-
చింత చిగురు పులిహోర.. అద్భుతమైన రుచి
చింతపండుతోపాటు చింత చిగురు లేదా చింతాకు కూడా చాలా వంటకాల్లో ఉపయోగపడుతుంది. చింత చిగురును మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. చింత చిగురు సీజనల్గా దొరికే ఆకుకూర లాంటిదనే చెప్పవచ్చు. చింతపండులాగానే ఈ చింత చిగురు రుచిగా పుల్లగా ఉంటుంది. (మటన్కు షాకిస్తున్న చింతచిగురు! ఈ ప్రయోజనాలు తెలుసా?)చింతాకు ఎముకల గట్టితనానికి, జీర్ణ సంబంధిత సమస్యలను తొలగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. చింత చిగురుతో పప్పు, పచ్చడి, మటన్, చికెన్, చేపలు, రొయ్యలతో కలిపి కూర చేసుకోవచ్చు. వీటిన్నింటిలో ప్రధానమైంది చింతచిగురు పులిహోర.కావాల్సిన పదార్థాలు రెండు కప్పులు బియ్యంకప్పు సన్నగా తరిగిన లేత చిగురు టేబుల్ స్పూన్లు నూనె 3 - 4 పెద్ద పచ్చిమిర్చి 5, 6 ఎండు మిరపకాయలు కొద్దిగా వేరు శనగపప్పు,లేదంటే జీడిపప్పు పసుపు, ఇంగువ పోపు కోసం మినపప్పు, శనగపప్పు, జీలకర్ర , ఆవాలు, కరివేపాకు తయారీ: బియ్యాన్ని బాగా కడిగి, మరీమెత్తగా కాకుండా పొడిగా ఉండేలా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి ఆవాలు, శెనగపప్పు, జీడిపప్పు, ఎండు మిరపకాయలు వేయించాలి. పచ్చిమిర్చి ముక్కలు కూడా కొద్దిసేపువేగనివ్వాలి. కొద్దిగా ఇంగువ కూడా వేయాలి. వేగిన తరువాత శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న చింత చిగురు వేసి బాగా కలపాలి. పసుపు, ఉప్పు వేసి మూత పెట్టాలి. (క్రికెట్ గాడ్ సచిన్కు అత్యంత అపురూపమైన 13 నాణేల గురించి తెలుసా? )సాధారణంగా ఉప్పు వేసిన తరువాత వచ్చే నీరుతో చింత చిగురు ఉడికిపోతుంది. లేదంటే కొద్దిగా నీరు చిలకరించుకుంటే సరిపోతుంది. చిగురు ఉడికి కమ్మటి వాసన వచ్చి, నూనెపైకి తేలేవరకు సన్నని మంటమీద ఉడికించాలి. చివరగా ఉడికిన అన్నంలో, ఈ మిశ్రమం వేసి అన్నం పగలకుండా కలుపుకుంటే కమ్మ కమ్మగా..పుల్లపుల్లగా చింతచిగురుపులిహోర రడీ. -
అంజీర్ పండ్లే కాదు.. ఆకులతో కూడా బోలెడన్ని ప్రయోజనాలు
అంజీర పండ్లను తినడం వల్ల ఆరోగ్యపరంగా చాలా లాభాలున్నాయి. వీటినే అత్తి పండ్లు అని కూడా అంటారు. ఈ పండ్లలో విటమిన్లు, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే కార్బోహైడ్రేట్లు, ఫైబర్ కూడా. వీటిని పచ్చిగానూ, డ్రై ఫ్రూట్స్గానూ కూడా వాడతారు. ఈ పండ్లతో పాటు వీటి ఆకులు కూడా అద్భుత పోషకాల గని అని మీకు తెలుసా? అవేంటో తెలుసుకుందాం. అంజీర పండ్లలలాగానే ఆకుల్లో కూడా పొటాషియం, సోడియం, ఫాస్పొరిక్ ఆమ్లం, ఐరన్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. అందుకే ఆకుల కషాయాలు, టీ, రసం, ఎండు ఆకులతో పొడి రూపంలో వివిధ అనారోగ్య సమస్య చికిత్సలో వినియోగించవచ్చు. అంజీర్ పండ్లే కాదు, ఆకులతో చేసిన కషాయం, రసం, టీ చాలా రకాలుగా మేలు చేస్తుంది. డయాబెటిక్ ఎలుకలపై జరిపిన ఒక అధ్యయనంలో అంజీర్ ఆకు రసం హైపోగ్లైసీమిక్ ప్రభావాన్ని కలిగి ఉందని తేలింది. అంజీర ఆకులలో అపారమైన యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి. హైపర్గ్లైకేమియా (రక్తంలో శాశ్వతంగా అధిక స్థాయి గ్లూకోజ్),హైపోగ్లైసీమియా (తక్కువ గ్లూకోజ్ లెవల్స్) ఈ రెండు పరిస్థితుల్లోనూ పనిచేసి, గ్లూకోజ్ స్థాయిలను సాధారణ స్థితికి తీసుకువస్తుందని తేలింది. వీటి రసం ద్వారా సహజ పద్ధతిలో కూడా శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ను నియంత్రణలో ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అంజీర్ ఆకుల్లోని ఔషధ గుణాలు మలబద్ధక సమస్యలు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంజీర్ ఆకులతో టీ వీటి ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో వేసి పది నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఈ నీటిని వడపోసుకుని, కావాలనుకుంటే రుచికి కొద్దిగా తెనె కలుపుకుని టీలా వేడిగా తీసుకోవాలి. ఎండబెట్టి పొడి చేసుకుని అంజీర ఆకులను శుభ్రంగా కడిగి, ఎండబెట్టి పొడి చేసి నిల్వం ఉంచుకోవచ్చు. దీనిని అవసరమైనపుడు,నీటిలో వేసుకుని టీ లాగా మరిగించి తీసుకోవచ్చు. ఈ పొడి ఎముకలకు మంచి బలాన్ని చేకూరుస్తాయి వీటిల్లో పుష్కలంగా లభించే పొటాషియం, కాల్షియంతో ఎముకల సాంద్రతను బలోపితం చేసేందుకు కూడా వాడవచ్చు. అంజీర ఆకుల్లోని ఒమేగా 3 ఒమేగా 6 లక్షణాలు గుండె సమస్యల్ని కూడా దూరం చేస్తాయి. ఈ ఆకుల కషాయం లేదా టీతో గుండె జబ్బులతో ఇబ్బంది పడే వారికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే ఈ అంజీర ఆకులలో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ అధిక కొలెస్ట్రాలను కరిగిస్తుంది. నోటి బాక్టీరియాతో బాధపడేవారు అంజీర్ను సహజ యాంటీ బాక్టీరియల్ ఏజెంట్గా ఉపయోగించ వచ్చు. అంజీర్ ఆకు రసం యాంటీ ఫంగల్గా పనిచేస్తుందని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. టీబీ నివారణలో అంజీర్ ఆకుల రసం మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ (క్షయవ్యాధి బ్యాక్టీరియా)కు వ్యతిరేకంగా ప్రభావ వంతంగా పనిచేస్తుంది. ఈ కారణంగానే మలేషియాలో క్షయవ్యాధి నివారణచికిత్సలో వాడతారు. -
లీఫ్ ఆర్ట్: ఇంటికి సరికొత్త అలంకరణ తెచ్చే ఆర్ట్!
ఇంటీరియ్లో వుడెన్ వర్క్ గురించి తెలిసిందే. ఇప్పుడు ఆకులు కూడా కొత్త పాత్ర పోషిస్తున్నాయి. రాలిన ఆకులను కొన్ని రోజుల పాటు నానబెట్టి, వాటి పలచని పొరను కూడా ఉపయుక్తంగా మార్చి, ఇంటి అలంకరణకు ఉపయోగిస్తున్నారు డిజైనర్లు. లీఫ్ ఆర్ట్గా పేరొందిన ఈ కళ ఇంటికి కొత్త శోభనిస్తోంది. బర్డ్స్గా, ఫెదర్స్గా, బెడ్ ల్యాంప్స్గా, ఎంబ్రాయిడరీ వర్క్తోనూ ఆకులుకొత్త సింగారాన్ని నింపుకుంటున్నాయి. స్కెలిటన్ లీవ్స్ తయారీకి.. 1. ఒక గిన్నెలో పది ఆకులను తీసుకొని, అందులో కప్పు సోడా వాటర్ పోయాలి. ఆకులు మునిగేలా నీళ్లు పోసి, సన్నని మంట మీద నీళ్లను మరిగించాలి. ఆకులు మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. 2. ఆకులను బయటకు తీసి, చల్లని నీళ్లలో వేయాలి. 3. ఒక్కో ఆకు తీసుకొని, తడి ఆరాక టూత్ బ్రష్తో మెల్లగా రబ్ చేస్తూ, పై పొట్టును తీసేయాలి. 4. పొట్టు తీసేసిన ఆకులన్నిటినీ బ్లీచ్ నీళ్లలో వేసి రెండు గంటలు ఉంచాలి. 5. తర్వాత నీళ్లు పోయేలా ప్రతి ఆకును టిష్యూ పేపర్తో అద్ది, పక్కనుంచాలి. దీని వల్ల ఆకు పైపొర పూర్తిగా పోయి, స్కెలిటన్ భాగం తయారవుతుంది. 6. ఈ ఆకులను ఎండబెట్టి, అలంకరణకు తగినట్టుగా తయారుచేసుకోవచ్చు. -
ఆకు అస్థిపంజరమై.. ‘టేకు’ ఎర్రబారి
నిర్మల్జిల్లా: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా టేకు ఆకులు రాలి... చెట్లు ఎండిపోతున్నాయి. వర్షాకాలంలో పచ్చగా ఉండాల్సిన ఆకులు గోధుమ రంగులోకి మారి ఎండుటాకుల్లా నేల రాలుతున్నాయి.ఒక్కసారిగా చెట్లు ఎండిపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అడవుల జిల్లా ఆదిలాబాద్లో ఇప్పుడు ఎటుచూసినా టేకుచెట్లన్నీ మోడువారి కనిపిస్తున్నాయి. సాధారణంగా ఈ సమయంలో పచ్చగాఉండాల్సిన అడవులు...ఎరుపు రంగులోకి మారిపోతున్నాయి. యూటెక్టోనా మాచెరాలిస్ తెగులుతోనే టేకు ఆకు అస్థిపంజరంగా మారడానికి యూటెక్టోనా మాచెరాలిస్ తెగులు కారణమని వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. టేకుఆకుల్లో ఉన్నరసాలను చీడ పురుగులు పీల్చడంతో నిర్విర్యమైపోతుంది. సూర్యరశ్మిసమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరపకుండా అడ్డుకుంటాయి.అంతేకాకుండా టేకు ఆకులు ఎదగకుండా ఈ చీడపురుగులు సన్నని జాలీల వంటి వలయాలు ఏర్పరుస్తాయి. ఫలితంగా ఆకులన్నీ ఎండిపోయి చెట్టు మొత్తం ఎరుపు రంగులోకి మారుతుంది. కళ తప్పుతున్న అడవులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడవుల విస్తీర్ణం ఎక్కువ. వర్షాలు మొదలైన తర్వాత జూలై, ఆగస్టు మాసాల్లో అడవులన్నీ పచ్చదనంతో నిండిపోయాయి. కానీ పక్షం రోజులుగా అడవుల్లోని టేకుచెట్లు పూర్తిగా ఎర్రబారడంతో అడవులు కళ తప్పుతున్నాయి. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దులను కలిపే సహ్యద్రి పర్వత పంక్తుల్లోని మహబూబ్ఘాట్స్లో దట్టమైన టేకు చెట్లు కనిపిస్తాయి. ఈ సంవత్సరం మాత్రం ఈ టేకు చెట్లన్నీ ఎర్రబారి కనిపిస్తున్నాయి. దగ్గరికి వెళ్లి చూస్తే చెట్టులోని ఆకులన్నీ అస్థిపంజరంలా మారి జల్లెడను తలపిస్తున్నాయి. వేగంగా వ్యాప్తి.. యూటెక్టోనా మాచెరాలిస్ అనే తెగులు కారణంగా టేకుచెట్ల ఆకులు ఎండిపోయినట్టుగా మారుతున్నాయి. ఈ తెగులు వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఒక అంగుళం పొడవు ఉండే చిన్న చీడ పురుగులే ఇందుకు కారణం. ఇవి వెడల్పాటి టేకు ఆకులోని రసాన్ని మొత్తం పీల్చి పిప్పి చేస్తాయి. ఆకులు ఎదగకుండా వలయాలను నిర్మిస్తాయి. దీనివల్ల ఆకు క్రమంగా రంగు మారుతుంది. వీటిని టేకు స్కెలిటోనైజర్గా పిలుస్తారు. వాతావరణ పరిస్థితుల ద్వారా దానికదే అదుపులోకి వస్తుంది. – డాక్టర్ వెల్మల మధు, వృక్షశాస్త్ర నిపుణుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ -
సూపర్ స్నాక్స్.. తమలపాకు గారెలు తయారీ ఇలా
తమలపాకు గారెలు తయారీకి కావల్సినవి: తమలపాకులు – 10 (కడిగి, కచ్చాబిచ్చాగా తరిగి, కొద్దిగా మిరియాల పొడి కలిపి పెట్టుకోవాలి) మినపగుళ్లు – 1 కప్పు (4 గంటలు నానబెట్టుకోవాలి) పచ్చి మిర్చి – 2 (చిన్నగా కట్ చేసుకోవాలి, అభిరుచిని బట్టి) అల్లం – చిన్న ముక్క, కరివేపాకు – 1 రెబ్బ ఉల్లిపాయ ముక్కలు – 1 టేబుల్ స్పూన్ (చిన్నచిన్నగా కట్ చేసుకోవాలి, అభిరుచిని బట్టి) బియ్యప్పిండి – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత బేకింగ్ సోడా – చిటికెడు, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానం ఇలా.. ముందుగా నానబెట్టిన మినపగుళ్లను మిక్సీలో వేసి.. అల్లం ముక్క, కరివేపాకు వేసుకుని గారెల పిండిలా మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని.. అందులో బియ్యప్పిండి, బేకింగ్ సోడా, తగినంత ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, తమలపాకు మిశ్రమాన్ని జోడించి బాగా కలిపి.. గారెల్లా ఒత్తుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి.అంతే క్రిస్పీగా ఉండే తమలపాకు గారెలు రెడీ.. -
అనేక రంగుల్లో ఉన్న ఆకును ఎప్పుడైనా చూశారా..
న్యూయార్క్: ఆకులు ఏ రంగులో ఉంటాయో తెలుసా? అంటే.. ఇదేం ప్రశ్న.. ఆకుపచ్చ రంగులోనే కదా అంటారా.. మనకు కనబడేది ఆకుపచ్చ రంగులోనే. కానీ దాన్ని దగ్గరగా జూమ్ చేసి చూస్తే.. చాలా రంగులు కనిపిస్తాయి. ఇదిగో.. ఈ ఫొటోనే దీనికి ఎగ్జాంపుల్. ఇందులో వివిధ రంగుల్లో మెరిసిపోతున్నది ఆలివ్ చెట్టు ఆకు. అమెరికాలోని బేలోర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్త జేసన్ కిర్క్ మైక్రోస్కోప్తో ఈ ఫొటో తీశారు. ఇందులో తెల్లగా పైకి పొడుచుకు వచ్చిన భాగాలను ట్రైకోమ్స్ అంటారు. ఆకులపై ఒత్తిడి పడినప్పుడు అవి షాక్ అబ్జార్వర్లలా పనిచేసి రక్షిస్తాయి. వంకాయ రంగులో ఉన్నవేమో ఆకులు కార్బన్డయాక్సైడ్, ఆక్సిజన్లను పీల్చి వదిలేసే రంధ్రాలు (స్టొమాటా). ఆకుల్లో నీళ్లు, ఇతర పోషకాలను రవాణా చేసే నాళాలు నీలం రంగులో కనిపిస్తున్నాయి. ప్రఖ్యాత కెమెరా తయారీ సంస్థ నికాన్ నిర్వహించే ‘స్మాల్ వరల్డ్ కాంపిటీషన్’లో ఈ ఫొటో మొదటి బహుమతికి ఎంపికైంది. చదవండి: ముళ్లపందితో పోరులో పులి మృతి -
వైరల్: ఆకా లేదంటే పురుగా.. ఆశ్చర్యంగా ఉందే!
‘అరె చూడటానికి అచ్చం ఆకులా ఉందే.. నిజంగా ఆకేనా.. లేదంటే పురుగా’ అని పై ఫోటో చూసి ఆశ్చర్యపోతున్నారా. ఇలాంటి సందేహం కలగడంలో తప్పు లేదు. ఎందుకంటే ఆకృతిలో ఆకును తలపిస్తూ విచిత్రంగా కనిపిస్తున్న ఇది నిజానికి ఓ పురుగు. ఫిలియం జిగాంటియం అని పిలువబడే ఈ జీవి శరీరం అచ్చం ఆకులా కలిగి ఉంటుంది. ఇది ప్రపంచంలో అతిపెద్ద ఆకు పురుగు. దీనికి ఉండే రెండు కాళ్లతో ఆకులాగే కనిపిస్తుంది. చర్మం అంచుల చుట్టూ గోధుమ రంగు మచ్చలతో ఆకుపచ్చ రంగులో ఉంటుంది. తాజాగా కొన్ని ఆకు పురుగులు కదులుతున్న వీడియోను సైన్స్ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ షేర్ చేసింది. దీంతో ఈ ఆకు పురుగు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో దీనిని చూసిన నెటిజన్లు ఇదేంటో తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతి చెట్టుకు ఆకులుంటాయని అందరికీ తెలుసు. కానీ, చ్చం ఆకుల్లాగానే ఉండే పురుగులు ఉంటాయా అని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే దీనికి మిలియన్ వ్యూస్ రాగా లక్షల్లో కామెంట్లు వచ్చి చేరుతున్నాయి. మరి మీరూ ఈ వీడియోను చూసేయండి ఇక. చదవండి: కళ్ల ముందే కుప్పకూలుతూ.. చావు కోరల్లోకి! View this post on Instagram A post shared by Science by Guff 🧬 (@science) -
అది ఆకు కాదు..
-
అయ్యో.. అది ఆకు కాదు.. వీడియో వైరల్
మన చుట్టూ ఉండే ప్రకృతిలో వింత వింత జీవులు సంచరిస్తుంటాయి. కొన్ని రకాల జీవులను ఎప్పుడు చూసి ఉండం. అలాంటి జీవులు ఉన్నాయనేది కూడా మనకు తెలిసి ఉండదు. సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడిప్పుడు కొన్ని వింత జీవులను మనం చూడగల్గుతున్నాయి. తాజాగా ఓ వింత సీతాకొకచిలుకకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటివరకు సీతాకోక చిలుక అంటే రంగురంగులతో చూడముచ్చటగా ఉంటుందనే తెలుసు. కానీ ఇది మాత్రం కాస్త భిన్నంగా ఉంది. రెక్కలు ముడుచుకొని ఉన్నప్పుడు చూస్తే ఎండిపోయిన ఆకు వలె కనిపిస్తుంది. ఎగురుతోన్న సమయంలో మాత్రం రంగురంగులతో కనపడుతూ అలరిస్తోంది. తన వద్దకు ఏదైనా పక్షి వచ్చి చంపాలని చూస్తే దాన్ని మభ్యపెట్టేలా ఈ సీతాకోకచిలుక తన రెక్కలను మూసుకుంటుంది. దీంతో అది ఒక ఆకుగా భావించి ఇతర పక్షులు దానికి హాని తలపెట్టకుండా వెళ్లిపోతాయి. తన ఈ సీతాకోకచిలుక తనను తాను రక్షించుకుంటోంది. (చదవండి : పారిపోయిన తాబేలు..74 రోజుల తిరిగొచ్చింది) 18 సెకండ్ల నిడివి గల ఈ వీడియోను బటర్ఫ్లై కన్జర్వేషన్ ట్విటర్లో షేర్ చేయగా దీనికి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ ప్రవీణ్ అంగుస్వామి రీట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ‘అద్భుతం.. ఇలాంటి సీతాకొకచిలుకను ఎప్పుడు చూడలేదు’, ‘వావ్.. ఇవి ప్రకృతి అద్భుతం’, ‘బ్యూటీపుల్ బటర్ఫ్లై.. ఆకర్షనీయంగా ఉంది’అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
పీజియన్ మెష్తో లీఫ్ కంపోస్టర్
ఎండాకులను చక్కని ఎరువుగా మార్చేందుకు అతి సులువుగా, అతి తక్కువ ఖర్చుతో, కేవలం పది నిమిషాల్లో మీరే లీఫ్ కంపోస్టర్ను తయారు చేసుకోవచ్చు. కావలసిన వస్తువులు: 1. పీజియన్ మెష్. 8 అడుగుల పొడవు “ 3 అడుగుల వెడల్పు ఉండే పిజియన్ మెష్. ఏ హార్డ్వేర్ స్టోర్లోనైనా దొరుకుతుంది. యువి ట్రీటెడ్ మెష్ కాబట్టి ఎండకు, వానకు తట్టుకొని నిలబడుతుంది. 2. జిప్ టైస్ ప్యాకెట్. ఒక ప్యాకెట్లో 30 జిప్ టైస్ ఉంటాయి. ఏ హార్డ్వేర్ స్టోర్లోనైనా దొరుకుతాయి. తయారు చేసుకునే పద్ధతి: ► పీజియన్ మెష్ను సిలిండర్ మాదిరిగా నిలువుగా, గుండ్రంగా ఉండేలా మడవండి. రెండు కొసలు దాదాపు ఒక అడుగు – అర అడుగు మేరకు ఒకదానిపైకి మరొకటి వచ్చే విధంగా మడిచి పట్టుకొని.. పీజియన్ మెష్ ఊడిపోకుండా జిప్ టైలతో కట్టేయండి. ► ఏదైనా చెట్టు కింద నేల పైన ఈ లీఫ్ కంపోస్టర్ను నిలబెట్టండి. దాని చుట్టూతా మట్టిని కొంచెం లోతు తవ్వి.. ఆ మట్టిని కంపోస్టర్ చుట్టూ ఎగదోయండి. లీఫ్ కంపోస్టర్ పడిపోకుండా నిలబడడానికి ఇలా చేయాలి. ► దీనికి మూడు వైపులా వెదరు కర్రలు లేదా తీసేసిన కర్టెన్ రాడ్లను నేలలో పాతి, వాటికి కంపోస్టర్ను కట్టేసినా పర్వాలేదు పక్కకు ఒరిగిపోకుండా, పడిపోకుండా ఉంటుంది. ► అంతే.. 7–8 అడుగుల ఎత్తు.. 2.5 – 3 అడుగుల వ్యాసార్థం కలిగిన లీఫ్ కంపోస్టర్ రెడీ అయినట్టే. ► ఇందులో రోజూ / ఎప్పుడు ఉంటే అప్పుడు ఎండాకులు వేయండి. వారానికోసారి కొంచెం మట్టి లేదా పశువుల పేడ లేదా ఎవరినైనా అడిగి తెచ్చిన కంపోస్టు ఎరువును కొంచెం వేయండి. లేదా సూక్ష్మజీవరాశితో కూడిన తోడు (మైక్రోబియల్ కల్చర్) వేసినా కూడా ఆకులు అలములు కొద్ది వారాల్లో కంపోస్టుగా మారతాయి. ► మొక్కలకు నీరు పోసినట్లు రోజూ ఈ కంపోస్టర్లోని ఆకులపైన కూడా నిరు పోయండి. అవి తేమగా ఉండేంతగా నీరు చాలు. ఇది నేలపైనే నిలబడి ఉంటుంది కాబట్టి, నీరు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. ► కంపోస్టర్ అడుగు భాగంలో రెండు నెలల్లోనే కంపోస్టు తయారవుతుంది. అప్పుడు ఇక ఎండాకులు వేయడం ఆపేయండి. అయితే, నీరు మాత్రం రోజూ తగుమాత్రంగా పోయటం అవసరం. నీరు చిలకరించడం మానకండి. ► ఇంకో నెల తర్వాత (మొత్తం 3 నెలల్లో) అందులో ఆకులన్నీ కంపోస్టుగా మారతాయి. అప్పుడు పీజియన్ లీఫ్ కంపోస్టర్ను ఎత్తివేసి, కంపోస్టును చెట్టు చుట్టూ సర్దేయండి. లేదా కుండీల్లో మొక్కలకు/ఇంటిపంటలకు వేయండి. అంతే.. అద్భుత ప్రకృతి వనరులైన ఎండాకులను తగులబెట్టకుండా, మున్సిపాలిటీకి భారంగా మార్చకుండా.. చక్కని సహజ ఎరువుగా మార్చి నేలతల్లికి చేర్చేశారన్న మాటే! -
నంబర్ ప్లేట్కు ఆకు అతికించాడుగా..
పంజగుట్ట: ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి నంబర్ ప్లేట్కు ఆకు అతికించిన సంఘటన పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు అత్తాపూర్కు చెందిన నందకిషోర్ విద్యార్థి. అతను తన (ఎపీ28డీఎక్స్ 5079) యమహా ఎఫ్జెడ్ బైక్పై బుధవారం ఉదయం షాలీమార్ జంక్షన్ నుంచి పంజగుట్ట వైపు వస్తుండగా పంజగుట్ట సర్కిల్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్సై రామకృష్ణ సిబ్బంది అతడి వాహనం వెనక ఏదో అంటించి ఉండటాన్ని గుర్తించి వాహనాన్ని ఆపారు. దగ్గరికి వెళ్లి చూడగా అతను ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్కు ఆకును అతికించినట్లు గుర్తించారు. అతని వాహనం వివరాలు పరిశీలించగా ఏడు చలాన్లకు గాను రూ.2045 పెండింగ్లో ఉన్నట్లు గుర్తించారు. అతడిని లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించగా నందకిషోర్పై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘భయ్యా.. మా చిన్నప్పుడు ఇలానే ఉండేది’
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఓ మాంసం వ్యాపారి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాడు. ఇంతకు అతడు ఏం చేశాడంటే.. ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని పూర్తిగా వదిలేయడమే కాక తన దుకాణానికి వచ్చే కస్టమర్లకు మాంసాన్ని కవర్ల బదులు ఆకుల్లో ప్యాక్ చేసి ఇస్తూ.. సామాన్యులతో పాటు.. కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు దృష్టిని కూడా ఆకర్షించాడు. దాంతో అతడి ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ.. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేశాడు కిరెణ్ రిజిజు. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. అరుణాచల్ ప్రదేశ్ లేపా రాడా జిల్లాకు చెందిన స్థానిక మాంసం దుకాణదారుడు.. తన షాప్కు వచ్చి మాంసం తీసుకునే వారికి ప్లాస్టిక్ కవర్లకు బదులు ఆకుల్లో పెట్టి సరఫరా చేస్తున్నాడు. "PM @narendramodi has told us not to use plastics so we are using local leaves because plastics are no more available" A local meat vendor at remote Tirbin, Lepa Rada Dist, Arunachal Pradesh. pic.twitter.com/Z1vuB2K8fK — Kiren Rijiju (@KirenRijiju) October 6, 2019 ఇందుకు సంబంధించిన వీడియోను కిరణ్ రిజిజు తన ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు మేం ప్లాస్టిక్ కవర్లను వినియోగించడం లేదు. దాని బదులు స్థానికంగా లభించే ఆకులను ఉపయోగిస్తూ.. పర్యావరణహితంగా మెలుగుతున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. మూడు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటికే 17వేలకు పైగా లైకులు సాధించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. సదరు మాంస దుకాణదారునిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తమ బాల్యంలో మాంసాన్ని ఇలానే ఆకుల్లో పెట్టి ఇచ్చే వారని గుర్తు చేసుకుంటున్నారు. 2022 నాటికి ఒకసారి మాత్రమే వినియోగించే వీలున్న ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించాలని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. -
తాటాకు @ రూపాయి
తాటాకుల నరికివేతతో ఉపాధి ఏటా నాలుగు నెలలు పని ద్వారకాతిరుమల : తాటి ఆకులు సంప్రదాయానికి చిహ్నాలుగా ఉండటంతో పాటు ఎండల నుంచి ఉపశమనాన్ని కలిగించే సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి. రానున్న వేసవి, వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు ఉండటంతో గ్రామాల్లో తాటి ఆకులకు డిమాండ్ పెరిగింది. దీంతో తాటి ఆకులు నరికే కార్మికులకు చేతి నిండా పని దొరుకుతుంది. ఏటా ఈ సీజన్లో తాటి ఆకుల నరికివేతను వృత్తిగా చేసుకుని ఎందరో జీవనాన్ని సాగిస్తున్నారు. ద్వారకాతిరుమల మండలంలోని ఐఎస్ జగన్నాథపురం, ఐఎస్ రాఘవాపురం, కోడిగూడెం, పి.కన్నాపురం, గోపాలపురం ప్రాంతాల్లో ఏడాదికి నాలుగు నెలలపాటు తాటి ఆకులు నరకడం ద్వారా వందలాది మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. ప్రమాదమని తెలిసినా.. తాటి చెట్లు ఎక్కేటప్పుడు గరికమ్మలు శరీరాన్ని చీల్చుతున్నా, ఆకులు నరికేటప్పుడు ప్రమాదవశాత్తు కత్తి తగిలి రక్తం కారుతున్నా కార్మికులు ఏ మాత్రం లెక్కచేయడం లేదు. ప్రమాదమని తెలిసినా ఈ సీజన్లో ఇదొక్కటే ఉపాధి అని వీరు అంటున్నారు. ఈ పనిలేనప్పుడు మేకలు మేపుతూ కుటుంబాలను పోషించుకుంటున్నామని చెబుతున్నారు. రోజుకు 500 నుంచి వెయ్యి ఆకుల వరకు నరుకుతున్నామని, ఆకుకు రూపాయి చొప్పున తమకు కూలి లభిస్తోందని అంటున్నారు. రవాణా చార్జీలతో కలిపి వినియోగదారులకు ఒక్కో ఆకును రూ.5 చొప్పున రైతులు విక్రయిస్తున్నారని చెబుతున్నారు. రోజుకు రూ.500 సంపాదిస్తున్నా.. తాటి ఆకులు నరికే పని ప్రమాదమని తెలుసు. అయినా తప్పడం లేదు. ఏటా వేసవి సీజన్లో తాటి ఆకులు నరుకుతూ ఉపాధి పొందుతున్నాం. ఒక్కో ఆకును నరికినందుకు రైతు రూపాయి ఇస్తాడు. ఇలా రోజుకు రూ.500 వరకు సంపాదిస్తున్నా. -రాజినాల రామయ్య, ఐఎస్ జగన్నాథపురం నాలుగు నెలలపాటు.. వివాహాది శుభకార్యాలకు తాటి ఆకులను వాడుతున్నారు. చలువ పందిళ్లు నిర్మించడం దగ్గర నుంచి ఇవి ఉపయోగపడతాయి. వేసవిలో చల్లదనం కోసం తాటి ఆకుల పందిళ్లు వేస్తుంటారు. దీంతో మాకు ఏటా నాలుగు నెలల పాటు చేతినిండా పని దొరుకుతుంది. - సొండు పాపారావు, ఐఎస్ జగన్నాథపురం -
నే పాడితే...లోకమే పాడదా..
తొండగారి పోజు చూశారా...ఆకును గిటార్లా చేసుకుని..ఏదో పాట హమ్ చేస్తున్నట్లు..ఇండోనేసియాలోని యోగ్యకర్తాలో ఆదిత్య పెర్మానా అనే ఫోటోగ్రాఫర్ ఈ వినూత్న చిత్రాన్ని క్లిక్ మనిపించారు. తొండకు సంబంధించి చాలా చిత్రాలు తీసి ఉండటంతో తొలుత దీన్ని అతడు గమనించలేదు. తీరిగ్గా...ఫోటోలన్నిటినీ చూస్తున్నప్పుడు ఈ విచిత్రమైన స్టిల్ బయటపడింది. -
ఆకు పచ్చినిజాలు
ఆవిష్కరణ ఒక ఆకు పూసింది... కొమ్మ లేకుండా! జూలియన్ మెల్కొరి అనే డిజైన్ ఇంజనీరింగ్ విద్యార్థి రూపొందించిన ‘కృత్రిమ-ఆకు’ మొక్క అవసరం లేకుండానే ప్రాణవాయువును వెలువరించడమే కాక స్పేస్ సైన్స్ రూపురేఖల్ని కూడా మార్చబోతోంది. ఒక ఆకు కార్బన్ డై ఆక్సైడ్ని పీల్చుకుని, ఆక్సిజన్ని విడుదల చేస్తుంది అనేది మనందరికి తెలిసిన విషయమే! ఈ చర్యకు ముఖ్య కారణం ఆకులోని క్లోరోఫ్లాస్ట్ అనే పదార్థం. అది సూర్యరశ్మిని వాడుకుని కార్బన్ డయాక్సైడ్ని ఆక్సిజన్గా మారుస్తుంది. కానీ ఒక చెట్టు ఎదగాలన్నా, మనుగడలో ఉండాలన్నా కావాల్సింది గురుత్వాకర్షణ శక్తి. అది ఔటర్ స్పేస్లో ఉండదు కాబట్టి, వ్యోమగాములు, రాకెట్లలో చెట్లని పట్టుకెళ్లలేరు. కోట్ల రూపాయలు వెచ్చించి ఆక్సిజన్ సిలండర్స్ని తీసుకెళ్తారు. కానీ జూలియన్ మెల్కొరి కనిపెట్టిన ఈ సింథటిక్ ఆకుతో ఆ ఖర్చుని తగ్గించవచ్చు. చూడటానికి మామూలు ఆకులానే ఉన్నా, దీన్ని సిల్క్ ఫైబర్స్ నుండి సేకరించబడిన ఒక జిగురులాంటి పదార్థంలో, ఆకుల నుండి తీయబడిన క్లోరోప్ల్లాస్ట్ని కలుపుతారు. ఆ జిగురు పదార్థంలో ఉండే కణజాలం, ఒక మేట్రిక్స్లా మారి అందులో క్లోరోఫ్లాస్ట్ని ఇముడ్చుకుని స్థిరంగా ఉంచుతుంది. జీరో గ్రావిటీలో కూడా క్లోరోప్లాస్ట్ని పనిచేసేలా చేస్తుంది. దీనికి సూర్యకాంతి కూడా అవసరం లేదు. ఇంట్లో వాడే బల్బు నుండి వెలువడే కాంతి సరిపోతుంది. అందుకే ఈ సింథటిక్ ఆకు మీద మరికొన్ని పరిశోధనలు చేసి, వ్యోమగాములకు ఆక్సిజన్ కొరత రాకుండా చూసే ప్రయత్నంలో ఉన్నారు. అంతేకాక, ఈ ఆకులని, ఆకాశహర్మ్యాల్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండే ఫ్లోర్లలో వాడుతున్నారు. ఒక బల్బ్ చుట్టూ డెకరేటివ్ కవర్లా పెట్టుకుంటే, ఆక్సిజన్ని అందించడమే కాక అందాన్ని కూడా ఇస్తుంది ఈ సింథటిక్ ఆకు. -
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
బళ్లారి అర్బన్, న్యూస్లైన్ : ప్రతి రోజు ఆకుకూరలు, కూరగాయలు వంటి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని రాయచూరు, బళ్లారి, కొప్పళ పాల సమాఖ్య వ్యవస్థాపక నిర్దేశకులు సురేష్కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక డబుల్ రోడ్డు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాబకొ సమాఖ్య నుంచి పౌష్టిక పాలపై ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. చిన్ననాటి నుంచే నిత్యం ఉదయం గ్లాసు పాలు తాగడం, పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఉత్తమ ఆరోగ్యం పొందవచ్చన్నారు. గతంలో పెద్దలు పౌష్టికాహారం తీసుకోవడంతో సంపూర్ణ ఆరోగ్యంతో జీవించారని అన్నారు. ప్రస్తుత సమాజంలో సరైన ఆహారం తీసుకోకపోవడంతో అనారోగ్యానికి గురవుతున్నారని విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో రాబకొ సమాఖ్య మార్కెటింగ్ అధికారులు వెంకటేశ్రెడ్డి, ఎర్రిస్వామి, మురళీధర్, నాగరాజ్ శర్మ, మల్లికార్జున, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సవితాకుమారి తదితరులు పాల్గొన్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
'బేబి' హీరో ఇంతలా మారిపోయాడేంటి? ఏకంగా అలా..
యశ్ దయాల్పై కోహ్లి ఫైర్.. దెబ్బకు ధోని ఖేల్ ఖతం!
భర్తతో పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతున్న నయనతార.. కారణం ఇదేనా?
మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
టీడీపీపై బొత్స సెటైర్లు
Pratibha Ranta: నిన్నెవరు పెళ్లాడతారు? అని నానమ్మ కలవరపడినా.. హీరోయిన్ అయింది(ఫోటోలు)
వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర
ఆ అవార్డు వస్తే సంతోషిస్తా: నటి కంగనా
ఆహా.. సూపర్ పవర్ భూమ్మీదకొచ్చిందా?.. వైరల్ వీడియోలు
తప్పక చదవండి
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- రేపే లోక్సభ ఐదో దశ పోలింగ్.. అందరి చూపు వీళ్లపైనే!
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- Weekly Horoscope: ఈ రాశి వారికి చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement