-
ఆ ఫోటోలోని క్యూట్ బేబీ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
బాల్యంలోనే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి.. నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. సీరియల్స్తో పాటు సినిమాల్లోనూ నటించింది. టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఆమె వరుస సినిమాలతో అదరగొట్టింది. ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పై ఫోటోలో తన తండ్రి చేతిలో క్యూట్గా కనిపిస్తోన్న ఆ చిన్నారి తెలుగులో స్టార్ హీరోయిన్. ఇంతకీ ఎవరో మీరు గుర్తు పట్టారా? (ఇది చదవండి: డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటే ఇలానే ఉంటుంది: కంగనా కౌంటర్) ఆ ఫోటోలోని క్యూట్ చిన్నారి ఎవరంటే.. మలయాళీ ముద్దుగుమ్మ నివేదా థామస్. నేచురల్ స్టార్ నాని జెంటిల్మెన్ మూవీతో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ.. ఆ తర్వాత నిన్నుకోరి, జై లవ కుశ, 118, బ్రోచేవారెవరురా, వి, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, వకీల్ సాబ్ చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా శాకిని డాకిని లాంటి లేడీ ఓరియంటెడ్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది. అంతకుముందే ఓరుతే వేరు భార్య చిత్రంలో మలయాళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి.. తమిళంలోనూ చాలా సినిమాల్లో నటించింది. (ఇది చదవండి: అవతార్-2ను మించిన టికెట్ ధరలు.. ఆ సినిమాకు ఎందుకంత క్రేజ్!) కాగా.. ఈ ఏడాది ‘ఎంతడా సాజి’ అనే మలయాళ మూవీలో కనిపించిన భామ.. ప్రస్తుతం ఎలాంటి సినిమాలో నటించడం లేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్లో ఉంటోంది. View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) -
అందమైన నవ్వుతో అట్రాక్ట్ చేస్తున్న కేరళ కుట్టి నివేదా థామస్ (ఫొటోలు)
-
‘శాకిని డాకిని' మూవీ ట్విట్టర్ రివ్యూ
రెజీనా కసాండ్రా, నివేదా థామస్ లీడ్ రోల్స్లో సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శాకిని డాకిని'.డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ నిర్మించిన ఈ సినిమా నేడు(శుక్రవారం)విడుదలయ్యింది. యాక్షన్, డ్రామా, హాస్యం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇద్దరు మహిళా ట్రైనీ పోలీసులు ఒక నేరాన్ని ఎలా పరిష్కరించగలిగారు? అనేది ఈ చిత్ర కథ. కొరియన్ చిత్రం 'మిడ్నైట్ రన్నర్స్' రీమేక్ అయిన ఈ సినిమా నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో ‘శాకిని డాకిని' చిత్రంపై హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఆ రివ్యూ ఏంటో మీరే చూసేయండి. అయితే ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’బాధ్యత వహించదు. కొన్ని సన్నివేశాల విషయంలో లాజిక్ మిస్ అయ్యిందని నెటిజన్లు పేర్కొన్నారు. అలాగే ఎమోషనల్ సన్నివేశాల్లో ఆకట్టుకోలేక పోయారని,సెకండ్ హాఫ్ ఇంకాస్త బెటర్ గా ప్లాన్ చేసి ఉండవచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. #SaakiniDaakini Movie Review: ⭐⭐⅓ A Decent 1st Half & A Disappointing 2nd Half Comedy Worked in Parts, But if failed in making audience engaging - Runtime less than 2hrs A Below Par Watch #SaakiniDaakiniReview@i_nivethathomas @ReginaCassandra — Thyveiw (@Thyveiw) September 16, 2022 #SaakiniDaakini Ok Ok Sunday Show Confirm 🥲 — Chandra Sekhar ᥫ᭡ (@kvvcsr1432) September 16, 2022 Showtime @i_nivethathomas @ReginaCassandra starrer #SaakiniDaakini Playing with subs pic.twitter.com/8EyKPZnxGB — வன்மமொழிவர்மன் (@naveenversion2) September 16, 2022 -
‘శాకిని డాకిని’ చిత్రంలో ఆ క్రైమ్ గురించి చెబుతున్నాం
‘‘ప్రస్తుతం సమాజంలో మహిళలపై జరుగుతున్న ఓ పెద్ద నేరం గురించి ఇండియాలో ఎవరూ మాట్లాడటం లేదు. మా ‘శాకిని డాకిని’ చిత్రంలో ఆ క్రైమ్ గురించి చెబుతున్నాం కాబట్టి ప్రతి మహిళ ఈ చిత్రం చూడాలి’’ అని నిర్మాత సునీత తాటి అన్నారు. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ లీడ్ రోల్స్లో సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శాకిని డాకిని’. డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా సునీత తాటి మాట్లాడుతూ– ‘‘గురు ఫిల్మ్స్పై నిర్మించిన 7వ చిత్రం ‘శాకిని డాకిని’. మహిళల సమస్యలపై మహిళలే మాట్లాడితే ఇంకా బాగా కనెక్ట్ అవుతారని లీడ్ రోల్స్లో రెజీనా, నివేదలను తీసుకున్నాం. ఇద్దరు మహిళా ట్రైనీ పోలీసులు ఒక నేరాన్ని ఎలా పరిష్కరించగలిగారు? అనేది ఈ చిత్ర కథ. ఇదొక యూనివర్శల్ కథ.. అందరికీ నచ్చుతుంది. సుధీర్ వర్మ వేరే షూటింగ్లో ఉండటం వల్లే ‘శాకిని డాకిని’ ప్రమోషన్స్లో పాల్గొనలేదు.. నేటి నుంచి పాల్గొంటారు. సురేశ్ బాబుగారితో అసోసియేట్ అవడం చాలా హ్యాపీ. మన చిత్రాలు కొరియన్, జపాన్ భాషల్లో చాలా రీమేక్ అవుతున్నాయి. థియేటర్లో సినిమా చూసినప్పుడు అందరం నవ్వుతాం.. ఏడుస్తాం. అదే ఓటీటీలో అయితే ఇంట్లో పర్సనల్గా అనుభూతి పొందుతాం. థియేటర్ అనుభూతే వేరు. మా బ్యానర్లో మరో నాలుగు కొరియన్ సినిమాలు రీమేక్ చేయనున్నాం.. వాటిలో సమంతతో ఓ సినిమా ఉంటుంది. డైరెక్టర్ బాపుగారంటే నాకు ఇష్టం. ఆయనలాంటి మూవీస్తో పాటు, ‘అవతార్’ లాంటి ఫ్యాంటసీ సినిమాలు డైరెక్ట్ చేయాలనుంది.. చేస్తాను’’ అన్నారు. -
బ్లాక్ డ్రెస్లో నివేదా.. భలే ఉంది (ఫొటోలు)
-
ఆకట్టుకుంటున్న ‘శాకిని-డాకిని’ టీజర్
రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘శాకిని డాకిని’. దక్షిణ కొరియా చిత్రం ‘మిడ్నైట్ రన్నర్’కి తెలుగు రీమేక్ ఇది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. డి. సురేశ్ బాబు, సునీత తాటి, హ్యూన్వూ థామస్ కిమ్ నిర్మాతలు. సెప్టెంబర్ 16న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం టీజర్ని విడుదల చేశారు మేకర్స్. (చదవండి: క్యూట్నెస్ ఓవర్లోడెడ్..మెరుపు తీగలా తయారైన హన్సిక!) టీజర్ ప్రకారం శాలిని(నివేదా థామస్) ఫుడ్ లవర్కాగా, దామిని(రెజీనా)కి ఓసీడీ సమస్యతో ఉంది. ఇద్దరు పోలీసు అకాడమీలో ట్రైనీలుగా జాయిన్ అవుతారు. శిక్షణా శిబిరంలో ఇద్దరు తక్కువ పనితీరు కనబరుస్తున్నారు. అంతేకాదు అనవసరమైన విషయాల్లో తగాదాలు పెట్టుకుంటున్నట్లు టీజర్లో చూపించారు. ఓ నేరస్థుడు ఒక అమ్మాయిని తలపై కొట్టినట్లుగా ప్రధాన కథ ను చూపించడం జరిగింది. ఈ అమ్మాయిలు తగిన సమయంలో తమ నైపుణ్యాలను ఎలా చూపిస్తారనే దాని గురించి టీజర్ ఉంది. టీజర్ను బట్టి చూస్తే, సినిమాలో వినోదం, యాక్షన్, బలమైన కథ, డ్రామా ఉన్నట్లు తెలుస్తోంది. థ్రిల్లర్లను హ్యాండిల్ చేయడంలో దిట్ట అయిన సుధీర్ వర్మ ఈ సబ్జెక్ట్ని డీల్ చేయడంలో తనదైన మార్క్ చూపించాడు. ఈ చిత్రానికి రిచార్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ కాగా, మైకీ మెక్క్లియరీ సంగీతం అందిస్తున్నారు. -
లేడీ ఓరియంటెడ్ మూవీస్లో ఇద్దరు హీరోయిన్లు, ఇప్పుడిదే ట్రెండ్!
లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. ఆ చిత్రాల్లో ఒకే ఒక్క హీరోయిన్ ఉంటారు. కానీ ఇప్పుడు ‘లేడీస్ ఓరియంటెడ్’ సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. ఒకే సినిమాలో ఇద్దరు ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారు. ఈ లేడీస్ ఓరియంటెడ్ సినిమాలపై ఓ లుక్కేద్దాం. బాలీవుడ్ అగ్ర తారలు ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్ ఓ రోడ్ ట్రిప్ ప్లాన్ చేశారు. నటుడు, దర్శకుడు, రచయిత ఫర్హాన్ అక్తర్ ఈ రోడ్ మ్యాప్కు డిజైనర్. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే.. ప్రియాంక, కత్రినా, ఆలియాలది పర్సనల్ ట్రిప్ కాదు.. ప్రొఫెషనల్ ట్రిప్. ఈ ముగ్గురూ కలిసి రోడ్ ట్రిప్ నేపథ్యంలో ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు ‘జీ లే జరా’ అనే టైటిల్ ఖరారు చేశారు. విశేషం ఏంటంటే.. పదేళ్ల తర్వాత ఫర్హాన్ అక్తర్ ‘జీ లే జరా’తో మళ్లీ దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు. షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన ‘డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్’ తర్వాత ఫర్హాన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇదే. ఇక ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్ల రోడ్ ట్రిప్ను ఫర్హాన్ అక్తర్ ప్లాన్ చేస్తే.. హీరోయిన్లు దియా మిర్జా, సంజనా సాంఘీ, రత్నా పాఠక్ షాల రోడ్ ట్రిప్ మ్యాప్ను రైటర్ తరుణ్ దుడేజా రెడీ చేశారు. ఈ ట్రిప్కు ‘ధక్ ధక్’ అని టైటిల్ పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా బైక్స్పై ప్రయాణం చేయాలనుకునే ఈ ‘ధక్ ధక్’ టీమ్కు హీరోయిన్ తాప్సీ ఓ నిర్మాతగా సపోర్ట్ చేస్తుండటం విశేషం. భిన్న వ్యక్తిత్వాలు కలిగిన నలుగురు మహిళలు ఓ రోడ్ ట్రిప్లో కలుసుకున్నప్పుడు వారి ప్రయాణం ఏ విధంగా సాగింది? వారి అనుభవాలు ఏంటి? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ‘జీ లే జరా’, ‘ధక్ ధక్’ రోడ్ ట్రిప్ నేపథ్యంలో సాగే సినిమాలైతే.. ‘కరుంగాప్పియమ్’ సినిమా కథానాయికలు కాజల్ అగర్వాల్, రెజీనా, జనని, రైజా విల్సన్, ఇరాన్ దేశ అమ్మాయి నోయిరికాలు హారర్ స్టోరీతో ప్రయాణం చేస్తున్నారు. డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నలుగురు మహిళలు ఓ కామన్ పాయింట్తో కలుస్తారు. అయితే వారిలో ఒకరికి అతీంద్రియ శక్తులు ఉంటాయి. ఒకరికి అతీంద్రియ శక్తులు ఉన్న విషయం మిగతావారికి తెలిసినప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? వారికి వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి ఈ శక్తులు ఎంత ఉపయోగపడ్డాయి? అనే అంశాల నేపథ్యంలో ‘కరుంగాప్పియమ్’ చిత్రకథ సాగుతుంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇంకోవైపు కిడ్నాపర్లను పట్టుకునేందుకు ప్లాన్ వేస్తున్నారు శాకిని అండ్ డాకిని. నివేదా థామస్, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శాకిని–డాకిని’. సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకుడు. సౌత్ కొరియన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ‘మిడ్నైట్ రన్నర్స్’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ఇద్దరు లేడీ ట్రైనీ పోలీసాఫీసర్లు కిడ్నాపింగ్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా ఆటకట్టించడంలో ఎలా భాగస్వామ్యమయ్యారు అన్నదే కథ. ఇవే కాదు.. మరికొన్ని ‘లేడీస్ ఓరియంటెడ్’ చిత్రాలు సెట్స్పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాయి. చదవండి: కొడుకు ఫొటోను షేర్ చేసిన కాజల్.. ఈసారి ముఖం కనిపించేలా కోవిడ్కు ముందు 2020లో చివరిసారిగా కలిశాను: హీరోయిన్ -
నవ్వులతో నవరాగాలు ఒలికిస్తున్న నివేదా థామస్ (ఫోటోలు)
-
గ్లామర్ అంటే స్కిన్ షో కాదు : నివేదా థామస్
నివేదా థామస్.. గ్లామర్ కన్నా అభినయతారగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు తెలుగులో చేసిన సినిమాలు కొన్నే అయినా.. ఇక్కడ సంపాదించుకున్న అభిమానం మాత్రం ఘనమే. అందం కన్నా అభినయం మీద ఆమెకున్న శ్రద్ధ అలాంటిది. తనలోని గ్లామర్ను ఆమె అశ్రద్ధ చేసినా ఈ బ్రాండ్స్ మాత్రం తీర్చిదిద్దుతున్నాయి.. సొబారికో దర్జా, విలాసం, సౌకర్యం .. ఈ మూడింటినీ ఒకేసారి ఆస్వాదించాలంటే సొబారికో బ్రాండ్ను ఎంచుకోవాలి. దేశంలోని ఏ మూలలో ఏ చేనేత ప్రత్యేకత ఉన్నా.. ఏ కళాకారుడి.. ఏ కళాకారిణి చేతిలో సృజన ఉన్నా అది ఈ బ్రాండ్లో ప్రతిబింబిస్తుంది. అందుకే సొబారికో అవుట్ ఫిట్స్ను ఇష్టపడని వాళ్లు లేరు సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా. ఈ అభిమానాన్నే బ్రాండ్ వాల్యూగా స్థిరపరచుకుంది. దాన్నే వారసత్వంగానూ మలచుకుంది ఏళ్లుగా. ఫ్యాబ్రిక్, డిజైన్ను బట్టి ధరలు. ఆన్లైన్లోనూ లభ్యం. డ్రెస్ బ్రాండ్ : సొబారికో అనార్కలీ సెట్ ధర: 37,500 జ్యూయెలరీ బ్రాండ్: అమెథిస్ట్ అండ్ ఆమ్రపాలి ధర: డిజైన్పై ఆధారపడి ఉంటుంది. అమెథిస్ట్ ఇది కిరణ్ రావు మానస పుత్రిక. అమూల్యమైన కళాఖండాల నిలయం.. ఈ బ్రాండ్. 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. దుస్తులు, జ్యూయెలరీ, ఫుట్ వేర్ నుంచి ఇంటి అలంకరణ వస్తువులు.. కాఫీ షాప్ వరకు అన్నిటికీ ఈ అమెథిస్ట్ కేరాఫ్. ఈ బ్రాండ్ రిచ్నెస్కు తగ్గట్టే ధరలు ఉంటాయి. ఆమ్రపాలి నిజానికి ఇదొక మ్యూజియం. అంతరించిపోతున్న గిరిజన సంప్రదాయ ఆభరణాల కళను కాపాడేందుకు ఇద్దరు స్నేహితులు రాజీవ్ అరోరా, రాజేష్ అజమేరా కలసి జైపూర్లో ‘ఆమ్రపాలి’ పేరుతో మ్యూజియాన్ని స్థాపించారు. నచ్చిన వాటిని కొనుగోలు చేసే వీలు కూడా ఉంది. అయితే, వీటి ధర లక్షల్లో ఉంటుంది. అందుకే, అలాంటి డిజైన్స్లో ఆభరణాలు రూపొందించి తక్కువ ధరకు అందించేందుకు ‘ఆమ్రపాలి జ్యూయెలరీ’ ప్రారంభించారు. ఒరిజినల్ పీస్ అయితే మ్యూజియంలో, మామూలు పీస్ అయితే ఆమ్రపాలి జ్యూయెలరీలో లభిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్కు ఇది ఫేవరెట్ బ్రాండ్. ఆన్లైన్లో కూడా ఆమ్రపాలి జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు. -
అలాంటి ప్రదేశం అంటే చాలా ఇష్టం: హీరోయిన్ నివేదా
నివేదా థామస్కి నచ్చే విషయాలేంటి? ‘ది బెస్ట్’గా ఉండేందుకు ఆమె ఏం చేస్తారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరికింది. ‘మీరు అడిగితే నేను చెబుతా’ అంటూ సోషల్ మీడియాలో తనను ఫాలో అవుతున్నవారికి ఓ ఆఫర్ ఇచ్చారు నివేదా. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు నివేదా టక టకా సమాధానాలు చెప్పేశారు. ఆ విశేషాలు.. ► మీరు ది బెస్ట్గా ఉండేందుకు మీలో స్ఫూర్తిని నింపే అంశాలు ఏంటి? ప్యాషన్. మనం ఏ పని చేసినా పూర్తి శక్తి సామర్థ్యాలతో చేయాలి. ఒకవేళ అలా చేయకపోతే నా వర్క్కి అన్యాయం చేశాననే ఫీలింగ్ నాకు కలుగుతుంది. పని పట్ల నాకు ఉన్న ప్యాషన్తో పూర్తి స్థాయిలో కష్టపడతాను. ► ఈ మధ్యకాలంలో మీకు నచ్చిన ఓ వెబ్ సిరీస్? మారే ఆఫ్ ఎస్టోన్ (అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్). ► మీ ఫేవరెట్ ప్లేస్? చల్లని వాతావరణంతో రాత్రి నిశ్శబ్దంగా ఉండాలి. ఆకాశం నిండా నక్షత్రాలు ఉండాలి... ఇలా ఉండే ఏ ప్లేస్ అయినా నాకు ఇష్టమే. ► మీకు బాగా ఇష్టమైన తమిళ సినిమా? నా ఫేవరెట్ మూవీస్లో ‘దళపతి’ ఉంది. ఈ సినిమాలో సంతోష్ శివన్గారి సినిమాటోగ్రఫీ మ్యాజిక్లా ఉంటుంది. ► రాత్రివేళ ఎక్కువ సేపు మేల్కొని ఉంటారా? అలా ఏం లేదు. కానీ నేను నిద్రపోయే సమయాలను మునుపటిలా ట్రాక్లో పెట్టాలనుకుంటున్నాను. ► మీకు ఇష్టమైన ఆహారం? ఇది చెప్పడానికి ఎక్కువసేపు అవుతుంది. ఎందుకంటే లిస్ట్ చాలా పెద్దది. ► హిందీలో మాట్లాడగలరా? నహీ తో (మాట్లాడకపోతే అని హిందీలో చెప్పి చమత్కరించారు). ► ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూస్తారా? హండ్రెడ్ పర్సెంట్ చూస్తా. ► ఐపీఎల్లో మీ ఫేవరెట్ జట్టు? చెన్నై సూపర్ కింగ్స్. ► డ్యాన్స్ చేయడం, పాటలు పాడటం... వీటిలో మీకు ఎక్కువగా ఏ విషయంలో నైపుణ్యం ఉంది? నిజం చెప్పాలంటే డ్యాన్సింగ్, సింగింగ్లో నేను జస్ట్ ఓకే. ఇంప్రూవ్ చేయాల్సింది చాలా ఉంది. మళ్లీ క్లాసులకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నాను. -
'జై బాలయ్య' పాటకు నివేదా థామస్ స్టెప్పులు.. సీన్ కాస్తా రివర్స్
Nivetha Thomas Dance Video On Jai Balayya Song: అఖండ సినిమాతో తన నట విశ్వరూపాన్ని చూపించాడు నందమూరి బాలకృష్ణ. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి వచ్చిన చిత్రం అఖండ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కొల్లగొట్టింది. చాలా కాలం తర్వాత తెరచుకున్న థియేటర్లకు గ్రాండ్ ఓపెనింగ్ ఇచ్చింది ఈ సినిమా. తమన్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో హైలెట్గా నిలిచింది. సాంగ్స్, బీజీఎంతో మాస్ ప్రేక్షకులను కిర్రాక్ అనిపించాడు తమన్. అఖండలో రెండు షేడ్స్లో అలరించిన బాలకృష్ణ ఒకే ఒక్క పాటలో మాస్ బీట్కు స్టెప్పులేసి అదరగొట్టాడు. జై బాలయ్య అనే సాంగ్ సినిమా రిలీజ్కు ముందే సూపర్ హిట్ అయింది. ఈ పాట విడుదలవడంతోనే నెటిజన్లు సోషల్ మీడియాలో తమదైన శైలిలో రీల్స్, వీడియోస్ చేసి ఆకట్టుకున్నారు. ఆ పాటకు స్టెప్పులేయడం ట్రెండ్గా కూడా మారింది. తాజాగా ఈ ట్రెండ్ను కొనసాగిస్తూ జై బాలయ్యకు పాటకు స్టెప్పులేసింది బ్యూటిఫుల్ హీరోయిన్ నివేదా థామస్. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ భిన్నమైన పోస్ట్లు, వీడియోలు పెడుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది నివేదా. అందుకే జై బాలయ్య సాంగ్లోని స్టెప్పులను వదల్లేదు. పాటలో డ్యాన్స్ మూమెంట్స్ వేస్తుండగా షర్ట్స్ మారే స్పెప్పు వేసింది నివేదా. అయితే మొదటి షర్ట్ మారేవరకూ బానే ఉంది. రెండో షర్ట్ మారేప్పుడు సీన్ రివర్స్ అయింది. స్టెప్పు వేసేప్పుడు రెండో షర్ట్ సరిగా రాకపోవడంతో తాను కూడా నవ్వుతూ ఫన్ క్రియేటే చేసింది నివేదా. ఈ వీడియోను షేర్ చేస్తూ 'ఏదేమైనా అఖండ ఎక్స్పీరియెన్స్ అదిరిపోయింది' అని క్యాప్షన్ ఇచ్చింది. View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) -
అందాల నివేదా బర్త్డే ఫోటోలు
-
నివేదా థామస్ బర్త్డే స్పెషల్ : ఇంట్రెస్టింగ్ విషయాలు
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్కు దొరికిన మరో అందాల హీరోయిన్ నివేదా థామస్. బాలనటిగా తెరంగేట్రం చేసి హీరోయిన్గా ఎదిగిన ఈ కేరళ కుట్టి తెలుగులో కూడా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. జెంటిల్మేన్ నుంచి వకీల్ సాబ్ దాకా అటు నటనతో, ఇటు అందంతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ డింపుల్ బ్యూటీకి హ్యాపీ బర్త్డే అంటోంది సాక్షి. కామ్. కేరళ కుట్టి 1995, నవంబర్ 2న జన్మించింది నివేదా థామస్. నివేదా థామస్ తండ్రి తామస్ ఇయన బిజినెస్ మేన్. తల్లి పేరు లిల్లీ. నివేదాకు నిఖిల్ అనే తమ్ముడున్నాడు . నివేదాను ఇంట్లో అందరూ బేబీ అని పిలుస్తారట. పుట్టింది కేరళలోనే అయినా విద్యాభ్యాసం మొత్తం తమిళనాడులోని చెన్నలోనే. బాలనటిగా తన కెరీర్ని స్టార్ట్ చేసిన ఈ అమ్మడు హీరోయిన్ కావాలనే కలలు కనేదిట. అలా మోడల్గా రాణిస్తూ మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో సినిమా అవకాశాలను దక్కించుకుంది. బాలనటిగా ఎంట్రీ, అవార్డు 2002లో మలయాళ చిత్రం ఉత్తరతో బాలనటిగా తెరంగేట్రం చేసింది నివేదా. సన్ టీవీలో ప్రసారమయ్యే బాలల సీరియల్ మై డియర్ బూతంలో కూడా నటించింది. మలయాళం సినిమా 'వెరుథె ఒరు భార్య' సినిమాలో జయరాం కుమార్తెగా నటించింది. అలాగే చాలా తమిళ, మలయాళ చిత్రాల్లో సహాయ నటిగా నటించింది. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ తన దైన నటనతో ప్రశంసలందుకుంది. ఆ తరువాత నివేదా చాప్పా కురిష్, తట్టతిన్ మరయతు వంటి విజయవంతమైన సినిమాల్లో పాపులర్ అయింది. మలయాళ చిత్రం వెరుథె ఒరు భార్య సినిమాకు గాను విమర్శకుల ప్రశంసల మాత్రమే కాదు, కేరళ రాష్ట్ర ఉత్తమ యువ నటి పురస్కారం అందుకుంది. ఇక టాలీవుడ్ డెబ్యూ మూవీతో జెంటిల్మేన్లో కూడా బాగా ఆకట్టుకుంది. డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ రూపొందించిన జెంటిల్మెన్ సినిమా ద్వారా నివేదాథామస్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తరువాత నిన్నుకోరి, బ్రోచేవారెవరురా, జై లవకుశ, 'జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్' యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ 118, వీ తదితర సినిమాలతో కర్రకారు మనసు దోచుకుంది. ఇక తన లేటెస్ట్ హిట్ వకీల్ సాబ్లో అద్భుతంగా నటించి ఫ్యాన్స్ను ఖుషీ చేసింది. దాదాపు తను నటించిన ప్రతీ మూవీ హిట్ టాక్ దక్కించుకోవడం నివేదాకు ప్లస్ పాయింట్ అని చెప్పాలి. (Aishwarya Rai Bachchan Birthday Special: తన పిచ్చి సెంటిమెంట్పై ఐశ్వర్య కామెంట్స్) ఎత్తైన శిఖరం కిలిమంజారో అధిరోహణ తన అందం, అభినయంతో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇటీవల ఓ అరుదైన ఘనతను సాధించింది. ఆఫ్రికాలోనే ఎత్తైన పర్వతం కిలిమంజారోను అధిరోహించింది. చాలా తక్కువ మంది సెలబ్రిటీలు ఇలాంటి సాహసానికి పూనుకుంటారు. ఈ ఘనత సాధించడం పట్ల ఫ్యాన్స్తో పాటు, పలువురు ప్రముఖులు అభినందనలు కురిపించారు. ప్రస్తుతం మీట్ క్యూట్, మిడ్నైట్ రన్నర్స్ రిమేక్గా తెరకెక్కుతున్న మరో మూవీలో కూడా నివేదా నటిస్తోంది. చిన్న వయసునుంచే హీరోయిన్ కావాలన్న కోరిక నేపథ్యంలో అటు చదువును, ఇటు కరియర్ను బ్యాలెన్స్ చేసుకుంటూ హీరోయిన్గా ఎదిగింది. ఈ నేపథ్యంలో కొన్నిసార్లు షూటింగ్ వెళ్లి ఆ మేకప్తోనే నే క్లాస్కు హాజరైన సందర్భాల చాలా ఉన్నాయని ఒక ఇంటర్వ్యూలో నివేద థామస్ తెలిపింది. -
Nivetha Thomas Biography In Telugu: డింపుల్ క్యూటీ
-
కిలిమంజారోపై జెండా పాతిన టాలీవుడ్ భామ.. ఫోటో వైరల్
Mount Kilimanjaro: ఎత్తయిన శిఖరాలను అధిరోహించడమంటే పెద్ద సాహసమే అని చెప్పాలి. ఈ పనిలో ప్రాణాలను సైతం పణంగా పెట్టాలి. అలాంటి సాహసాన్ని తక్కువ వ్యవధిలోనే సాధించి, నలుగురికి ఆదర్శంగా నిలిచింది హీరోయిన్ నివేదా థామస్. ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి ఔరా అనిపించింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఓ ఫోటోని షేర్ చేసింది. నివేదాకు ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా కిలిమంజారో పర్వాతాన్ని అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ఆరు నెలలపాటు ట్రెక్కింగ్లో శిక్షణ తీసుకుంది. తాజాగా తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ బ్యూటీ ఇటీవల ‘వకీల్ సాబ్’ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరిచింది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో.. నివేదా ఓ కీలక పాత్రలో నటించి, మెప్పించింది. ప్రస్తుతం ఆమె ‘మీట్ క్యూట్’లో నటిస్తుంది. . ఈ చిత్రానికి నాని సోదరి దీప్తి ఘంటా దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో నివేదా థామస్తో పాటు మరో నలుగురు హీరోయిన్స్ నటించబోతున్నారు. I made it 😊 To the top of the tallest free standing mountain in the world. Mount Kilimanjaro pic.twitter.com/InPptVTjit — Nivetha Thomas (@i_nivethathomas) October 23, 2021 -
ఆవు పాలు పితికిన హీరోయిన్... వీడియో వైరల్
