-
మరో క్రికెట్ లీగ్కు విస్తరించనున్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్
ఐపీఎల్లో అమల్లో ఉన్న ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన త్వరలో మరో పాపులర్ క్రికెట్ లీగ్కు విస్తరించనుందని తెలుస్తుంది. 2023 ఐపీఎల్ సీజన్లో తొలిసారి పరిచయం చేయబడిన ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ 2025 ఎడిషన్ నుంచి సౌతాఫ్రికా టీ20 లీగ్లోనూ అమల్లోకి రానున్నట్లు సమాచారం. ఈ రూల్కు ఆమోదం లభిస్తే ఐపీఎల్ తరహా మెరుపులు సౌతాఫ్రికా టీ20 లీగ్లోనూ చూసే అవకాశం ఉంటుంది.వాస్తవానికి సౌతాఫ్రికా టీ20 లీగ్లోనూ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన గతేడాదే అమల్లోకి రావాల్సి ఉండింది. అయితే ఈ రూల్ గురించి చర్చ జరిగే సమయానికి అన్ని ఫ్రాంచైజీలు జట్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసుకున్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అమల్లో ఉంటే జట్ల ఎంపిక వేరేలా ఉంటుంది కాబట్టి అన్ని ఫ్రాంచైజీలు అప్పట్లో దీనికి నో చెప్పాయి. ఈ రూల్ వల్ల ఐపీఎల్ రక్తి కడుతుండటంతో తాజాగా సౌతాఫ్రికా లీగ్ దీన్ని పునఃపరిశీలనలోకి తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు కార్యాచరణ సిద్దం చేస్తుంది.ఇదిలా ఉంటే, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల అదనపు ఆటగాడిని ఆడించొచ్చనే మాట తప్పితే పెద్దగా ప్రయోజనాలేమీ లేకపోగా చాలా మైనస్లు ఉన్నాయి. ఈ రూల్ వల్ల సంప్రదాయ క్రికెట్ చచ్చిపోతుందని చాలా మంది దిగ్గజాలు ఆరోపిస్తున్నారు. రూల్ వల్ల ఆల్రౌండర్ల భవిష్యత్తు ప్రశ్నార్దకంగా మారుతుందని అంటున్నారు. ఈ రూల్ అమల్లో ఉంటే బ్యాటర్ లేదా బౌలర్వైపే మొగ్గు చూపుతారు కాని ఆల్రౌండర్లను పట్టించుకోరని వాదిస్తున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై రోహిత్ శర్మ లాంటి దిగ్గజ ప్లేయర్ కూడా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.ఆటను రక్తి కట్టించడం కోసం ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ను ఐపీఎల్లో అమలు చేస్తుంటే దీని ప్రభావం జాతీయ జట్టు ఆల్రౌండర్లపై పడుతుందని అన్నాడు. శివమ్ దూబే లాంటి ఆల్రౌండర్లు కేవలం బ్యాటింగ్కు మాత్రమే పరిమితమవుతున్నారని వాపోయాడు. జాతీయ జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఇది చాలా ప్రమాదమైన నిబంధన అని తెలిపాడు.కాగా, ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన అమల్లో అంటే రెగ్యులర్ క్రికెట్కు భిన్నంగా 11 మందితో కాకుండా 12 మంది ఆటగాళ్లను బరిలోకి దించే అవకాశం ఉంటుంది. అవసరాల దృష్ట్యా స్పెషలిస్ట్ బ్యాటర్లో లేదా స్పెషలిస్ట్ బౌలర్లో జట్లు బరిలోకి దించుతాయి. దీని వల్ల ఆల్రౌండర్లకు అన్యాయం జరుగుతుంది. వీరికి పెద్దగా అవకాశాలు రావు. -
కౌంటీల్లో ఆడనున్న సన్రైజర్స్ మాజీ బౌలర్
సన్రైజర్స్ మాజీ పేసర్, టీమిండియా బౌలర్ సిద్దార్థ్ కౌల్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ 2024 సీజన్ కోసం నార్తంప్టన్షైర్ కౌంటీ ఇతన్ని ఎంపిక చేసుకుంది. ఈ మేరకు నార్తంప్టన్షైర్ కౌంటీ ఓ ప్రకటన విడుదల చేసింది. మే 10 నుంచి గ్లోసెస్టర్షైర్తో జరుగబోయే మ్యాచ్లో సిద్దార్థ్ నార్తంప్టన్షైర్కు ప్రాతినిథ్యం వహిస్తాడు. సిద్దార్థ్ తొలిసారి ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు క్రిస్ ట్రెమెయిన్కు ప్రత్యామ్నాంగా సిద్దార్థ్ను నార్తంప్టన్షైర్ ఎంపిక చేసుకుంది. 33 ఏళ్ల సిద్దార్థ్ 2023 సీజన్ వరకు ఐపీఎల్లో బిజీగా ఉన్నాడు. గత సీజన్లో అతను ఆర్సీబీకి ఆడాడు. సిద్దార్థ్ ఐపీఎల్ అరంగేట్రం సీజన్లో కేకేఆర్కు, ఆతర్వాత 2013-2014 వరకు ఢిల్లీ డేర్డెవిల్స్కు.. 2016-2021 వరకు సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించాడు. సన్రైజర్స్కు ఆడుతున్నప్పుడు సిద్దార్థ్ చాలా పేరు వచ్చింది. అక్కడి ప్రదర్శనలతోనే అతను టీమిండియాకు ఎంపికయ్యాడు. దేశవాలీ క్రికెట్లో పంజాబ్కు ఆడే సిద్దార్థ్కు ఫస్ట్క్లాస్ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇతను పంజాబ్ తరఫున 59 మ్యాచ్ల్లో 205 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 12 ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. సిద్దార్థ్ టీమిండియా ఛాంపియన్గా నిలిచిన 2008 అండర్-19 ప్రపంచకప్లో సభ్యుడిగా ఉన్నాడు. ఆ మెగా టోర్నీలో యువ భారత్ విరాట్ కోహ్లి సారథ్యంలో టైటిల్ గెలిచింది. టీమిండియా తరఫున 3 వన్డేలు, 2 టీ20లు ఆడిన సిద్దార్థ్ ఐపీఎల్ కెరీర్లో 55 మ్యాచ్లు ఆడి 58 వికెట్లు పడగొట్టాడు. -
IPL 2024: పిచ్చెక్కిస్తున్న సన్రైజర్స్.. ఈసారి టైటిల్ పక్కా..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ఏ రేంజ్లో రెచ్చిపోతున్నారో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ సీజన్లో ఆరెంజ్ ఆర్మీ గతంలో ఎన్నడూ లేనంతగా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఇంతటి సమతూకమైన జట్టు బహుశా పొట్టి క్రికెట్ చరిత్రలో ఎక్కడా లేదనే చెప్పవచ్చు. బ్యాటింగ్ విభాగంలో సన్రైజర్స్ ప్రదర్శన న భూతో న భవిష్యతి అన్న చందంగా ఉంది. ఈ జట్టులో ఉన్నటువంటి విధ్వంసకర వీరులు యావత్ పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఏ జట్టులోనూ లేరు. ఓపెనర్ల దగ్గరి నుంచి ఎనిమిది, తొమ్మిదో స్థానం ఆటగాళ్ల వరకు అందరూ మెరుపు వీరులే ఉన్నారు.ఓపెనర్లు అభిషేక్, హెడ్ ఊచకోత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వీరిద్దరు తమకెదురైన ప్రతి బౌలర్ను గడగడలాడిస్తున్నారు. వీరి దెబ్బకు బ్యాటింగ్ రికార్డులు ఒక్కొటిగా బద్దలవుతూ ఉన్నాయి. వీరిద్దరి తర్వాత బ్యాటింగ్కు దిగే మార్క్రమ్, క్లాసెన్ విధ్వంసం ఇంకో లెవెల్లో ఉంది. వీరు కూడా తమేమీ తక్కువ కాదు అన్నట్లు విధ్వంసం సృస్టిస్తున్నారు.మార్క్రమ్ గత కొన్ని మ్యాచ్లుగా లయ తప్పినట్లు కనిపిస్తున్నా క్లాసెన్ మాత్రం అవకాశం దొరికిన ప్రతిసారి రెచ్చిపోతున్నాడు. ఈ నలుగురితో పాటు యువ ఆల్రౌండర్లు నితీశ్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్లు కూడా తమ దాకా వస్తే మెరుపులు మెరిపిస్తున్నారు.బౌలింగ్ విభాగంలో సైతం సన్రైజర్స్ చాలా పటిష్టంగా ఉంది. స్వింగ్ సుల్తాన్ భునేశ్వర్ కుమార్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇతనికి కమిన్స్, నటరాజన్, ఉనద్కత్ తోడవుతున్నారు. నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్తో ఐపీఎల్ అరంగేట్రం స్పిన్నర్ విజయ్కాంత్ వియాస్కాంత్ పర్వాలేదనిపించాడు. షాబాజ్ అహ్మద్, నితీశ్ రెడ్డి కూడా బంతితో రాణిస్తున్నారు.సన్రైజర్స్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలతో పాటు ఫీల్డింగ్లోనూ పటిష్టంగా ఉంది. లక్నోతో జరిగిన మ్యాచ్లో నితీశ్, సన్వీర్ సింగ్ పట్టిన క్యాచ్లే ఇందుకు నిదర్శనం. ఈ సీజన్లో సన్రైజర్స్ బెంచ్ కూడా చాలా పటిష్టంగా ఉంది. ఎంతలా అంటే.. బెంచ్పై ఉన్న ఆటగాళ్లతో మరో సమతూకమైన జట్టును తయారు చేయవచ్చు. మొత్తంగా ఈ సీజన్లో ఆరెంజ్ ఆర్మీ గతంలో ఎన్నడూ లేనట్లు అత్యంత పటిష్టంగా కనిపిస్తూ టైటిల్ దిశగా పరుగులు పెడుతుంది. ఈసారి సన్రైజర్స్ టైటిల్ ఎగరేసుకుపోవడం పక్కా అని అభిమానులు ధీమాగా ఉన్నారు. విశ్లేషకులు, మాజీలు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. -
ఐపీఎల్లో నేటి (మే 9) మ్యాచ్.. ఆర్సీబీతో పంజాబ్ 'ఢీ'.. తప్పక గెలవాలి
ఐపీఎల్లో ఇవాళ మరో ఆసక్తికర సమరం జరుగనుంది. ప్లే ఆఫ్స్ బెర్త్పై దాదాపుగా ఆశలు వదులుకున్న పంజాబ్ కింగ్స్.. ఇంచుమించు అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్న ఆర్సీబీని ఢీకొట్టనుంది. ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.ఇరు జట్లలో ఏ జట్టు ప్లే ఆఫ్స్కు చేరాలన్నా ఈ మ్యాచ్తో పాటు మిగిలిన మ్యాచ్లన్నీ (రెండు) భారీ తేడాతో గెలవాల్సి ఉంది. ఇలా జరిగినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుందని గ్యారెంటీ లేదు. ఫైనల్ ఫోర్ రేసులో ఉన్న మిగతా జట్ల జయాపజయాలపై ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.ప్రస్తుతం ఆర్సీబీ, పంజాబ్ 11 మ్యాచ్లు ఆడి చెరి నాలుగు మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. పంజాబ్తో పోలిస్తే ఆర్సీబీ నెట్ రన్రేట్ కాస్త మెరుగ్గా ఉంది. ఆర్సీబీ -0.049 రన్రేట్ కలిగి ఉండగా.. పంజాబ్కు -0.049 ఉంది. ఆర్సీబీ ఈ మ్యాచ్ తరువాత ముంబై, గుజరాత్లతో తలపడాల్సి ఉండగా..పంజాబ్ ఈ మ్యాచ్ తర్వాత పటిష్టమైన రాజస్థాన్, సన్రైజర్స్ను ఢీకొట్టాల్సి ఉంది.పంజాబ్తో పోలిస్తే ఆర్సీబీ కాస్త బలహీనమైన ప్రత్యర్దులతో తలపడాల్సి ఉన్న నేపథ్యంలో ఆ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. ఆర్సీబీ ఈ మ్యాచ్తో పాటు ముంబై, గుజరాత్లపై భారీ తేడాతో గెలిస్తే 14 పాయింట్లు ఖాతాలో ఉండి సీఎస్కే (12), ఢిల్లీ (12), లక్నోలతో (12) ప్లే ఆఫ్స్ బెర్తు కోసం పోటీపడే అవకాశం ఉంది.ఢిల్లీ, లక్నో ఇంకా రెండ్రెండు మ్యాచ్లు, సీఎస్కే మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. కేకేఆర్ (16), రాజస్థాన్ (16) పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉండి ప్లే ఆఫ్స్ బెర్తులను దాదాపుగా ఖరారు చేసుకోగా.. సన్రైజర్స్ (14).. సీఎస్కే, ఢిల్లీ, లక్నోల కంటే కాస్త మెరుగైన స్థానంలో ఉంది.సన్రైజర్స్ తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్లో భారీ తేడాతో గెలిచిన ప్లే ఆఫ్స్ మూడో బెర్త్ ఆ జట్టు వశమే అవుతుంది. అప్పుడు మిగిలిన నాలుగో బెర్త్ కోసం సీఎస్కే, ఢిల్లీ, లక్నో, ఆర్సీబీ నువ్వా నేనా అన్నట్లు పోటీపడాల్సి ఉంటుంది. నిన్న లక్నోపై సన్రైజర్స్ భారీ విజయం సాధించడంతో ఈ సీజన్లో ముంబై పోరాటం అధికారికంగా ముగిసింది. ఆ జట్టు మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉన్నా వాటి ఫలితంతో సంబంధం లేకుండా లీగ్ నుంచి నిష్క్రమించింది.తుది జట్లు (అంచనా)..పంజాబ్: జానీ బెయిర్స్టో, రిలీ రొస్సో, శశాంక్ సింగ్, సామ్ కర్రన్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్కీపర్), అశుతోష్ శర్మ, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్ [ఇంపాక్ట్ సబ్: ప్రభ్సిమ్రన్ సింగ్]ఆర్సీబీ: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్వెల్, విల్ జాక్స్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, కర్ణ్ శర్మ, స్వప్నిల్ సింగ్, యశ్ దయాల్, విజయ్కుమార్ వైశాఖ్, మహ్మద్ సిరాజ్ [ఇంపాక్ట్ సబ్: రజత్ పాటిదార్] -
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గతంలో ఎన్నడూ లేని విధంగా సిక్సర్ల మోత మోగుతుంది. ఈ సీజన్ మరో 18 మ్యాచ్లు మిగిలుండగానే 1000 సిక్సర్ల అత్యంత అరుదైన మైలురాయిని తాకింది. సన్రైజర్స్తో ఇవాళ (మే 8) జరుగుతున్న మ్యాచ్లో కృనాల్ పాండ్యా కొట్టిన సిక్సర్తో ఈ సీజన్లో 1000 సిక్సర్లు పూర్తయ్యాయి. ఈ మైలురాయిని చేరుకునే క్రమంలో ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టింది. వెయ్యి సిక్సర్ల మార్కును అత్యంత వేగంగా చేరుకున్న సీజన్గా ఐపీఎల్ 2024 సరికొత్త చరిత్ర సృష్టించింది.1000TH SIXES IN IPL 2024...!!!! 🤯- THE MOST CRAZIEST IPL SEASON EVER. 🔥 pic.twitter.com/mfYwS6fbUY— Tanuj Singh (@ImTanujSingh) May 8, 2024ఐపీఎల్ చరిత్రలో 2022 (1062 సిక్సర్లు), 2023 (1124 సిక్సర్లు), 2024 సీజన్లలో మాత్రమే 1000కి పైగా సిక్సర్లు నమోదు కాగా.. ఈ సీజన్లోనే అత్యంత వేగంగా ఆ మార్కు తాకింది. 2022 సీజన్లో ఈ మార్కును తాకేందుకు 16269 బంతులు అవసరమైతే.. గత సీజన్లో 15390 బంతులు.. ఈ సీజన్లో అన్నిటికంటే తక్కువగా 13079 బంతుల్లోనే వెయ్యి సిక్సర్లు పూర్తయ్యాయి.సన్రైజర్స్-లక్నో మ్యాచ్ విషయానికొస్తే.. హైదరాబాద్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో లక్నో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 18 ఓవర్లు పూర్తయ్యాక లక్నో స్కోర్ 4 వికెట్ల నష్టానికి 131 పరుగులుగా ఉంది. డికాక్ (2), స్టోయినిస్ (3), కృనాల్ పాండ్యా (24), రాహుల్ (29) ఔట్ కాగా.. పూరన్ (30), బదోని (39) క్రీజ్లో ఉన్నారు. భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన స్పెల్తో (4-0-12-3) లక్నోను దారుణంగా దెబ్బ కొట్టగా.. కమిన్స్ ఓ వికెట్ పడగొట్టాడు. కృనాల్ను కమిన్స్ అద్భుతమైన త్రోతో రనౌట్ చేశాడు. -
విమానం దారి మళ్లింపు... వారణాసిలో కోల్కతా జట్టు
న్యూఢిల్లీ: కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లకు సోమవారం రాత్రి కునుకు లేకుండా గడిచింది. క్రికెటర్లు ప్రయాణించిన విమానం లక్నో నుంచి కోల్కతాకు బయలుదేరాల్సి ఉండగా... ప్రతికూల వాతావరణంతో పలుమార్లు దారి మళ్లించారు. వారి చార్టర్ ఫ్లయిట్ను తొలుత గువాహటికి మళ్లించారు. అక్కడి నుంచి కోల్కతాకు క్లియరెన్స్ రావడంతో టేకాఫ్ అయిన విమానానికి మళ్లీ వాతావరణం ఏమాత్రం అనుకూలించలేదు. దీంతో ఉన్నపళంగా ఫ్లయిట్ను వారణాసి ఎయిర్పోర్ట్కు మళ్లించాల్సి వచి్చంది. అలా తీవ్రమైన ప్రయాణ బడలిక, క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల మధ్య ఆటగాళ్లు సోమవారమంతా వారణాసిలోని హోటల్లో గడపాల్సి వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం తర్వాత తమ విమాన ప్రయాణం ఉండటంతో ఈలోపు కోల్కతా జట్టు క్రికెటర్లు వారణాసిలో కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం తర్వాత నైట్రైడర్స్ జట్టు కోల్కతాకు చేరుకోగలిగింది. ఈ నెల 11న సొంతగడ్డపై కోల్కతా నైట్రైడర్స్ తమ తదుపరి లీగ్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. -
MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
2024 ఐపీఎల్ సీజన్ గత సీజన్లకు భిన్నంగా జోరుగా సాగుతుంది. ఈ సీజన్లో దాదాపుగా ప్రతి మ్యాచ్లో పరుగుల వరద పారడంతో పాటు భారీ సంఖ్యలో మెరుపు ఇన్నింగ్స్లు నమోదవుతున్నాయి. నిన్న (మే 6) ముంబై-ఎస్ఆర్హెచ్ మ్యాచ్లోనూ ఇలాంటి ఓ మెరుపు ప్రదర్శన నమోదైంది. ముంబై ఆటగాడు సూర్యకుమార్ (51 బంతుల్లో 102 నాటౌట్; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) సునామీ శతకంతో విరుచుకుపడి తన జట్టుకు అపురూప విజయాన్నందించాడు. ఈ క్రమంలో ఓ ఆల్టైమ్ రికార్డు సమం అయ్యింది.ఓ సీజన్లో అత్యధిక సెంచరీల రికార్డును ప్రస్తుత సీజన్ సమం చేసింది. 2023 సీజన్లో రికార్డు స్థాయిలో 12 సెంచరీలు (అన్ని జట్లు కలిపి) నమోదు కాగా.. ఈ సీజన్లో ఇప్పటికే 12 సెంచరీలు పూర్తయ్యాయి. ఇంకా 19 మ్యాచ్లు ఆడాల్సి ఉండగానే భారీ సంఖ్యలో నమోదు కావడంతో ఈ సీజన్ గత సీజన్ల కంటే భిన్నమని మరోసారి రుజువైపోయింది.ఐపీఎల్లో ఏ యేడుకాయేడు సెంచరీల సంఖ్య పెరుగుతూ వస్తుంది. 2022 సీజన్ మొత్తంలో 8 సెంచరీలు నమోదైనప్పుడు అభిమానులు ఆహా ఓహో అన్నారు. ఇప్పుడు మరికొన్ని మ్యాచ్లు మిగిలుండగానే 12 సెంచరీలు నమోదవడం చూసి ఫ్యాన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. నిన్నటి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్పై ముంబై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ ముక్కీ మూలిగి 173 పరుగులు చేసింది. ట్రవిస్ హెడ్ (48). కెప్టెన్ కమిన్స్ (35 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేసి సన్రైజర్స్ పరువు కాపాడారు. ముంబై బౌలర్లలో పియూశ్ చావ్లా, హార్దిక్ పాండ్యా తలో 3 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అన్షుల్ కంబోజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే సూర్యకుమార్.. తిలక్ వర్మ (37 నాటౌట్) సాయంతో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్లో ఓటమితో సన్రైజర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోవడంతో పాటు నెట్ రన్రేట్ను కూడా దిగజార్చుకుంది. ఈ మ్యాచ్లో గెలుపుతో ముంబై ఆఖరి స్థానం నుంచి లేచొచ్చి తొమ్మిదో స్థానానికి చేరుకుంది. -
IPL 2024: ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏ జట్టుకు ఎలా..?
ఐపీఎల్ 2024 సీజన్లో అత్యంత కీలక దశ నడుస్తుంది. లీగ్ మొత్తంలో 70 మ్యాచ్లు జరగాల్సి ఉండగా.. 54 మ్యాచ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కేకేఆర్ టాప్లో కొనసాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో 8 విజయాలు (16 పాయింట్లు, 1.453 రన్రేట్) సాధించి అగ్రస్థానంలో నిలిచింది.కేకేఆర్ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్ (10 మ్యాచ్ల్లో 8 విజయాలు 16 పాయింట్లు 0.622 రన్రేట్), సీఎస్కే (11 మ్యాచ్ల్లో 6 విజయాలు 12 పాయింట్లు 0.700 రన్రేట్), సన్రైజర్స్ (10 మ్యాచ్ల్లో 6 విజయాలు 12 పాయింట్లు 0.072 రన్రేట్), లక్నో (11 మ్యాచ్ల్లో 6 విజయాలు 12 పాయింట్లు -0.371 రన్రేట్), ఢిల్లీ (11 మ్యాచ్ల్లో 5 విజయాలు 10 పాయింట్లు -0.442 రన్రేట్), ఆర్సీబీ (11 మ్యాచ్ల్లో 4 విజయాలు 8 పాయింట్లు -0.049 రన్రేట్), పంజాబ్ (11 మ్యాచ్ల్లో 4 విజయాలు 8 పాయింట్లు -0.187 రన్రేట్), గుజరాత్ (11 మ్యాచ్ల్లో 4 విజయాలు 8 పాయింట్లు -1.320 రన్రేట్), ముంబై ఇండియన్స్ (11 మ్యాచ్ల్లో 3 విజయాలు 6 పాయింట్లు -0.356 రన్రేట్) వరుసగా రెండు నుంచి పది స్థానాల్లో ఉన్నాయి.ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇలా..ప్రస్తుతమున్న పరిస్థితులను బట్టి ఏ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఎలా ఉన్నాయనే అంశంపై ఓ లుక్కేద్దాం. ప్రస్తుతానికి ఏ జట్టూ అధికారికంగా లీగ్ నుంచి ఎలిమినేట్ కానప్పటికీ.. ముంబై మాత్రం నిష్క్రమించే జట్ల జాబితాలో ముందువరుసలో ఉంది. ఈ జట్టు తదుపరి ఆడబోయే మూడు మ్యాచ్ల్లో భారీ విజయాలు సాధించినా ప్లే ఆఫ్స్కు చేరదు. ఈ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు సున్నా అని చెప్పాలి.ప్లే ఆఫ్స్ ఛాన్స్లు దాదాపుగా గల్లంతు చేసుకున్న జట్ల జాబితాలో ముంబై తర్వాతి స్థానంలో గుజరాత్ ఉంది. ఈ జట్టు కూడా తదుపరి ఆడే మ్యాచ్ల్లో భారీ విజయాలు సాధించినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయితే ఇలా జరిగి మిగతా జట్లు తమతమ తదుపరి మ్యాచ్ల్లో ఓడితే సమీకరణలు మారతాయి. ఈ జట్టుకు మినుకుమినుకు మంటూ ఒక్క శాతం ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి.ఇక ముంబై, గుజరాత్ తర్వాత ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించేందుకు రెడీగా ఉన్న జట్ల జాబితాలో పంజాబ్, ఆర్సీబీ ఉన్నాయి. ఏవైనా అద్భుతాలు జరిగితే తప్ప ఈ జట్లు కూడా ప్లే ఆఫ్స్కు చేరలేవు. పంజాబ్కు 2 శాతం, ఆర్సీబీకి 3 శాతం ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. మిగతా జట్ల విషయానికొస్తే.. రాజస్థాన్, కేకేఆర్ జట్లు ఫైనల్ ఫోర్ బెర్త్లు దాదాపుగా ఖరారు చేసుకోగా.. సన్రైజర్స్, సీఎస్కే, లక్నో మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఢిల్లీకి సైతం ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నా ఆ జట్టుకు కేవలం 12 శాతం ఛాన్స్లు మాత్రమే ఉన్నాయి. కేకేఆర్కు 99, రాజస్థాన్కు 98 శాతం ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉండగా.. సన్రైజర్స్కు 75, సీఎస్కేకు 60, లక్నోకు 50 శాతం అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి అత్యద్భుతాలు జరగకపోతే పై సమీకరణలన్నీ యధాతథంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. -
ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
ఐపీఎల్ చరిత్రలోనే అత్యద్భుతమైన క్యాచ్కు నిన్నటి (మే 5) కేకేఆర్-లక్నో మ్యాచ్ వేదికైంది. ఈ మ్యాచ్లో కేకేఆర్ ఆటగాడు రమన్దీప్ సింగ్ నమ్మశక్యంకాని రీతిలో అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో అర్శిన్ కులకర్ణి ఆడిన షాట్ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని గాల్లో చాలాసేపు ప్రయాణించగా.. ఈ క్యాచ్ను అందుకునేందుకు రమన్దీప్ సింగ్ పెద్ద విన్యాసమే చేశాడు. తాను ఫీల్డింగ్ చేసే డైరెక్షన్ నుంచి వెనక్కు పరిగెడుతూ అద్భుతమైన డైవింగ్ క్యాచ్ పట్టాడు. నమ్మశక్యం కాని ఈ విన్యాసానికి ప్రతి ఒక్కరు ముగ్దులైపోయారు. బ్యాటర్ అర్శిన్ చాలాసేపు ఈ విషయాన్ని నమ్మలేకపోయాడు. క్యాచ్ అనంతరం రమన్దీప్ను సహచరులు అభినందనలతో ముంచెత్తారు. బౌలర్ స్టార్క్, పక్కనే ఫీల్డింగ్ చేస్తున్న రసెల్ రమన్దీప్పై ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తుంది.RAMANDEEP SINGH WITH ONE OF THE GREATEST CATCHES OF IPL HISTORY. 🤯🔥pic.twitter.com/xFiqHssmzV— Mufaddal Vohra (@mufaddal_vohra) May 5, 2024 ఈ మ్యాచ్లో రమన్దీప్ బ్యాటింగ్లోనూ సత్తా చాటాడు. ఇన్నింగ్స్ ఆఖర్లో వచ్చి సుడిగాలి ఇన్నింగ్స్ (6 బంతుల్లో 25 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) ఆడి ఆకట్టుకున్నాడు. రమన్దీప్తో పాటు సునీల్ నరైన్ (39 బంతుల్లో 81; 6 ఫోర్లు, 7 సిక్సర్లు; 4-0-22-1), హర్షిత్ రాణా (3.1-0-24-3), వరుణ్ చక్రవర్తి (3-0-30-3), రసెల్ (2-0-17-2) చెలరేగడంతో ఈ మ్యాచ్లో కేకేఆర్ లక్నోను 98 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ గెలుపుతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో రాజస్థాన్ను కిందకు నెట్టి అగ్రస్థానానికి ఎగబాకింది.కేకేఆర్ ఇన్నింగ్స్లో నరైన్, రమన్దీప్లతో పాటు ఫిలిప్ సాల్ట్ (14 బంతుల్లో 32; 5 ఫోర్లు, సిక్స్), రఘువంశీ (32), శ్రేయస్ అయ్యర్ (23) రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 3, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యుద్వీర్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లక్నో.. కేకేఆర్ బౌలర్ల ధాటికి 16.1 ఓవర్లలో 137 పరుగులకే చాపచుట్టేసింది. లక్నో ఇన్నింగ్స్లో స్టోయినిస్ (36) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
ప్రస్తుతం తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలేం రావట్లేదు. మరోవైపు ఐపీఎల్లో ఈసారి హైదరాబాద్ జట్టు దంచికొట్టే ఫెర్ఫార్మెన్స్ ఇస్తోంది. దీంతో జనాలు దృష్టి క్రికెట్ పైకి మళ్లింది. ఈ క్రమంలోనే థియేటర్లకు ప్రేక్షకులు రావడమే తగ్గించేశారు. ఈ క్రమంలోనే మొన్నీమధ్య ఓ సినిమా ఈవెంట్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి కొన్ని కామెంట్స్ చేశారు. అవి కాస్త సోషల్ మీడియాలో చిన్నపాటి దుమారమే రేపాయి. ఇప్పుడు వాటిపై మళ్లీ ఈయనే క్లారిటీ ఇచ్చేశాడు.(ఇదీ చదవండి: నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్)రీసెంట్గా 'కృష్ణమ్మ' సినిమా ఈవెంట్కి హాజరైన దర్శకుడు అనిల్ రావిపూడి.. 'ఐపీఎల్ చూడకపోతే కొంపలేం మునిగిపోవు. సాయంత్రం థియేటర్లకు వచ్చి మూవీస్ చూడండి' అని కాస్త ఘాటుగానే చెప్పాడు. దీంతో సినిమాల కంటే ఐపీఎల్ బెస్ట్, సినిమాలు చూడకపోయినా కొంపలేం మునిగిపోవు అని నెటిజన్స్ రిటర్న్ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో తాజాగా మరో కార్యక్రమంలో పాల్గొన్న అనిల్ రావిపూడి.. తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇస్తూనే అసలేం జరిగిందో చెప్పుకొచ్చాడు.'మే 19న డైరెక్టర్స్ డే వేడుకలు చేస్తున్నాం. ఆ రోజు కూడా ఐపీఎల్ మ్యాచ్ ఉంది. నేను ఈ మధ్య ఐపీఎల్ గురించి మాట్లాడిన మాటలు మరో రకంగా జనాల్లోకి వెళ్లాయి. నేను ఆ ఈవెంట్ కి వెళ్లే ముందు ఓ డిస్ట్రిబ్యూటర్ని కలిశాను. వేసవిలో ఐపీఎల్ వల్ల కూడా సినిమాలు సరిగా ఆడట్లేదని చెప్తే ఆ ఫ్లోలో అలా మాట్లాడేశాను. ఐపీఎల్ చూడండి. సినిమాలు కూడా చూడండి. నేనూ ఐపీఎల్ చూస్తా. నేను మాట్లాడింది అపార్థం చేసుకోవద్దు' అని అనిల్ రావిపూడి.. వివాదాస్పద కామెంట్స్కి పుల్స్టాప్ పెట్టేశాడు.(ఇదీ చదవండి: ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి) -
క్షమించండి.. పోలీసుల విచారణకు రాలేను: తమన్నా
ఐపీఎల్ కేసులో చిక్కుకున్న సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ తమన్నాకు నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్ 2023 మ్యాచ్లను ‘ఫెయిర్ ప్లే’ యాప్లో లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకుగాను మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. నేడు ఎప్రిల్ 29న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఐపీఎల్ 2023 మ్యాచ్లను ‘పెయిర్ ప్లే’ యాప్లో స్ట్రీమింగ్ చేయడం కారణంగా తమకు రూ. కోట్లలో నష్టం జరిగిందని ప్రసార హక్కులను సొంతం చేసుకున్న ‘వయాకామ్’ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ యాప్లో ఐపీఎల్ మ్యాచ్లను చూడాలంటూ తమన్నా, సంజయ్ దత్తో పాటు పలువురు బాలీవుడ్ నటీనటులు, గాయకులు ప్రచారం చేశారు. ఇదే కేసులో ఈ మధ్యే సంజయ్ దత్కి కూడా సమన్లు జారీ అయ్యాయి. తమన్నా నేడు విచారణకు రావాల్సి ఉంది. కానీ ఆమె హాజరుకాలేదు. షూటింగ్ పనుల వల్ల ఆమె అందుబాటులో లేదని, మరో రోజు విచారణకు వస్తారని ఆమె తరపున ఉన్న లాయర్ పేర్కొన్నారు. ప్రస్తుతం సాక్షిగా మాత్రమే ఆమెను విచారణకు పోలీసులు పిలిచారు. ఈ కేసులో నటుడు సాహిల్ ఖాన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.ఐపీఎల్ 2023 స్ట్రీమింగ్ రైట్స్ను రూ. 23 వేల కోట్లకు పైగానే వయాకామ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ హక్కులన్నీ కూడా ఆ సంస్థకు మాత్రమే ఉన్నాయి. కానీ, ఆ నిబంధనలను అతిక్రమిస్తూ ఫెయిర్ప్లే బెట్టింగ్ యాప్ తమ ఛానెల్లో ఐపీఎల్ మ్యాచ్లను లైవ్ స్ట్రీమింగ్ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో తమకు భారీగా నష్టం వాటిల్లిందని మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులకు 'వయాకామ్' వారు ఫిర్యాదుచేశారు. దీంతో ఆ యాప్ను ప్రమోట్ చేస్తున్న సినిమా ప్రముఖులకు కూడా నోటీసులు ఇచ్చారు. -
ఐపీఎల్లో ఇవాళ (Apr 28) రెండు మ్యాచ్లు.. రెండూ భారీ సమరాలే..!
ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 28) రెండు మ్యాచ్లు జరుగనున్నాయి. మధ్యాహ్నం (3:30 గంటలకు) మ్యాచ్లో గుజరాత్, ఆర్సీబీ.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో సన్రైజర్స్, సీఎస్కే జట్లు తలపడనున్నాయి. ఆదివారం కావడంతో ఐపీఎల్ ఇవాళ రెండూ భారీ మ్యాచ్లనే షెడ్యూల్ చేసింది.మధ్యాహ్నం మ్యాచ్ విషయానికొస్తే..పేపర్పై పటిష్టంగా కనిపించే ఆర్సీబీ.. అడపాదడపా ప్రదర్శనలతో నెట్టుకొస్తున్న గుజరాత్ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ గుజరాత్ హోం గ్రౌండ్ అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనుంది.పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండగా.. గుజరాత్ 9 మ్యాచ్ల్లో 3 విజయాలతో ఏడో స్థానంలో నిలిచింది. గుజరాత్కు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలబడాలంటే గుజరాత్ ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సి ఉంది. మరోవైపు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ఆర్సీబీకి ఈ మ్యాచ్ నామమాత్రం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచినా, ఓడినా ఆర్సీబీకి పెద్ద ఫరక్ పడదు.హెడ్ టు హెడ్ ఫైట్స్ విషయానికొస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు మూడు సందర్భాల్లో ఎదురెదురుపడగా.. గుజరాత్ 2, ఆర్సీబీ ఒక మ్యాచ్లో గెలుపొందాయి. తుది జట్లు (అంచనా)..గుజరాత్: వృద్ధిమాన్ సాహా (వికెట్కీపర్), శుభ్మన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్కీపర్), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, లోకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్రాత్రి మ్యాచ్ విషయానికొస్తే.. సీఎస్కే తమ సొంత మైదానమైన చెపాక్లో పటిష్టమైన సన్రైజర్స్ను ఢీకొట్టనుంది. ఈ సీజన్లోనే ఇది బిగ్ ఫైట్గా చెప్పవచ్చు. ఈ మ్యాచ్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్రైజర్స్ మూడో స్థానంలో.. సీఎస్కే ఆరో స్థానంలో ఉన్నాయి. ప్లే ఆఫ్స్కు చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది.హెడ్ టు హెడ్ రికార్డ్ విషయానికొస్తే.. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 20 మ్యాచ్ల్లో తలపడగా.. సీఎస్కే 14, సన్రైజర్స్ 6 మ్యాచ్ల్లో గెలుపొందాయి.తుది జట్లు (అంచనా)..సన్రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్, ఎయిడెన్ మార్క్రమ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్ [ఇంపాక్ట్ సబ్: టి నటరాజన్]సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, ఎంఎస్ ధోని, దీపక్ చాహర్, తుషార్ దేశ్పాండే, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మతీషా పతిరణ [ఇంపాక్ట్ సబ్: శార్దూల్ ఠాకూర్] -
IPL 2024: వరుసగా ఓడిపోతున్నా పంజాబ్ బౌలర్లను మించిన తోపులు లేరు..!
బ్యాటర్ల హవా కొనసాగుతున్న ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పంజాబ్ బౌలర్లు ఎవరికీ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు (41 మ్యాచ్లు) జరిగిన మ్యాచ్ల్లో పంజాబ్ ఒక్కటే ఒక్కసారి కూడా ప్రత్యర్దిని 200 పరుగులు చేయనీయలేదు. ఈ సీజన్లో పంజాబ్ బౌలింగ్ యావరేజ్ 24.94గా ఉంది. ఏ జట్టుకు ఈ సీజన్లో ఇంత తక్కువ బౌలింగ్ సగటు లేదు. పంజాబ్ తర్వాత కేకేఆర్కు అత్యల్ప బౌలింగ్ సగటు (25.47) ఉంది. పంజాబ్ ఈ సీజన్లో అత్యధికంగా 199 పరుగులు ప్రత్యర్దికి సమర్పించుకుంది. ఇలా రెండు సందర్భాల్లో జరిగింది. ఇదిలా ఉంటే, పంజాబ్ ఇవాళ (ఏప్రిల్ 26) పటిష్టమైన కేకేఆర్ను వారి సొంత మైదానంలో ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ పంజాబ్కు చాలా కీలకంగా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే పంజాబ్ ప్లే ఆఫ్స్ లెక్కల్లో ఉంటుంది. లేకపోతే మరో సీజన్లో ఈ జట్టు టైటిల్ లేకుండా రిక్త హస్తాలతో వైదొలగాల్సి ఉంటుంది. పంజాబ్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. మరోవైపు కేకేఆర్ ఏడింట ఐదు మ్యాచ్లు గెలిచి రెండో స్థానంలో ఉంది. ఈ సీజన్లో కేకేఆర్ అంచనాలకు తగ్గట్టు రాణిస్తూ మూడో టైటిల్ దిశగా అడుగులు వేస్తుంది.ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. పంజాబ్పై కేకేఆర్కు స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తూ వచ్చింది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచ్ల్లో తలపడగా.. కేకేఆర్ 21, పంజాబ్ 11 మ్యాచ్ల్లో గెలుపొందాయి.తుది జట్లు..కోల్కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్ (వికెట్కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, దుష్మంత చమీర, వరుణ్ చకరవర్తి, హర్షిత్ రాణాపంజాబ్ కింగ్స్: జానీ బెయిర్స్టో, సామ్ కర్రన్(కెప్టెన్), రిలీ రోసోవ్, జితేష్ శర్మ(వికెట్కీపర్), శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్ -
SRH vs RCB: ఉప్పల్లో 300 కొడతారా..!
సాక్షి, హైదరాబాద్: 266... 277... 287... ఇదంతా ఒకే ఐపీఎల్ సీజన్లో, ఒకే టీమ్, వేర్వేరు మ్యాచ్లలో చేసిన పరుగుల విధ్వంసం. విశేషం ఏమిటంటే ఈ 287 పరుగులే ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు. ఈ పరుగుల సునామీ సృష్టించింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కాగా... ఇందులో 277 పరుగులు నమోదు చేసింది నగరంలోని ఉప్పల్ స్టేడియం వేదికగానే.ఇప్పుడిదంతా ఎందుకంటే.. ఈసారి ఐపీఎల్ సీజన్లో భీకర ఫామ్లో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నేడు ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును ‘ఢీ’ కొట్టనుంది. 10 రోజుల క్రితం బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్రైజర్స్ జట్టు 288 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా... ఆ లక్ష్యాన్ని ఆర్సీబీ (262/7) చేధించినంత పనిచేసింది. ఈ ఇరు జట్లే మళ్లీ నేడు తలపడనుండటంతో క్రికెట్ అభిమానుల చూపంతా ఈ మ్యాచ్పైనే ఉంది. ఆర్సీబీ ప్రతీకారం తీర్చుకోనుందా? హైదరాబాద్ తన హవాను కొనసాగించనుందా? అనే ఆసక్తికి ఉప్పల్ స్టేడియం వేదికగా మారింది. ఈ మ్యాచ్లో ఓడితే బెంగళూరు ‘ప్లే ఆఫ్స్’ చేరే అవకాశాలు ఆవిరవుతాయి. ఈ నేపథ్యంలో బెంగళూరుకు ఆడుతున్న ‘లోకల్ బాయ్’ మొహమ్మద్ సిరాజ్, భారత స్టార్ విరాట్ కోహ్లి ఎలాంటి ప్రదర్శన చేస్తారో వేచి చూడాలి. మరోవైపు తొలుత బ్యాటింగ్ చేస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, మార్క్రమ్, ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్ చెలరేగితే సన్రైజర్స్ స్కోరు ఈసారి 300 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సన్రైజర్స్ భీకరమైన ఫామ్లో ఉండటం... కోహ్లిలాంటి దిగ్గజం బరిలోకి దిగనుండటంతో ఈ మ్యాచ్ కోసం ప్రేక్షకుల ఎదురుచూపులు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఈ సీజన్లోని గత మ్యాచ్ల్లాగే ఈసారీ అభిమానులకు టికెట్ల ఇక్కట్లు తప్పట్లేదు. ఆన్లైన్లో టిక్కెట్లు క్షణాల్లో అయిపోవడంతో చేసేదేమిలేక క్రికెట్ అభిమానులంతా బిగ్ స్క్రీన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనిని ఆసరా చేసుకున్న పలు రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, మాల్స్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ప్రసారం కోసం భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నాయి. 🧡❤️ pic.twitter.com/3ho5bxzGSZ— SunRisers Hyderabad (@SunRisers) April 25, 2024 -
IPL 2024: ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టనున్న శుభ్మన్ గిల్
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో ఇవాళ (ఏప్రిల్ 24) జరుగబోయే మ్యాచ్తో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయిని తాకనున్నాడు. ఈ మ్యాచ్ గిల్కు ఐపీఎల్లో 100వ మ్యాచ్. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు 64 మంది 100 మ్యాచ్లు ఆడగా.. గిల్ 65వ ఆటగాడు కానున్నాడు.2018 నుంచి ఐపీఎల్ ఆడుతున్న గిల్.. 2021 వరకు కేకేఆర్ తరఫున, ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్కు ఆడుతున్నాడు. గిల్ తన 99 మ్యాచ్ల కెరీర్లో 135.2 స్ట్రయిక్రేట్తో 38.1 సగటున 3088 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.2022 సీజన్ టైటిల్ విన్నింగ్ జట్టులో (గుజరాత్) భాగమైన గిల్.. 2023 సీజన్లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా నిలిచాడు. ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్తో జరిగిన నాకౌట్లో గిల్ మెరుపు సెంచరీతో మెరిశాడు.కాగా, నేటి మ్యాచ్లో గుజరాత్ ఢిల్లీని వారి సొంత మైదానమైన అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢీకొట్టనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకంగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఆరు, ఎనిమిది స్థానాల్లో ఉంటూ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.ఢిల్లీతో పోలిస్తే గుజరాత్కు ప్లే ఆఫ్స్ అవకాశాలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. గుజరాత్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో నాలుగింట గెలిచి 8 పాయింట్లు కూడగట్టుకుంది. ఢిల్లీ ఎనిమిదిలో మూడు మ్యాచ్లు మత్రమే గెలిచి ఆరు పాయింట్లతో గుజరాత్ కంటే వెనుకపడింది. ప్లే ఆఫ్స్కు చేరాలంటే ఇరు జట్లకు ఇప్పటి నుంచి ఆడే ప్రతి మ్యాచ్ కీలకంగా మారింది. గుజరాత్కు ఓ మ్యాచ్ అటో ఇటో అయినా ఢిల్లీ మాత్రం అన్ని మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ల్లో తలపడగా.. చెరి రెండు మ్యాచ్లు గెలిచాయి. ఢిల్లీ గెలుపొందిన రెండు మ్యాచ్లు గుజరాత్ హోం గ్రౌండ్ అయిన అహ్మదాబాద్లోనే కావడం విశేషం. -
SRH Vs RCB: ఐపీఎల్ ఫీవర్... హోటల్ రెంట్లు డబుల్!
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫీవర్తో హైదరాబాద్లోని స్టార్ హోటళ్ల గదుల అద్దెలకు రెక్కలు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు అన్ని స్టార్ హోటళ్లు బుక్ అయిపోయాయి. దీనికితోడు రేట్లు కూడా సాధారణం కంటే రెట్టింపు అంతకంటే ఎక్కువయ్యాయి. హోటల్ గదులు బుక్ చేసుకోవడానికి ఉపకరించే ప్రముఖ వెబ్సైట్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఉప్పల్ స్టేడియంలో గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)–రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్ల మధ్య ఫేవరేట్ మ్యాచ్ జరుగనుండటంతో పాటు పెళ్లి ముహూర్తాలు కూడా ఉండటం ఇందుకు కారణంగా తెలుస్తోంది. అత్యధిక స్కోర్లతో హాట్ ఫేవరేట్లుగా... ప్రసుత్తం ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్–ఆర్సీబీ జట్లు హాట్ ఫేవరెట్స్గా మారిపోయాయి. ఈ రెండింటి మధ్య ఈ నెల 15న బెంగళూరు చిన్నస్వామి స్టేడియం కేంద్రంగా ఓ మ్యాచ్ జరిగింది. అందులో ఎస్ఆర్హెచ్ 287, ఆర్సీబీ 262 పరుగులు చేసి రికార్డు సృష్టించాయి. ఐపీఎల్ చరిత్రలోనే ఇవి అత్యధిక స్కోర్లు కావడంతో ఈ రెండు జట్ల పైనా ఐపీఎల్ ప్రియులకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. గురువారం ఉప్పల్ స్టేడియంలోనూ ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఆయా జట్లు హైదరాబాద్ చేరుకున్నాయి. వీరి కోసం రెండు స్టార్ హోటళ్లలో చాలా భాగం నిర్వాహకులు బుక్ చేశారు. దీంతో పాటు ఈ మ్యాచ్ను తిలకించేందుకు దేశవిదేశాల నుంచి అనేక మంది క్రికెట్ అభిమానులు వస్తున్నారు. వీళ్లు సైతం ఆన్లైన్లో, ప్రముఖ వెబ్సైట్లు, యాప్ల ద్వారా స్టార్ హోటళ్లలో గదులు బుక్ చేసుకుంటున్నారు. ఈ కారణంగానే హైదరాబాద్లోని అనేక స్టార్ హోటళ్లలో శుక్రవారం వరకు గదులు ఖాళీ లేవని ఆయా వెబ్సైట్లు చూపిస్తున్నాయి. సరాసరిని మించిన బుకింగ్... హోటళ్లల్లో గదులు బుక్ కావడం, అందులో అతిథులు బస చేయడాన్ని ఆక్యుపెన్సీగా పిలుస్తారు. స్టాటిస్టా సంస్థ అధ్యయనం ప్రకారం హైదరాబాద్లోని స్టార్ హోటళ్లల్లో ఆక్యుపెన్సీ రేటు సరాసరి గరిష్టంగా 50 నుంచి 60 శాతం మాత్రమే ఉంటోంది. 2021–22 ఆరి్థక సంవత్సరంలో ఇది 51 శాతంగా, 2022–23 ఆరి్థక సంవత్సరంలో 73 శాతంగా నమోదైంది. అయితే ఐపీఎల్ మ్యాచ్తో పాటు పెళ్లి ముహుర్తాలు కూడా ఉండటంతో ప్రస్తుతం అనేక స్టార్ హోటళ్లు ‘నో రూమ్’గా మారిపోయాయి. ఉన్న వాటిలోనూ అద్దెలు సాధారణ సమయం కంటే రెట్టింపు, అంతకంటే ఎక్కువగా ఉన్నట్లు ప్రముఖ వెబ్సైట్లు, యాప్స్ సూచిస్తున్నాయి. గురువారం రాత్రి క్రికెట్ మ్యాచ్ ఉండటంతో మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఇవే రేట్లు కనిపిస్తున్నాయి. సాధారణంగా మామూలు రోజుల్లో కంటే వీకెండ్స్లో హోటల్ రూముల అద్దెలు ఎక్కువగా ఉంటాయి. ఈ లెక్కన చూసినా శని–ఆదివారాల్లో ఆయా హోటళ్ల అద్దెల కంటే మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఎక్కువగా ఉన్నాయి. సైబరాబాద్ పరిధిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న షెరిటన్ హోటల్లో ప్రెసిడెన్షియల్ స్వీట్ అద్దె మంగళ–బుధవారాల్లో రూ.1.28 లక్షలుగా ఉండగా... శుక్రవారం నుంచి ఇది రూ.64 వేల నుంచి రూ.67 వేల వరకు మాత్రమే ఉన్నట్లు ఆయా వెబ్సైట్లు చూపిస్తున్నాయి. ఇదే హోటల్లో సాధారణ గది అద్దె మంగళ–బుధవారాల్లో రూ.21,500గా, శని–ఆదివారాల్లో రూ.11,250గా ఉంది. హైటెక్ సిటీలోని ఐటీసీ కోహినూర్ హోటల్లో మంగళ–బుధవారాలకు అద్దె రూ.32 వేలుగా చూపిస్తోంది. శని–ఆదివారాలకు ఈ మొత్తం రూ.9,800గా ఉంది. వెస్టిన్ హోటల్లో మంగళ–బుధవారాలకు రూ.22,500గా, శని–ఆదివారాలకు రూ.10 వేలుగా కనిపిస్తోంది. సోమాజీగూడలోని ది పార్క్ హోటల్లో గది అద్దె మంగళ–బుధవారాలకు రూ.11,587గా, శని–ఆదివారాలకు రూ.5,071గా ఉంది. గురు–శుక్రవారాల్లో ఆయా హోటళ్లలో నో రూమ్ అని కనిపిస్తోంది. (అద్దె మొదటి రోజు చెక్ ఇన్ సమయం నుంచి రెండో రోజు చెక్ ఔట్ సమయం వరకు... పన్నులు దీనికి అదనం) -
IPL 2024: తిరుగులేని సన్రైజర్స్.. అన్ని జట్లు ఓడినా..!
ఐపీఎల్ 2024 సీజన్లో సగానికి పైగా మ్యాచ్లు పూర్తయిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ (14 పాయింట్లు), కోల్కతా నైట్రైడర్స్ (10), సన్రైజర్స్ హైదరాబాద్ (10), లక్నో సూపర్ జెయింట్స్ (10) జట్లు పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్స్ రేసులో ముందున్నాయి. సీఎస్కే (8), గుజరాత్ (8), ముంబై ఇండియన్స్ (6), ఢిల్లీ క్యాపిటల్స్ (6) జట్లు ఐదు నుంచి ఎనిమిది స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం పోటీ పడుతున్నాయి. పంజాబ్ కింగ్స్ (4), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (2) చివరి రెండు స్థానాల్లో ఉంటూ ప్లే ఆఫ్స్ అశలను దాదాపుగా వదులుకున్నాయి.ప్రస్తుత సీజన్లో 39 మ్యాచ్ల అనంతరం ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో సన్రైజర్స్ మినహా మిగతా తొమ్మిది జట్లు తమతమ సొంత మైదానాల్లో పరాజయాలు ఎదుర్కొన్నాయి. ఒక్క సన్రైజర్స్ మాత్రమే హోం గ్రౌండ్లో తిరుగులేని శక్తిగా ఉంది. భారీ ఫ్యాన్ బేస్ ఉన్న చెన్నై, ఆర్సీబీ, ముంబై జట్లు సైతం సొంత మైదానాల్లో ఓటములు ఎదుర్కొంటే, కమిన్స్ సేన మాత్రం సొంత అభిమానుల మధ్యలో దర్జాగా తలెత్తుకు నిలబడింది.ఈ సీజన్లో సన్రైజర్స్ కమిన్స్ నేతృత్వంలో మునుపెన్నడూ లేనంత పటిష్టంగా ఉంది. పటిష్టం అంటే అట్లాంటి ఇట్లాంటి పటిష్టం కాదు. ఐపీఎల్ పునాదులు దద్దరిల్లేంత పటిష్టంగా కమిన్స్ సేన ఉంది. సన్రైజర్స్ బ్యాటింగ్ వీరులు విధ్వంసం ధాటికి పొట్టి క్రికెట్ బ్యాటింగ్ రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. వీరి దెబ్బకు ఆరెంజ్ ఆర్మీ ఈ సీజన్లో ఇప్పటికే మూడు సార్లు 260 ప్లస్ స్కోర్లు నమోదు చేసింది.మరోవైపు బౌలింగ్లోనూ సన్రైజర్స్ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కమిన్స్ నేతృత్వంలో సన్రైజర్స్ బౌలింగ్ విభాగంలో కూడా అదరగొడుతుంది. మొత్తంగా ఈ సీజన్లో ఆరెంజ్ ఆర్మీ పట్టపగ్లాల్లేకుండా టైటిల్ దిశగా దూసుకెళ్తుంది. రేపు (ఏప్రిల్ 25) జరుగబోయే మ్యాచ్లో సన్రైజర్స్ సొంత మైదానంలో ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్లోనూ పరుగుల వరద పారి ఆల్టైమ్ రికార్డు బద్దలు కావడం ఖాయమని సన్రైజర్స్ అభిమానులు నమ్మకంగా ఉన్నారు.ఇదే సీజన్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఏం జరిగిందో అందరం చూశాం. ఆర్సీబీ హోం గ్రౌండ్లో జరిగిన ఆ మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటర్లు పరుగుల ప్రళయం సృష్టించారు. హెడ్ (102), అభిషేక్ శర్మ (34), క్లాసెన్ (67), మార్క్రమ్ (32 నాటౌట్), అబ్దుల్ సమద్ (37 నాటౌట్) సునామీ ఇన్నింగ్స్లతో విరుచుకుపడటంతో సన్రైజర్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత భారీ స్కోర్ (287) నమోదు చేసింది. ప్రత్యర్ది హోం గ్రౌండ్లోనే సన్రైజర్స్ బ్యాటర్లు ఈ తరహాలో రెచ్చిపోతే.. రేపు సొంత మైదానంలో వీరిని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. -
LSG VS CSK: గెలిచినప్పుడు ధోనిని పొగిడి, ఓడితే రుతురాజ్ను నిందిస్తారా..?
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సీఎస్కేతో నిన్న (ఏప్రిల్ 23) జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్లో సీఎస్కే నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని లక్నో మరో మూడు బంతులు మిగిలుండగానే ఛేదించింది. స్టోయినిస్ అజేయమైన మెరుపు శతకంతో (63 బంతుల్లో 124 నాటౌట్; 13 ఫోర్లు, 6 సిక్సర్లు) లక్నోను విజయతీరాలకు చేర్చాడు. స్టోయినిస్కు పూరన్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), దీపక్ హుడా (6 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) సహకరించారు. గెలిస్తే ధోని ఓడితే రుతురాజా..?మ్యాచ్ అనంతరం జరిగిన డిబేట్లో నవ్జ్యోత్ సింగ్ సిద్దూ, అంబటి రాయుడు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సీఎస్కే ఓటమికి రుతురాజ్ చెత్త కెప్టెన్సీ కారణమని రాయుడు అంటే.. గెలిచినప్పుడు ధోని పేరు చెప్పి ఓడినప్పుడు రుతురాజ్ నిందించడం సమంజసం కాదని సిద్దూ అభిప్రాయపడ్డాడు. Ambati Rayudu - Poor field placements in deaths overs by Ruturaj. We clearly saw lack of experience as captainN. Sidhu - If you credit Dhoni for CSK wins then blame him for the losses too. Dhoni is still the main think tank#LSGvsCSK #CSKvLSG #CSKvsLSG pic.twitter.com/R4VnEwWUKY— Richard Kettleborough (@RichKettle07) April 24, 2024 తొలుత రాయుడు మాట్లాడుతూ.. డెత్ ఓవర్లలో రుతురాజ్ ఫీల్డింగ్ను మొహరించడంలో విఫలమయ్యాడు. కెప్టెన్గా అతని అనుభవ రాహిత్యం స్పష్టంగా బయటపడింది. స్టోయినిస్ విధ్వంసకర మూడ్లో ఉన్నప్పుడు రుతురాజ్ సిల్లీ ఫీల్డ్ సెటప్ చేసి అతను మరింత రెచ్చిపోయేలా చేశాడని అన్నాడు.ఇందుకు సిద్దూ కౌంటరిస్తూ.. సీఎస్కే గెలిచినప్పుడు ధోనికి క్రెడిట్ ఇచ్చి, ఓడినప్పుడు రుతురాజ్ను నిందించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డాడు. గెలిచినప్పుడు ధోనిని పొగిడిన నోళ్లు ఓడినప్పుడు కూడా అతన్నే నిందించాలని అన్నాడు. సీఎస్కే కెప్టెన్సీని ధోనినే ఇంకా మోస్తున్నాడన్న విషయం బహిరంగ సత్యమని తెలిపాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. రుతురాజ్ గైక్వాడ్ మెరుపు సెంచరీతో (60 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. రుతురాజ్ మెరుపులకు శివమ్ దూబే (27 బంతుల్లో 66; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసం తోడు కావడంతో సీఎస్కే భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లక్నో.. తొలి ఓవర్లోనే డికాక్ వికెట్ కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే స్టోయినిస్.. పూరన్, హుడా సహకారంతో లక్నోకు అపురూప విజయాన్ని అందించాడు. చివరి ఓవర్లో లక్నో గెలుపుకు 17 పరుగులు అవసరం కాగా.. మస్తాఫిజుర్ బౌలింగ్లో ప్టోయినిస్ వరుసగా 6, 4, 4, 4 పరగులు సాధించాడు. ఫలితంగా లక్నో ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. -
క్రికెట్లో కృత్రిమ మేధ.. ఐస్ కూల్గా ఐపీఎల్ (ఫోటోలు)
-
IPL 2024: బుమ్రాను భయపెట్టిన అశుతోష్.. ఊహలకందని సిక్సర్
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో నిన్న (ఏప్రిల్ 18) జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 9 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది. ఈ మ్యాచ్లో పంజాబ్ ఓడినా.. ఇద్దరు బ్యాటర్లు మాత్రం ముంబైకి ముచ్చెమటలు పట్టించారు. 184 పరుగుల లక్ష్య ఛేదనలో 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి గెలుపుపై ఏ మాత్రం ఆశలు లేని పంజాబ్ను అశుతోష్ శర్మ (28 బంతుల్లో 61; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), శశాంక్ సింగ్ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లతో తిరిగి మ్యాచ్లో నిలబెట్టారు. అయితే ఆఖర్లో ముంబై బౌలర్లు పుంజుకోవడంతో పంజాబ్కు ఓటమి తప్పలేదు. - He is 25-Year old. - He's playing debut IPL. - He scored 61(28) in today's match. - 156 runs, 52 ave, 205.3 SR in this IPL. - He hits 13 Sixes & 9 Fours. ASHUTOSH SHARMA - THE FUTURE OF INDIAN CRICKET. ⭐ pic.twitter.com/JgVu4UsDab — CricketMAN2 (@ImTanujSingh) April 18, 2024 ఈ మ్యాచ్లో పంజాబ్ ఓడినా ఆశుతోష్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం హైలైట్గా నిలిచింది. ఈ మ్యాచ్లో ఆశుతోష్ ఆడిన కొన్ని షాట్లు క్రికెట్ పండితులకు సైతం ఆశ్చర్యాన్ని కలిగించాయి. బుమ్రా బౌలింగ్లో ఆడిన ఓ షాట్ అయితే న భూతో న భవిష్యతి అన్నట్లుగా ఉంది. ప్రపంచ బ్యాటర్లనంతా గడగడలాడించే బుమ్రా బౌలింగ్లో అశుతోష్ ఊహలకందని స్వీప్ షాట్ సిక్సర్ కొట్టాడు. బుమ్రా బౌలింగ్లో ఇలాంటి షాట్ ఆడటం దాదాపుగా అసాధ్యం. ASHUTOSH SHARMA PLAYED ONE OF THE BEST SHOT IN IPL 2024. 🥶 pic.twitter.com/WhO7RgfNEF — Johns. (@CricCrazyJohns) April 18, 2024 అయితే అశుతోష్ మాత్రం ఏమాత్రం తడబడకుండా ఈ షాట్ను అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశాడు. అశుతోష్ ఈ షాట్ ఆడిన విధానం చూసి ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా నోరెళ్లబెట్టాడు. మ్యాచ్ అనంతరం ఈ సిక్సర్ గురించి మాట్లాడుతూ నమ్మశక్యంగా లేదని అన్నాడు. ఈ షాట్ చూసిన క్రికెట్ అభిమానులైతే బుమ్రా బౌలింగ్ ఇలా కూడా సిక్సర్ కొట్టొచ్చా అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్లో అశుతోష్ ఆడిన సుడిగాలి ఇన్నింగ్స్లో దాదాపు ప్రతి షాట్ అణిముత్యమే అని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. టీమిండియా నయా 360 ప్లేయర్లంటున్నారు. అశుతోష్ సిక్సర్కు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. From sweeping Bumrah for six, to soaking pressure and consistantly delivering when team needs, taking Punjab almost par yesterday. The new 360 player in town, Ashutosh Sharma pic.twitter.com/SsniN2ad13 — Jahazi (@Oye_Jahazi) April 19, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. సూర్యకుమార్ యాదవ్ (53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (25 బంతుల్లో 36;2 ఫోర్లు, 3 సిక్సర్లు), తిలక్ వర్మ (18 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేయగా.. ఛేదనలో పంజాబ్.. శశాంక్ సింగ్ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), అశుతోష్ శర్మ (28 బంతుల్లో 61; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగినప్పటికీ లక్ష్యానికి 10 పరుగుల దూరంలో నిలిచిపోయింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బుమ్రా (4-0-21-3), గెరాల్డ్ కొయెట్జీ (4-0-32-3), అద్భుతంగా బౌలింగ్ చేసి పంజాబ్ ఓటమిని అడ్డుకున్నారు. Hardik Pandya said - "The way Ashutosh Sharma middle every ball and played unbelievable knock. I'm happy for him for future". pic.twitter.com/gOTmHmphiQ — CricketMAN2 (@ImTanujSingh) April 18, 2024 -
ఐపీఎల్కు 17 ఏళ్లు.. తొలి మ్యాచ్ ఆడిన వాళ్లు ఇప్పుడు ఎంత మంది ఉన్నారు..?
క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్కు నేటితో 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఇవాళ (ఏప్రిల్ 18) క్యాష్ రిచ్ లీగ్ 17వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఐపీఎల్ మేనేజ్మెంట్ ఓ పోస్టర్ను రిలీజ్ చేసి గతాన్ని గుర్తు చేసుకుంది. మీ ఫేవరెట్ ఐపీఎల్ జ్ఞాపకాన్ని కూడా షేర్ చేసుకోండని క్యాప్షన్ జోడించింది. దీంతో చాలామంది ఐపీఎల్ అభిమానులు తమ తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. IPL's poster on Completed "17 Years of IPL". - The Biggest Cricket Event...!!!! ⭐ pic.twitter.com/oXgkvRf0dP — CricketMAN2 (@ImTanujSingh) April 18, 2024 ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ ఓ ఆసక్తికర ప్రశ్నను సంధించాడు. ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్లో ఆడిన వారు ప్రస్తుతం ఎంత మంది ఇప్పటికీ ఆడుతున్నారని అడిగాడు. దీనికి చాలామంది తమకు తెలిసిన సమాధానాలు చెప్పారు. సమాధానం రివీల్ చేయకముందు మీకు తెలిసిన సమాధాన్ని మీరు కూడా షేర్ చేయండి. 17 YEARS OF THE IPL...!!! 💥 The greatest league in the world started on this day in 2008. 🇮🇳 pic.twitter.com/BPApcjBkOL — Mufaddal Vohra (@mufaddal_vohra) April 18, 2024 సమాధానం విషయానికొస్తే.. ఐపీఎల్ తొలి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, కేకేఆర్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో కేకేఆర్ తరఫున ఆడిన వృద్దిమాన్ సాహా, ఇషాంత్ శర్మ ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మ్యాచ్లో ఆర్సీబీకి ఆడిన విరాట్ కోహ్లి ఇప్పుడు కూడా అదే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ తొలి మ్యాచ్ ఆడిన ఈ ముగ్గురు మాత్రమే ఐపీఎల్లో ఇంకా కొనసాగుతున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన మరో విషయం ఏంటంటే.. ఐపీఎల్ చరిత్రలో విరాట్ ఒక్కడే నాటి నుంచి నేటి వరకు ఒకే జట్టుకు ఆడుతూ ఎవరికీ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకున్నాడు. నాటి మ్యాచ్ విషయానికొస్తే.. బ్రెండన్ మెక్కల్లమ్ శివాలెత్తిపోవడంతో (73 బంతుల్లో 158; 10 ఫోర్లు, 13 సిక్సర్లు) కేకేఆర్ 140 పరుగల భారీ తేడాతో ఆర్సీబీపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత ఓవరల్లో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. కేకేఆర్ ఇన్నింగ్స్లో మెక్కల్లమ్ ఒక్కడే సింహ భాగం స్కోర్ చేశాడు. సౌరవ్ గంగూలీ 10, రికీ పాంటింగ్ 20, డేవిడ్ హస్సీ 12, మొహమ్మద్ హఫీజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.ఆర్సీబీ బౌలర్లలో జహీర్ ఖాన్, ఆష్లే నోఫ్కే, జాక్ కలిస్ తలో వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. ఆశోక్ దిండా (3-0-9-2), ఇషాంత్ శర్మ (3-0-7-1), అజిత్ అగార్కర్ (4-0-25-3), సౌరవ్ గంగూలీ (4-0-21-2), లక్ష్మీ రతన్ శుక్లా (1.1-0-12-1) ధాటికి 15.1 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. ఆర్సీబీ ఇన్నింగ్స్లో ఒకే ఒక్కరు (ప్రవీణ్ కుమార్ (18 నాటౌట్)) రెండంకెల స్కోర్ చేశారు. ద్రవిడ్ 2, వసీం జాఫర్ 6, విరాట్ కోహ్లి 1, జాక్ కలిస్ 8, కెమరూన్ వైట్ 6, మార్క్ బౌచర్ 7, బాసిల్ థంపి 0, నోఫ్కే 9, జహీర్ ఖాన్ 3, సునీల్ జోషి 3 పరుగులు చేసి ఔటయ్యారు. వికెట్ కీపర్గా వృద్దిమాన్ సాహా కలిస్ క్యాచ్ అందుకున్నాడు. -
ఢిల్లీ బౌలర్ల విజృంభణ.. ఐపీఎల్లో అత్యల్ప స్కోర్
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో ఇవాళ (ఏప్రిల్ 17) జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. గుజరాత్ బ్యాటింగ్ లైనప్పై ఎదురుదాడికి దిగి, ఆ జట్టును కకావిలకలం చేసింది. ఇషాంత్ శర్మ (2-0-8-2), ముకేశ్ కుమార్ (2.3-0-14-3), ట్రిస్టన్ స్టబ్స్ (1-0-11-2), అక్షర్ పటేల్ (4-0-17-1), ఖలీల్ అహ్మద్ (4-1-18-1), కుల్దీప్ యాదవ్ (4-0-16-0) విజృంభించడంతో గుజరాత్ 17.3 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. వికెట్కీపర్ రిషబ్ పంత్ రెండు క్యాచ్లు, రెండు స్టంపౌట్లు చేసి గుజరాత్ పతనంలో కీలక భాగస్వామి అయ్యాడు. గుజరాత్ ఇన్నింగ్స్లో రషీద్ ఖాన్ (31) టాప్ స్కోరర్గా నిలువగా.. సాయి సుదర్శన్ (12), తెవాటియా (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. గుజరాత్ చెత్త రికార్డు.. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ 100లోపు ఆలౌట్ కావడం ఇదే మొదటిసారి. 2024 సీజన్లో ఓ జట్టు 100లోపు ఆలౌట్ కావడం కూడా ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్లో గుజరాత్ చేసిన 89 పరుగుల స్కోర్.. ఇపీఎల్ చరిత్రలో ఆ జట్టుకు అత్యల్ప స్కోర్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనూ ఇదే అత్యల్ప టీమ్ స్కోర్ Delhi Capitals bowling unit wrapping up GT for just 89. 💥 - Captain Rishabh Pant and his army are dominating in Ahmedabad. pic.twitter.com/jS31TQyI1b — Mufaddal Vohra (@mufaddal_vohra) April 17, 2024 -
IPL 2024: గుజరాత్పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఢిల్లీ
గుజరాత్పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఢిల్లీ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. 89 పరుగులకే కుప్పకూలగా.. ఛేదనలో ఢిల్లీ 8.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ 65 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. సందీప్ వారియర్ బౌలింగ్లో అభిషేక్ పోరెల్ (15) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఢిల్లీ 90 బంతుల్లో 25 పరుగులు చేస్తే గెలుస్తుంది రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ 6 బంతుల్లో 7 పరుగులు చేసి పృథ్వీ షా ఔటయ్యాడు. సందీప్ వారియర్ బౌలింగ్లో స్పెన్సర్ జాన్సన్కు క్యాచ్ ఇచ్చి షా పెవిలియన్ బాట పట్టాడు. టార్గెట్ 90.. తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ 10 బంతుల్లో 20 పరుగులు చేసి ఫ్రేసర్ ఔటయ్యాడు. స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్లో అభినవ్ మనోహర్కు క్యాచ్ ఇచ్చి ఫ్రేసర్ పెవిలియన్కు చేరాడు. టార్గెట్ 90.. మెరుపు వేగంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ 90 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఢిల్లీ దూకుడుగా ఇన్నింగ్స్ను ప్రారంభించింది. ఓపెనర్ ఫ్రేసర్ 9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 20 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ పృథ్వీ షా 2 బంతుల్లో ఒక్క పరుగు చేశాడు. 1.5 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 25/0గా ఉంది. ఢిల్లీ బౌలర్ల విజృంభణ.. 89 పరుగులకే కుప్పకూలిన గుజరాత్ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ బౌలర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. గుజరాత్ బ్యాటింగ్ లైనప్పై ఎదురుదాడికి దిగింది. ఇషాంత్ శర్మ (2-0-8-2), ముకేశ్ కుమార్ (2.3-0-14-3), ట్రిస్టన్ స్టబ్స్ (1-0-11-2), అక్షర్ పటేల్ (4-0-17-1), ఖలీల్ అహ్మద్ (4-1-18-1) విజృంభించడంతో గుజరాత్ 17.3 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. వికెట్కీపర్ రిషబ్ పంత్ రెండు క్యాచ్లు, రెండు స్టంపౌట్లు చేసి గుజరాత్ పతనంలో కీలక భాగస్వామి అయ్యాడు. గుజరాత్ ఇన్నింగ్స్లో రషీద్ ఖాన్ (31) టాప్ స్కోరర్గా నిలువగా.. సాయి సుదర్శన్ (12), తెవాటియా (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఏడో వికెట్ కోల్పోయిన గుజరాత్ 66 పరుగుల వద్ద గుజరాత్ ఏడో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్లో రాహుల్ తెవాటియా (10) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన గుజరాత్ 48 పరుగుల వద్ద గుజరాత్ ఆరో వికెట్ కోల్పోయింది. ట్రిస్టన్ స్టబ్స్ వేసిన 9వ ఓవర్లో అభినవ్ మనోహర్ (8), షారుక్ ఖాన్లను (0) రిషబ్ పంత్ స్టంపౌట్ చేశాడు. 10 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 61/6గా ఉంది. రషీద్ ఖాన్ (12), రాహుల్ తెవాటియా (8) క్రీజ్లో ఉన్నారు. 30 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన గుజరాత్ గుజరాత్ టైటాన్స్ 30 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఐదో ఓవర్ ఆఖరి బంతికి ఇషాంత్ శర్మ బౌలింగ్ పంత్కు క్యాచ్ ఇచ్చి డేవిడ్ మిల్లర్ (2) ఔటయ్యాడు. మూడు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయిన గుజరాత్ 4.1వ ఓవర్: మూడు బంతుల వ్యవధిలో గుజరాత్ రెండు వికెట్లు కోల్పోయింది. నాలుగో ఓవర్ ఐదో బంతికి ముకేశ్ కుమార్ సాహాను (2) క్లీన్ బౌల్డ్ చేయగా.. ఐదో ఓవర్ తొలి బంతికి సాయి సుదర్శన్ (12) రనౌటయ్యాడు. 4.5 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 30/3గా ఉంది. డేవిడ్ మిల్లర్ (2), అభినవ్ మనోహర్ క్రీజ్లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్ 1.5వ ఓవర్: 11 పరుగుల వద్ద గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. ఇషాంత్ శర్మ బౌలింగ్లో పృథ్వీ షాకు క్యాచ్ ఇచ్చి శుభ్మన్ గిల్ (8) ఔటయ్యాడు. సాహా, సాయి సుదర్శన్ క్రీజ్లో ఉన్నారు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్, ఢిల్లీ జట్లు తామాడిన గత మ్యాచ్ల్లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లపై సంచలన విజయాలు సాధించి జోష్లో ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ ఆరో స్థానంలో (6 మ్యాచ్ల్లో 3 విజయాలు) ఉండగా.. ఢిల్లీ తొమ్మిదో స్థానంలో (6 మ్యాచ్ల్లో 2 విజయాలు) కొనసాగుతుంది. తుది జట్లు.. గుజరాత్: శుభ్మన్ గిల్ (కెప్టెన్), వృద్దిమాన్ సాహా (వికెట్కీపర్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, సందీప్ వారియర్, స్పెన్సర్ జాన్సన్ ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్కీపర్), షాయ్ హోప్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ -
ఐపీఎల్లో ఇప్పటివరకు ఎన్ని సూపర్ ఓవర్లు జరిగాయో తెలుసా..?
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చాలా మ్యాచ్లు తుది బంతి వరకు వచ్చినప్పటికీ సూపర్ ఓవర్ దాకా వెళ్లలేదు. ఈ సీజన్లో దాదాపు సగం మ్యాచ్లు ముగుస్తున్నా ఒక్కటంటే ఒక్క సూపర్ ఓవర్ కూడా లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన సూపర్ ఓవర్లపై ఓ లుక్కేద్దాం. క్యాష్ రిచ్ లీగ్లో నేటి వరకు (ఏప్రిల్ 17) మొత్తం 15 సూపర్ ఓవర్లు జరిగాయి. 2020 సీజన్లో అత్యధికంగా 5 సూపర్ ఓవర్లు జరుగగా.. అదే సీజన్లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో రెండు సూపర్ ఓవర్లు (ఒక దాంట్లో ఫలితం రాకపోయగా మరొకటి జరిగింది) జరిగాయి. గత రెండు ఐపీఎల్ సీజన్లలో ఒక్క మ్యాచ్ కూడా సూపర్ ఓవర్ దాకా వెళ్లలేదు. ఐపీఎల్ తొలి సీజన్లోనూ (2008) ఒక్క సూపర్ ఓవర్ మ్యాచ్ కూడా జరుగలేదు. 2009లో ఒకటి, 2010లో ఒకటి, 2013లో రెండు, 2014లో ఒకటి, 2015లో ఒకటి, 2017లో ఒకటి, 2019లో రెండు, 2020లో ఐదు, 2021 సీజన్లో ఓ సూపర్ ఓవర్ మ్యాచ్ జరుగగా... 2008, 2011, 2012, 2016, 2018, 2022, 2023 సీజన్లలో ఒక్క సూపర్ ఓవర్ మ్యాచ్ కూడా జరుగలేదు. మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా వెళితే అభిమానులకు అసలుసిసలు క్రికెట్ మజా అందుతుంది. అందుకే ఫ్యాన్స్ సూపర్ ఓవర్లో ఫలితం తేలడాన్ని ఇష్టపడతారు. ఫలితం ఒక్క సూపర్ ఓవర్ వరకు వెళితేనే అభిమానులు నరాలు బిగబట్టుకుని మ్యాచ్లు చూస్తారు. అదే రెండో సూపర్ దాకా వెళితే ఫ్యాన్స్తో ఆటగాళ్లు పడే ఉత్కంఠ అంతాఇంత కాదు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. గుజరాత్, ఢిల్లీ జట్లు తామాడిన గత మ్యాచ్ల్లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లపై సంచలన విజయాలు సాధించి జోష్లో ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ ఆరో స్థానంలో (6 మ్యాచ్ల్లో 3 విజయాలు) ఉండగా.. ఢిల్లీ తొమ్మిదో స్థానంలో (6 మ్యాచ్ల్లో 2 విజయాలు) కొనసాగుతుంది. -
ఐపీఎల్లో సన్రైజర్స్ రికార్డులు.. పుష్ప టీమ్ స్పెషల్ ట్వీట్!
అల్లు అర్జున్ పుష్ప సినిమా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2021లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఎర్రచందనం సిండికేట్ నేపథ్యంలో సుకుమార్ తెరకెక్కించిన పుష్ప కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా మెప్పించగా.. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్గా కనిపించారు. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్గా పుష్ప-2 రూపొందిస్తున్నారు. ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేశారు. విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్లో రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా పుష్ప టీమ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతోంది. సన్రైజర్స్ హైదరాబాద్ను పుష్ప సినిమాతో పోలుస్తూ ఓ ఫోటోను షేర్ చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ టీమ్ తన రికార్డ్ను తానే అధిగమించింది. ముంబయిపై 277 పరుగుల అత్యధిక స్కోరు చేసిన ఎస్ఆర్హెచ్.. మరోసారి బెంగళూరుపై 287 రన్స్ చేసి తన రికార్డ్ను తానే బద్దలు కొట్టింది. దీంతో మొదటి మ్యాచ్ను పుష్ప పార్ట్-1గా.. రెండో మ్యాచ్ను పుష్ప-2గా పోలుస్తూ పోస్ట్ చేసింది. రెండుసార్లు అత్యధిక స్కోరు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్కు అభినందనలు తెలిపింది. దీంతో బన్నీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇది చూసిన కొందరు అభిమానులు పుష్ప డైలాగ్స్ పోస్ట్ చేస్తున్నారు. ప్రపంచలో ఎక్కడా లేని సరకు మన దగ్గరే ఉండాది అనే డైలాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. ఏ టీమ్ సాధించని రికార్డ్ను రెండుసార్లు సన్రైజర్స్ అధిగమించడం ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోనుంది. HUPPPP!!! 💥💥 277/3 - SRH: The Rise 😎 287/3 - SRH: The Rule 🤙 Congratulations on scoring the Highest-ever IPL team totals twice in this season! 🔥 @SunRisers https://t.co/kcfJBj5E0Z pic.twitter.com/co0o1zIw7T — Pushpa (@PushpaMovie) April 16, 2024
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
సింగరేణిని అమ్మేందుకు కాంగ్రెస్ కుట్ర
విషాదం నింపిన క్యాన్సర్
No Headline
అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
రూ.14.05లక్షలు పట్టివేత
రాజన్న సేవలో ఐజీ
పుంజుకున్న స్టాక్ మార్కెట్ సూచీలు
జిల్లా ప్రజలను నిరాశపరచిన ప్రధాని మోదీ
వెండితెరపై పల్లెటూరు పిల్లాడు
విద్యుత్షాక్తో యువకుడి మృతి
తప్పక చదవండి
- ‘సంతోషం’.. కేజ్రీవాల్కు మద్యంతర బెయిల్పై దీదీ
- నామినేషన్ దాఖలుకు బీజేపీ అభ్యర్థి పరుగులు.. చివరికి ఏమైందంటే..
- సింపతీ కోసమే కేజ్రీవాల్ అరెస్ట్
- అమిత్ షా నివాసంలో పద్మగ్రహీతలకు విందు....మెనులో ఎలాంటి రెసిపీలు ఉన్నాయంటే..
- టాలీవుడ్లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: సీఎం జగన్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement