-
ఏపీ మండలి చైర్మన్ షరీఫ్కు కరోనా
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ ఎంఏ. షరీఫ్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న ఆయనకు స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు ఆయన కార్యాలయ అధికారులు తెలిపారు. షరీఫ్ కోవిడ్ బారిన పడటం బాధాకరమని ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
'విచక్షణ' కోల్పోతోందా?
సాక్షి, అమరావతి: ‘‘ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత ప్రతిపక్షం ఇచ్చిన సవరణలు, సెలక్ట్ కమిటీకి పంపే అంశాలు నిబంధనల ప్రకారం రికార్డుల్లోకి రాలేదు. ఏదైనా బిల్లు సభలోకి వచ్చినప్పుడు 12 గంటల్లోపు సవరణలు, సెలక్ట్ కమిటీకి పంపే నోటీసులు ఇవ్వాలి. కానీ, అవి ఆలస్యంగా అందాయి. ఈ తప్పు ఎలా జరిగిందో జరిగింది. సవరణలు, సెలక్ట్ కమిటీకి పంపే అంశాలు నిబంధనల ప్రకారం లేవని స్పష్టంగా కనిపిస్తోంది. అయినా దీనిపై రూలింగ్ ఎలా ఇవ్వాలా అని ఆలోచించా. 154వ నిబంధన ప్రకారం నాకున్న విచక్షణాధికారాలతో ఈ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపుతున్నా’’ – 2020 జనవరి 22న శాసన మండలిలో చైర్మన్ ఎంఏ షరీఫ్ ‘‘కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాలపాటు వాయిదా వేస్తున్నాం. రాజ్యాంగం ద్వారా, పంచాయతీరాజ్ చట్టం ద్వారా ఎన్నికల కమిషనర్గా నాకు సంక్రమించిన విస్తృత, విచక్షణాధికారాలను ఉపయోగించుకుని ఈ నిర్ణయం తీసుకున్నా’’ – 2020 మార్చి 15న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ కేవలం రెండు నెలల వ్యవధిలో రాష్ట్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన రెండు అంశాల్లో ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా విచక్షణాధికారం ఆధారంగా వెలువడిన నిర్ణయాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాబలంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకోవడానికి ఈ విచక్షణాధికారం ఉపయోగపడడం వెనుక ప్రతిపక్షం, ఆ పార్టీ అధినేత ప్రయోజనాలున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. - స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల్ని సెలక్ట్ కమిటీకి పంపే విషయంపై శాసన మండలి చైర్మన్ ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా, ప్రతిపక్షానికి అనుకూలంగా తమ అధికారాలను ఉపయోగించడానికి రాజకీయ కారణాలున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. - ప్రజాస్వామ్య వ్యవస్థల్లో అరుదైన సందర్భాల్లో సంకట పరిస్థితులు ఎదురైనప్పుడు ఉపయోగించాల్సిన విచక్షణాధికారం రాష్ట్రంలో విచక్షణ కోల్పోతోందనడానికి శాసన మండలి చైర్మన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయాలే నిదర్శనమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. - శాసన మండలిలో చైర్మన్ షరీఫ్పై టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చి, నిబంధనలకు విరుద్ధంగా రెండు బిల్లుల్ని సెలక్ట్ కమిటీకి పంపేలా చేశారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. చేస్తున్నది తప్పే అయినా తనకున్న విచక్షణాధికారంతో నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించి మండలి ౖచైర్మన్ షరీఫ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒత్తిడికి లొంగిపోయారని వారు విమర్శించారు. ఆరోజు మండలిలో షరీఫ్ చదివిన ప్రకటన కూడా టీడీపీ రాసిచ్చిందేనని వారు పేర్కొన్నారు. - ఎన్నికల కమిషనర్ సైతం తెలుగుదేశం పార్టీ అభిమతానికి అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేసినట్లు రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. - స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వచ్చిన రోజు నుంచే చంద్రబాబు, టీడీపీ నాయకులు వాటిని ఇప్పుడు నిర్వహించడం సరికాదని వాదిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ఉందని, ఎన్నికల్ని వాయిదా వేయాలని ఎన్నికల కమిషనర్ను టీడీపీ నాయకులు పదేపదే కోరారు. - ఒక పథకం ప్రకారం అక్కడక్కడా జరిగిన చిన్నచిన్న గొడవలపై రాద్ధాంతం చేసి భూతద్దంలో చూపించి ఎన్నికలు వాయిదా వేయాలని టీడీపీ నాయకులు లేఖలు రాయడంతోపాటు నేరుగా వినతిపత్రాలు ఇచ్చారు. - టీడీపీ నాయకుల డిమాండ్కు అనుగుణంగానే ఎన్నికల కమిషనర్ స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేయడం చూసి రాష్ట్ర ప్రజలు ఒక్కసారిగా నివ్వెరపోయారు. తెర వెనుక ఏం జరిగింది?! - ఆదివారం ఉదయం 10కి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ విలేకరుల సమావేశం ఉంటుందని ఎన్నికల సంఘం కార్యాలయం శనివారం రాత్రి 7 గంటలప్పుడు మీడియాకు సమాచారం ఇచ్చింది. - రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ ఆదివారం జారీ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కోసమేనని అధికారులు, మీడియా ప్రతినిధులు భావించారు. - నిమ్మగడ్డ రమేష్కుమార్ శనివారం రాత్రంతా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలోనే బస చేశారు. కొన్ని రోజులుగా ఆయన కమిషన్ కార్యాలయంలోని తన ఛాంబర్లోనే రాత్రి వేళలో కూడా ఉంటున్నారు. - షెడ్యూల్ ప్రకారం ఆదివారం విడుదల చేయాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్కు సంబంధించిన కాపీలను ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కార్యాలయంలో పనిచేసే జాయింట్ కమిషనర్ స్థాయి అధికారి ఒకరు రమేష్కుమార్ ఛాంబరుకు తీసుకెళ్లి ఇవ్వబోతే.. తర్వాత పిలుస్తానంటూ ఆ అధికారిని రమేష్కుమార్ వెనక్కి పంపారని తెలిసింది. - చంద్రబాబు ప్రభుత్వ హయాం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్న, ఇటీవలి కాలం వరకు ఎన్నికల కమిషన్ ఇన్చార్జి కార్యదర్శిగా కొనసాగిన సత్య రమేష్ను ఆదివారం ఉదయం 9 గంటలకు రమేష్కుమార్ ప్రత్యేకంగా తన ఛాంబర్కు పిలిపించుకున్నారని.. ఆయన హడావుడిగా కమిషనర్ కార్యాలయానికి వచ్చినట్లు సమాచారం. - కొద్దిసేపు వీరిద్దరి మధ్య ఆంతరంగిక చర్చలు కొనసాగిన తర్వాత.. స్థానిక సంస్థల ఎన్నికల నిలిపివేత నోట్ను సత్యరమేష్ ఛాంబర్లో రహస్యంగా తయారు చేయించినట్లు తెలిసింది. - కమిషనర్ రమేష్కుమార్, జాయింట్ కమిషనర్ సత్యరమేష్ మధ్య ఉదయం 9.30 గంటల ప్రాంతంలో చర్చలు జరుగుతున్న సమయంలో కార్యాలయంలో పనిచేసే ఇతర అధికారులు గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ గురించి మరోసారి రమేష్కుమార్ వద్ద ప్రస్తావించగా.. తాను చెప్పే వరకూ విలేకరుల సమావేశంలో ఈ నోటిఫికేషన్ వివరాలను ఇవ్వవద్దని ఆయన వారికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. - ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో ఐఏఎస్ అధికారి కమిషన్ కార్యదర్శి హోదాలో పనిచేస్తుంటారు. ఇన్చార్జి కమిషన్ కార్యదర్శి సత్యరమేష్ స్థానంలో నెలన్నర క్రితం రామసుందర్రెడ్డి అనే ఐఏఎస్ అధికారి నియమితులయ్యారు. ఎన్నికల నిలిపివేత నిర్ణయాన్ని విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించే వరకు కమిషన్ కార్యదర్శి రామసుందర్రెడ్డికి కనీసం సమాచారం కూడా తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు కార్యాలయంలో చర్చ జరుగుతోంది. - ఎన్నికల ప్రక్రియ నిలిపివేత.. ఇద్దరు ఐఏఎస్లు, ఇద్దరు ఐపీఎస్ అధికారులతో పాటు మరికొందరు పోలీసు సిబ్బంది తొలగింపునకు సంబంధించి ఏం మాట్లాడాలన్నది రమేష్కుమార్ ఒక నోట్బుక్లో రాసుకున్నారు. దానినే విలేకరుల సమావేశంలో చదివి వినిపించారు. ప్రొసీజర్ ప్రకారం జరగాల్సిందిదీ.. - కరోనా ప్రభావంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పరిస్థితిని అంచనా వేయాలి. - శాంతిభద్రతల పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై వాస్తవ పరిస్థితిపై ఒక అంచనాకు రావాలి. - ఎన్నికల నిర్వహణ తీరు.. నిబంధనల ఉల్లంఘన..హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటే జిల్లాల ఎన్నికల పరిశీలకులు, జిల్లా ఎన్నికల అధికారులతో ప్రత్యేక నివేదికలు తెప్పించుకోవాలి. - వీటి ఆధారంగా పరిస్థితి అదుపు తప్పిందని భావిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి.. ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలా? వాయిదా వేయాలా? అన్న అంశంపై చర్చించి, తుది నిర్ణయం తీసుకోవాలి. ఇది నిపుణుల మాట.. కానీ ఇవేవీ జరిగిన దాఖలాలు లేవని వైఎస్సార్సీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. -
సెలెక్ట్ కమిటీ ఏర్పాటు అసాధ్యం : అసెంబ్లీ కార్యదర్శి
సాక్షి, అమరావతి: శాసనమండలిలో ప్రతిపాదించిన పాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని అసెంబ్లీ కార్యదర్శి మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు మండలి చైర్మన్ పంపిన ఫైలును ఆయన వెనక్కి పంపించారు. క్లాజ్ 189 ఏ.. ప్రకారం సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని లెజిస్లేచర్ కార్యదర్శి (ఇన్చార్జి) పి.బాలకృష్ణమాచార్య పేర్కొన్నారు. (చదవండి : ఏపీ: సెలెక్ట్ కమిటీకి నో) మండలి చైర్మన్ నిర్ణయంతోనే.. పాలనా వికేంద్రీకరణ బిల్లును జనవరి 21న అసెంబ్లీ ఆమోదించి అదే రోజు శాసనమండలికి పంపింది. 22న మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణలు ఈ బిల్లును మండలిలో ప్రతిపాదించారు. నిబంధనల ప్రకారం బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటే ప్రతిపక్షం ఆ బిల్లును మండలి పరిశీలనకు తీసుకోవడానికి ముందే నోటీసులు ఇవ్వాలి. అయితే అలా జరగకపోగా, రెండు రోజుల సుదీర్ఘ వివాదానంతరం 23వ తేదీ చైర్మన్.. తన విచక్షణాధికారాలను ఉపయోగిస్తూ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు చెప్పి సమావేశాలను వాయిదా వేయడంతో వివాదం తలెత్తడం తెలిసిందే. -
బిల్లుపై స్పష్టతనిచ్చిన మండలి చైర్మన్
సాక్షి, అమరావతి : అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై టీడీపీ చేస్తున్న ప్రచారం తప్పని తేలిపోయింది. ఏపీ శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై స్పష్టతనిచ్చారు. బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లలేదని, సాంకేతిక కారణాలతో అది మండలిలోనే ఆగిపోయిందని అన్నారు. ఆ ప్రక్రియ పూర్తయితేగానీ వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లదని చెప్పారు. బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లిందన్న టీడీపీ ప్రచారం అవాస్తవమని వెల్లడించారు. మండలి చైర్మన్ ఇచ్చిన స్పష్టతతో అసలు నిజం బయటికొచ్చిందని రాష్ట్ర సమగ్రాభివృద్ధిని కోరుకుంటున్న ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ఈ బిల్లుపై మండలి ఏ విధంగా ముందుకు వెళ్తుందనే సందిగ్దత నెలకొంది. (చదవండి : నన్నెవరూ బెదిరించలేదు: షరీఫ్) ఇక ‘మూడు రాజధానులు’ బిల్లును టీడీపీ సభ్యులు అడ్డుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం జిల్లాల వ్యాప్తంగా పలు చోట్ల రాస్తారోకోలు, చంద్రబాబు దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించారు. ప్రజలు రోడ్లెక్కి చంద్రబాబు, టీడీపీ సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వెన్నుపోటు రాజకీయాలకు వ్యతిరేకంగా విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. చదవండి : ప్రజలకు మేలు చేయని మండలి అవసరమా? మండలి చైర్మన్కు ఆ విచక్షణాధికారం లేదు వీధిన పడ్డ ‘పెద్ద’ల సభ పరువు గ్యాలరీలో చంద్రబాబు ఎందుకు కూర్చున్నారు? -
ఇది తప్పే..
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యాన్ని ప్రతిపక్ష టీడీపీ అపహాస్యం చేసింది. అత్యున్నత శాసన వ్యవస్థ వేదికగా రాజ్యాంగాన్ని కాలరాసింది. తన రాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతానని, అడ్డగోలు దోపిడీ కోసం దేనికైనా తెగిస్తానని ప్రతిపక్ష నేత చంద్రబాబు మరోసారి నిరూపించారు. అందుకోసం శాసనమండలిని వేదికగా చేసుకుని కుట్ర పూరితవైఖరితో వ్యవహరించారు. ప్రాంతీయ సమానాభివృద్ధి, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను నిబంధనలకు విరుద్ధంగా శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపించేలా టీడీపీ మంత్రాంగం నెరిపింది. ‘ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించడం నిబంధనలకు విరుద్ధం.. టీడీపీ ఇచ్చిన నోటీసు నిబంధనల మేరకు లేదు..’ అని శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ స్వయంగా చెబుతూనే ఆ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ రూలింగ్ ఇవ్వడం విస్మయపరిచింది. అమరావతిలో భారీగా ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి లక్షల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ అవినీతి సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు టీడీపీ అంతగా బరితెగించింది. ఇందులో భాగంగా నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ను ప్రభావితం చేసిన తీరు విస్మయ పరిచింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఏకంగా శాసనమండలి చైర్మన్ సీటుకు ఎదురుగా మీడియా గ్యాలరీలో నాలుగు గంటలపాటు కూర్చొని రాజకీయ కుతంత్రాన్ని రచించడం టీడీపీ దిగజారుడుతానినికి నిదర్శనంగా నిలిచింది. వికేంద్రీకరణ బిల్లుపై కాలయాపన చేసేలా చంద్రబాబు కుతంత్రాన్ని అమలు చేసేందుకు శాసనమండలిలో టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు సైంధవ పాత్ర పోషించారు. ప్రజాస్వామిక విలువలకు తిలోదకాలు ఇస్తూ రాష్ట్ర శాసన మండలి వేదికగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. రాష్ట్ర శాసన వ్యవస్థ చరిత్రలో బుధవారం ఓ చీకటి రోజుగా నిలిచిపోయిందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. శాసనమండలి వేదికగా టీడీపీ కుట్ర రాజకీయం ప్రాంతీయ సమానాభివృద్ధి, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టిన రెండు బిల్లులను అడ్డుకునేందుకు ప్రతిపక్ష టీడీపీ బుధవారం కూడా కుట్ర పూరితంగా వ్యవహరించింది. నిబంధనలకు విరుద్ధంగా రూల్ 71 పేరిట చర్చకు పట్టుపడుతూ మంగళవారం ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేయడం తెలిసిందే. పోనీ బుధవారం అయినా బిల్లుపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని అంతా భావించారు. కానీ టీడీపీ మళ్లీ తన దుర్నీతిని ప్రదర్శించింది. టీవీ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయడం లేదంటూ మధ్యాహ్నం వరకు సభా కార్యక్రమాలను అడ్డుకుంది. బుధవారం రాత్రి విశాఖలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేస్తున్న ప్రజలు మధ్యాహ్నం అయినా బిల్లులపై సజావుగా చర్చించేందుకు సహకరించిందా అంటే అదీ లేదు. టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు, ఆ పార్టీ సభ్యులు లోకేశ్, తిప్పేస్వామి, రాజేంద్రప్రసాద్, దీపక్రెడ్డి తదితరులు పదే పదే సభా కార్యకలాపాలకు అడ్డుపడ్డారు. అప్పటికే ఓ రోజు వృథా కావడంతో ఇక కాలయపన చేయకూడదనే ఉద్ధేశంతో అధికార పార్టీ సభ్యులు ప్రతి విమర్శలు చేయకుండా మౌనంగా ఉన్నారు. ఎట్టకేలకు సాయంత్రం 5 గంటలకు బిల్లులపై సభ్యుల ప్రసంగాలు పూర్తయ్యాయి. దాంతో ప్రభుత్వం తరఫున మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ సమాధానం ఇచ్చి బిల్లులను ఆమోదించాలని కోరారు. దాంతో ఓటింగ్ నిర్వహించి సభ తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని అంతా భావించారు. సెలెక్ట్ కమిటీ పేరుతో టీడీపీ తొండాట చర్చ అనంతరం టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు లేచి తమ రాజకీయ కుతంత్రానికి తెరతీశారు. బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా ముందు సెలెక్ట్ కమిటీకి నివేదించాలని సభాపతి స్థానంలో ఉన్న వైస్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంను కోరారు. దీనిపై తాను కాదు.. చైర్మన్ షరీఫ్ వచ్చి నిర్ణయం తీసుకుంటారన్నారు. ఆ తర్వాత కాసేపటికి చైర్మన్ షరీఫ్ సభాపతి స్థానంలో ఆశీనులయ్యారు. యనమల తన వితండవాదాన్ని కొనసాగిస్తూ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని పట్టుబట్టారు. దీనిపై అధికార పక్ష సభ్యులు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. బిల్లులపై ప్రతిపక్షం సవరణలను ఇవ్వనందున 143 నిబంధన ప్రకారం సెలెక్ట్ కమిటీకి నివేదించడానికి వీలు లేదని చెప్పారు. 142 నిబంధనకు కొనసాగింపుగానే 143 నిబంధనలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారని వివరించారు. అందుకు యమమల రామకృష్ణుడు విభేదించడంతో సభలో కాసేపు అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. పీడీఎఫ్ సభ్యుడు బాలసుబ్రహ్మణ్యం జోక్యం చేసుకుని ప్రతిపక్షం సవరణలు ప్రతిపాదించనందున బిల్లులను సెలెక్ట్ కమిటీకి నివేదించాల్సిన అవసరం లేదని నిబంధనలను ఉటంకిస్తూ వివరించారు. కానీ లోకేశ్, దీపక్రెడ్డిలతోపాటు ప్రతిపక్ష టీడీపీ సభ్యులు ఏమాత్రం సమ్మతించకుండా సభలో తీవ్ర స్థాయిలో గందరగోళం సృష్టించారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ తదితరులు ఆ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించడం నిబంధనలకు విరుద్ధమని రూల్ బుక్లోని నిబంధనలను వివరించారు. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్యవాగ్వాదం చోటుచేసుకోవడంతో చైర్మన్ షరీఫ్ సభను వాయిదా వేశారు. గంటన్నరపాటు చైర్మన్ చాంబర్లో చర్చలు సభ వాయిదా పడిన తరువాత దాదాపు గంటన్నరపాటు ఉత్కంఠత కొనసాగింది. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు చైర్మన్ షరీఫ్ను ఆయన చాంబర్లో కలిసి మాట్లాడారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడం సరికాదని వైఎస్సార్సీపీ పక్ష నేత, ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ తదితరులు రూల్ బుక్లోని నిబంధనలను వివరించారు. బీజేపీ, పీడీఎఫ్ సభ్యులు కూడా చైర్మన్ను కలిసి బిల్లులను సెలెక్ట్ కమిటీకి నివేదించాలన్న టీడీపీ వాదన నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పారు. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన బిల్లు అంశంలో ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ప్రజలు మెజార్టీ ఇచ్చి ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం తీసుకునే విధాన నిర్ణయాలను శాసనమండలి అడ్డుకోవడం సరికాదని సీనియర్ సభ్యుడు కంతేటి సత్యనారాయణ రాజు కూడా విస్పష్టంగా చెప్పారు. కాగా, టీడీపీ సభ్యులు మాత్రం చైర్మన్ షరీఫ్ మీద ఒత్తిడి తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. టీడీపీ మినహా ఇతర పార్టీల సభ్యులు అందరూ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించడం నిబంధనలకు విరుద్ధమని చెప్పిన వాదనతో షరీఫ్ ఏకీభవించినట్టు కనిపించారు. ప్రభుత్వం తన విధానాలను అమలు చేయడానికి శాసనమండలి తరఫున సహకరిస్తానని ఆయన చెప్పినట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధం.. అంటూనే.. దాదాపు రెండు గంటల తరువాత శాసన మండలి సమావేశం కాగానే అంతటా ఉత్కంఠ నెలకొంది. సభలో దాదాపు చీమ చిటుక్కుమన్నా వినిపించేత నిశ్శబ్దం నెలకొంది. చైర్మన్ ఏం చెబుతారోనని అంతా ఆసక్తిగా చూశారు. చైర్మన్ షరీఫ్ నెమ్మదిగా తాను రాసుకువచ్చిన ఉపన్యాసాన్ని చదవడం ప్రారంభించారు. ‘బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాలని కోరడంలో టీడీపీ నిబంధనలను అతిక్రమించింది. బిల్లులపై టీడీపీ సకాలంలో సవరణలు అందలేదు. కాలాతీతం అయ్యింది. దాంతో బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాలని టీడీపీ అడగటం తప్పే. బీజేపీ, పీడీఎఫ్ సభ్యులు కూడా అదే విషయం చెప్పారు. సెలెక్ట్ కమిటీకి పంపించాలన్న టీడీపీ వాదన నిబంధనల ప్రకారం లేదని స్పష్టమైంది. దాంతో సంక్లిష్ట పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో నిబంధనలను పాటించాలి. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించే పరిస్థితి లేదు. కానీ చైర్మన్గా నాకున్న విచక్షణాధికారాలతో బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నా’ అని ప్రకటించడంతో సభ ఒక్కసారిగా నివ్వెరపోయింది. అధికార పార్టీ సభ్యులు చైర్మన్ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. పోడియం చుట్టిముట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. నిబంధనలకు మేరకు వ్యవహరిస్తానని చెప్పి ఇలా మోసం చేయడం ఏమిటని మంత్రులు చైర్మన్ షరీఫ్ను ప్రశ్నించారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి సహకరిస్తామన్న మీరు ఇలా చేయడం న్యాయమా.. అని నిలదీశారు. కానీ చైర్మన్ షరీఫ్ ఏమీ స్పందించకుండా మౌనం దాల్చడం గమనార్హం. బీజేపీ, పీడీఎఫ్ సభ్యులు కూడా స్పీకర్ నిర్ణయంతో విస్తుపోయారు. కాగా ప్రతిపక్ష టీడీపీ సభ్యులు చైర్మన్ పోడియం మీదకు చేరి వైఎస్సార్సీపీ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. ఆ వెంటనే వ్యూహాత్మకంగా చైర్మన్ చుట్టూ చేరి షరీఫ్ను వెంటనే అక్కడ నుంచి చాంబర్లోకి తీసుకుపోయారు. లోకేష్ వీడియో చిత్రీకరణ టీడీపీ సభ్యుడు లోకేశ్ శాసనమండలిలో గందరగోళాన్ని తన సెల్ఫోన్తో వీడియో తీయడం విస్మయానికి గురిచేసింది. నిబంధనల మేరకు సభలో ఫొటోలు, వీడియోలు తీయకూడదు. కానీ లోకేశ్ మాత్రం దాదాపు 15 నిముషాలపాటు వీడియో తీశారు. దీన్ని గమనించిన మంత్రులు పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ ఆయన వద్దకు వెళ్లి అభ్యంతరం తెలిపారు. కానీ లోకేశ్ ఏమీ పట్టించుకోకుండా వీడియో తీశారు. దీనిపై వైఎస్సార్సీపీ సభ్యులు ఫిర్యాదు చేయాలని నిర్ణయిండంతో ఆయన వెంటనే సభ నుంచి బయటకు జారుకున్నారు. నాడు–నేడు.. ఇదే తీరు చంద్రబాబు, యనమల రామకృష్ణుడు.. తమ రాజకీయ స్వార్థం కోసం రాజ్యాంగాన్ని కాలరాయడంలో ఆరితేరిన ద్వయం. నాడు, నేడు.. ఎప్పుడూ వీరిద్దరి తీరు ఇంతే. 1995లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును కుట్ర పూరితంగా కూలదోయడంలో చంద్రబాబు కుతంత్రానికి ఆనాడు స్పీకర్గా ఉన్న యనమల రామకృష్ణుడు పూర్తిగా సహకరించిన విషయం అందరికీ తెలిసిందే. దీనిపై ఎన్టీ రామారావు అప్పట్లో ఎంతగా అభ్యంతరం తెలిపినప్పటికీ ఫలితం లేకపోయింది. తాజాగా గ్యాలరీ నుంచి చంద్రబాబు సూచనలు, సైగలు చేస్తూ.. యనమల ద్వారా శాసనమండలిలో చైర్మన్ షరీఫ్ను ప్రభావితం చేసేలా తతంగాన్ని నెరిపి రాజ్యాంగాన్ని కాలరాశారని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యం చేయగలరే గానీ ఆపలేరు పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతూ శాసనమండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయం వల్ల బిల్లులు తాత్కాలికంగా ఆగుతాయేమో కానీ పూర్తిగా ఆపలేరు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది కూడా ఏమీ లేదు. నిర్ణీత సమయం తర్వాత ప్రభుత్వం తిరిగి ఈ బిల్లులను పాస్ చేయించుకుంటుంది. ప్రతిపక్ష పార్టీ నిర్ణయం కాలయాపనకు ఉపయోగపడుతుందే తప్ప ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేందుకు పనికిరాదు. సెలెక్ట్ కమిటీని ఎవరితో ఎలా నియమిస్తారో, విధివిధానాలేమిటో చూడాల్సి ఉంది. – ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శాసనసభకే అధికారాలు ఎక్కువ శాసనమండలి, శాసనసభ రెండూ చట్ట సభలే. దేని అధికారాలు దానికున్నప్పటికీ శాసనసభకు అధికారాలు ఎక్కువ. వాటిని ఉపయోగించుకుని మళ్లీ బిల్లును ఆమోదించి శాసనమండలికి సిఫార్సు చేస్తే అనివార్యంగా ఆమోదించాలి. ఇప్పుడు జాప్యం చేయవచ్చునేమో గానీ బిల్లుల్ని ఆపడం కుదరదు. –మాడభూషి శ్రీధర్ ఉభయ సభలను కలిపి సమావేశపరిచి మెజార్టీ తీసుకోవచ్చు రాజధాని వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొంది, శాసనమండలిలో ఆమోదం పొందకపోతే ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా అందులో మెజార్టీ తీసుకునేందుకు వీలుంది. సభా సంప్రదాయాల వ్యవహారాల్లో ఉభయ సభలను కలపి నిర్వహించే సంస్కృతి ఉంది. పార్లమెంటరీ సమావేశాల మాదిరిగానే ఇక్కడా చేయడానికి అవకాశం ఉంది. ప్రత్యేక పరిస్థితిలో అధికారపార్టీ తన మెజార్టీతో ఏదైనా చేయవచ్చు. – మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మండలి నిర్ణయమేదైనా అసెంబ్లీ ఆమోదం పొందాలి ‘శాసన మండలి పరిధి సూచనలు ఇవ్వడం వరకే. ప్రజలచే ఎన్నుకోబడిన శాసనసభే సర్వాధికారాలు కలిగి ఉంటుంది. శాసనసభ నిర్ణయాన్ని పెద్దల సభకు పంపాక సభ్యులు చర్చించి సూచనలు, సలహాలతో మళ్లీ అసెంబ్లీకి పంపాలి. దానిపై మళ్లీ చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకొనే రాజ్యాంగపరమైన హక్కు శాసనసభకే ఉంది. ప్రస్తుత బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు మండలి చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని శాసనసభ కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ఒకవేళ శాసనసభ ఆమోదించకపోతే శాసనసభ అంతకు ముందు ఏ బిల్లు పంపిందో అదే ఫైనలైజ్ అవుతుంది. మండలి తీసుకున్న నిర్ణయాన్ని శాసనసభకు పంపించాల్సిందేనని నిబంధనలు చెబుతున్నాయి. బిల్లును ఆమోదించినా, వ్యతిరేకించినా, సెలెక్ట్ కమిటీకి పంపించినా ఏదైనా సరే శాసనసభకు విధిగా తెలియచేయాలి’ – కె.సురేష్రెడ్డి, ఉమ్మడి ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ మండలి చైర్మన్ తీరు సరికాదు రెండు ప్రధాన బిల్లులపై శాసనమండలి చైర్మన్ వ్యవహరించిన తీరు సరికాదు. ప్రొసీజర్ ప్రకారం ప్రతిపక్షం వ్యవహరించలేదని ఆయనే చెప్పి విచక్షణాధికారం ప్రకారం టీడీపీ కోరినట్టే సెలెక్ట్ కమిటీకి పంపడం సరికాదు. సభ రాజకీయంగా జరుగుతోందన్న సంకేతాలిచ్చినట్టు అయ్యింది. అట్లా సభ జరపడం మంచిది కాదు. పీడీఎఫ్, బీజేపీ ఎమ్మెల్సీలం మధ్యవర్తిత్వం వహించి, అధికార, ప్రతిపక్షాలను ఒప్పించి.. నిబంధనలకు అనగుణంగా వ్యవహరించాలని చైర్మన్ను కోరాం. కౌన్సిల్ బుక్లో ఏముందో చూడమన్నాం. రికార్డులను పరిశీలించాలని కోరాం. అయినా రూల్ ప్రకారం జరగలేదని అంటూనే ఇంత కీలకమైన బిల్లుల విషయంలో చైర్మన్ ఇలా విచక్షణాధికారం ఉపయోగించడం సరికాదు. మంచి సంప్రదాయం కాదు. రూల్ను విస్మరించి విచక్షణాధికారం సంప్రదాయంగా మారకూడదు. – విఠపు బాలసుబ్రమణ్యం, పీడీఎఫ్ ఎమ్మెల్సీ మండలి చైర్మన్ తీరుతో రాజ్యాంగ సంక్షోభం మండలిలో బుధవారం చోటు చేసుకున్న ఘటనల వల్ల రాజ్యాంగానికి విఘాతం కలిగిందని భావిస్తున్నా. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలి. తప్పు చేస్తున్నానని ప్రకటించి చైర్మన్ విచక్షణాధికారాన్ని వినియోగించుకోవడం ద్వారా తీవ్ర రాజ్యాంగ సంక్షోభం నెలకొనే అవకాశం ఉంది. ఈ విషయాన్ని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్కు తెలియచేశాం. ఇది రూల్ ప్రకారం లేదు. అధికారం ఉన్న వారంతా ఇలాగే వ్యవహరిస్తే రాజ్యాంగబద్ధమైన వేదికల విలువ పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని రకాలుగా సభా మర్యాదల ఉల్లంఘన జరిగింది’ – పీవీఎన్ మాధవ్, మండలిలో బీజేపీ పక్ష నేత విచక్షణాధికారాలపై చర్చ జరగాలి తప్పు చేశాను అంటూనే.. బాధ్యతయుతమైన పదవుల్లో ఉన్నవారు విచక్షణాధికారాలు వినియోగించడంపై ఇప్పుడు ప్రధానంగా చర్చ జరగాలి. శాసన మండలిలో చైర్మన్ తప్పు చేశాను అంటూ విచక్షణాధికారం ఉపయోగించుకుంటున్నట్టు ప్రకటించి నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై తదుపరి చర్యలు తీసుకునే దానిపై అధికారంలో ఉన్నవారు దృష్టి పెట్టాలి. శాసన మండలిలో జరిగిన ఈ ఘటన నా మనస్సుకు బాధ కలిగించింది. – సోము వీర్రాజు, బీజేపీ ఎమ్మెల్సీ రూల్ ప్రకారం లేదు.. ‘నిబంధనలకు అనుగుణంగా లేకపోవడం వల్ల రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపే పరిస్థితి లేదు.. సవరణలు, సెలెక్ట్ కమిటీకి పంపే అంశాలు నిబంధనల ప్రకారం లేవని స్పష్టంగా కనబడుతోంది. ఏదైనా బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత సవరణ తీర్మానం, సెలెక్ట్ కమిటీ ఆలోచన 12 గంటల్లోపు ఇవ్వాలి. కానీ సెలెక్ట్ కమిటీ కావాలంటూ లెటర్ ఇచ్చిన పార్టీ ఆలస్యంగా ఇచ్చింది. ఏదైతే రూలు ఉందో దాని ప్రకారం జరగలేదు. అయినా చైర్మన్గా నాకున్న విచక్షణాధికారాలతో ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నా’ అని శాసన మండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ సభలో ప్రకటించారు. వాయిదా అనంతరం బుధవారం రాత్రి శాసన మండలి తిరిగి సమావేశమయ్యాక ఆయన మాట్లాడుతూ.. ‘బిల్లుల కోసం ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, బీఏసీలో అజెండా నిర్ణయించుకున్న తర్వాత అనుకోకుండా 71వ నిబంధన అంశం ముందుకు వచ్చింది. ఈరోజు చర్చ జరిగిన తర్వాత ప్రతిపక్ష నేత సవరణల మీద కాకుండా సెలెక్ట్ కమిటీ కోసం అడిగారు. అది రూలు ప్రకారం లేదు, ఇన్టైమ్లో రాలేదు, మోషన్ అడాప్ట్ కాలేదు, సాంకేతికంగా జరగాల్సినవి జరగలేదు. సవరణలు, సెలెక్ట్ కమిటీకి పంపే అంశాలు నిబంధనల ప్రకారం రికార్డుల్లోకి రాలేదు. దీనిపై రెండున్నర గంటలపాటు పార్టీల వారీగా, ఫ్లోర్లీడర్లతోనూ మాట్లాడాను’ అని షరీఫ్ పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం లేవు: చైర్మన్ ‘ఈ పొరపాటు ఎలా జరిగిందో జరిగిపోయింది. నిబంధనల ప్రకారం సభ ముందుకు రాని సవరణలు, సెలెక్ట్ కమిటీకి పంపాలనే అంశాలను పరిగణలోకి తీసుకోవద్దని ప్రభుత్వం, పీడీఎఫ్, బీజేపీ నాయకులు చెప్పారు. ఈ పరిస్థితుల్లో రూల్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నా పొరపాటు జరిగింది. అయినా దీనిపై రూలింగ్ ఎలా ఇవ్వాలా అని ఆలోచించాను. ఇక కాలయాపన చేయడం సరికాదని నా ఉద్దేశం. ఏది ఏమైనప్పటికీ 154వ నిబంధన ప్రకారం నాకున్న విచక్షణాధికారాలకు లోబడి ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నా’ అని తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది.. వారంతా ఎక్కడ?
ఉప్పల్ స్టేడియంలో యాంకర్ శ్రీముఖి సందడి (ఫోటోలు)
అవ్వా, తాతల ఉసురు పోసుకుని ఉరేగుతోన్న పచ్చమంద
ఆ కంఫర్ట్ కోసమే నిర్మాతగా మారా: దర్శకుడు
SRH: కావ్యా మారన్ వైల్డ్ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత..
Viveka Case: అవినాష్రెడ్డికి ఊరట
ఇంత బాగా నేర్చుకుంటానని అనుకోలేదు
పేదల కలను జగన్ మామ నిజం చేశారు
చేపలు విక్రయించే ఇంట ఇంగ్లిష్ చదువు
తప్పక చదవండి
- టెక్సాస్ అమెరికా రాష్ట్రమా? ఇండియా రాష్ట్రమా?
- Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
- నాకు నేనే సవాల్గా మారా: స్టార్ హీరోయిన్
- మోసాల బాబు మరో అబద్ధం..
- మోసాల బాబు మరో అబద్ధం..
- Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
- ‘పంపుసెట్ల’నూ కాపీ కొట్టేసిన బాబు!
- Central government: సీబీఐ మా నియంత్రణలో లేదు
- SRH Vs RR: ఓటమి అంచుల నుంచి...ఒక పరుగు విజయం వరకు...
- తొడలు కొట్టే నేత.. ప్రజాసేవలో తొండాట
Advertisement