాతన యంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి ‘హెలీనా’ ప్రయోగానికి సంబంధించిన వీడియోలను భారత వైమానికి దళం విడుదల చేసింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) తయారు చేసిన హెలీనాకు ధ్రువస్త్రా అని నామకరణం చేశారు. ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ బాలసోర్లో జూలై 15, 16 తేదీల్లో క్షిపణి ప్రయోగం జరిగిన సంగతి తెలిసిందే. హెలీనా (హెలికాప్టర్ ఆధారిత నాగ్ మిస్సైల్) ప్రత్యక్ష హిట్ మోడ్తో పాటు టాప్ అటాక్ మోడ్లోనూ లక్ష్యాలను చేధించగలదని అధికారులు వెల్లడించారు. డీఆర్డీవో అభివృద్ధి చేసిన హెలీనా ప్రపంచంలోనే అత్యంత అధునాతన యాంటీ ట్యాంక్ ఆయుధాలలో ఒకటి. ఇందులో అమర్చిన యాంటీ ట్యాంక్ గైడెడె వ్యవస్థ ద్వారా ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా ఇది పనిచేయగలదు. లాక్-ఆన్ బిఫోర్-లాంచ్ మోడ్లో పనిచేసే ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ సీకర్ (ఐఐఆర్) ద్వారా దీనికి మార్గదర్శకాలు అందుతాయి. దీనిలో అమర్చిన అత్యాధునిక టెక్నాలజీ ద్వారా యుద్ధ ట్యాంకులను విచ్చిన్నం చేయగలదు. దేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి హెలీనా సహాయపడుతుందని సైనిక అధికారులు పేర్కొన్నారు. భారత వైమానిక దళంలో మరో కీలక ఆయుధంగా హెలీనా (ధ్రువస్త్రా)ని అభివర్ణిస్తున్నారు. (లద్దాఖ్కు యుద్ధ విమానాలు ) #WATCH Trials of Helicopter-launched Nag Missile (HELINA), now named Dhruvastra anti-tank guided missile in direct and top attack mode. The flight trials were conducted on 15&16 July at ITR Balasore (Odisha). This is done without helicopter. pic.twitter.com/Jvj6geAGLY — ANI (@ANI) July 22, 2020 -
గాంధీ ఆస్పత్రికి అరుదైన గౌరవం
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో కీలకమైన వేదికగా మారిన గాంధీ ఆస్పత్రిలో ఆదివారం (మే 3) రోజు అరుదైన ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి కబళిస్తున్న వేళ.. కరోనా ఫైటర్స్ గా మారి చికిత్స అందిస్తున్న ‘గాంధీ’ వైద్యులపై పూల వర్షం కురవబోతుంది. గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ బారిన పడిన రోగులకు సేవలు అందించేందుకు గాంధీ ఆసుపత్రి వైద్య సిబ్బంది చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. సెలవులను సైతం రద్దు చేసుకొని వైద్యం అందిస్తున్నారు. వీరి కృషి వల్ల ఎందరో బాధితులు కోలుకొని ఇంటికి తిరిగి వెళ్లారు. ఈ నేపథ్యంలో గాంధీ వైద్య సిబ్బందికి అభినందనలు తెలపడానికి ఎయిర్ ఫోర్స్ ముందుకు వచ్చింది. కరోనాని జయిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి సంఘీభావంగా రేపు ఉదయం 9.30 గంటలకు గాంధీ ఆస్పత్రిపై హెలికాఫ్టర్లతో పూల వర్షం కురిపించబోతున్నారు. (చదవండి : వైద్యురాలికి ఘన స్వాగతం.. భావోద్వేగం) గాంధీ ఆసుపత్రి ఆవరణలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద డాక్టర్లు. నర్సులు. తెలంగాణ పోలీసు అధికారులు, మినిస్టీరియల్, పారామెడికల్, 4వ తరగతి సిబ్బంది, భద్రతా సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది సహా అందరూ హాజరు కావాలని హకీంపేటలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అధికారులు కోరారు. వీరందరిపై హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించి అభినందనలు తెలియజేయాలని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నిర్ణయించింది. ఎయిర్ ఫోర్స్ అధికారుల సూచన మేరకు సిబ్బంది అంతా తమ యూనిఫాంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద హాజరు కావాలని.. ఎయిర్ ఫోర్స్ అందించే ప్రశంశలను అందుకోవాలని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ కోరారు. కాగా, వైద్యులు చేస్తున్న కృషికి సంఘీభావంగా దేశ వ్యాప్తంగా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఇండియన్ ఎయిర్ఫోర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న వైద్య సిబ్బందిపై ఆదివారం హెలికాప్టర్లతో పూల వర్షం కురిపించనున్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రైతులూ.. జాగ్రత్త! విత్తనాల కొనుగోలులో.. ఆఫర్లు చూశారో?
RCBని ధోని అవమానించాడా..? ధోనినే ఆర్సీబీ అవమానించిందా..?
'లూసిఫర్2'లో మాఫియా డాన్గా మోహన్లాల్ లుక్ రివీల్
సైక్లింగ్తో మెకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ ప్రమాదాలకు చెక్!
రామోజీ ఈ వయసులో ఇదేం పని... ఇప్పటికైనా మారకపోతే..
కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన.. ఎందుకంటే?
Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
శ్రీకాకుళంలో ఎగిరేది YSRCP జండానే..
కొండెక్కిన చికెన్! మంట పుట్టిస్తున్న మటన్..
హిమాచల్ అడవుల్లోనూ కార్చిచ్చు
తప్పక చదవండి
- కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన.. ఎందుకంటే?
- Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
- కొన్ని గంటల్లోనే నిర్ణయం వెనక్కి తీసుకున్న బీఐఏఎల్
- T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్కు మరోసారి!
- తెలంగాణ డీజీపీ పేరుతో వ్యాపారవేత్త కూతురికి బెదిరింపులు
- MI: ఈ సీజన్లో నిరాశే మిగిలింది: నీతా అంబానీ వ్యాఖ్యలు వైరల్
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- వారి ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తున్న పాయల్ రాజ్పుత్
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
Advertisement