-
ప్లే ఆఫ్స్కు పట్నా పైరేట్స్ అర్హత
కోల్కతా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో ప్లే ఆఫ్స్కు అర్హత పొందిన ఐదో జట్టుగా పట్నా పైరేట్స్ నిలిచింది. తెలుగు టైటాన్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 38–36తో గెలిచింది. పట్నా తరఫున మంజీత్ 8 పాయింట్లు, సందీప్ 7 పాయింట్లు స్కోరు చేశారు. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ 16 పాయింట్లతో ఆకట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఈ టోర్నీలో 21 మ్యాచ్లు ఆడి 11 విజయాలు అందుకున్న పట్నా 68 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది. 20 మ్యాచ్లు పూర్తి చేసుకున్న తెలుగు టైటాన్స్ 18వ పరాజయంతో 17 పాయింట్లతో చివరిదైన 12వ స్థానాన్ని ఖరారు చేసుకుంది. మిగిలి ఉన్న తమ చివరి రెండు మ్యాచ్ల్లో టైటాన్స్ గెలిచినా 29 పాయింట్లతో 11వ స్థానంలో ఉన్న యూపీ యోధాస్ను దాటే అవకాశం లేదు. ఇప్పటికే జైపూర్ పింక్ పాంథర్స్, పుణేరి పల్టన్, గుజరాత్ జెయింట్స్, దబంగ్ ఢిల్లీ, పట్నా పైరేట్స్ ప్లే ఆఫ్స్కు చేరుకోగా... చివరిదైన ఆరో బెర్త్ కోసం హరియాణా స్టీలర్స్, బెంగాల్ వారియర్స్ జట్లు రేసులో ఉన్నాయి. అయితే స్టీలర్స్ ఒక మ్యాచ్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ను దక్కించుకుంటుంది. -
PKL 10: ‘ప్లే ఆఫ్స్’ చేరిన పుణేరి పల్టన్
PKL 10- న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్లో పుణేరి పల్టన్ జట్టు ‘ప్లే ఆఫ్స్’ దశకు అర్హత సాధించింది. సోమవారం పుణేరి పల్టన్, దబంగ్ ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ ‘టై’గా ముగిసింది. ఇరు జట్లూ 30–30 పాయింట్ల స్కోరుతో సమంగా నిలిచాయి. పుణేరి తరఫున అస్లామ్ ముస్తఫా 10 పాయింట్లు స్కోరు చేయగా... దబంగ్ కెప్టెన్ అషు మలిక్ 8 పాయింట్లు నమోదు చేశాడు. ఈ మ్యాచ్ అనంతరం 17 మ్యాచ్ల ద్వారా మొత్తం 71 పాయింట్లు సాధించిన పుణేరి ‘ప్లే ఆఫ్స్’కు చేరింది. మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 36–33 పాయింట్ల తేడాతో పింక్ పాంథర్స్పై విజయం సాధించింది. పట్నా తరఫున కెప్టెన్ సచిన్, సుధాకర్ చెరో 10 పాయింట్లతో చెలరేగగా జైపూర్ ఆటగాళ్లలో అర్జున్ దేశ్వాల్ (12 పాయింట్లు) రాణించాడు. ఇదిలా ఉంటే.. జైపూర్ పింక్ పాంథర్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో పాంథర్స్ తర్వాత టాప్-4కు చేరుకున్న రెండో జట్టుగా పుణేరి పల్టన్ నిలిచింది. అయితే, తెలుగు టైటాన్స్ మాత్రం ఈసారి కూడా కనీస ప్రదర్శన కనబరచలేక ఇప్పటికే పదహారు మ్యాచ్లలో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది. చదవండి: Ind vs Eng: హైడ్రామా.. అలా నాటౌట్.. ఇలా కూడా నాటౌటేనా?.. రోహిత్ సీరియస్ Admin's next task: Adding 𝐐 in the #PKLSeason10 Points Table graphic 😉@PuneriPaltan 🧡 join defending champions Jaipur Pink Panthers in confirming a #PKLPlayoffs spot 🔥#ProKabaddi #ProKabaddiLeague #PKL #HarSaansMeinKabaddi #PuneriPaltan pic.twitter.com/gBCs3zGJ6s — ProKabaddi (@ProKabaddi) February 5, 2024 సహజ సంచలన విజయం ముంబై: తెలుగమ్మాయి సహజ యమలపల్లి ముంబై ఓపెన్ (డబ్ల్యూటీఏ–125) టెన్నిస్ టోర్నీలో సంచలన విజయాన్ని నమోదు చేసింది. తొలి రౌండ్లో సహజ 6–4, 1–6, 6–4 స్కోరుతో వరల్డ్ నంబర్ 92, టాప్ సీడ్ కేలా డే (అమెరికా)ను ఓడించింది. మ్యాచ్లో 2 ఏస్లు కొట్టిన సహజ 4 డబుల్ఫాల్ట్లు చేసింది. -
Pro Kabaddi 2024: పట్నా పైరేట్స్కు ఎనిమిదో గెలుపు
పట్నా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో సొంతగడ్డపై పట్నా పైరేట్స్ జట్టు అదరగొట్టింది. గుజరాత్ జెయింట్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ జట్టు 32–20 పాయింట్ల తేడాతో నెగ్గింది. ఈ టోర్నీలో పైరేట్స్కిది ఎనిమిదో విజయం కావడం విశేషం. పట్నా తరఫున సందీప్ (7 పాయింట్లు), అంకిత్ (6 పాయింట్లు) రాణించారు. మరో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 41–36తో బెంగాల్ వారియర్స్ను ఓడించింది. హరియాణా తరఫున శివమ్ 12 పాయింట్లు, సిద్ధార్థ్ 11 పాయింట్లు, వినయ్ 6 పాయింట్లు స్కోరు చేశారు. -
తెలుగు టైటాన్స్కు మరో ఓటమి.. ఏకంగా 12వ పరాజయం
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం హైదరాబాద్ అంచె పోటీలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సొంతగడ్డపై తెలుగు టైటాన్స్ జట్టు 26–42 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్ చేతిలో ఓడిపోయింది. ఈ లీగ్లో తెలుగు టైటాన్స్ జట్టుకిది 12వ పరాజయం కావడం గమనార్హం. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ ఏడు పాయింట్లు స్కోరు చేశాడు. అదే విధంగా.. బెంగళూరు జట్టు తరఫున సుర్జీత్ ఏడు పాయింట్లు, వికాశ్ ఆరు పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 34–31తో యూపీ యోధాస్ను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్ల్లో దబంగ్ ఢిల్లీతో యు ముంబా; తెలుగు టైటాన్స్తో యూపీ యోధాస్ తలపడతాయి. -
Pro Kabaddi League: పట్నా పైరేట్స్కు షాక్
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్కు షాక్ తగిలింది. నిన్న జరిగిన మ్యాచ్లో ఆ జట్టు తమిళ్ తలైవాస్ చేతిలో 25-41 తేడాతో పరాజయంపాలైంది. ఈ సీజన్లో పట్నాకు ఇది ఏడో పరాజయం. తలైవాస్ తరఫున అజింక్య పవార్ 10 పాయింట్లు, అభి 7 పాయింట్లు, నరేందర్ 6 పాయింట్లు స్కోరు చేశారు. పట్నా తరఫున సుధాకర్ 8 పాయింట్లు సాధించాడు. -
PKL: ఎట్టకేలకు బోణీ కొట్టిన తెలుగు టైటాన్స్.. ఉత్కంఠ పోరులో విజయం
Pro Kabaddi League 2023: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. శుక్రవారం జరిగిన తమ ఆరో మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 37–36తో హరియాణా స్టీలర్స్ జట్టుపై నెగ్గింది. టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ అత్యధికంగా 10 పాయింట్లు, అజిత్ పవార్ 7 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 46–33తో తమిళ్ తలైవాస్ను ఓడించింది. When you play for the Steelers, you always 𝐒𝐓𝐄𝐀𝐋 points 😉🔥#ProKabaddiLeague #ProKabaddi #PKL #PKLSeason10 #HarSaansMeinKabaddi #HSvTT #HaryanaSteelers #TeluguTitans pic.twitter.com/Es9C6C7ZYx — ProKabaddi (@ProKabaddi) December 22, 2023 టాప్లో పుణెరి పల్టన్.. టైటాన్స్ చివర ఇక పీకేఎల్-2023 సీజన్లో ఇప్పటి వరకు పుణెరి పల్టన్ ఆడిన ఆరు మ్యాచ్లలో ఐదు గెలిచి 26 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు... బెంగాల్ వారియర్స్ ఆరింట మూడు(21 పాయింట్లు), హరియాణా స్టీలర్స్ ఆరింట నాలుగు(21 పాయింట్లు), జైపూర్ పింక్ పాంథర్స్ ఆరింట మూడు (20 పాయింట్లు) గెలిచి టాప్-4లో స్థానం సంపాదించాయి. మరోవైపు.. తెలుగు టైటాన్స్ ఆరింట ఐదు ఓడగా.. తాజా విజయంతో ఏడు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. అయితే, ఇప్పటికీ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలోనే ఉంది. చదవండి: విండీస్దే టి20 సిరీస్ తరూబా (ట్రినిడాడ్): సొంతగడ్డపై వెస్టిండీస్ జట్టు వన్డే, టి20ల్లో ఇంగ్లండ్పై పైచేయి సాధించింది. ఇంతకుముందే వన్డే సిరీస్ను గెలుచున్న విండీస్ ఇప్పుడు టి20 సిరీస్నూ 3–2తో తమ ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన చివరిదైన ఐదో టి20 మ్యాచ్లో రోవ్మన్ పావెల్ కెప్టెన్సీలోని వెస్టిండీస్ నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. ముందుగా ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. ఫిల్ సాల్ట్ (22 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలవగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గుడకేశ్ మోతీ (3/24) ఇంగ్లండ్ను కట్టడి చేశాడు. అనంతరం విండీస్ 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 133 పరుగులు సాధించింది. షై హోప్ (43 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. -
జైపూర్ పింక్పాంథర్స్ గెలుపు
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ రెండో విజయం నమోదు చేసింది. పట్నా పైరేట్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో జైపూర్ 29–28తో గెలిచింది. జైపూర్ తరఫున అజిత్ అత్యధికంగా 16 పాయింట్లు స్కోరు చేశాడు. -
గుజరాత్పై పట్నా పైచేయి
అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న గుజరాత్ జెయింట్స్ జట్టుకు పట్నా పైరేట్స్ బ్రేక్ వేసింది. గురువారం జరిగిన మ్యాచ్లో మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్ 33–30 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ను ఓడించింది. ఈ లీగ్లో పట్నాకిది వరుసగా రెండో విజయంకాగా... గుజరాత్ జట్టుకిది తొలి పరాజయం. గుజరాత్తో మ్యాచ్లో పట్నా సమష్టి ఆటతో రాణించింది. పట్నా పైరేట్స్ తరఫున సుధాకర్ (6 పాయింట్లు), సచిన్ (4), నీరజ్ కుమార్ (4), అంకిత్ (4), సందీప్ కుమార్ (4 పాయింట్లు) ఆకట్టుకున్నారు. గుజరాత్ తరఫున రాకేశ్ 11 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచినా ఫలితం లేకపోయింది. అంతకుముందు బెంగాల్ వారియర్స్, జైపూర్ పింక్ పాంథర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 28–28తో ‘డ్రా’గా ముగిసింది. బెంగాల్ తరఫున శ్రీకాంత్ జాదవ్ (7), నితిన్ కుమార్ (5), మణీందర్ సింగ్ (4)... జైపూర్ తరఫున భవాని రాజ్పుత్ (10) అర్జున్ దేశ్వాల్ (6) రాణించారు. నేడు జరిగే మ్యాచ్ల్లో బెంగళూరు బుల్స్తో దబంగ్ ఢిల్లీ; పుణేరి పల్టన్తో యు ముంబా తలపడతాయి. -
తెలుగు టైటాన్స్కు నిరాశ
అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు వరుసగా రెండో ఓటమి చవిచూసింది. మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 28–50 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. టైటాన్స్ తరఫున కెపె్టన్ పవన్ సెహ్రావత్ 11 పాయింట్లతో రాణించాడు. పట్నా తరఫున సచిన్ 14 పాయింట్లు స్కోరు చేశాడు. మరో మ్యాచ్లో యూపీ యోధాస్ 57–27తో హరియాణా స్టీలర్స్పై ఘనవిజయం సాధించింది. యూపీ యోధాస్ తరఫున సురేందర్ 13 పాయింట్లు, ప్రదీప్ నర్వాల్ 12 పాయింట్లు స్కోరు చేశారు. -
PKL 2022: సెమీస్లో జైపూర్, పుణె.. పట్నాకు పరాభవం!
Pro Kabaddi League 2022- సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్లో పుణేరి పల్టన్, జైపూర్ పింక్ పాంథర్స్ జట్లు సెమీఫైనల్ బెర్త్లను ఖరారు చేసుకున్నాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్ల్లో పుణేరి పల్టన్ 44–30తో పట్నా పైరేట్స్పై, జైపూర్ పింక్ పాంథర్స్ 44–30తో హరియాణా స్టీలర్స్పై గెలిచాయి. మరో లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉన్న పుణేరి, జైపూర్ జట్లు 79 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. మిగతా జట్లు తమ తదుపరి రెండు మ్యాచ్ల్లో గెలిచినా పుణేరి, జైపూర్ జట్లను దాటే అవకాశం లేదు. కాగా టాప్–6లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్ చేరుకుంటాయి. మిగతా రెండు సెమీఫైనల్ బెర్త్ల కోసం నాలుగు జట్లు ఎలిమినేటర్–1, ఎలిమినేటర్–2 మ్యాచ్ల్లో తలపడతాయి. చదవండి: FIFA WC 2022: విజేతపై మెస్సీ జోస్యం.. ఆశ్చర్యపోవడం ఖాయం! IND Vs Ban ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు ఐసీసీ షాక్ The 🔝 2⃣ teams in the #vivoProKabaddi Season 9 league stage are now just 2⃣ steps away from getting their hands on the 🏆#FantasticPanga #JaipurPinkPanthers #PuneriPaltan pic.twitter.com/27Gg62sKMB — ProKabaddi (@ProKabaddi) December 5, 2022 -
ఎట్టకేలకు గెలిచిన తెలుగు టైటాన్స్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో వరుసగా రెండు పరాజయాల తర్వాత తెలుగు టైటాన్స్ జట్టు గెలుపు బోణీ చేసింది. మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 30–21తో నెగ్గింది. టైటాన్స్ తరఫున మోనూ గోయట్ 10 పాయింట్లు, సిద్ధార్థ్ దేశాయ్ 7 పాయింట్లు, సుర్జీత్ సింగ్ 4 పాయింట్లు స్కోరు చేశారు. మరో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 27–22 తో తమిళ్ తలైవాస్ను ఓడించింది. -
Pro Kabaddi league 2022: పట్నాను నిలువరించిన పుణేరి పల్టన్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో శనివారం మూడు మ్యాచ్లు జరగ్గా... చివరి నిమిషం వరకు హోరాహోరీగా సాగిన రెండు మ్యాచ్లు ‘డ్రా’గా ముగిశాయి. మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్తో జరిగిన మ్యాచ్ను పుణేరి పల్టన్ 34–34తో ‘డ్రా’ చేసుకోగా... గుజరాత్ జెయింట్స్, తమిళ్ తలైవాస్ మ్యాచ్ కూడా 31–31తో సమంగా ముగిసింది. మూడో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 41–33తో బెంగాల్ వారియర్స్ను ఓడించింది. పట్నాతో మ్యాచ్లో పుణేరి ఆటగాళ్లు అస్లాం ఇనామ్దార్ 7, మోహిత్ గోయట్ 8, ఆకాశ్ 6 పాయింట్లు స్కోరు చేశారు. పట్నా జట్టులో రోహిత్ గులియా (6), సచిన్ (8) రాణించారు. తలైవాస్తో మ్యాచ్లో గుజరాత్ రెయిడర్ రాకేశ్ 13 పాయింట్లతో అదరగొట్టాడు. బెంగాల్తో మ్యాచ్లో హరియాణా రెయిడర్ మంజీత్ ఏకంగా 19 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్ల్లో జైపూర్ పింక్ పాంథర్స్తో పట్నా పైరేట్స్; బెంగాల్ వారియర్స్తో తెలుగు టైటాన్స్; పుణేరి పల్టన్తో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
PKL 2022: తొలిసారి చాంపియన్స్గా దబంగ్ ఢిల్లీ
Pro Kabaddi League 2022 Finals: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో దబంగ్ ఢిల్లీ జట్టు తొలిసారి చాంపియన్గా అవతరించింది. శుక్రవారం హోరాహోరీగా జరిగిన ఎనిమిదో సీజన్ ఫైనల్లో దబంగ్ ఢిల్లీ 37–36తో గతంలో మూడుసార్లు చాంపియన్గా నిలిచిన పట్నా పైరేట్స్పై విజయం సాధించింది. విజేతగా నిలిచిన ఢిల్లీ జట్టుకు రూ. 3 కోట్లు... రన్నరప్ పట్నా జట్టుకు రూ. కోటీ 80 లక్షలు ప్రైజ్మనీగా లభించాయి. ఫైనల్లో ఢిల్లీ తరఫున రెయిడర్లు నవీన్ కుమార్, విజయ్ మలిక్ అద్భుత ప్రదర్శన చేశారు. విజయ్ 14 పాయింట్లు, నవీన్ 13 పాయింట్లు స్కోరు చేశారు. పట్నా తరఫున సచిన్ 10 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. పీకేఎల్ ఎనిమిదో సీజన్లో నవీన్ (ఢిల్లీ; రూ. 20 లక్షలు) ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’గా... మోహిత్ గోయట్ (పుణేరి పల్టన్; రూ. 8 లక్షలు) ‘ఎమర్జింగ్ ప్లేయర్’గా... మొహమ్మద్ రెజా (పట్నా; రూ. 15 లక్షలు) ‘బెస్ట్ డిఫెండర్’గా... పవన్ సెహ్రావత్ (బెంగళూరు బుల్స్; రూ. 15 లక్షలు) ‘బెస్ట్ రెయిడర్’గా అవార్డులను సొంతం చేసుకున్నారు. -
PKL 2022: ఫైనల్లో పట్నా, ఢిల్లీ
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో పట్నా పైరేట్స్, దబంగ్ ఢిల్లీ టైటిల్ పోరుకు సిద్ధమయ్యాయి. బుధవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ల్లో మాజీ విజేత పట్నా 38–27 పాయింట్లతో యూపీ యోధపై, ఢిల్లీ 40–35తో బెంగళూరు బుల్స్పై గెలిచాయి. పట్నాతో జరిగిన పోరులో యూపీ స్టార్ రెయిడర్ పర్దీప్ నర్వాల్ తేలిపోయాడు. 16 సార్లు రెయిడింగ్కు వెళ్లిన పర్దీప్ కేవలం 4 పాయింట్లే చేశాడు. పట్నా జట్టులో గుమన్ సింగ్ (8), సచిన్ (7), రెజా (6), సునీల్ (5) సమష్టిగా రాణించారు. పట్నా, ఢిల్లీ జట్ల మధ్య రేపు ఫైనల్ జరుగుతుంది. -
ప్లే ఆఫ్స్కు పట్నా పైరేట్స్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్ ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. తెలుగు టైటాన్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో పట్నా 38–30 పాయింట్ల తేడాతో గెలిచింది. 19 మ్యాచ్లు ఆడిన పట్నా 14 మ్యాచ్ల్లో గెలిచి 75 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ లీగ్లో 15వ పరాజయం చవిచూసిన తెలుగు టైటాన్స్ 27 పాయింట్లతో చివరిదైన 12వ స్థానంలో ఉంది. పట్నాతో జరిగిన మ్యాచ్లో టైటాన్స్ స్టార్ రెయిడర్ రజనీశ్ మరోసారి రాణించి 10 పాయింట్లు స్కోరు చేశాడు. ఈ క్రమంలో ఈ సీజన్లో అతను వంద వ్యక్తిగత రెయిడింగ్ పాయింట్లను పూర్తి చేసుకున్నాడు. పట్నా పైరేట్స్ తరఫున సచిన్ 14 పాయింట్లు స్కోరు చేసి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరో మ్యాచ్లో యూపీ యోధ 44–28తో దబంగ్ ఢిల్లీపై నెగ్గగా... గుజరాత్ జెయింట్స్, పుణేరి పల్టన్ మ్యాచ్ 31–31తో ‘టై’గా ముగిసింది. -
Pro Kabaddi League: పట్నా పైరేట్స్ విజయం.. ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా..
Pro Kabaddi League- బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 43–26 స్కోరుతో పుణేరీ పల్టన్ను చిత్తు చేసింది. తద్వారా ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. పట్నా తరఫున గుమాన్ సింగ్ 13 పాయింట్లు స్కోర్ చేయగా, పుణేరీ ఆటగాళ్లలో అస్లమ్ ఇనామ్దార్ 9 పాయింట్లు సాధించాడు. ఇక ఇప్పటి వరకు మొత్తంగా 18 మ్యాచ్లు ఆడిన పట్నా పదమూడింట గెలిచి 70 పాయింట్లతో టేబుల్ టాపర్గా ఉంది. ఇదిలా ఉండగా... బెంగాల్ వారియర్స్, దబంగ్ ఢిల్లీ మధ్య జరిగిన మరో మ్యాచ్ 39–39తో ‘టై’గా ముగిసింది. బెంగాల్ తరఫున మణీందర్ సింగ్, ఢిల్లీ తరఫున నవీన్ కుమార్ చెరో 16 పాయింట్లు స్కోర్ చేశారు. చదవండి: Ind Vs Wi 3rd ODI: ప్రయోగాలకు సిద్ధం.. అతడు కచ్చితంగా తుది జట్టులో ఉంటాడు: రోహిత్ శర్మ -
Pro Kabaddi League: పట్నా పైరేట్స్ని గెలిపించిన సచిన్
Pro Kabaddi League: Patna Pirates Beat Bengal Warriors: ప్రొ కబడ్డీ లీగ్లో ఆదివారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 38–29తో డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్ను ఓడించింది. పట్నా రెయిడర్ సచిన్ తన్వర్ 11 పాయింట్లు స్కోరు చేశాడు. ఈ లీగ్లో 11వ విజయంతో పట్నా మొత్తం 60 పాయింట్లతో టాప్ ర్యాంక్లోకి దూసుకొచ్చింది. మరో మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ 40–36తో బెంగళూరు బుల్స్పై విజయం సాధించింది. చదవండి: U19 WC- Shaikh Rasheed: 40 లక్షల నగదు.. అంత డబ్బు ఎప్పుడూ చూడలేదు.. చిన్న ఇల్లు కొంటాను.. మిగతా మొత్తంతో.. -
Pro Kabaddi League: బెంగాల్ వారియర్స్కు హరియణా షాక్
Pro Kabaddi League- Haryana Steelers Beat Bengal Warriors, Patna Pirates Defeat Gujarat Giants: ప్రొ కబడ్డీ లీగ్లో హరియాణా స్టీలర్స్ జట్టు ఏడో విజయం నమోదు చేసింది. డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 46–29తో ఘనవిజయం సాధించింది. హరియాణా కెప్టెన్ వికాశ్ కండోలా పది రెయిడింగ్ పాయింట్లు సంపాదించి తమ జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. బెంగళూరు బుల్స్, దబంగ్ ఢిల్లీ మ్యాచ్ 36–36తో ‘టై’ కాగా... మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 43–23తో గుజరాత్ జెయింట్స్ను ఓడించింది. చదవండి: U19 WC Final Ind Vs Eng: 11 మందిలో ఏకంగా 8వ వరుస బ్యాటర్ దాకా పరుగులు చేసే సత్తా వాళ్లది.. హోరాహోరీ తప్పదు! -
బెంగాల్ వారియర్స్కు పట్నా పైరేట్స్ షాక్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో పట్నా పైరేట్స్ జట్టు తమ ప్రతాపం చూపించింది. డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్కు షాక్ ఇచ్చింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 43–29 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్ను ఓడించింది. పట్నా రెయిడర్ మోనూ గోయట్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. పట్నా 32–25తో ఆధిక్యంలో ఉన్న దశలో మోనూ గోయట్ సింగిల్ రెయిడ్లో ఏకంగా ఏడు పాయింట్లు సాధించి అబ్బురపరిచాడు. మ్యాచ్ మొత్తంలో మోనూ 15 పాయింట్లు సాధించి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఓవరాల్గా ఈ లీగ్ చరిత్రలో మోనూ 500 రెయిడింగ్ పాయింట్లు పూర్తి చేసుకోవడం విశేషం. ఈ లీగ్లో పట్నాకిది మూడో విజయం. బెంగాల్ వారియర్స్ తరఫున మణీందర్ సింగ్ 12 పాయింట్లు సాధించాడు. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 36–26తో పుణేరి పల్టన్ను ఓడించి ఈ లీగ్లో తొలి విజయం నమోదు చేసింది. నేడు జరిగే మ్యాచ్ల్లో యు ముంబాతో యూపీ యోధ; బెంగళూరు బుల్స్తో తెలుగు టైటాన్స్; దబంగ్ ఢిల్లీతో తమిళ్ తలైవాస్ తలపడతాయి. -
ప్రదీప్ ప్రతాపం
గ్రేటర్ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో పట్నా పైరేట్స్ రైడర్ ప్రదీప్ నర్వాల్ మరోసారి విశ్వరూపం ప్రదర్శించాడు. ఏకంగా 36 పాయింట్లు సాధించాడు. దీంతో పట్నా 69–41తో బెంగాల్ వారియర్స్పై ఘన విజయం సాధించింది. అతడికి జాంగ్ కున్ లీ (8 పాయింట్లు), ట్యాక్లింగ్లో నీరజ్ కుమార్ (5 పాయింట్లు) చక్కని సహకారం అందించారు. ఆట మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా రైడ్కు వెళ్లిన ప్రదీప్... ఏకంగా ఆరుగురిని ఔట్ చేసి రైడింగ్లో తనకు ఎదురులేదని చాటాడు. ఈ మ్యాచ్లో పట్నా ప్రత్యరి్థని నాలుగు సార్లు ఆలౌట్ చేయడం విశేషం. బెంగాల్ తరఫున సౌరభ్ (11 పాయింట్లు), రాకేశ్ (10 పాయిం ట్లు) ఆకట్టుకున్నారు. ఈ సీజన్లో 300 పాయింట్ల మార్కును అందుకున్న రెండో రైడర్గా ప్రదీప్ (304 పాయింట్లు) నిలిచాడు. బెంగళూరు రైడర్ పవన్ షెరావత్ 309 పాయింట్లతో ముందున్నాడు. మరో మ్యాచ్లో యూపీ యోధ 43–39తో పుణేరి పల్టన్పై గెలిచింది. నేటి మ్యాచ్ల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో తెలుగు టైటాన్స్; తమిళ్ తలైవాస్తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి. -
ప్లే ఆఫ్స్కు యు ముంబా
పంచకుల: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్–7)లో తాజాగా యు ముంబా ప్లే ఆఫ్స్కు చేరింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో మాజీ చాంపియన్ ముంబా జట్టు 30–26తో మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్పై విజయం సాధించింది. యు ముంబా జట్టులో అభిషేక్ సింగ్ (7), అతుల్ (5), రోహిత్ బలియన్ (5), ఫజల్ అత్రాచలి (4) రాణించారు. పట్నా పైరేట్స్ తరఫున ప్రదీప్ నర్వాల్ (8) పోరాడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 59–36తో హరియాణా స్టీలర్స్పై భారీ విజయం సాధించింది. బెంగళూరు తరఫున పవన్ షెరావత్ ఒక్కడే రికార్డు స్థాయిలో 39 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే పోరులో తెలుగు టైటాన్స్తో పుణేరి పల్టన్ తలపడుతుంది. -
టైటాన్స్కు మరో ‘టై’
పుణే: ప్రత్యర్థిని పట్టేయాలన్న టైటాన్స్ అత్యుత్సాహం జట్టుకు విజయాన్ని దూరం చేసింది. గెలవాల్సిన మ్యాచ్ను టైటిల్ తో సరిపెట్టుకుంది. శుక్రవారం జరిగిన టైటాన్స్, పట్నా పైరేట్స్ మ్యాచ్ 42–42తో ‘డ్రా’గా ముగిసింది. స్పష్టమైన ఆధిక్యాన్ని రెండు సార్లు చేజార్చుకున్న టైటాన్స్ గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. 17 పాయింట్లు సాధించిన పట్నా రైడర్ ప్రదీప్ నర్వాల్ జట్టుకు పరాభవాన్ని తప్పించాడు. ఏకంగా మూడు సూపర్ రైడ్లతో చెలరేగి జట్టును ఆదుకున్నాడు. టైటాన్స్ తరఫున సిద్ధార్థ్ దేశాయ్ (12 పాయింట్లు), రజ్నీశ్ (10 పాయింట్లు) రాణించారు. మరో మ్యాచ్లో పుణేరి పల్టన్ 42–38తో బెంగళూరు బుల్స్పై నెగ్గింది. నేటి మ్యాచ్ల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో జైపూర్ పింక్ పాంథర్స్; యూపీ యోధతో తమిళ్ తలైవాస్ తలపడతాయి. -
పట్నా, బెంగాల్ విజయం
కోల్కతా: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో అదరగొట్టిన జైపూర్ పింక్ పాంథర్స్ అపజయాల బాటలో పయనిస్తుంది. గురువారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 36–33తో జైపూర్ను చిత్తు చేసింది. స్టార్ రైడర్ దీపక్ హుడా (5 పాయింట్లు) నిరాశపరిచాడు. పట్నా తరఫున ప్రదీప్ నర్వాల్ 14 పాయింట్లతో చెలరేగగా... జాన్ కున్ లీ (8 పాయింట్లు) అతనికి చక్కని సహకారం అందించాడు. మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 42–40తో బెంగళూరు బుల్స్పై విజయం సాధించింది. బెంగాల్ రైడర్ మణీందర్ సింగ్ 17 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. నేడు ప్రొ కబడ్డీ లీగ్లో విశ్రాంతి దినం. -
ప్రదీప్ 26, తలైవాస్ 25
కోల్కతా: పట్నా పైరేట్స్ రైడర్ ప్రదీప్ నర్వాల్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఏకంగా 26 పాయింట్లు సాధించి జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. దీంతో ప్రొ కబడ్డీ లీగ్ సీజన్–7లో సోమవారం జరిగిన మ్యాచ్లో పట్నా 51–25తో తమిళ్ తలైవాస్ను చిత్తు చేసింది. పట్నా సాధించిన మొత్తం పాయింట్లల్లో ప్రదీప్ సాధించిన పాయింట్లు సగం ఉండటం విశేషం. అంతే కాకుండా ప్రత్యర్థి సాధించిన పాయింట్ల కంటే ప్రదీప్ సాధించిన పాయింట్లే ఎక్కువ. అంతకుముందు జరిగిన మ్యాచ్లో యూపీ యోధ 33–26తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్పై విజయం సాధించింది. గుజరాత్ రైడర్ సచిన్ సూపర్ టెన్తో రాణించినా జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. -
వారియర్స్ విజయం
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో బెంగాల్ వారియర్స్ ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. గురువారం జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 35–26తో పట్నా పైరేట్స్పై గెలుపొందింది. రైడర్ మణీందర్ సింగ్ సూపర్ ‘టెన్’తో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు. అతనికి డిఫెండర్ రింకు నర్వాల్ (5 పాయింట్లు) నుంచి చక్కని సహకారం అందింది. పట్నా తరఫున ఒంటరి పోరాటం చేసిన ప్రదీప్ నర్వాల్ 11 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచినా... సహచరులు రాణించకపోవడంతో జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. మ్యాచ్ లో బెంగాల్ ప్రత్యర్థిని 4 సార్లు ఆలౌట్ చేయగా... పట్నా రెండు సార్లు ఆలౌట్ చేసింది. ఈ విజయంతో బెంగాల్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. నేడు జరిగే మ్యాచ్ల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో పట్నా పైరేట్స్, తమిళ్ తలైవాస్తో యు ముంబా తలపడతాయి.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
చెత్త అంపైరింగ్.. డుప్లెసిస్ది క్లియర్గా నాటౌట్! వీడియో
చెలరేగిన ఆర్సీబీ బ్యాటర్లు.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్ చూశారా..?
నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
ఉత్తరాంధ్ర... టీడీపీ ఆశలు గల్లంతేనా..?
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..!
డబ్బే ఆ పచ్చనేత ధీమా... తలకిందులైన అంచనాలు
తప్పక చదవండి
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
- Lok Sabha elections 2024: ఐదో దశకు ముగిసిన ప్రచారం
- బిభవ్ కుమార్ అరెస్ట్
- డిగ్రీకి డిగ్నిటీ...పీజీకి ఫుల్ పవర్
- Delhi Chief Minister Arvind Kejriwal: బీజేపీ ఆఫీస్కొస్తాం
- కదులుతున్న బస్సులో మంటలు.. 9 మంది సజీవ దహనం
- Lok Sabha Election 2024: లద్దాఖ్లో త్రిముఖ పోటీ
- Lok Sabha Election 2024: కశ్మీర్లో కనిపించని కమలం!
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
Advertisement