సెలబ్రిటీలు ఏ పని చేసినా.. అదో వైరల్ న్యూస్ అవుతున్న రోజులివి. ముఖ్యంగా సినీ తారల విషయంతో ఇది చాలా ఎక్కువ. వాళ్లు ఎక్కడికి వెళ్లినా, ఏ పని చేసినా.. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. ఇక ఆ వీడియోలు చూసి అభిమానులు మురిసిపోతుంటారు. తాజాగా హీరోయిన్ నివేదా థామస్కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. (చదవండి: నేహాకక్కడ్: అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వుమెన్ సింగర్..) ఇంతకీ ఆ వీడియోలో ఏముందనేగా మీ ప్రశ్న. అందులో నివేదా బ్లాక్ కలర్ జాకెట్ ధరించి ఆవు పాలు పితికింది. డైరీ ఫామ్కి వెళ్లిన నివేదా.. స్వయంగా తానే ఆవు దగ్గరకు వెళ్లి పాలు పితికి చక్కటి కాఫీ పెట్టుకుంది. దీన్ని ఓ వీడియో రూపంలో తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేస్తూ 'జాయ్' అని ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కొంతమంది వాటి దగ్గరకు వెళ్లడానికే భయపడతారు.. కానీ నువ్వు వెళ్లడమే కాకుండా పాలు పితికే సాహసం చేశావంటే నువ్వు చాలా గ్రేట్ అక్కా’అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' మూవీలో కీలకపాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న నివేదా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో రెండు మూడు సినిమాల్లో నటిస్తోంది. -
‘మిడ్నైట్ రన్నర్స్’ గా రెజీనా, నివేదా థామస్
సౌత్ కొరియన్ హిట్ ఫిల్మ్ ‘మిడ్నైట్ రన్నర్స్’ (2017) తెలుగులో రీమేక్ అవుతోంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రెజీనా, నివేదా థామస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డి. సురేశ్బాబు, సునీత తాటి, హ్యూన్యూ థామస్ కిమ్లు ‘మిడ్నైట్ రన్నర్స్’ తెలుగు రీమేక్ను నిర్మిస్తున్నారు. ‘‘ఈ ఏడాది మార్చిలో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. ఆగస్టు కల్లా పూర్తి చేయాలనుకుంటున్నాం. ఈ సినిమా కోసం రెజీనా, నివేదా థామస్ తొలిసారిగా డిఫరెంట్ స్టంట్స్ చేస్తున్నారు’’ అని చిత్రయూనిట్ వెల్లడించింది. ఇద్దరు కాబోయే పోలీసాఫీసర్లు కిడ్నాపర్ల ముఠాను ఎలా పట్టుకున్నారన్నదే ‘మిడ్నైట్ రన్నర్స్’ కథాంశం. -
హీరోయిన్ నివేథా థామస్లో ఈ టాలెంట్ కూడా ఉందా?
హీరోయిన్ నివేదా థామస్. ఈ ఏడాది వకీల్సాబ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రంలోని పల్లవి పాత్రలో నివేథా నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇదిలా ఉండగా, తాజాగా గిటార్ వాయిస్తూ తన సింగింగ్ టాలెంట్ను కూడా బయటపెట్టేసింది. 2008లో విడుదలైన “జానే తు యా జానేనా” అనే సూపర్ హిట్ మూవీలోని కభీ కభీ అధితీ జిందగీ అనే పాటను పాడుతూ తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో నెటిన్లను ఆకట్టుకుంది. పాటలో ఆమె లీనమైన తీరు చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మీలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ నెటిజన్లు షాకవుతున్నారు. ప్రస్తుతం నివేదా పాడిన ఈ పాట నెట్టింట వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సుధీర్ వర్మ డైరెక్షన్లో ‘శాకిని ఢాకిని’ అనే మూవీలో నటిస్తుంది. ‘మిడ్ నైట్ రన్నర్స్’ అనే కొరియన్ చిత్రానికి రీమేక్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రెజీనా కసాండ్ర మరొక హీరోయిన్గా నటిస్తుంది. lekin raat ke baadh he tho savera hota hai 🌸 pic.twitter.com/r0e7cUPqqe — Nivetha Thomas (@i_nivethathomas) June 29, 2021 చదవండి : హీరోయిన్ను ఆ విషయం గురించి డైరెక్ట్గా అడిగేసిన నెటిజన్ మోనాల్ని అఖిల్ ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా? -
‘వకీల్ సాబ్’ మూవీ రివ్యూ
టైటిల్ : వకీల్ సాబ్ జానర్: లీగల్ డ్రామా నటీనటులు : పవన్ కల్యాణ్, శృతిహాసన్, ప్రకాశ్ రాజ్, అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ తదితరులు నిర్మాణ సంస్థ : శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు : దిల్ రాజు, శిరీష్ సమర్పణ : బోనీ కపూర్ దర్శకత్వం : శ్రీరామ్ వేణు సంగీతం : తమన్ సినిమాటోగ్రఫీ : పీఎస్ వినోద్ ఎడిటింగ్ : ప్రవీన్ పూడి విడుదల తేది : ఏప్రిల్ 09, 2021 అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ తర్వాత దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకొని ‘వకీల్ సాబ్’గా ఈ శుక్రవారం (ఏప్రిల్ 9) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు పవన్. పవన్ రీఎంట్రీ మూవీ కావడం.. అందులోనూ అమితాబ్ నటించి బాలీవుడ్ బ్లాక్ బ్లస్టర్ పింక్ సినిమాకు రీమేక్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇటీవల విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్కు మంచి స్పందన రావడంతో ‘వకీల్ సాబ్’పై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ వకీల్ సాబ్ ఏ మేరకు అందుకున్నాడు? పవన్ రీఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథ పల్లవి(నివేధా థామస్), జరీనా బేగం(అంజలి), దివ్య నాయక్(అనన్య నాగళ్ళ )వేరు వేరు ప్రాంతాలకు చెందిన మధ్యతరగతి యువతులు. ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్కు వచ్చి ఒకే ఇంట్లో అద్దెకు ఉంటారు. డ్యూటీకి వెళ్లడం, వచ్చిన డబ్బులు ఇంటికి పంపించడం వీరి కర్తవ్యం. ఇలా హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటున్న ఈ ముగ్గురు ఒక రోజు పార్టీ కోసం బయటకు వెళ్లి రాత్రి క్యాబ్లో ఇంటికి వెళ్తూ అనుకోకుండా ఎంపీ రాజేందర్(ముఖేష్ రిషి) కొడుకు వంశీ(వంశీకృష్ణ) గ్యాంగ్తో రిసార్ట్కి వెళ్తారు. అక్కడ జరిగిన ఓ సంఘటన ఈ ముగ్గురి జీవితాలను మలుపుతిప్పుతుంది. ఈ ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు అవుతుంది. పల్లవిని అరెస్ట్ చేస్తారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన ఈ ముగ్గురు యువతులకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాని క్రమంలో సస్పెండ్కు గురైన లాయర్ సత్యదేవ్ అలియాస్ వకీల్ సాబ్( పవన్ కల్యాణ్) అండగా నిలబడతాడు. అసలు సత్యదేవ్ ఎందుకు సస్పెండ్ అయ్యాడు? అతని చరిత్ర ఏంటి? మధ్యతరగతి కుటుంబానికి చెందిన ముగ్గురు ఆడపడుచులకు వకీల్ సాబ్ ఎలా న్యాయం చేశాడు? రాజకీయ నేపథ్యం ఉన్న వంశీని, డబ్బులకు అమ్ముడుపోయే లాయర్ నందా(ప్రకాశ్ రాజ్)ని సత్యదేవ్ ఎలా ఢీకొన్నాడు? అనేదే మిగతా కథ. నటీనటులు అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కల్యాణ్ వెండితెరకు దూరమయ్యాడు. దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లి తెరపై కనిపించాడు. వకీల్ సాబ్ పాత్రలో పవన్ పరకాయ ప్రవేశం చేశారు. ముఖ్యంగా కోర్టు సన్నివేశాల్లో పవన్ చెప్పే డైలాగ్స్ అబ్బురపరచడంతో పాటు ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ఇక శృతిహాసన్ చనిపోయినప్పుడు వచ్చే ఎమోషనల్ సీన్లో పవన్ కల్యాణ్ జీవించేశాడు. అలాగే మధ్యతరగతి చెందిన యువతుల పాత్రల్లో అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ అద్భుతంగా నటించారు. వకీల్ సాబ్ భార్య పాత్రలో శృతిహాసన్ పర్వాలేదనిపిస్తుంది. ఇక క్రిమినల్ లాయర్ నందా పాత్రలో ప్రకాశ్రాజ్ ఎప్పటిమాదిరే జీవించేశాడు. వంశీకృష్ణతో మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. విశ్లేషణ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పింక్’కి రీమేకే ఈ వకీల్ సాబ్ సినిమా. సమాజంలో మహిళల పట్ల కొంతమంది వ్యక్తులకు ఉన్న చులకన భావాన్ని, దానివల్ల స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్రం ‘పింక్’. అక్కడ అమితాబ్ బచ్చన్, తాప్సీ, కృతి కల్హరి, ఆండ్రియా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదే సినిమాను అజిత్లో కోలీవుడ్లో రీమేక్ చేశారు. అక్కడా సూపర్ హిట్ అయింది. రెండు చోట్ల సూపర్ హిట్ కావడంతో ఈ కథను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలని భావించాడు నిర్మాత దిల్ రాజు. పవర్స్టార్ పవన్కల్యాణ్ స్టార్డమ్ని దృష్టిలో ఉంచుకుని మూలకథలో ఎలాంటి మార్పులు చేయకుండా, దానికి కొన్ని కమర్షియల్ హంగుల్ని చేర్చాడు దర్శకుడు వేణు శ్రీరామ్. బాలీవుడ్, కోలీవుడ్లో చూపించని విధంగా ఇందులో పవన్ని యంగ్ లుక్లో చూపించారు. అలాగే హీరోకి ప్లాష్ బ్యాగ్ కూడా పెట్టాడు. అయితే అది మాత్రం వర్కౌట్ కాలేదు. సినిమా కథకు అది కాస్త అడ్డంకిగా అనిపిస్తుంది. అలాగే శ్రుతీహాసన్, పవన్ కల్యాణ్ మధ్య వచ్చిన లవ్ సీన్స్కూడా అంతగా ఆకట్టుకోవు. ఫస్టాఫ్లో కొన్ని చోట్ల అనవసరమైన సీన్స్ కూడా ఉండటం కొంతమేర ప్రతికూల అంశమే. అలాగే ఇంటర్వెల్ వరకు అసలు కథ ముందుకు సాగదు. ఇక సినిమాకు ప్రధాన బలం కోర్టు సీన్స్ . కోర్టు సన్నీవేశాల్లో వచ్చే డైలాగ్స్ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేవిగా ఉంటాయి.‘అడుక్కునోళ్లకి అన్నం దొరుకుంది. కష్టపడినోడికి నీడ దొరుకుంది కానీ పేదోడికి మాత్రం న్యాయం దొరకదు’, ‘ఆడది అంటే బాత్రుంలో ఉండే బొమ్మ కాదు నిన్ను కన్న అమ్మ’ లాంటి డైలాగ్స్ హృదయాలను హత్తుకుంటాయి. అయితే సెకండాఫ్ మొత్తం కోర్టు సన్నివేశాలే ఉండడం పవన్ ఫ్యాన్స్కు నచ్చినా.. సాధారణ ప్రేక్షకుడికి కాస్త ఇబ్బందిగా అనిపించే అవకాశం ఉంది. అలాగే కొన్ని డైలాగ్స్ పవన్ రాజకీయ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టి రాసినట్లుగా అనిపిస్తాయి. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం తమన్ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది. పలు సన్నివేశాలను తన నేపథ్య సంగీతంతో ఓ రేంజ్కి తీసుకెళ్లాడు. ముఖ్యంగా కోర్టు సన్నివేశాలకు తనదైన బీజీఎం ఇచ్చి తమన్ అదరగొట్టాడు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫి బాగుంది. కోర్టు సన్నివేశాలను కళ్లకుకట్టినట్లు చూపించాడు. పవీన్ పూడి ఎడిటింగ్ పర్వాలేదు. ఫస్టాఫ్లో కొన్ని సీన్లకు కత్తెరపడితే బాగుండనిపిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ పవన్ కల్యాణ్, ప్రకాశ్రాజ్ నటన తమన్ సంగీతం కోర్టు సీన్స్ మైనస్ పాయింట్స్ ఫస్టాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ -
వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
మాటల మాంత్రికుడు, అల్లు అరవింద్కు కరోనా!
దేశంలో మరోసారి మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మహమ్మారి టాలీవుడ్కు సైతం వ్యాపించింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్లు కరోనా పాజటివ్గా పరీక్షించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరు హోం క్వారంటైన్లో ఉన్నారని వినికిడి. అయితే దీనిపై ఇప్పటికి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే అల్లు అరవింద్, త్రివిక్రమ్లు డాక్టర్ల సలహా మేరకు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నారని, కరోనా నివారణకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా హీరోయిన్ నివేదా థామస్ సైతం తాజాగా కరోనా బారిన పడ్డారు.ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆమె ట్వీట్ చేస్తూ.. ‘అందరికి నమస్తే.. నేను కరోనా పాజిటివ్గా పరీక్షించాను. డాక్టర్ సలహాతో అన్ని విధాల మెడికల్ ప్రోటోకాల్ పాటిస్తూ ఐసోలేషన్కు వెళ్లాను. ఇటీవల నన్ను కలిసి వారంత దయచేసి హోం క్వారంటైన్కు వెళ్లండి. ఈ కష్టకాలంలో నాకు సపోర్టుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా నా మెడికల్ టీంకు. నాపై ప్రత్యేక శ్రద్ధా చూపిస్తున్నా వారికి నిజంగా రుణపడి ఉంటాను’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. pic.twitter.com/S6kh4filk3 — Nivetha Thomas (@i_nivethathomas) April 3, 2021 చదవండి: అయాన్ బర్త్డే: అల్లు అర్జున్ స్పెషల్ విషెస్ ఖమ్మంలో ‘బేబమ్మ’ సందడి.. ‘ఉప్పెన’లా ఎగసిపడ్డ జనం త్రివిక్రమ్ డైరెక్షన్లో ఎన్టీఆర్; మొత్తం 60 ఎపిసోడ్లు! -
నివేదాకు వకీల్ సాబ్ టీమ్ స్పెషల్ గిఫ్ట్
తెలుగు, తమిళ, మలయాళంలో పలు సూపర్హిట్ సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు అందుకున్న నటి నివేదా థామస్. నిన్ను కోరి, జెంటిల్మేన్, బ్రోచేవారెవరురా, దర్బార్ లాంటి సూపర్హిట్ సినిమాలు ఇప్పటికే ఆమె ఖాతాలో ఉన్నాయి. 2008లో వచ్చిన మలయాళం సినిమా 'వెరుతే ఒరు' భార్యతో వెండితెరకు పరిచయమైన నివేదా తను తమిళంలో చేసిన మొదటి చిత్రం 'కురువి'తో మంచి పేరు సాధించారు. మలయాళంలో బ్లాక్బస్టర్ అయిన దృశ్యం సినిమాకు తమిళ రీమేక్గా వచ్చిన పాపనాశం సినిమాతో నివేదాకు అసలైన బ్రేక్ వచ్చింది. ఇందులో కమల్ హాసన్ సుయంబులింగం పాత్ర పోషించగా, నివేథా ఆయన కూతురు సెల్వి సుయంబులింగంగా నటించారు. ప్రస్తుతం పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న నివేదా షూటింగ్లో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఈ రోజు నివేదా థామస్ పుట్టినరోజు సందర్భంగా వకీల్ సాబ్ ఆమెకు బహుమతిగా ఒక స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. (కాజల్ వెడ్డింగ్ లెహెంగా తయారీకి 30 రోజులు) Team #VakeelSaab wishes @i_nivethathomas, a very Happy Birthday! pic.twitter.com/OpARfbLZsI — Sri Venkateswara Creations (@SVC_official) November 2, 2020 కాగా.. పరిమిత సిబ్బందితో ఈ సినిమా షూటింగ్ జరుగుతండగా నివేదా ఇటీవల షూటింగ్లో భాగమయ్యారు. పలు జాగ్రత్తలు పాటిస్తూ నివేదా షూటింగ్లో పాల్గొంటున్నారు. 7 నెలల లాక్డౌన్ తర్వాత షూటింగ్ను తిరిగి ప్రారంభించారు. కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కుతున్న వకీల్ సాబ్కు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా.. నివేదా థామస్ ఓ కీలక రోల్లో నటిస్తున్నారు. -
ఆ గేమ్లోకి వెళ్లను
నాని, సుధీర్బాబు, అదితీ రావు హైదరీ, నివేదా థామస్లు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘వి’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం నివేదా థామస్ చెప్పిన విశేషాలు. ► నిజానికి ఈ సినిమాని థియేటర్ రిలీజ్ కోసం తీశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనందరం పక్కనే ఉన్న షాప్కి వెళ్లటానికి కూడా ఆలోచిస్తున్నాం. ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయినా ప్రేక్షకులు వస్తారని గ్యారెంటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో డిజిటల్ ప్లాట్ఫామ్లో విడుదల సరైన నిర్ణయమే. ఒక మంచి సినిమాలో భాగం అయినందుకు ఆనందంగా ఉంది. ► ‘వి’ సినిమా చేయడం వెనక నా స్వార్థం కూడా ఉంది. నా పాత్ర నచ్చడం, నానీతో మూడోసారి సినిమా చేయడం, ఇంద్రగంటి సార్తో రెండో సినిమా, ‘దిల్’ రాజుగారి బేనర్లో కంటిన్యూస్గా సినిమాలు చేయడం.. ఇవన్నీ నేను ‘వి’ చేయడానికి కారణాలు. ఈ సినిమాలో నా పాత్ర పేరు అపూర్వ. తను క్రైమ్ థ్రిల్లర్స్ రాసే నవలా రచయిత. ఇప్పటివరకు నేను చేసిన మంచి పాత్రల్లో ఇదొకటి. ► స్వతహాగా నేను ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాను. ఫస్ట్ టైమ్ ఫ్యామిలీతో చాలారోజులు ఇంట్లో స్పెండ్ చేశాను. 17 ఏళ్లుగా మా నాన్న దుబాయ్లో వర్క్ చేస్తున్నారు. ఆయన ఎప్పుడన్నా అలా వచ్చి ఇలా వెళ్లేవారు. కానీ ఆరు నెలలుగా ఆయనతో బెస్ట్ టైమ్ గడుపుతున్నాను. ఈ లాక్డౌన్లో ఎంతోమంది కొత్త దర్శకులు చెప్పిన కథలు విన్నాను. ప్రతి కథ ఒక కొత్త అనుభూతినిచ్చింది. కానీ ఫైనల్గా నాకు సూట్ అయ్యేవే ఎన్నుకుంటాను. ► వెబ్ సిరీస్లో నటించాలనుకోలేదు. మంచి క్యారెక్టర్ వస్తే చేస్తానేమో. ప్రస్తుతానికి నేను మంచి పొజిషన్లో ఉన్నాను. స్టార్డ్డమ్ అంటూ నంబర్ గేమ్లోకి రావటం నాకిష్టంలేదు. నేను ఆ బాక్స్లో ఉండను. స్టార్డమ్ కంటే కూడా ‘ఈ అమ్మాయి మంచి క్యారెక్టర్స్ చేస్తుంది’ అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. -
‘పుష్ప’ సర్ప్రైజ్: బన్నీకి లవర్గా నివేదా
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రేజీ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘పుష్ప’. రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్నారు. లాక్డౌన్ కారణంతో సినిమా షూటింగ్కు కొంత గ్యాప్ ఏర్పడటంతో చిత్ర యూనిట్ ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు. పనిలో పనిగా రష్మికా రాయలసీమ యాస నేర్చుకుంటున్నారు. సినిమాలో ఈ భామ అటవీశాఖ అధికారిగా కనిపించనున్నారు. ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. సినిమాలో రాయలసీమ లుక్లో కనిపించే బన్నీ స్టైల్కు అభిమానులు ఫిదా అయిపోయారు. ఆర్య, ఆర్య-2 తర్వాత బన్నీ, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ పుష్ప. (పుష్ప కోసం రష్మిక ట్రైనింగ్) ఇక ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి నటించనున్నారు. తాజాగా సినిమాకు సంబంధించిన మరో ఆసక్తిర విషయం తెలిసింది. పుష్పలో నివేదా థామస్ ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ఇటీవల దర్బార్ సినిమాలో నటించిన నివేదా ఈ సినిమాలో రెండో హీరోయిన్గా నటించనున్నారు. అల్లు అర్జున్ లవర్గా ఆమె పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నివేదా పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘వకీల్సాబ్’లో నటిస్తున్నారు. కాగా సునీల్ శెట్టి, నివేదా థామస్ ఇటీవల దర్బార్ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. (థాంక్యూ తమన్.. మాట నిలబెట్టుకున్నావ్ : బన్నీ) -
‘జెంటిల్మన్’ మర్చిపోలేని అనుభవం: నివేదా
అప్పుడే ఎంతో ఫన్ అంటోంది నటి నివేదా థామస్. ఈ మలయాళ చిన్నది ఒక పక్క హీరోయిన్గా నటిస్తూనే, స్టార్ హీరోలకు వెండితెర కూతురిగా మారిపోతోంది. అలా మలయాళంలో మోహన్లాల్కు, తమిళంలో కమలహాసన్, రజనీకాంత్లకు ముద్దుల కూతురిగా మారిపోయింది. లక్కీగా ఈ మూడు చిత్రాలు నివేదా థామస్కు మంచి పేరు తెచ్చి పెట్టాయి, ముఖ్యంగా దర్బార్లో రజనీకాంత్కు కూతురుగా కీలక పాత్రను పోషించి మెప్పించింది. ఇంకా చెప్పాలంటే దర్బార్ చిత్రంలో హీరోయిన్ నయనతార పాత్ర కంటే నివేదా పాత్రకే అధిక ప్రాముఖ్యత ఉంది. ఈ సందర్భంగా నటిగా నివేదా థామస్ అనుభవాలను చూద్దాం. చదువుకునే రోజుల్లోనే నటిగా రంగప్రవేశం చేశాను. అయినా నటనతో పాటు చదువుకు ప్రాముఖ్యతనిచ్చాను. అలా గత ఏడాదే చదువులో ఆర్కిటెక్చర్ పూర్తి చేశాను. దర్బార్ చిత్రంలో రజనీకాంత్తో నటించిన అనుభవం గురించి చెప్పాలంటే చాలానే ఉంది. ఆ చిత్ర షూటింగ్కు ముందే ఏవీఎం స్టూడియోలో ఫొటో షూట్ నిర్వహించారు. అప్పుడే రజనీకాంత్ను దగ్గరగా చూశాను. అదీ ఆదిత్య అరుణాచలం (దర్బార్ చిత్రంలోని పాత్ర) గెటప్లో చూశాను. అప్పుడే ఆయన సూపర్స్టార్ కంటే కూడా ఒక తండ్రిగా నా మనసులో నిలిచిపోయారు. ఇక దర్బార్ చిత్ర షూటింగ్లో కామెడీ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో రజనీకాంత్లో ప్రత్యేక ఎనర్జీని చూశాను. ఆయన్ని ఆట పట్టించే సన్నివేశాల్లో నటించడానికి నటుడు యోగిబాబు చాలా సంకటపడ్డారు. అప్పుడు రజనీ సార్ను చూడొద్దు. స్క్రిప్ట్లో ఉన్నది నువ్వు చెయ్యి కన్నా అని ఆయన ఎంకరేజ్ చేశారు. కామెడీ సన్నివేశాల్లో తమతో జాలీగా ఎంగేజ్ అయి చాలా సూచనలిచ్చేవారు. దాన్ని అవుట్పుట్ చూస్తే వేరే లెవల్గా ఉండేది. నిజం చెప్పాలంటే దర్బార్ చిత్ర షూటింగ్లో చాలా ఖుషీగా ఉన్నాను. కారణం పాపనాశం తరువాత చాలా గ్యాప్ తరువాత తమిళంలో మాట్లాడి నటించాను. అంతగా తమిళ చిత్రాలను మిస్ అయ్యాను. నా పాత్రకు ప్రాముఖ్యత ఉంటే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధం. కథానాయకిగా మాత్రమే నటిస్తానని, పలాన భాషలోనే నటిస్తానని నిబంధనలు లేవు. రజనీకాంత్లో కామెడీ సెన్స్ నాకు చాలా ఇష్టం. అలాంటి సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు ఆయన ఖుషీ అవుతూ మమ్మల్ని జాలీ పరిచేవారు. ఇకపోతే కమలహాసన్ను తొలిసారిగా పాపనాశం చిత్రంలో నాన్న గెటప్లోనే చూశాను. చిత్రం బాగా రావాలని ఆయన చూపే సిన్సియారిటీ నాకు చాలా నచ్చింది. అదే విధంగా విజయ్ కెమెరా వెనుక చాలా ప్రశాంతంగా ఉంటారు. అదే కెమెరా ముందుకు వచ్చే ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. నాకు సినిమా చేయాల్సింది ఇంకా చాలా ఉంది. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో చాలా చిత్రాల్లో నటించాలి. భాషను నేర్చుకోవడం అంటే నాకు చాలా ఆసక్తి. ఏ భాషనైనా చాలా త్వరగా సెట్ అయిపోతాను. అందుకే ఇతర భాషా చిత్రాల్లోనూ నటించాలని కోరుకుంటున్నాను. ఇక సినిమాలో మరచిపోలేని అనుభవం అంటే తెలుగులో నటించిన జెంటిల్మెన్ చిత్రమే. ఆ చిత్రం కోసం ఒక సారి కంటిన్యూగా రెండు రోజులు విరామం లేకుండా నటించాను. షూటింగ్ పూర్తి అయిన తరువాత 16 గంటల పాటు నిద్రపోయాను. ఆ సంఘటన ఎప్పటికీ మరచిపోలేను. డబ్బు మాత్రమే సంతోషాన్నివ్వదన్నది నమ్మే వ్యక్తిని నేను. ఖాళీ సమయం లభిస్తే నేను ఉండేది ఇంట్లోనే. అమ్మకు ఇంటి పనుల్లో సహాయం చేస్తాను.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)
ఆసీస్ యువ సంచలనానికి లక్కీ ఛాన్స్.. వరల్డ్కప్ జట్టులో చోటు!?
పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
'దేవర' ఫియర్ సాంగ్ వచ్చేసింది
హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
తారక్ అభిమానుల మంచి మనసు.. 'రా ఎన్టీఆర్ 2.0' టీమ్ రక్తదానం
నా ఆల్టైమ్ ఫేవరెట్ క్రికెటర్ అతడే: టీమిండియా స్టార్
సెంటరాఫ్ అట్రాక్షన్గా ఉండాలనే తపన ..!
14 ఏళ్ల వయస్సులోనే కల.. ఎవరీ ‘ఐస్క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’
ఎస్బీఐకి మొట్టికాయలు గట్టిగానే పడ్డాయిగా?
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement