-
‘రాజధాని దొంగల’పై సంచలన నివేదిక
సాక్షి, గుంటూరు: అమరావతి రాజధాని నిర్మాణం పేరిట జరిగిన భూ కుంభకోణంపై సమగ్ర నివేదికను ఏపీ మంత్రి వర్గ ఉప సంఘం రూపొందించింది. అయితే.. రాజధాని ప్రకటనకు ముందస్తు సమాచారంతో భూముల కోనుగోళ్లు జరిగాయని, క్యాపిటల్ సిటీ, రీజియన్ లో భూముల కొనుగోళ్లు అదీ బినామీ పేర్లతో టీడీపీ నేతలు కొనుగోళ్లు చేపట్టినట్టు నివేదికలో వెల్లడైంది. రాజధాని దొంగలపై కేబినెట్ సబ్ కమిటీ రూపొందించిన ఆ నివేదికలో సంచలన విషయాలు వెల్లడి కాగా.. ఈ నివేదిక సాక్షి చేతికి దొరికింది. టీడీపీ నేతలు, బినామీలకు మేలు చేసేలా రాజధాని సరిహద్దుల నిర్ణయం జరిగింది. అలాగే.. లంక, పోరంబోకు,ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీ అక్రమాల గుర్తించింది కేబినెట్ సబ్ కమిటీ. లేండ్ పూలింగ్ స్కీమ్ కోసం రికార్డులు తారుమారు చేసినట్టు నిర్ధారణ కావడంతో పాటు భూ కేటాయింపుల్లోనూ భారీ అక్రమాలకు పాల్పడింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. 1977 అసైన్డ్ భూముల చట్టంతో పాటు 1989 ఎస్సీ, ఎస్టీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించారని నిర్ధారణ అయ్యింది. ఇన్ సైడర్ ట్రేడింగ్పై పక్కా ఆధారాలు బినామీలు, నేతల భూములకు మేలు చేసేలా రాజధాని ఏర్పాటుకై చంద్రబాబు హయాంలోని ప్రభుత్వం తీవ్ర కృషి చేసింది. ఇందుకోసం తెల్లరేషన్కార్డు ఉన్నవాళ్లను బినామీలుగా ఉపయోగించుకున్నారు టీడీపీ నేతలు. 2014 జూన్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు భూముల కొనుగోళ్లు జరగ్గా.. 4 వేల 70 ఎకరాల భూములను ఇన్ సైడర్ ట్రేడింగ్ లో కొనుగోళ్లు చేశారు వాళ్లు. టీడీపీ నేతలు, ప్రముఖులు రాజధాని భూ కుంభకోణం నివేదికలో అసలు దొంగత పేర్లను సైతం మంత్రివర్గ ఉప సంఘం పేర్కొంది. ఇందులో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ సన్నిహితుడు వేమూరు రవికుమార్ ప్రసాద్, మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీఎస్ ఆంజనేయులు, చంద్రబాబు గెస్ట్ హౌస్ యజమాని లింగమనేని రమేష్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, లంకా దినకర్, దూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్ రావు, పుట్టా మహేష్ యాదవ్ పేర్లను నివేదికలో పేర్కొంది ఉప సంఘం. నారా లోకేష్ బినామీ వ్యవహారం.. నారా లోకేష్ బినామీ భూముల వ్యవహారాన్ని మంత్రివర్గ ఉప సంఘం బయటపెట్టింది. వేమూరి రవి కుమార్ కుటుంబం పేరుతో భారీగా భూముల కొనుగోళ్లు జరిగినట్లు గుర్తించింది. సుమారు 62.77 ఎకరాల భూములు కొనుగోలు చేసినట్టు తేలింది. 👉 అలాగే.. భార్యా, బంధువుల పేర్లతో భూములు కొనుగోలు చేశాడు చంద్రబాబు గెస్ట్ హౌస్ యజమాని లింగమనేని రమేష్. 👉 ఇక మాజీ మంత్రి నారాయణ బినామీ దందాను నివేదిక బయటపెట్టింది. సన్నిహితులు ఆవుల మునిశేఖర్, రాపూరు సాంబశివరావు, పొట్టూరి ప్రమీల, కొత్తపు వరుణ కుమార్ పేర్లతో 55. 27 ఎకరాలు భూముల్ని మాజీ మంత్రి నారాయణ కొనుగోలు చేశారు. 👉 బినామీ పేర్లతో 68.6 ఎకరాల భూమి కొనుగోలు చేశారు.. మాజీ ఎమ్మెల్యే కొమ్మాల పాటి శ్రీధర్. 👉 ఇక గుమ్మడి సురేష్ పేరుతో 38.84 ఎకరాల భూమి కొన్నాడు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. 👉 మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు మైత్రీ ఇన్ ఫ్రా పేరుతో 40 ఎకరాలు కొనుగోలు చేసినట్లు బట్టబయలైంది. 👉 పేర్లు, రికార్డులు, ఆధారాలతో సహా నివేదిక సమర్పించింది మంత్రి వర్గ ఉప సంఘం ఆ జీవో టీడీపీ నేతల కోసమే.. టీడీపీ నేతల కోసం సిఆర్డీయే పరిధి మార్చేసింది చంద్రబాబు హయాంలోని టీడీపీ ప్రభుత్వం. ఇప్పుడు సంక్షేమ పథకాలకు, జీవోలకు అడ్డుపుడుతున్న ఇదే పచ్చ నేతల కోసం.. అప్పట్లో జీవో జారీ చేసింది బాబు సర్కార్. 👉 సీఆర్డీయే పరిధిలో 524.545 ఎకరాల భూముల కోసం సరిహద్దులు మార్పు చేసింది. అలాగే నటుడు.. ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడి సంస్థ వీబీసీ కెమికల్స్ కు భూముల కేటాయింపు చేసింది. జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో 498 ఎకరాల కేటాయించి.. భూములు కేటాయించాక సిఆర్డీయే పరిధి మారుస్తూ జీవో జారీ చేసింది. 👉 ఇక.. సత్తెనపల్లి మండలంలో దూళిపాళ్లలో కోడెల శివప్రసాద్(దివంగత మాజీ స్పీకర్)కు భూములు ఉన్నాయి. మొవ్వ మండలం పెద ముట్టేవి, చిన ముట్టేవిలో లింగమనేనికి భూములు ఉన్నాయి. భూముల్ని కేటాయించాక పరిధి మారుస్తూ 207 జీవో విడుదల చేసింది టీడీపీ ప్రభుత్వం. ఇక కొనకంచిలో యలమంచిలి శివలింగ ప్రసాద్ భూముల కోసం సీ ఆర్డీయే సరిహద్దుల్లో మార్పులు చేసింది. సంస్థల కేటాయింపుల్లోనూ.. వివిధ సంస్థలకు కేటాయించిన భూముల్లోనూ అక్రమాలను గుర్తించింది ఏపీ కేబినెట్ సబ్ కమిటీ. ఆ వివరాలను నివేదికలో పొందుపరిచింది. ఐదు ప్రైవేట్ సంస్థలకు 850 ఎకరాల భూమిని అక్రమంగా కేటాయించినట్లు తేలింది. అలాగే.. సింగపూర్ తో ఒప్పందంలోనూ లోపాలను గుర్తించిన మంత్రివర్గ ఉప సంఘం.. మొత్తంగా టీడీపీ హయాంలో జరిగిన భూ దందాను, అక్రమాలను సమగ్రమైన నివేదిక ద్వారా ప్రభుత్వానికి సమర్పించింది. ఇదీ చదవండి: చంద్రబాబు హయాం అవినీతిపై సిట్ దర్యాప్తునకు సుప్రీం గ్రీన్ సిగ్నల్ -
దేవినేని ఉమా సోదరుడు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి : టీడీపీ ప్రభుత్వం హయాంలో చోటుచేసుకున్న అవినీతిపై టీడీపీ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని పేరుతో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడట్టు తేటతెల్లమవుతోందని అన్నారు. టీడీపీ నేతల అవినీతిపై విచారణ జరిపితే ప్రముఖుల బండారం బయటపడుతుందని పేర్కొన్నారు. శనివారం విజయవాడలో ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. మాజీమంత్రి దేవినేని ఉమా అండదండలతో చాలామంది అక్రమాలకు పాల్పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కృష్ణా జిల్లా కంచికచర్ల మాజీ మార్కెటింగ్ చైర్మన్ లక్ష్మీనారాయణ సామాన్య రైతు కుటుబానికి చెందిన వారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో పెద్ద ఎత్తున అవినీతి సొమ్ము కూడగట్టారు. రాజధాని ప్రాంతంలో బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేసి ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడ్డారు. సీఐడీ సోదాల్లో దొరికింది చాలా తక్కువ. వారి అవినీతిపై మరింత లోతుల్లోకెళ్లి విచారణ జరిపితే చాలా అక్రమాలు బయటపడతాయి. లక్ష్మీనారాయణ కొడుకు సీతారామరాజు రియల్ ఎస్టేట్ కంపెనీలో సోదాలు చేస్తే మొత్తం వ్యవహారం బయటపడుతుంది. ఇన్సైడర్ ట్రేడింగ్లో లక్ష్మీనారాయణ వెనక ఉన్న ప్రముఖ నేతల బండారం కూడా బహిర్గతం అవుతుంది. మాజీమంత్రి దేవినేని ఉమా అండదండలతో కంచికచర్లలో చాలామంది అక్రమాలకు పాల్పడ్డారు. సహకార బ్యాంకు రుణాల గోల్మాల్లో కూడా దేవినేని ఉమా అండదండలు ఉన్నాయి’ అని అన్నారు. -
‘టీడీపీ నేతలు దళితుల భూములను లాక్కున్నారు’
సాక్షి, అమరావతి: దళితుల భూములను మభ్యపెట్టి, భయపెట్టి మరీ టీడీపీ నేతలు లాక్కున్నారని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ దొంగల ముసుగులు తొలగుతున్నాయని తెలిపారు. టీడిపీకి చెందిన నేతలు నారాయణ, పత్తిపాటి పుల్లారావులపై సీఐడీ నమోదు చేసిన కేసులే అందుకు ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. తాజాగా దళిత మహిళ బుజ్జమ్మ ఫిర్యాదుతో మాజీ మంత్రుల భూ భాగోతం బయపడిందని ఆయన మండిపడ్డారు. బుజ్జమ్మ లాంటి బాధిత దళితులు రాజధాని ప్రాంతంలో చాలామంది ఉన్నారని అనిల్ కుమార్ తెలిపారు. చదవండి: ఇన్సైడర్ ట్రేడింగ్: పత్తిపాటి, నారాయణపై కేసులు సీఐడీ పూర్తి స్థాయిలో విచారణ చేసి.. ఇన్సైడర్ ట్రేడింగ్ కలుగులో ఉన్న టీడీపీ నేతల బండారాన్నీ బయటపెట్టాలి పేర్కొన్నారు. పేదల పేరుతో భూములు కొనుగోలు చేసిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. బినామీల పేర్లతో కొనుగోలు చేసిన భూములను కాపాడుకునేందు పరిపాలన వికేంద్రీకరణను టీడీపీ అడ్డుకుంటుందని అనిల్ కుమార్ మండిపడ్డారు. టీడీపీ నేతలు మండలి చైర్మన్పై ఒత్తిడి చేసి అప్రజాస్వామిక నిర్ణయం తీసుకొనేలా చేశారని అనిల్ కుమార్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. చదవండి: ఇన్సైడర్ ట్రేడింగ్పై సమగ్ర విచారణ -
'ఆ ఎలుకలన్నీ ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి'
అమరావతి: రాజధాని అంశంలో చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ ద్వారా విరుచుకుపడ్డారు. ఇన్ సైడర్ ట్రేడింగులో భూములు చౌకగా కొట్టేసిన ఎలుకలన్నీ కలుగుల్లో నుంచి బయటికొస్తున్నాయంటూ ధ్వజమెత్తారు. పరువు నష్టం దావా వేస్తామని, దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండని సవాళ్లు విసురుతున్నారని ఆయన ట్వీట్ చేశారు. సీఐడీ లేదా సీబీఐతో దర్యాప్తు జరిపించమని లేఖలు రాయండి మీరు నిప్పులో తుప్పులో తేలుతుంది అంటూ సవాలు విసిరారు. చదవండి: అందుకే ప్రజలు మిమ్మల్ని తరిమికొట్టారు 'విక్రమార్కుడు- భేతాళ కథల్లోని భేతాళుడితో పోల్చదగ్గ వ్యక్తి చంద్రబాబు. రకరకాల మ్యానిప్యులేషన్లతో తప్పించుకుంటూ వస్తున్నాడు. చేసిన తప్పుల నుంచి శాశ్వతంగా ఎవరూ బయట పడలేరని త్వరలోనే ఆయనకు అర్థమవుతుంది. కుతంత్రాలతో ప్రజలను రెచ్చగొట్టి తను రక్షణ పొందాలని చూస్తుంటాడు' అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. గతంలో కూడా 'ఎలక్షన్ల ముందు కూడా ఇలాగే దుష్ప్రచారం చేశారు. వైఎస్ జగన్ సీఎం అయితే భూములు లాక్కుంటారని, ఇళ్లలోంచి వెళ్లగొడతారని, రౌడీరాజ్యం వస్తుందని భయానక దృశ్యాలు చూపించారు. ప్రజలు మిమ్మల్నే అధికారం నుంచి విసిరి కొట్టి బుద్ధి చెప్పారు. అయినా అవే గోబెల్స్ ప్రచారాలు చేస్తున్నారంటూ' మండిపడ్డారు. మరో ట్వీట్లో.. 'తీసేసిన తహశీల్దారులంతా పళ్లు పటపట కొరుకుతున్నారు. విషం కక్కడంలో పోటీలు పడుతున్నారు. వైఎస్ జగన్ గారి నివాసం మీ హయాంలోనే పూర్తయింది. అనుమతి లేకపోతే అప్పుడు నోళ్లెందుకు పెగల్లేదు అంటూ విమర్శించారు. లింగమనేని గెస్ట్ హౌజులా నదిని పూడ్చి కట్టింది కాదు కదా. తోక కనిపించకున్నా అదిగో పులి అనే బ్యాచ్ తయారైందంటూ' మరో ట్వీట్లో విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. -
ఇన్సైడర్ ట్రేడింగ్లో టీడీపీ నేతలు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement