-
శ్రీలంకకు ఊహించని షాకిచ్చిన బంగ్లాదేశ్..
బంగ్లాదేశ్తో విజయంతో ఆరంభించింది. ఛటోగ్రామ్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో 6 వికెట్లతో తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం విజయం సాధించింది. 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 44.4 ఓవర్లలో ఛేదించింది. బంగ్లా విజయంతో కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో కీలక పాత్ర పోషించాడు. నజ్ముల్ హుస్సేన్ ఆజేయ సెంచరీతో చెలరేగాడు. 129 బంతుల్లో శాంటో 13 ఫోర్లు, 2 సిక్స్లతో 122 పరుగులు చేశాడు. అతడితో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ ముస్తిఫికర్ రహీమ్(73 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లంక బౌలర్లలో మధుశంక రెండు వికెట్లు పడగొట్టగా.. ప్రమోద్ మధుషాన్, కుమారా తలా వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లంక 48.5 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌటైంది. లంక బ్యాటర్లలో లియాంగే(67) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కుశాల్ మెండిస్(59) పరుగులతో రాణించాడు. బంగ్లా బౌలర్లలో టాస్కిన్ ఆహ్మద్, షోర్ఫుల్ ఇస్లాం, టాన్జిమ్ హసన్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. ఇక ఇరు జట్లు మధ్య రెండో టీ20 ఛటోగ్రామ్ వేదికగా శుక్రవారం జరగనుంది. చదవండి: IPL 2024: ఢిల్లీ జట్టులోకి ఫాస్టెస్ట్ సెంచరీ వీరుడు.. ఎవరంటే? -
BAN vs SL: శ్రీలంక జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాడు రీ ఎంట్రీ
బంగ్లాదేశ్తో వన్డే సిరీస్కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ మంగళవారం ప్రకటించింది. గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న వెటరన్ పేసర్ లాహిరు కుమార పునరాగమనం చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ జట్టులో కుమారకు చోటు దక్కింది. అతడితో పాటు బంగ్లాతో టీ20 సిరీస్లో అకట్టుకున్న కమిందు మెండిస్కు వన్డే జట్టులో కూడా చోటు దక్కింది. అదే విధంగా ఆల్రౌండర్ చమికా కరుణరత్నేకు ఛాన్నాళ్ల తర్వాత సెలక్టర్లు మళ్లీ పిలుపునిచ్చారు. ఇక వన్డే సిరీస్కు సైతం స్టార్ పేసర్ దుష్మంత చమీర గాయం కారణంగా దూరమయ్యాడు. అయితే బంగ్లాదేశ్తో ఆఖరి టీ20లో ఐదు వికెట్లతో చెలరేగిన నువాన్ తుషారాకు వన్డే జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. మార్చి 13 నుంచి ఛటోగ్రామ్ వేదికగా ఈ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. కాగా బంగ్లాతో టీ20 సిరీస్ను 2-1తో లంక సొంతం చేసుకుంది. శ్రీలంక జట్టు: కుసాల్ మెండిస్ (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, జనిత్ లియానగే, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, ప్రమోద్ మధుషన్, లహిరు కుమార, మహేశ్ తీక్షణ, కమిన్నన్ల దస్సన, దిల్షన్ మదుషాన, దిల్షాన్ మదుషాన , సహన్ అరాచ్చిగే, చమిక కరుణరత్నే. -
SL Vs Afg: శతక్కొట్టిన యువ బ్యాటర్.. క్లీన్స్వీప్ చేసిన లంక
Sri Lanka vs Afghanistan, 3rd ODI- పల్లెకెలె: అఫ్గానిస్తాన్లో జరిగిన మూడు వన్డేల సిరీస్ను ఆతిథ్య శ్రీలంక 3–0తో క్లీన్స్వీప్ చేసింది. బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో లంక 7 వికెట్ల తేడాతో అఫ్గాన్పై ఘన విజయం సాధించింది. అఫ్గాన్ 48.2 ఓవర్లలో 266 పరుగుల వద్ద ఆలౌటైంది. రహ్మత్ షా (65; 7 ఫోర్లు, 1 సిక్స్), అజ్మతుల్లా ఒమర్జాయ్ (54; 4 ఫోర్లు) రాణించారు. శ్రీలంక 35.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసి గెలిచింది. 25 ఏళ్ల పాతుమ్ నిసాంక (101 బంతుల్లో 118; 16 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీతో చెలరేగా...అవిష్క ఫెర్నాండో (91; 10 ఫోర్లు, 5సిక్స్లు) శతకం చేజార్చుకున్నాడు. నంబర్వన్ ఆల్రౌండర్గా నబీ... ఐసీసీ వన్డే ఆల్రౌండర్స్ కొత్త ర్యాంకింగ్స్లో అఫ్గాన్ ఆటగాడు మొహమ్మద్ నబీ నంబర్వన్ స్థానాన్ని అందుకున్నాడు. అతి పెద్ద వయసులో (39 ఏళ్ల ఒక నెల) ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నబీ నిలిచాడు. 1739 రోజులు (మే 7, 2019నుంచి) నంబర్వన్ ఆల్రౌండర్ ర్యాంక్లో కొనసాగిన షకీబ్ అల్ హసన్ ఎట్టకేలకు రెండో స్థానానికి పడిపోయాడు. -
చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా!.. టీమిండియా తర్వాత
వెస్టిండీస్తో మూడో వన్డే సందర్భంగా ఆస్ట్రేలియా సరికొత్త చరిత్ర సృష్టించింది. తమ వన్డే క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. అది కూడా 50 ఓవర్ల క్రికెట్లో తమ 1000వ మ్యాచ్లో ఈ ఫీట్ అందుకోవడం విశేషం. కాగా మంగళవారం కాన్బెర్రా వేదికగా ఆసీస్ విండీస్తో ఆఖరి వన్డేలో తలపడింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కంగారూ జట్టు.. విండీస్ను 86 పరుగులకే ఆలౌట్ చేసింది. ఇదే మొదటిసారి ఆ తర్వాత 6.5 ఓవర్లలోనే అంటే.. ఇంకా 259 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది ఆస్ట్రేలియా. తద్వారా తమ వన్డే చరిత్రలో తొలిసారి ఇలాంటి ఘన విజయం అందుకుంది. ఇంతకు ముందు 2004లో యూఎస్ఏ జట్టు మీద ఆసీస్ 253 బంతులు మిగిలి ఉండగా గెలుపొందింది. టీమిండియా తర్వాత అదే విధంగా 2013లో వెస్టిండీస్తో మ్యాచ్లోనే 244 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ పూర్తి గెలుపు జెండా ఎగురవేసింది. ఇక కాన్బెర్రా మ్యాచ్ ఆసీస్కు 1000వ వన్డే కావడం విశేషం. తద్వారా టీమిండియా తర్వాత అత్యధిక వన్డేలు ఆడిన రెండో జట్టుగా ఆస్ట్రేలియా చరిత్రకెక్కింది. అయితే, ఈ ఫార్మాట్లో ఆస్ట్రేలియా 600కు పైగా మ్యాచ్లు గెలిచిన ఏకైక జట్టు కూడా కావడం మరో విశేషం. వెస్టిండీస్తో మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఈ మేరకు భారీ విజయం నమోదు చేయడంలో ఓపెనర్లది కీలక పాత్ర. జేక్ ఫ్రాసెర్ మెక్గర్క్(18 బంతుల్లోనే ఐదు ఫోర్లు, మూడు సిక్స్లతో 41 రన్స్), జోష్ ఇంగ్లిస్( 16 బంతుల్లో 35 పరుగులు(నాటౌట్)) సాధించాడు. జేక్ను అల్జారీ జోసెఫ్ పెవిలియన్కు పంపగా తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. వన్డౌన్ బ్యాటర్ ఆరోన్ హార్డీ(2) రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో ఇంగ్లిస్కు తోడైన కెప్టెన్ స్టీవ్ స్మిత్(6- నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ క్రమంలో వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్ను ఆసీస్ 3-0తో వైట్వాష్ చేసింది. చదవండి: IPL 2024: అందుకే రోహిత్ను ముంబై కెప్టెన్గా తప్పించాం.. కోచ్పై రితిక విమర్శలు -
ODI: ఆసీస్ బ్యాటర్ల విధ్వంసం.. 6.5 ఓవర్లలోనే ఖేల్ ఖతం
వెస్టిండీస్పై ఆస్ట్రేలియా బ్యాటర్లు ప్రతాపం చూపించారు. మూడో వన్డేలో కేవలం 6.5 ఓవర్లలోనే విండీస్ విధించిన లక్ష్యాన్ని ఛేదించి సత్తా చాటారు. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు వెస్టిండీస్ ఆసీస్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా టెస్టు సిరీస్ను 1-1తో డ్రా చేసుకున్న కరేబియన్ జట్టు.. వన్డేల్లో మాత్రం కంగారూల చేతిలో చిత్తుగా ఓడింది. తొలి రెండు వన్డేల్లో వరుసగా 8 వికెట్లు.. 81 పరుగులతో పరాజయం పాలైన షాయీ హోప్ బృందం.. తాజాగా ఆఖరి మ్యాచ్లోనూ ఓడి వైట్వాష్కు గురైంది. కాన్బెర్రా వేదికగా మనుకా ఓవల్ మైదానంలో మంగళవారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన పర్యాటక విండీస్ కేవలం 86 పరుగులకే ఆలౌట్ అయింది. యువ పేసర్ జేవియర్ బ్రాట్లెట్ మరోసారి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని ఏకంగా నాలుగు వికెట్లు తీయగా.. లాన్స్ మోరిస్, ఆడం జంపా రెండేసి వికెట్లు పడగొట్టారు. సీన్ అబాట్కు ఒక వికెట్ దక్కింది. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య ఆసీస్కు ఓపెనర్లు జేక్ ఫ్రాసెర్ మెక్గర్క్, జోష్ ఇంగ్లిస్ అదిరిపోయే ఆరంభం అందించారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ విండీస్ బౌలింగ్లో పరుగుల విధ్వంసం సృష్టించారు. జేక్ 18 బంతుల్లోనే ఐదు ఫోర్లు, మూడు సిక్స్లతో 41 రన్స్ చేయగా.. ఇంగ్లిస్ 16 బంతుల్లో 35 పరుగులు(నాటౌట్) సాధించాడు. ఇక జేక్ జోరుకు అల్జారీ జోసెఫ్ బ్రేకులు వేయగా.. వన్డౌన్ బ్యాటర్ ఆరోన్ హార్డీ(2)ని ఒషానే థామస్ పెవిలియన్కు పంపాడు. ఈ క్రమంలో ఇంగ్లిస్కు జతైన కెప్టెన్ స్టీవ్ స్మిత్(6- నాటౌట్) గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ నేపథ్యంలో 6.5 ఓవర్లలోనే 87 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి.. 8 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. వెస్టిండీస్తో వన్డే సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఇక ఆసీస్ బౌలర్ జేవియర్ బార్ట్లెట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
ధోని ఉన్నా కూడా.. అందుకే 19వ ఓవర్లో చహర్ చేతికి బంతి!
అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!
బీజేపీ వారినే ప్రోత్సహిస్తుంది: ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు
ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి
తిరుమలలో భారీ వర్షం.. భగభగల నుంచి భక్తులకు ఉపశమనం
పవన్కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
క్లాస్ రూంలో స్విమ్మింగ్ పూల్: పిల్లల సంబరం, వైరల్ వీడియో
Darshini Trailer: భవిష్యత్తులో జరిగేది ముందే తెలిస్తే..?
మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
తప్పక చదవండి
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- ‘ఫోన్ ట్యాపింగ్లో రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే’
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
Advertisement