-
అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
ఒక్కోసారి హీరోయిన్లకు విచిత్రమైన సంఘటనలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా అభిమానుల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు ఏం చెప్పాలో తెలియని అయోమయ పరిస్థితి ఉంటుంది. తాజాగా నటి తాన్యా రవిచంద్రన్కు అలాంటి పరిస్థితే ఎదురైంది. ప్రఖ్యాత నటుడు రవిచంద్రన్ మనవరాలైన తాన్యా రవిచంద్రన్.. ఆయన వారసత్వాన్ని తీసుకుని సినీ రంగప్రవేశం చేశారు. ఆమె 2017లో భలే వెళైదేవా అనే చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యారు. శశికుమార్ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయినప్పటికీ తాన్నా రవిచంద్రన్కు అవకాశాలు తలుపు తడుతూనే ఉన్నాయి. అలా బృందావనం, కరుప్పన్, నెంజుక్కు నీతి, మాయోన్, అకిలన్ వంటి చిత్రాల్లో నటించి తనకుంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.తాజాగా ఆమె రసవాది అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా తాన్యా రవిచంద్రన్ ఓ భేటీలో అభిమానులతో ముచ్చటించారు. వారితో తన చిత్రాల గురించి.. తాను నటించాలనుకుంటున్న పాత్రల గురించి వివరించారు. అదే సమయంలో తనకు ఎదురైన విచిత్రమైన ప్రశ్న గురించి చెప్పారు. ఒకసారి అభిమాని ఒకరు అనూహ్యంగా అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగారన్నారు. అతను అడిగిన విధానం తనకు అర్థం కాలేదన్నారు. అక్కా అన్నాడు.. పెళ్లి చేసుకుంటావా? అని సంబంధమే లేకుండా అడిగిన అతని ప్రశ్నకు బదులేం చెప్పాల్లో తనకు అర్థం కాలేదన్నారు. ఇలాంటి ఫన్నీ సంఘటనలు గుర్తొస్తే నవ్వొస్తుందని తాన్యా రవిచంద్రన్ పేర్కొన్నారు. కాగా రసవాది చిత్రం తనకు మంచి పేరు తెచ్చి పెడుతుందనే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. -
కమల్హాసన్ 'థగ్ లైఫ్'.. ఆ హీరోను రిప్లేస్ చేశారు!
మణిరత్నం- కమల్ హాసన్ కాంబోలో వస్తోన్న భారీ చిత్రం 'థగ్ లైఫ్'. నాయగన్(1987) సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న గ్యాంగ్స్టర్ డ్రామాగా తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష, శింబు, ఐశ్వర్యా లక్ష్మి, జోజూ జార్జ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీమ్లో కోలీవుడ్ హీరో శింబు జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు మేకర్స్.కారును వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి, గన్తో ఎవరిపైనో గురి పెట్టి శింబు కాల్చుతున్నట్లుగా ఈ వీడియోలో కనిపించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది. కమల్హాసన్, శింబులతో పాటు ప్రముఖ నటీనటులపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ఢిల్లీ షూటింగ్ షెడ్యూల్ పూర్తవగానే ‘థగ్ లైఫ్’ టీమ్ లండన్ వెళుతుందని కోలీవుడ్ సమాచారం. రెడ్ జెయింట్ మూవీస్, మద్రాస్ టాకీస్ పతాకాలపై నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుందని సమాచారం. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘థగ్ లైఫ్’ సినిమా నుంచి దుల్కర్ సల్మాన్ తప్పుకున్నారని.. ఈ ప్లేస్లోనే శింబును ఎంపిక చేశారని టాక్. అలాగే జయం రవి కూడా ఈ చిత్రం నుంచి తప్పుకోగా.. ఆ పాత్రను అశోక్ సెల్వన్ చేస్తారనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. -
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ సేవలో దూసుకుపోతున్నాడు. పేదరికంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. మాత్రం అనే అనే ఫౌండేష్ ద్వారా సేవలు కొనసాగిస్తున్నారు. ఇటీవలే దివ్యాంగులకు టూవీలర్ వాహనాలు అందించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇచ్చిన మాట ప్రకారం మరో పది కుటుంబాలకు ట్రాక్టర్లు అందిస్తున్నారు. ప్రస్తుతం విల్లుపురం జిల్లాలోని ఓ పేద కుటుంబానికి ట్రాక్టర్ను తానే స్వయంగా అందించారు.దీనికి సంబంధించిన వీడియోను రాఘవ లారెన్స్ ట్విటర్లో పంచుకున్నారు. విల్లుపురం జిల్లాలో ప్రభు కుటుంబానికి మూడో ట్రాక్టర్ తాళాలు అందజేశానని తెలిపారు. మీ ప్రేమను చూస్తుంటే.. ఇది నాకు మరింత శక్తిని ఇస్తోందని.. ముందుకు సాగడానికి ప్రేరణనిస్తోందని రాసుకొచ్చారు. మనమంతా కలిసి అందరికీ ఉజ్వల భవిష్యత్తును సృష్టించగలం అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. #serviceisgod DAY TWO JOURNEY! I handed over the 3rd tractor key to the Prabu family in the Villupuram district. Seeing all your love, It's giving us more energy and motivation to go forward. Together, we can make a difference and create a brighter future for all. #Maatram… pic.twitter.com/Hq9lY9vylA— Raghava Lawrence (@offl_Lawrence) May 7, 2024 -
'స్టార్ హీరోలు కథ గురించి పట్టించుకోవట్లే'..
ప్రతిభ అనేది ఎవరబ్బ సొత్తు కాదు. ప్రతిభావంతులు తమ సత్తాను ఏ రంగంలోనైనా చాటుకోవచ్చు. అలా నృత్య దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్న రాధిక ఇప్పుడు మోగాఫోన్ పట్టారు. ఆమె తెరకెక్కించిన చిత్రం ది ప్రూఫ్. గోల్డెన్ స్టూడియోస్ పతాకంపై గోమతి నిర్మించిన ఈ చిత్రంలో నటి సాయి ధన్సిక ప్రధాన పాత్రను పోషించింది. తాజాగా ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చెన్నైలో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్వీ.ఉదయకుమార్, నటుడు, నిర్మాత కే.రాజన్, దర్శకుడు మిష్కిన్, యూకీ సేతు, గీత రచయిత స్నేహన్, నటుడు రోబో శంకర్, సంతోష్ ప్రతాప్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆర్వీ ఉదయకుమార్ మాట్లాడుతూ ప్రూఫ్ చిత్రంలో అన్నీ అంశాలు బాగున్నాయన్నారు. ఇది ఒక క్లాస్ దర్శకురాలు చేసినట్లుగా ఉందన్నారు. దర్శకురాలు రాధిక చాలా సింపుల్గా ఉంటారని.. అయితే చాలా ప్రతిభావంతురాలని ప్రశంసించారు. ఇప్పుడు సినిమా ట్రెండ్ మారిపోయిందన్నారు. దర్శకులు నటిస్తున్నారని.. నృత్యదర్శకులు, నటులు, సంగీత దర్శకులు కూడా దర్శకత్వం వహిస్తున్నారన్నారు. సినిమా అందరినీ ఆదరిస్తుందని పేర్కొన్నారు.అయితే మేకింగ్ స్టైల్ తెలియకుండానే కొందరు దర్శకత్వం వహిస్తున్నారని ఆయన తెలిపారు. అలాంటి కొన్ని చిత్రాలు హిట్ అయినంత మాత్రాన.. అది సరైన విధానం అని తాను చెప్పలేనన్నారు. ఎక్కడ ఏ షాట్ ఉండాలి.. ఇంటర్వెల్ ఎక్కడ ఉండాలి అన్న విషయాలను సహాయ దర్శకులు తెలుసుకోవాలన్నారు. ఇప్పుడు మాదక ద్రవ్యాల నేపథ్యమే సరికొత్త ట్రెండ్ అని పేర్కొన్నారు. దానితోనే మనం సంసాదించుకుంటున్నామన్నారు. ఇప్పుడు స్టార్ హీరోలు కథల గురించి పట్టించుకోవడం లేదని కాంబినేషన్ సరిగా సెట్ అయితే చాలు అనుకుంటున్నారన్నారు. ఈ మూవీ డైరెక్టర్ రాధికకు ఒక్క విషయం చెప్పదలచుకున్నానని.. ఇక్కడ చాలా మంది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటారని, వారి గురించి పట్టించుకోకుండా ట్రెండ్కు తగినట్లుగా చిత్రాలు చేయాలని సూచించారు. కాగా.. ఈ చిత్రంలో రుద్వీర్ వదన్, మెమ్గోపీ, రిత్విక, ఇంద్రజ ముఖ్యపాత్రలు పోషించారు. దీపక్ సంగీతం అందించారు. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
కోలీవుడ్ దర్శకుడు, హీరో రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది జిగర్తాండ డబుల్ ఎక్స్, రుద్రన్ చిత్రాలతో అలరించారు. సినిమాలతో ఎప్పుడు బిజీగా ఉన్నప్పటికీ తనవంతు సాయంగా మాత్రం ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇటీవల దివ్యాంగులకు ద్విచక్రవాహనాలు కూడా పంపిణీ చేశారు. పేదల కోసం ఇచ్చిన మాట ప్రకారం సాయం చేస్తూ ముందుకెళ్తున్నారు మన కోలీవుడ్ స్టార్.తాజాగా మరో పది పేద రైతు కుటుంబాలకు అండగా నిలిచారు లారెన్స్. వారి కళ్లలో ఆనందం వెల్లివిరిసేలా చేశారు. కష్టాల్లో ఉన్న రైతులకు ఉచితంగా పది ట్రాక్టర్లు అందించారు. దీనికి సంబంధించిన వీడియోను రాఘవ తన ట్విటర్లో పంచుకున్నారు.రాఘవ తన ట్విటర్లో రాస్తూ..' స్నేహితులు అభిమానులు! మాత్రమ్ సేవ ఈరోజు ప్రారంభమైందని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నా. గతంలో ప్రెస్మీట్లో చెప్పినట్లుగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతులకు 10 ట్రాక్టర్లను అందజేస్తామని చెప్పాం. మా మొదటి ట్రాక్టర్ విలుపురం జిల్లాకు చెందిన రాజకన్నన్ కుటుంబానికి అందించాం. అతను తన సోదరి భర్త చనిపోవడంతో ఆమెతో పాటు తన కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. ఈ రోజు అతను కొత్త ట్రాక్టర్ని నడుపుతున్నప్పుడు అతని ముఖంలో ఆనందం, ఆశను చూడాలనేది నా కోరిక. అందుకే అతన్ని పిలిపించి సర్ప్రైజ్ ఇచ్చాం. కష్టాల్లో ఉన్న రైతులకు ఆనందాన్ని, మద్దతును అందజేద్దాం!' అంటూ పోస్ట్ చేశారు. Hi friends and fans! I am excited to announce that Maatram's service begun today. As I mentioned in our press meet, we will be presenting 10 tractors to financially struggling farmers. Our first tractor was presented to RajaKannan family from Vilupuram District, who is now solely… pic.twitter.com/7XePCpNweb— Raghava Lawrence (@offl_Lawrence) May 1, 2024 -
రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
కోలీవుడ్లో తెరకెక్కించిన సినిమాలు హిట్ అయితే ఇతర భాషల్లోనూ డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మరో కోలీవుడ్ మూవీ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. అయితే ఈ సినిమా హిట్ కాకపోయినప్పటికీ టాలీవుడ్ సిద్ధమయ్యారు. తమిళ మూవీ యతిసై తెలుగు డబ్బింగ్ వర్షన్ మే 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ హిస్టారికల్ గతేడాదిలోనే ఓటీటీలో రిలీజైంది. ఇప్పటికే తమిళంలో అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. తాజాగా యతిసై తెలుగు, హిందీ రిలీజ్ డేట్స్ను సినిమా యూనిట్ ప్రకటించింది.ఈ సందర్భంగా తెలుగు, హిందీ భాషలకు సంబంధించి టీజర్స్ రిలీజ్ చేశారు. యుద్ధ సన్నివేశాలు, పాండ్య రాజులను ఎదురించి అసమాన పోరాటం చేసిన ఓ తెగ జీవితాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. గతేడాది ఏప్రిల్లో థియేటర్లలో విడుదలై రూ.20 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఓటీటీలో రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో థియేటర్లలో విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. తెలుగుతో పాటు హిందీలో ఒకే రోజు థియేటర్లలో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ సినిమాకు ధరణి రాసేంద్రన్ దర్శకత్వం వహించారుమొదట టీజర్స్, ట్రైలర్స్ రిలీజైన తర్వాత కోలీవుడ్ వర్గాల యాతిసై మూవీని బాహుబలితో పోల్చారు. కానీ ఈ సినిమా బాహుబలికి ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఏడు కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ 20 కోట్లు మాత్రమే రాబట్టింది -
Ajith Unseen Photos: హీరోలందు తలా అజిత్ వేరయా.. రేర్ ఫొటోలు
-
తలైవా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు అప్డేట్!
కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం వేట్టైయాన్. ఈ చిత్రాన్ని జైభీమ్ చిత్రం పేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రజినీకాంత్ మాజీ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా తలైవా నటిస్తోన్న 170వ చిత్రం. ఈ మూవీ తర్వాత రజినీకాంత్ 171వ చిత్రంలో నటించనున్నారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది.అయితే ఇంకా షూటింగ్ ప్రారంభం కానీ ఈ సినిమాపై అసత్య ప్రచారం ఎక్కువైందనే చెప్పాలి. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్, టైటిల్ ప్రకటన, టీజర్ను వరుసగా విడుదల చేయడంతో ఈ చిత్రానికి సంబంధించి ప్రచారం హోరెత్తుతోంది. దీంతో అంతకు ముందే ప్రారంభం అయిన రజనీకాంత్ నటిస్తున్న 170వ చిత్రం వేట్టైయాన్ చిత్రం మరుగున పడిందనే చెప్పాలి.కాగా.. తాజాగా వేట్టైయాన్ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వెలువడింది. ఈ చిత్రం షూటింగ్ 100 రోజులు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది అక్టోబర్ నెలలో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుందని.. ఈ ఏడాది అక్టోబర్లో చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు లైకా సంస్థ నిర్వాహకులు ఎక్స్(ట్విటర్) ద్వారా వెల్లడించారు. దీంతో ఇకపై వేట్టైయాన్ చిత్ర ఆడియో, ట్రైలర్ విడుదల వంటి ప్రమోషన్ కార్యక్రమాలకు చిత్ర వర్గాలు రెడీ అవుతున్నట్లు సమాచారం.ఈ చిత్రంలో దుషారా విజయన్, అమితాబ్బచ్చన్, ఫాహత్ ఫాజిల్, రానా, మంజువారియర్, రితికాసింగ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 100 days of #Vettaiyan shooting 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥#Jailer | #Rajinikanth | #superstar @rajinikanth | #Coolie | #VettaiyanFromOctober | #ThalaivarNirandharam | #SuperstarRajinikanth | #Hukum | #CoolieDisco | #Jailer2 | #ThalaivarNirandharam | #CoolieTitleTeaser pic.twitter.com/psri6cXUtQ— Suresh balaji (@surbalutwt) April 27, 2024 -
వివాదాస్పద నటుడు మన్సూర్ అలీఖాన్ సంచలన ఆరోపణలు....!
కోలీవుడ్ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్పై విష ప్రయో గం జగిందనే వార్త లు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. తమిళనాడులో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరగనుండడంతో రాజకీయ పరంగా చర్చనీయాంశంగా మారాయి. బుధవారం వరకు అన్ని రాజకీయపార్టీల నాయకులు ముమ్మరంగా ప్రచా రం సాగించారు. కాగా నటుడు మన్సూర్ అలీఖాన్ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈయన బుధవారం వేలూ రు పరిసర ప్రాంతాల్లో ప్రచారం చేస్తుండగా కొందరు బలవంతంగా పండ్ల జ్యూస్ను తాగించారు. ఆ తరువాత మజ్జిగను కూ డా తాగించడంతో కడుపునొప్పికి గురైన నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ వెంటనే కిందకు పడిపోయాడు. కార్యకర్తలు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన తరువాత మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆయన అత్యవసర వార్డులో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనను మన్సూర్ అలీఖాన్ సన్నిహితులు మీడియాకు విడుదల చేశారు. అందులో నటుడు మన్సూర్అలీఖాన్ పేర్కొంటూ తాను ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉండగా కొందరు తనతో బలవంతంగా పండ్ల రసాన్ని తాగించారని.. ఆ వెంటనే మజ్జిగను కూడా ఇచ్చారని, అది తాగిన తాను తీవ్ర కడుపు నొప్పితో కిందికి పడిపోయానని పేర్కొన్నారు. తన వెంట ఉన్న కార్యకర్తలు వెంటనే ఆస్పతికి తీసుకెళ్లారని.. పరీక్షించిన వైద్యులు విష ప్రయోగం జరిగిందని చెప్పారన్నారు. ప్రస్తుతం తాను ఐసీయూలో ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాననే నమ్మకముందని మన్సూర్ అలీఖాన్ వ్యక్తం చేశారు. -
ఓటీటీకి సరికొత్త మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వైభవ్, నందితాశ్వేత జంటగా నటించిన చిత్రం రణం. మిస్టరీ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళంలో రణం అరమ్ థవరేల్ పేరుతో ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఆద్యంతం ట్విస్టులతో ప్రేక్షకులను మెప్పించింది. అంతే కాదు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.15 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. ఓ సిరియల్ కిల్లర్ చేసిన హత్యలను చేధించే కథాంశంతో ఈ సినిమాను దర్శకుడు షరీఫ్ తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీకి స్ట్రీమింగ్కు రాబోతోంది. ఈ నెల 19 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఓవర్సీస్ ఆడియన్స్ కోసం టెంట్కోట్టాలోనూ స్ట్రీమింగ్కు రానుంది. దాదాపు థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఈ చిత్రంలో ఓ స్కెచ్ ఆర్టిస్ట్గా కనిపించారు. ఈ సినిమాలో నందితా శ్వేత నెగెటివ్ షేడ్స్తో కూడిన క్యారెక్టర్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు మరో హీరోయిన్ తాన్యా హోప్ ఇన్స్పెక్టర్ పాత్రలో కనిపించింది. వీళ్లంతా కలిసి సీరియల్ కిల్లర్ను పట్టుకున్నారా? లేదా అన్నదే కథ. థియేటర్లలో చూడలేనివారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. Vaibhav’s #Ranam will be streaming from Apr 19 on AMAZON PRIME. pic.twitter.com/cHXxx2331L — Christopher Kanagaraj (@Chrissuccess) April 17, 2024 -
ఏపీ ముఖ్యమంత్రిగా మళ్లీ జగనే: హీరో విశాల్ కామెంట్స్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ప్రముఖ హీరో విశాల్ ప్రశంసలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ ఆయనే అధికారంలోకి వస్తారని అన్నారు. గతంలోనూ సీఎం జగన్పై ఇలాంటి దాడులు జరిగాయని తెలిపారు. ఇలాంటి దాడులను జగన్ ఎన్నోసార్లు ఎదుర్కొన్నారని విశాల్ వెల్లడించారు. తాను ఏ పార్టీకి కూడా మద్దతుగా లేనని.. కానీ సీఎం జగన్ అంటేనే తనకు విపరీతమైన అభిమానమని విశాల్ తెలిపారు. ప్రస్తుతం విశాల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ప్రస్తుతం ఆయన రత్నం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ చిత్రం ఏప్రిల్ 26న థియేటర్లలోకి రాబోతోంది. ప్రస్తుతం ఆయన మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. హైదారాబాద్లో పర్యటించిన విశాల్ మీడియా ప్రతినిధులు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా ఏపీలో మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అవుతారని విశాల్ అన్నారు. (Read this article in English) -
సూపర్ హిట్ డైరెక్టర్తో జతకట్టనున్న శింబు?
కోలీవుడ్లో సంచలన నటుడిగా ముద్ర వేసుకున్న హీరో శింబు. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వార్త సామాజిక మాధ్య మాల్లో వైరల్ అవుతోంది. ఇటీవల శింబు నటించిన పత్తుతల చిత్రం పెద్దగా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే అవకాశాలకు మాత్రం తగ్గడం లేదు. తాజాగా నటుడు కమలహాస న్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రంలో శింబు కథానాయకుడిగా నటించనున్నారు. దేశింగు పెరియ సామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నా యి. ఈ చిత్రం కోసం శింబు ప్రత్యేకంగా కసరత్తు చేయడంతో పాటు కరాటే వంటి ఆత్మ రక్షణ విద్యల్లోనూ శిక్షణ పొందారు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్పైకి వెళ్లనుంది. ఇదిలా ఉండగా శింబు తన 49, 50వ చిత్రాలకు కూడా కమిట్ అయిన ట్లు తాజా సమాచారం. ఆయన తన 49వ చి త్రాన్ని అశ్వంత్ మారి ముత్తు దర్శకత్వంలో చే యనున్నట్లు తెలుస్తోంది. ఆయన చెప్పిన కథ డబుల్ ఓకే అనిపించడంతో వెంటనే అందులో నటించడాని కి సమ్మతించినట్లు తెలిసింది. ఇ కపోతే శింబు తాను 50వ చిత్రాన్ని సుధా కొంగర దర్శకత్వంలో చేయనున్న ట్లు తాజాగా సామాజిక మాధ్యమాల్లో టా క్ వైరల్ అవుతోంది. సూరారై పోట్రు వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన సుధా కొంగర తాజాగా మరోసారి సూర్యతో పురనానూరు అనే చి త్రాన్ని రూపొందించే పనిలో ఉన్నారు. ఈ చి త్రం తర్వాత శింబుతో చేసే చిత్రం ఉండే అ వకాశం ఉంది. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
సినిమాలో విలన్స్ కంటే బయటే ఎక్కువ: విశాల్ హాట్ కామెంట్స్
సినిమాల్లో కంటే బయటే ఎక్కువ విలన్లు ఉన్నారని కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ పేర్కొన్నారు. ఆయన ఇటీవల హీరోగా నటించిన మార్క్ ఆంటోని చిత్రం ఘన విజయాన్ని సాధించింది. తాజాగా హరి దర్శకత్వంలో రత్నం చిత్రంలో నటించారు. నటి ప్రియా భవానీశంకర్ నాయకిగా నటించిన ఈ చిత్రం ఈనెల 26న తెరపైకి రానుంది. తాజాగా తమిళ నూతన సంవత్సరం సందర్భంగా తమిళ సినీ పాత్రికేయుల సంఘం ఆదివారం ఉదయం స్థానిక వడపళనిలోని సంగీత కళాకారుల సంఘం ఆవరణలో నిర్వహించిన వేడుకలో విశాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాత్రికేయులతో ముచ్చటించారు. తాను తాజాగా నటించిన రత్నం చిత్రం కుటుంబసమేతంగా చూసి ఆనందించే కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉంటుందన్నారు. దర్శకుడు హరి ఈ చిత్ర కథ చెప్పినప్పుడే అందులోని ముఖ్య పాయింట్ అద్భుతం అనిపించిందన్నారు. ఈ చిత్రం విడుదల తరువాత తాను స్వీయ దర్శకత్వంలో నటించే తుప్పరివాలన్- 2 చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుందని చెప్పారు. మే 5తేదీన షూటింగ్ లండన్లో మొదలవుతుందని చెప్పారు. దీంతో విశాల్ కూడా దర్శకుడు అవుతున్నాడు.. కొత్తగా ఈయనే చేస్తారులే అని అనుకునేవారు ఇక్కడ ఉంటారన్నారు. అలాంటి వారి కోసమే తాను తుప్పరివాలన్–2 చేస్తున్నట్లు చెప్పారు. కాగా దక్షిణ భారత నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణాన్ని ఈ ఏడాదిలో పూర్తిచేస్తామని చెప్పారు. మెరీనా తీరంలో ఎంజీఆర్ సమాధిని చూడడానికి ఎలాగైతే ప్రజలు వస్తారో.. అలా నటీనటుల సంఘం నూతన భవనాన్ని చూడడానికి వచ్చేలా దీన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించే విధంగానూ, కల్యాణమంటపం, రంగస్థల నటుల కోసం వేదికను వంటి పలు వసతులతో ఈ భవనం ఉంటుందని విశాల్ పేర్కొన్నారు. -
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. సింగం నటుడు కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ కోలీవుడ్ నటుడు అరుల్మణి(65) కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా.. అరుల్మణి ప్రస్తుతం అన్నాడీఎంకే తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఆయన మృతికి ఎన్నికల ప్రచారమే కారణమని తెలుస్తోంది. గత పది రోజులుగా పలు నగరాల్లో ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు. గురువారం చెన్నైకి వచ్చిన ఆయన అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. కాగా.. అరుల్మణి ప్రముఖంగా సింగం, సింగం- 2, సామాన్యన్, స్లీప్లెస్ ఐస్, థెండ్రాల్, తాండవకొనే, రజినీకాంత్ లింగతో సహా పలు తమిళ చిత్రాలలో ఆయన నటించారు. కాగా.. అరుల్మణి తమిళ సినిమాల్లో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలు సినిమాల్లో నటించారు. 'అళగి' సినిమా అరుల్ మణి కెరీర్ను మలుపు తిప్పింది. కోలీవుడ్లో ఇప్పటి వరకు అళగి, తెనారల్, పొన్నుమణి, ధర్మశీలన్, కరుపు రోజా, వేల్, మరుదమలై, కత్తు తమిళ్, వన యుద్ధం సహా 90 చిత్రాల్లో నటించారు. దాదాపు అందరు ప్రముఖ హీరోలతో ఆయన నటించారు. ఆయనకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఆయన అన్నాడీఎంకే స్టార్ కంపెయినర్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
లవ్ టుడే హీరో మరో చిత్రం.. ఆ సూపర్ హిట్ కాంబో రిపీట్!
నటుడు జయంరవి హీరోగా నటించిన కోమాలి చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యి హిట్ కొట్టిన ప్రదీప్ రంగనాథన్ ఆ తరువాత లవ్టుడే చిత్రంతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చి సూపర్హిట్ను అందుకున్నారు. ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన సంగతి తెలిసిందే. కాగా ఇదే సంస్థలో ప్రదీప్ రంగనాథన్ మరోసారి కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం ద్వారా తన కాలేజ్మేట్ అశ్వంత్ మారిముత్తు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన ఇంతకుముందు కొన్ని షార్ట్ ఫిలింస్ చేశారు. దీని గురించి ఏజీఎస్ సంస్థ నిర్వాహకులు గురువారం ఒక వీడియోను విడుదల చేశారు. అందులో నటుడు ప్రదీప్ రంగనాథన్ తన కాలేజ్మేట్, మిత్రుడు అశ్వంత్ మారిముత్తుతో కలిసి చిత్రం చేయాలన్నది దశాబ్దం కల అని పేర్కొన్నారు. అది ఇప్పటికి నెరవేరబోతోందని అన్నారు. కాగా ఈయన ప్రస్తుతం విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ఎల్ఐసీ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఆ తరువాత ఏజీఎస్ ఎంటర్టైయిన్మెంట్ సంస్థ నిర్మించనున్న చిత్రంలో నటించనున్నారు. ఇది ఈ సంస్థ నిర్మిస్తున్న 26వ చిత్రం అవుతుంది. ఈ చిత్రం షూటింగ్ మే నెలలో ప్రారంభం కానుందని చెప్పారు. కాగా ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ ప్రస్తుతం విజయ్ హీరోగా వెంకట్ప్రభు దర్శకత్వంలో గోట్ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించే చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాతలు పేర్కొన్నారు. Dedicated to all those who have a dream :) Joining hands with my brother , friend , well wisher @Dir_Ashwath and my home ground @Ags_production once again ❤️#AGS26 #PR03 Announcement video : https://t.co/JwLjs8n5HI#KalpathiSAghoram#KalpathiSGanesh#KalpathiSSuresh pic.twitter.com/hKxBbns9TB — Pradeep Ranganathan (@pradeeponelife) April 10, 2024 -
సలార్ హీరో సాహసం.. ఆ సీన్ కోసం ఏకంగా మూడు రోజులు!
సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం ఆడుజీవితం(ది గోట్ లైఫ్). ఈ చిత్రంలో అమలాపాల్ హీరోయిన్గా నటించింది. బ్లెస్సీ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవల థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. యథార్థ సంఘటనలపై బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ ఈ చిత్రాన్ని రూపొందించాడుకేరళకు చెందిన ఓ యువకుడు విదేశాలకు వెళ్లి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేది ఈ సినిమాలో చూపించారు. అయితే ఈ చిత్రం కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ తీవ్రంగా శ్రమించారు. ఈ సినిమాలో పాత్ర కోసం ఏడు నెలల్లో 31 కిలోల బరువు తగ్గినట్లు వెల్లడించారు. తాజాగా ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ సునీల్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రంలోని నగ్నంగా కనిపించే సన్నివేశం కోసం కఠినమైన ఉపవాసం చేశారని తెలిపారు. దాదాపు మూడు రోజుల పాటు కనీసం నీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉన్నారని వెల్లడించారు. ఈ సినిమాపై పృథ్వీరాజ్ అంకితభావం చూపడాన్ని ఆయన కొనియాడారు. పృథ్వీరాజ్ను షూట్ జరిగే ప్రదేశానికి కుర్చీలో తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా నగ్న సన్నివేశాన్ని చిత్రీకరించే ముందు కేవలం 30 ఎంఎల్ వోడ్కా ఎందుకు తాగాడనే విషయాన్ని కూడా సునీల్ వెల్లడించారు. షూట్కు ముందు అతని శరీరంలో మిగిలి ఉన్న నీటి నీటి శాతాన్ని బయటకు పంపేందుకు 30 ఎంఎల్ వోడ్కా తీసుకున్నారని తెలిపారు. ఈ సీన్ షాట్కు ముందు మేము ఆయనను కుర్చీలో నుంచి లేపాల్సి వచ్చిందని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో నజీబ్ అనే వలస కార్మికుడి పాత్రలో పృథ్వీరాజ్ కనిపించారు. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. Wow 👏 For d Naked Scene, Prithviraj was fasting for 3 Days, not even water in last day; before shoot he took 30ML Vodka to drain remaining water frm body. He was carried in a chair to d location. We needed to lift him from the chair before the shot😯 pic.twitter.com/UjY3Kq0Ti9 — Christopher Kanagaraj (@Chrissuccess) April 2, 2024 -
విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. చివరి చిత్రం డైరెక్టర్గా ఎవరంటే?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 69వ చిత్రంపై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇందుకు ప్రధాన కారణం రాజకీయరంగ ప్రవేశం చేస్తున్న విజయ్ నటించే చివరి చిత్రం ఇదేననే ప్రచారం జరుగుతోంది. విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన తండ్రి, కుమారుడిగా ద్విపాత్రాభియనం చేస్తున్నారు. కొడుకు పాత్ర కోసం ఆధునికి టెక్నాలజీని వాడుతున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో విజయ్ 69వ చిత్రానికి దర్శకుడెవరనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. ఈ విషయంలో చాలా మంది దర్శకుల పేర్లు కోలీవుడ్లో వినిపిస్తున్నాయి. వీరిలో ఓ టాలీవుడ్ డైరెక్టర్తో పాటు, వెట్రిమారన్, కార్తీక్సుబ్బరాజ్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరందరికీ విజయ్తో చిత్రం చేయాలన్నది ఆశే. తాజాగా హెచ్.వినోద్ పేరు వెలుగులోకి వచ్చింది. ఇంతకు ముందు చతురంగవేట్టై, ధీరన్ అధికారం ఒండ్రు, తుణివు వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. తాజాగా కమలహాసన్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన కథా చర్చలు జరిపారు. చిత్రం ప్రారంభమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో ఆ చిత్రం డ్రాప్ అయ్యారు. అలాంటి పరిస్థితుల్లో విజయ్ తన 69వ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు ప్రచారం వైరలవుతోంది. దీని గురించి ఇటీవల ఓ భేటీలో నటుడు విజయ్ హీరోగా చేస్తే అది ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నకు హెచ్.వినోద్ బదులిస్తూ కచ్చితంగా రాజకీయ నేపథ్యంలోనే ఉంటుందని చెప్పారు. విజయ్ హీరోగా రాజకీయ నేపథ్యంలో చిత్రం చేయాలన్నది తన కోరిక అని పేర్కొన్నారు. తాను ఆయనకు చెప్పిన కథలన్నీ అలాంటివేనన్నారు. కాగా విజయ్ 69వ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకుడు అయితే అది కచ్చితంగా ఆయన రాజకీయ జీవితానికి ప్రయోజన కరంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
డేనియల్ బాలాజీ పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. సంపాదించిన డబ్బంతా ఏమైంది?
కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ (48) కన్నుమూశాడు. శుక్రవారం అర్థరాత్రి గుండెపోటుతో ఆయన మరణించారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రితో ఆయన మరణిచారు. అనంతరం డేనియల్ నేత్రాలు ఒక ట్రస్ట్కు దానం చేశారు. 48 ఏళ్లు పూర్తి అయినా కూడా ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదని పలు ప్రశ్నలు నెట్టింట కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆయన సంపాధించిన డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టారో తెలుసా అంటూ పలురకాలుగా ప్రచారం జరుగుతుంది. వీటంన్నిటిక సమాధానం ఆయన గతంలోనే పలు ఇంటర్వ్యూలలొ పంచుకున్నాడు. కుటుంబ నేపథ్యం డేనియల్ బాలాజీ తండ్రి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరుకు చెందిన వ్యక్తి, ఆయన అమ్మగారు మాత్రం తమిళనాడుకు చెందిని వారు. డేనియల్ తండ్రి చెన్నైలో వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. అక్కడ హౌల్సేల్ క్లాత్ షోరూమ్స్ వారికి ఉన్నాయి. డేనియల్కు ఐదుగురు సోదరులతో పాటు ఐదుగురు సోదరీమణులు ఉన్నారు అలా మెత్తం 11 మంది వారి కుటుంబ సభ్యులు. పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే.. తనకు 25 ఎళ్ల వయసు వచ్చినప్పుడే పెళ్లి చేసుకోనని తన తల్లికి చెప్పారట.. అందుకు కారణం తన కుటుంబంలోని సభ్యులందరికీ పెళ్లిళ్లు అయ్యాక వారి ఇబ్బందులు చూసి వద్దనుకున్నట్లు ఆయన చెప్పాడు. పెళ్లి తర్వాత, భార్యా, పిల్లలు వంటి బాధ్యతలు తన వల్ల కాదని ఆయన చెప్పాడు. వారి కోసం డబ్బు కూడబెట్టాలి.. అందుకోసం ఒక్కోసారి తప్పులు కూడా చేయాల్సి వస్తుంది. కొందరిని మోసం చేయాల్సి వస్తుంది.. ఇలా పలు కారణాలతో పెళ్లి వద్దని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. సొంత డబ్బుతో గుడి నిర్మాణం చెన్నైలో కొట్టివాక్కం ప్రాంతంలో డేనియల్ ఉంటున్నారు. తన సొంత డబ్బుతో అక్కడ ఒక గుడిని ఆయన నిర్మించారు. ఆ ఆలయం వద్ద ప్రతి సంవత్సరం గంగమ్మ జాతర జరుగుతుందని ఆయన చెప్పారు. జాతర కోసం లక్షల్లో ప్రజలు వస్తారని తెలిపారు. 'సినిమా ద్వారా నేను కొంతమేరకు సంపాధించాను.. ఇప్పటికే తమిళ్,తెలుగు ప్రజల్లో నాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇంతకు మించి ఇంకేమీ వద్దు అనుకున్నాను. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ గుడిని ఎవరూ అభివృద్ధి చేయలేదు. ఇక్కడ ఉన్న అమ్మవారిని నమ్మిన వారు కోట్లలో సంపాదించారు. కానీ వారెవరూ గుడి కోసం ఖర్చు పెట్టలేదు. అలాంటి సమయంలోనే ఈ గుడి కోసం ఎదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ గుడి మొత్తం 4వేల చదరపు గజాలు ఉంది. ఒక రూమ్ మాదిరిగా ఉన్న ఈ గుడిని ఇప్పడు భారీగా నిర్మించాను. ఈ గుడి అంటే మా అమ్మకు కూడా ఎంతో నమ్మకం ఉంది. అందుకే నేను దీనిని ఎలాగైనా నిర్మించాలని కోరుకున్నాను.' అని గతంలో ఓ ఇంటర్వయూలో ఆయన చెప్పాడు. సినిమాల్లో నటించి వచ్చిన డబ్బంతా కూడా డేనియల్ ఆ గుడి కోసమే ఖర్చు చేశాడు. ఆలయ నిర్మాణ కోసం సుమారు రూ. 3 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు కోలీవుడ్లో పలు వార్తలు కూడా గతంలో వచ్చాయి. గుడి కోసం కేజీఎఫ్ యష్ సాయం డేనియల్ బాలాజీ కన్నడలో కూడా పలు సినిమాల్లో మెప్పించాడు. కేజీఎఫ్ యష్తో డేనియల్కు మంది స్నేహం ఉంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో యష్ గురించి డేనియల్ ఇలా అన్నారు. ' కేజీఎఫ్ సినిమాలో ఛాన్స్ ఉంది అందులో నటించాలని యష్ నన్ను కోరాడు. కానీ నేను ఆ సమయంలో అందుబాటులో లేను. దానికి ప్రధాన కారణం గుడి నిర్మాణ పనులే. ఆలయానికి సంబంధించి చాలా కీలకమైన పనులు ఉండటంతో నేను రాలేనని యష్కు చెప్పాను. రెండు రోజుల తర్వాత యష్ నాకు కొంత డబ్బు పంపాడు.. ఎందుకు అని నేను కాల్ చేసి మాట్లాడాను. గుడి నిర్మాణం కోసం తన వంతుగా ఇస్తున్నాను అన్నాడు. గుడి నిర్మాణం తర్వాత కూడా యష్ ఇక్కడికి వచ్చాడు. అని ఆయన చెప్పారు. డేనియల్ మరణం తర్వాత ఆయన చేసిన మంచి పనుల గురించి ఒక్కోక్కటిగా ఇలా బయటకొస్తున్నాయి. డేనియల్ విలన్ కాదు.. రియల్ హీరో అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. "அங்காள பரமேஸ்வரி அம்மனுக்கு கோயில் கட்டிய நடிகர் டேனியல் பாலாஜி காலமானார்" 😥😢💔#RIPDanielBalaji #DanielBalaji #OmShanthi pic.twitter.com/YN7SVdG1SA — Aadhi Shiva (@aadhi_shiva1718) March 29, 2024 -
డేనియల్ బాలాజీ మంచి మనసు.. వారి జీవితాల్లో వెలుగులు నింపాడు
కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ (48) కన్నుమూశాడు. శుక్రవారం అర్థరాత్రి గుండెపోటుతో ఆయన మరణించారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. అర్థరాత్రి ఒక్కసారిగా తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన డేనియల్ బాలాజీని వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. కానీ మార్గమధ్యమంలోనే డేనియల్ బాలాజీ మరణించినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’.. శరీరంలోని అన్ని అవయవాల కంటే కళ్లు ప్రధానమైనవని దానర్థం. ఈ క్రమంలోనే అమరుల నుంచి కళ్లు సేకరించి మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపడమే కర్తవ్యంగా దేశంలోని అన్ని ప్రభుత్వాలు సంకల్పించాయి. ఈ క్రమంలో డేనియల్ బాలాజీ కూడా తన నేత్రాలను దానం చేయాలని ముందే నిర్ణయించుకున్నాడు. మరణం తర్వాత తన కళ్లు మరో ఇద్దరికి చూపును ఇవ్వాలని తలచాడు. అందుకు సంబంధించిన ఐ రిజిస్టర్లో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఈమేరకు కుటుంబ సభ్యుల అంగీకార ధ్రువపత్రం కూడా పొందాడు. ఇప్పుడు ఆయన మరణం తర్వాత డేనియల్ బాలాజీ నేత్రాలను అక్కడ ప్రభుత్వ ఆస్పత్రి వారు భద్రపరిచి మరో ఇద్దరికి చూపును ఇచ్చేందుకు తోడ్పడుతున్నారు. డేనియల్ బాలాజీ తన నేత్రాలను దానం చేయడంతో అందుకు సంబంధించిన ఆపరేషన్ పూర్తి అయిందని తన కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని తన స్వగృహానికి తరలించనున్నారు. తిరువాన్మియూర్లోని ఆయన నివాసంలో రేపు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. ఎంతో మందిని బతికేలా చేస్తున్న మంచి హృదయం ఉన్న డేనియల్ బాలాజీ అని ఆయన అభిమానులు కొనియాడుతున్నారు. 👉: గుండెపోటుతో నటుడి హఠాన్మరణం.. డేనియల్ బాలాజీ గురించి ఆసక్తికర విషయాలు (ఫొటోలు) View this post on Instagram A post shared by Indiaglitz Tamil (@indiaglitz_tamil) -
ప్రముఖ నటుడు 'డేనియల్ బాలాజీ' కన్నుమూత
కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ (48) కన్నుమూశాడు. శుక్రవారం అర్థరాత్రి గుండెపోటుతో ఆయన మరణించారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. అర్థరాత్రి ఒక్కసారిగా తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన డేనియల్ బాలాజీని వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. కానీ మార్గమధ్యమంలోనే డేనియల్ బాలాజీ మరణించినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. ఆయన ఇప్పటికీ వివాహం చేసుకోలేదు. డేనియల్ బాలాజీ ఎక్కువగా విలన్ రోల్స్లోనే నటించాడు. సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో సుమారు 50కి పైగా చిత్రాల్లో కనిపించిన డేనియల్.. తెలుగులో సాంబ, ఘర్షణ,చిరుత,టక్ జగదీష్, సాహసం శ్వాసగా సాగిపో వంటి చిత్రాలతో తెలుగువారికి దగ్గరయ్యాడు. కమల్ హాసన్ విడుదల కాని సినిమా 'మరుదనాయగం' సెట్స్లో యూనిట్ ప్రొడక్షన్ మేనేజర్గా బాలాజీ తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. (ఘర్షణ సినిమాలో వెంకటేశ్తో) బాలాజీ మొదటి పాత్ర టెలివిజన్ ధారావాహిక 'చితి' , అక్కడ అతను 'డేనియల్' అనే పాత్రను పోషించాడు. 'పిన్ని' పేరుతో తెలుగులో డబ్ అయిన ఈ సీరియల్ ఇక్కడ కూడా పాపులర్గా అయ్యింది. ఈ సీరియల్ హిట్ అయిన తర్వాత, అతని రెండవ ధారావాహిక 'అలైగల్'లో , దర్శకుడు సుందర్ K. విజయన్, 'చితి'లో తన పాత్రను తానే పోషించాడని భావించి అతనికి 'డేనియల్ బాలాజీ' అని పేరు పెట్టారు . (బిగిల్ సినిమా సెట్స్లో విజయ్తో డేనియల్) డేనియల్ బాలాజీకి తెలుగు మూలాలు ఉన్నాయి. ఆయన తండ్రి చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి.. కాగా తల్లి తమిళ్ కుటుంబానికి చెందిన వారు. డైరెక్టర్ కావాలని ఫిలిం మేకింగ్ కోర్సు నేర్చుకున్న డేనియల్ బాలాజీ చివరకు నటుడిగా స్థిరపడ్డాడు. కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అయిన గౌతమ్మీనన్తో డేనియల్ బాలాజీకి మంచి స్నేహం ఉంది. గద్దలకొండ గణేష్ సినిమాలో సెకండ్ హీరోగా నటించిన అథర్వ మురళితో బంధుత్వం ఉంది. డేనియల్ అమ్మగారి నుంచి అథర్వతో బంధుత్వం ఉంది. 👉: గుండెపోటుతో నటుడి హఠాన్మరణం.. డేనియల్ బాలాజీ గురించి ఆసక్తికర విషయాలు (ఫొటోలు) -
భిన్నమైన కాన్సెప్ట్తో వస్తోన్న చిత్రం.. రిలీజ్ ఎప్పుడంటే?
జీవితాల్లోని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రాల్లో జీవం ఉంటుంది. అలాంటి కథలకు కాస్త సినిమా టిక్ సన్నివేశాలను కలిపితే అది మరింత జనరంజక చిత్రంగా మారుతుంది. ఈ తరహా చిత్రాలకు పెద్దగా క్యాస్టింగ్ గురించి పట్టించుకోరు. కథ, కథనాలు బిగువుగా ఉంటే చాలు.. అలాంటి కథాంశంతో తెరకెక్కిన చిత్రం వెప్పమ్ కుళీర్ మళై. హాష్ ట్యాగ్ ఎఫ్డీఎఫ్ఎస్ పతాకంపై ధీరవ్ కథానాయకుడిగా నటిస్తుండగా.. ఇస్మత్ భాను హీరోయిన్గా పరిచయమవుతోంది. పస్కల్ వేదముత్తు ఈ సినిమాతో డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తున్నారు. ముఖ్యంగా పిల్లల పుట్టుక గురించి ఆవిష్కరించిన చిత్రమిది. పెళ్లి తరువాత ఆ దంపతులకు పిల్లలు పుట్టక పోతే కుటుంబ సభ్యుల నుంచి, ఊరు జనం వరకూ ఎలాంటి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఆధునిక సమాజంలో ప్రకృతికి విరుద్ధంగా కలిగి సంతానం కారణంగా ఎలాంటి మనోవేదనకు గురవుతారు? వంటి అంశాలను, సహజ సిద్ధంగా పిల్లలు పుట్టడానికి కారణాలు అంటూ పలు ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిన చిత్రమే వెప్పమ్ కళీర్ మళై. ఈ సినిమాలో ఎంఎస్ భాస్కర్, నటి రమ, మాస్టర్ కార్తీకేయన్, దేవ్హబిబుల్లా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. శంకర్ రంగరాజన్ సంగీతాన్ని, పృధ్వీ రాజేంద్రన్ ఛాయాగ్రహణం అందించారు. దర్శకుడు ఒక గ్రామీణ నేపథ్యాన్ని తీసుకుని వైవిధ్యంగా తెరకెక్కించారు. ఆధ్యంతం ఆసక్తిని రేకెత్తించేలా రూపొందిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. -
'నా భార్యను వన్ సైడ్ లవ్ చేస్తున్నా మావయ్య..'..ఆసక్తి పెంచుతోన్న ట్రైలర్!
సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో విజయ్ఆంటోని. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది 'బిచ్చగాడు -2'తో దర్శకుడిగా మారి సూపర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం 'రోమియో' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో మృణాళిని రవి హీరోయిన్గా నటిస్తోంది. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను తెలుగులో లవ్ గురు పేరుతో రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ మూవీకి ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే ఫుల్ రొమాంటిక్ లవ్ కథాచిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ చూడగానే లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించినట్లు అర్థమవుతోంది. లవ్ మ్యారేజ్ చేసుకున్న హీరోకు ఎదురయ్యే పరిస్థితుల నేపథ్యంలో లవ్ గురు చిత్రాన్ని తీసుకొస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు భరత్ ధనశేఖర్ సంగీతమందించారు. ఈ #LoveGuru చిత్రం specially భార్యామణుల కోసం తీయబడినది 🌹🤔 ▶https://t.co/uzXkprMMcS A Summer Blockbuster. Releasing this Ramzan💥 Telugu Release by @MythriOfficial@vijayantonyfilm @vijayantony @mirnaliniravi @actorvinayak_v #BarathDhanasekar @Bhashyasree @Gskmedia_pr… pic.twitter.com/fPV3Fms1t0 — Mythri Movie Makers (@MythriOfficial) March 25, 2024 -
స్టార్ డైరెక్టర్కు షాక్.. భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న మరో హీరో!
ఇండియన్ సినిమాలో దర్శకుడిగా మణిరత్నంకు మంచి పేరు ఉంది. అలాంటి దర్శకుడి చిత్రాల్లో పనిచేయాలని కోరుకోని నటినటులు ఉండరనే చెప్పాలి. ఇటీవల మణిరత్నం భారీ తారాగణంతో దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాలు మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా కమల్ హాసన్ హీరోగా థగ్స్ లైఫ్ అనే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది కమల్హాసన్ నటిస్తున్న 234వ చిత్రం కావడం గమనార్హం. అదేవిధంగా 34 ఏళ్ల తర్వాత కమలహాసన్, మణిరత్నం కలిసి పనిచేస్తున్న చిత్రమిదే. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో జయంరవి, దుల్కర్సల్మాన్, త్రిష కూడా ముఖ్యపాత్రలకు ఎంపికయ్యారు. కమలహాసన్కు చెందిన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ, మణిరత్నంకు చెందిన మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. రెండవ షెడ్యూల్ సెర్బియాలో జరగనుంది. అయితే నటుడు కమలహాసన్ అమెరికాలో జరుగుతున్న ఇండియన్–2 చిత్ర పనుల్లో బిజీగా ఉండడం, అదే సమయంలో ఇటీవల పార్లమెంట్ ఎన్నికల తేదీ ప్రకటించడంతో, పార్టీ వ్యవహారాలలో పాల్గొనడానికి చైన్నెకి తిరిగి వచ్చారు. దీంతో థగ్స్ లైఫ్ చిత్ర షూటింగ్ సెర్బియాలో ప్రణాళిక ప్రకారం జరగకపోవడంతో దర్శకుడు చైన్నెకి చేరుకున్నట్టు సమాచారం. ఈ చిత్ర షూటింగ్ కోసం తదుపరి షూటింగ్ను ఎన్నికల తర్వాత మళ్లీ సెర్బియాకు వెళ్లి జరుపుతారని సమాచారం. దీంతో కమలహాసన్ కాల్షీట్స్ దొరక్కపోవడంతో ఇందులో నటిస్తున్న ఇతరుల కాల్షీట్స్ వ్యవహారంలోనూ సమస్యలు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇలాంటి సమస్యలు కారణంగానే ఇప్పటికే ఈ చిత్రం నుంచి దుల్కర్సల్మాన్ వైదొలిగారు. తాజాగా జయం రవి కూడా థగ్స్ లైఫ్ చిత్రం నుంచి తప్పుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ఇందులో దుల్కర్సల్మాన్ పాత్రను శింబు నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు జయంరవికి బదులుగా దర్శకుడు మణిరత్నం ఎవరిని ఎంపిక చేస్తారనే ఆసక్తి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
'ఇలాంటి టైటిల్ పెట్టకపోవడం ఆశ్చర్యంగా ఉంది'
మిర్చి విజయ్, అంజలి నాయర్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం వైఫ్. ఈ చిత్రం ద్వారా హేమంత్ నాదం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఒలింపియ మూవీస్ సంస్థ అధినేత ఎస్.అంబేడ్కర్ నిర్మిస్తున్నారు. గతంలో జిప్సీ, డాడా, కలిగేత్తి మూర్కన్ వంటి వైవిధ్యభరిత కథా చిత్రాలను ఆయన నిర్మించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. దంపతుల మధ్య నవీన అనుబంధాలను ఆవిష్కరించే కథాచిత్రంగా ఇది ఉంటుందని డైరెక్టర్ హేమంత్ నాదం అన్నారు. అందుకే ఈ చిత్రానికి వైఫ్ అని పేరు పెట్టామని తెలిపారు. ఇలాంటి టైటిల్ను ఇప్పటివరకు ఎవరూ పెట్టకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. చదరంగంలో రాణికి అపార శక్తి ఉంటుందన్నారు. అదేవిధంగా ఒక ఇంటిని చక్కదిద్దడంలో భార్య పాత్ర ముఖ్యమన్నారు. వివాహానంతరం భార్యాభర్తల మధ్య పెరిగే ప్రేమానుబంధాన్ని ఎమోషనల్గా ఆవిష్కరించే చిత్రమని చెప్పారు. ఈ చిత్రం ద్వారా మిర్చి విజయ్ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కేఏ శక్తివేల్ చాయాగ్రహణం, జెన్ మార్టిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో మైత్రేయన్, రెడిన్ కింగ్స్ లీ, కల్యాణి నటరాజన్, విజయ్బాబు, విల్లు, కదిర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. Super happy to present the First Look of my next Romcom #Wife with @RJVijayOfficial 👰🏻♀️🤵🏻 Directed by @dir_hemanathan Produced by @ambethkumarmla @olympiaMovis@Abishek_jg @shakthi_dop @JenMartinmusic @PMohan93 @gayathribala21@sharmaseenu11@VishnuEdavan1 @DoneChannel1 pic.twitter.com/fqnzgwDBaZ — Anjali (@ianjalinair) March 23, 2024 -
ఎడారిలో షూటింగ్.. ఏకంగా 31 కిలోలు తగ్గా: సలార్ నటుడు
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం "ది గోట్ లైఫ్"(ఆడు జీవితం). ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్పై ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించాకు. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ ఆడు జీవితం పేరుతో తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, డైరెక్టర్ బ్లెస్సీ, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, మైత్రీ నుంచి నిర్మాత వై రవి శంకర్, శశి పాల్గొన్నారు. ఈ సినిమా గురించి హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ..' ఇటీవల వరదరాజ మన్నార్ పాత్రతో సలార్లో మీ ముందుకు వచ్చాను. మరోసారి ఆడు జీవితం సినిమాతో తెరపైకి రాబోతున్నాను. వరదరాజ మన్నార్ పూర్తిగా ప్రశాంత్ నీల్ ఇమాజినేషన్. కానీ ఈ సినిమా వాస్తవంగా జరిగిన కథ. నజీబ్ అనే పాత్రలో నటించా. 90వ దశకంలో జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వ్యక్తి అతను. ఈ ప్రయాణంలో తను ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ రాసిన పుస్తకమే గోట్ డేస్. బెన్యామిన్ రాసిన ఈ పుస్తకం కేరళలో 2008లో పబ్లిష్ అయింది. ఇప్పుడు సినిమా రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాం. 2008 ప్రారంభంలో ఈ సినిమాకు కమిట్ అయ్యాం. అయితే ఆ టైమ్లో ఈ సినిమాకు కావాల్సిన బడ్జెట్ ఖర్చు చేయడం అసాధ్యంగా ఉండేది. పదేళ్ల తర్వాత 2018లో షూటింగ్ ప్రారంభించాం' అని తెలిపారు. సినిమా షూటింగ్పై మాట్లాడుతూ..' నేను ఈ సినిమా కోసం మొదట బరువు పెరిగి ఆ తర్వాత 31 కిలోలు తగ్గా. బరువు తగ్గేందుకు ఒక షెడ్యూల్ తర్వాత 7 నెలల గ్యాప్ తీసుకున్నాం. ఇప్పటికి కూడా ఈ సినిమా బడ్జెట్ రిస్కు చేయడమే. మేము తిరిగి జోర్డాన్లో షూటింగ్ స్టార్ట్ చేసేప్పటికి కోవిడ్ లాక్ డౌన్ వచ్చింది. మూడు నెలలు పూర్తిగా షూటింగ్ ఆపేశాం. మేము భారత్ కు తిరిగి రావడం కూడా కష్టమైంది. వందే భారత్ స్పెషల్ ఫ్లైట్లో ఇండియాకు వచ్చాం. పాండమిక్ ఎప్పటికి ఆగిపోతుందో తెలియదు. ఏడాదిన్నర తర్వాత అల్జీరియాలోని టిముమౌన్ అనే ప్లేస్లో షూటింగ్ స్టార్ట్ చేశాం. సహార ఎడారి మధ్యలో లొకేషన్. అక్కడికి ఏ సినిమా యూనిట్ వెళ్లలేదు. మా బ్లెస్సీ సార్కు సినిమా పిచ్చి. ఆయన వల్లే మేమంతా అక్కడ షూటింగ్ చేయగలిగాం. 2008లో అనుకున్న సినిమా ఫైనల్గా 2024 మార్చి 28న మీ ముందుకు వస్తోంది. ఇంత కష్టపడిన ఈ సినిమాను ఫర్ఫెక్ట్గా రిలీజ్ చేయాలని అనుకున్నామని' వెల్లడించారు.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
సీఎస్కేకు షాకిచ్చిన గుజరాత్.. ఘన విజయం
ట్రాన్స్జెండర్కు ఘోర అవమానం!
ఈ అలవాట్లను మార్చుకున్నారో.. విజయం మీదే..!
అక్కను రౌడీలా వేధించా.. సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోంది
ఎన్డీయేలో చేరాలన్న మోదీ.. శరద్ పవార్ స్పందన ఇదే
పవన్ కళ్యాణ్, బాలకృష్ణకు సీఎం జగన్ కౌంటర్
సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన పల్నాడు గడ్డ..
అలా ముగిసిందో లేదో.. ఇలా తగ్గింది!
రఘురామ, గంటాకు బిగ్ షాక్
ఓటేసే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచించండి..
తప్పక చదవండి
- సీఎం జగన్కు ఇంత మంది శత్రువులు ఎలా అయ్యారు?
- టీ20లలో సరికొత్త చరిత్ర.. బాబర్ ఆజం ప్రపంచ రికార్డు
- నీతో ప్రచారం చేస్తే నా ఓటమి ఖాయం... కేశినేని చిన్ని
- పశ్చిమలో వెంకన్న సైలెంట్.. అనుచరుల ఆగ్రహం
- తూ.గో.లో వ్యాన్ బోల్తా.. కోట్లలో పట్టుబడిన డబ్బు
- కుప్పంలో టీడీపీ గూండాయిజం
- HYD: ఏపీకి క్యూ కట్టిన ప్రజలు.. పలుచోట్ల ట్రాఫిక్ జాం
- 'డబుల్ ఇస్మార్ట్' తర్వాత ఆ ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న 'రామ్'
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement