-
మద్యం బ్రాండ్లు..అసలు నిజాలు.. రాష్ట్రానికి లిక్కర్ కింగ్ చంద్రబాబే..!
40 ఏళ్ల అనుభవం అంటూ తరచుగా చెప్పుకునే చంద్రబాబు.. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యంలో కొత్త ఒరవడులు తెచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 20 డిస్టిలరీలకుగానూ ఏకంగా 14 డిస్టీలరీలకు అనుమతి ఇచ్చింది చంద్రబాబే. అయినా.. వీటన్నింటిని మరిచి ఈ మధ్య మళ్లీ మద్యం పాట పాడుతున్నారు చంద్రబాబు. మనసుకు నిజం తెలిసినా.. ఆయన నోటి నుంచి అబద్దాలే వస్తున్నాయి. ఎక్కడా లేని బ్రాండ్లు ఏపీలో ఉన్నాయంటూ ప్రచారంలో ప్రజలకు చెప్పుకొస్తున్నారు. కొత్త బ్రాండ్లతో నాసిరకం మద్యం అమ్ముతున్నారని తెగ జాలి ప్రదర్శిస్తున్న చంద్రబాబు.. లిక్కర్ షాపుల్లో డిజిటల్ పేమేంట్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ చంద్రబాబు వాదనలో నిజమెంత ఉంది? ఒక సారి కింది ట్యాలీని పరిశీలిద్దాం. మార్చిలో జరిగిన శాసనసభ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దీనిపై పూర్తి స్పష్టత ఇచ్చారు. "నవరత్నాలు, అమ్మ ఒడి.. ఇవీ మా ప్రభుత్వం చేపట్టిక సంక్షేమ కార్యక్రమాలు, ఇవే మా ప్రభుత్వ బ్రాండ్లు. అయితే చంద్రబాబు బ్రాండ్ లిక్కర్లో ఉంది. ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ ఛాయిస్ భూంభూం బీర్, పవర్ స్టార్ 999, 999 లెజెండ్.. బ్రాండ్లన్నీ చంద్రన్న కానుకలే. ఇవన్నీ చంద్రబాబు ఆశీస్సులతో వచ్చిన బ్రాండ్లే. ప్రెసిడెంట్ మెడల్ బ్రాండ్.. చంద్రబాబు మెడల్ బ్రాండ్. గవర్నర్ ఛాయిస్ 2018, నవంబర్ 5న అనుమతి ఇచ్చింది చంద్రబాబే. ఆయన దిగిపోయే చివరి క్షణం వరకు లిక్కర్ బ్రాండ్లకు అనుమతులు ఇస్తూనే ఉన్నారు. చంద్రబాబు హయాంలోనే 254 బ్రాండ్లు వచ్చాయి. ఇవన్నీ చంద్రబాబు ట్రేడ్ మార్క్ బ్రాండ్లు" చేసిందంతా చేసి.. ఇప్పుడు బ్రాండ్ల గురించి మళ్లీ ప్రజల ముందు ప్రస్తావిస్తున్నారు చంద్రబాబు. ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకుని ఎంత ఘనంగా ప్రచారం చేసినా మాకంత తెలుసులే అనుకుంటున్నారు జనం. చదవండి: మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో మూడో రోజు విస్తృత సోదాలు.. -
Telangana: మద్యం దుకాణాల లైసెన్సుల జారీలో రిజర్వేషన్లు
మూడు అంశాలపై సబ్ కమిటీలు ►పోడు భూముల సమస్యపై సమగ్ర అధ్యయనం, పరిష్కారాల అన్వేషణ, సిఫారసుల కోసం గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వంలో.. మంత్రులు జగదీశ్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, అజయ్కుమార్తో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. ►కొత్త జిల్లాల్లో అవసరాలకు అనుగుణంగా పోలీసు వ్యవస్థను పటిష్టం చేయడంపై అధ్యయనానికి హోంమంత్రి మహమూద్ అలీ నేతృత్వంలో.. మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్రెడ్డి, వి.శ్రీనివాస్గౌడ్, ఇంద్రకరణ్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్కుమార్లతో సబ్ కమిటీని ప్రకటించారు. ►ధరణి పోర్టల్లో తలెత్తున్న సమస్యలను గుర్తించి, పరిష్కారాలను సిఫారసు చేయడానికి మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలతో ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. పంట కొనుగోళ్లకు సిద్ధంకండి రాష్ట్రంలో ఇటీవలి వానలు, పంటల సాగువిస్తీర్ణం, దిగుబడుల అంచనాలు, పంట కొనుగోళ్లపై మంత్రివర్గం చర్చించింది. పంటల కొనుగోళ్లకు సన్నద్ధం కావాలని మార్కెటింగ్శాఖను ఆదేశించింది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీలో గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీనిని వచ్చే ఏడాది (కొత్త ఆబ్కారీ సంవత్సరం) నుంచి అమలు చేస్తామని వెల్లడించింది. సీఎం కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన గురువారం ప్రగతిభవన్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు దాదాపు 6 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో.. వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించి, పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ లైసెన్సులతో నిర్వహించే వ్యాపారాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని ఇటీవల ‘దళితబంధు’ సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు.. మద్యం షాపుల్లో కోటాపై నిర్ణయం తీసుకున్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. వైద్యారోగ్యంపై సమగ్ర ప్రణాళిక రాష్ట్రంలో వైద్యారోగ్య రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. తదుపరి కేబినెట్ సమావేశానికల్లా ప్రణాళికను అందజేయాలని సూచించింది. వచ్చే ఏడాది కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని వైద్య, రోడ్లు–భవనాల శాఖలను ఆదేశించింది. హైదరాబాద్ నగరంలో తలపెట్టిన నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. గురువారం నుంచి ప్రారంభించిన వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ను గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో విజయవంతం చేయడానికి స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలని, రోజూ 3 లక్షల మందికి టీకాలు అందేలా చూడాలని కేబినెట్ నిర్దేశించింది. రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 130 టన్నుల నుంచి 280 టన్నులకు పెంచామని.. దీనిని 550 టన్నులకు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. నీకే సన్మానం చేయాలి... మద్యం దుకాణాల్లో గౌడలు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించినందుకు సీఎం కేసీఆర్ను సన్మానించాలని అబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ వెళ్లారు. అయితే, ఇందుకు నీకే సన్మానం చేయాలని పేర్కొన్న సీఎం.. శ్రీనివాస్గౌడ్ను శాలువాతో సన్మానించారు. గ్రామీణ రోడ్ల మరమ్మతులకు రూ.100 కోట్లు రాష్ట్రంలో ఇటీవలి భారీ వర్షాలకు దెబ్బతిన్న గ్రామీణ రోడ్ల మరమ్మతుల కోసం.. ఈ ఏడాది ఇప్పటికే కేటాయించిన రూ.300 కోట్లకు అదనంగా మరో రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్టు మంత్రివర్గం ప్రకటించింది. రహదారుల మరమ్మతులు వేగంగా చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖను ఆదేశించింది. రాజాబహద్దూర్ సొసైటీకి స్థలం రాజాబహద్దూర్ వెంకటరామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ విజ్ఞప్తి మేరకు.. హైదరాబాద్లోని నారాయణగూడలో బాలికల వసతి గృహం నిర్మాణం కోసం 1,261 గజాల స్థలాన్ని నామమాత్రపు ధరకు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రెండు కొత్త ఎత్తిపోతలకు ఆమోదం ►సంగారెడ్డి, ఆందోల్, జహీరాబాద్, నారాయణ్ఖేడ్ నియోజకవర్గాల్లోని 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ►సింగూరు రిజర్వాయర్ కుడివైపు నుంచి 12 టీఎంసీల నీటిని ఎత్తిపోసి.. జహీరాబాద్, ఆందోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని 231 గ్రామాల్లో 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి సంగమేశ్వర పథకాన్ని చేపట్టనున్నారు. దీన్ని రూ.2,653 కోట్లతో నిర్మించనున్నారు. ►సింగూరు రిజర్వాయర్ ఎడమ వైపు నుంచి 8 టీఎంసీల నీటిని ఎత్తిపోసి.. నారాయణ్ఖేడ్, ఆందోల్ నియోజకవర్గాల్లోని 166 గ్రామాల్లో 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి బసవేశ్వర పథకాన్ని ప్రతిపాదించారు. రూ.1,774 కోట్లతో దీన్ని చేపట్టనున్నారు. ►కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా యాదాద్రి జిల్లాలో నిర్మిస్తున్న నృసింహసాగర్ (బస్వాపూర్ జలాశయం) కోసం నాబార్డు నుంచి రూ.2,051.14 కోట్ల రుణం పొందడానికి మంత్రివర్గం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ►వారం రోజులు శాసనసభ, మూడు రోజులు మండలి భేటీలు! సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ వానాకాల సమావేశాలను ఈ నెల 24 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారం రోజులు శాసనసభ, మూడు రోజుల పాటు శాసన మండలి భేటీలు జరిగే అవకాశం ఉన్నట్టు అధికారవర్గాల సమాచారం. రెండు మూడు రోజుల్లో అసెంబ్లీ స్పీకర్, మండలి ప్రొటెం చైర్మన్ సమావేశ ఏర్పాట్లపై సమీక్షించనున్నట్టు తెలిసింది. ఈసారి సమావేశాల్లో ‘దళితబంధు’ పథకానికి చట్టబద్ధత, వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం వైఖరి వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది శాసనసభ బడ్జెట్ సమావేశాల చివరిరోజైన మార్చి 26న అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. మళ్లీ జూన్, జూలై నెలల్లో సమావేశాలు జరగాల్సి ఉండగా.. లాక్డౌన్, కరోనా పరిస్థితుల నేపథ్యంలో సాధ్యం కాలేదు. అయితే శాసనసభ సమావేశాల మధ్య ఆరునెలలకు మించి విరామం ఉండకూడదన్న నిబంధన ఉంది. దీంతో ఈ నెల 24 నుంచి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భౌతిక దూరం, ఇతర కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. పరిమిత సంఖ్యలో సందర్శకులు, మీడియా, ఇతర సిబ్బందిని అనుమతించే అవకాశం ఉంది. -
మద్యంషాపుల లైసెన్స్ గడువు 3 నెలలు పొడిగింపు
- బార్ల లైసెన్సులు రెన్యూవల్ గడువు ఏడాది - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: నూతన మద్యం విధానం ఖరారు కాని నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న మద్యం దుకాణాల (ఎ4 షాపులు) లైసెన్సుల గడువును మరో మూడు నెలలు పెంచుతూ ప్రభుత్వం సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30తో లైసెన్సు గడువు ముగుస్తున్నందున జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు మద్యం దుకాణాల లైసెన్సులను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 2,216 మద్యం దుకాణాల యజమానులు హోలోగ్రామ్ లేబుల్స్ను రీడ్ చేసేందుకు అవసరమైన మిషనరీని కొనుగోలు చేయాలని సూచించారు. బార్లకు సంబంధించి 2బి బార్ల వార్షిక లైసెన్సు రెన్యూవల్ చేయించుకోవాలని సూచిస్తూ మరో జీవో జారీ చేశారు. 2015- 16 సంవత్సరం కోసం జులై ఒకటో తేదీ నుంచి లైసెన్సులను రెన్యూవల్ చేయించుకోవాలని పేర్కొన్నారు. నాలుగు స్లాబుల్లో ఈ లైసెన్సులు ఉంటాయని, 50వేల జనాభా లోపు మునిసిపాలిటీ/ నగర పంచాయితీల్లో రూ. 25 లక్షలు, 50వేల పై నుంచి ఐదు లక్షల లోపు జనాభా ఉన్న పట్టణాల్లో రూ. 35 లక్షలు, 20 ల క్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో రూ. 38 లక్షలు , 20లక్షల జనాభా పైబడిన నగరాల్లో రూ. 35 లక్షలు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని సూచించారు. ఈ సందర్భంగా ఏపీ ఎక్సైజ్ రూల్స్- 2012ను తెలంగాణకు వర్తింజేస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్
ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే: సీఎం జగన్
భార్యాభర్తలిద్దరూ స్టార్ క్రికెటర్లే.. అతడు కాస్ట్లీ.. ఆమె కెప్టెన్!(ఫొటోలు)
టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు.. తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement