-
వైఎస్ఆర్సీపీ పై షర్మిల కుట్ర.. ఆడియో లీక్ తో అడ్డంగా దొరికిపోయింది..
-
ఢిల్లీ వెళ్లేముందు తండ్రి కేసీఆర్తో మాట్లాడిన కవిత..
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ వెళ్లే ముందు తండ్రి కేసీఆర్తో ఫోన్లో మాట్లాడారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈడీ నోటీసులు పంపిన నేపథ్యంలో కూతురికి కేసీఆర్ ధైర్యం చెప్పారు. ఆందోళనపడాల్సిన అవసరం లేదని, బీజేపీ అకృత్యాలపై న్యాయపరంగా పోరాడదామని పేర్కొన్నారు. పార్టీ అన్ని విధాలుగా ఉంటుందని హామీ ఇచ్చారు. నీ కార్యక్రమం నువ్వు కొనసాగించు అని కవితకు కేసీఆర్ సూచించారు. కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ నోటీసులు పంపించడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మార్చి 9న(గురువారం) విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులో పేర్కొంది. దీనిపై స్పందించిన కవిత.. ఈనెల 10న ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద ధర్నా, ఇతర కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్ ఫిక్స్ అయిన కారణంగా విచారణకు హాజరుకాలేనని, ఈనెల 15న హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఈడీని కోరారు. కానీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోడవంతో ఆమె ఢిల్లీ బయలుదేరారు. వాస్తవానికి కవిత గురువారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. కానీ ఒకరోజు ముందే వెళ్తుండటంతో ఈడీ విచారణ కోసమే వెళ్తున్నారా? అనే చర్చ మొదలైంది. కవితకు ఈడీ నోటీసులు పంపడాన్ని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. మహిళా దినోత్సవం రోజే సీఎం కేసీఆర్ కుమార్తెకు నోటీసులు పంపడం కేంద్రం దుర్మార్గపు చర్య అని మండిపడ్డాయి. బీజేపీకి రోజులు దగ్గరపడ్డాయని, ప్రజలు తగిన బుద్ది చెబుతారని ధ్వజమెత్తాయి. మరోవైపు బీజేపీ నాయకులు బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టారు. దర్యాప్తు సంస్థలతో తమ పార్టీకి సంబంధం లేదని చెప్పారు. కవిత వల్ల తెలంగాణ సమాజం తలదించుకునే పరిస్థిత వచ్చిందని కౌంటర్ ఇచ్చారు. లిక్కర్ స్కాం నిందితులు తనకు తెలుసునని కవితలో గతంలోనె చెప్పారని పేర్కొన్నారు. ఈడీ విచారణకు కవిత హాజరు కావాల్సిందేనని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఇంత వరకు కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు. కాగా.. మంగళవారం హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. తాను కవితకు బినామీనంటూ పిళ్లై ఒప్పుకున్నారని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో పిళ్లై రిమాండ్ రిపోర్ట్లోనూ కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. ఆ మరునాడే ఆమెకు నోటీసులు పంపింది. చదవండి: లిక్కర్ స్కామ్ హీట్: సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగానే..! పిళ్లై రిమాండ్ రిపోర్టులో సంచలనాలు -
అతన్ని సీనియర్లేమీ అనట్లేదు..
ఎంజీఎం: పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి తన తల్లితో చివరిసారిగా మాట్లాడిన ఫోన్ సంభాషణ తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సందర్భంగా ఆమె సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులకు గురిచేస్తున్న వైనాన్ని వివరించింది. అతన్ని సీనియర్లు ఏమీ అనడంలేదని.. ఒకవేళ అతనిపై ఫిర్యాదు చేస్తే సీనియర్లు తనకు ఏమీ నేర్పించకుండా దూరంపెడతారని తల్లికి చెప్పుకొని బాధపడింది. వారిద్దరి మధ్య ఫోన్ సంభాషణ ఇలా.. ప్రీతి: హలో అమ్మా.. తల్లి: అయిపోయిందా డ్యూటీ. ప్రీతి: లేదమ్మా నైట్ డ్యూటీ. 2, 3 గంటల తర్వాత ఎవరైనా వస్తారు.. వస్తే గాంధీకి వెళ్లాలి. అక్కడ కూడా నైట్ డ్యూటీ. తల్లి: బండి తీసుకుపోలేదా? ప్రీతి: తీసుకెళ్లినా.. తల్లి: డాడీ వచ్చిండంట కదా.. ప్రీతి: ఆ వచ్చిండు.. ఆస్పత్రి దగ్గర దించిండు. మళ్లీ హెచ్ఓడీ దగ్గరకు వెళ్లి మాట్లాడినా.. చూసుకుంటా అన్నాడు. తల్లి: నువ్వు ఒక్కదానివే వెళ్లినవా.. డాడీ కూడా వచ్చాడా. ప్రీతి: నేనే వెళ్లినా.. డాడీ పనిలో ఉండే.. నేను వెళ్లినా.. ఏమైనా ఉంటే నేను చూసుకుంటా.. ప్రిన్సిపాల్ సర్ దగ్గరికి ఎందుకు వెళ్లినావు అని హెచ్ఓడీ అడిగాడు. ఆయనను పిలిచి ఏం మాట్లాడిండో తెలియదు. వాని గురించి డాడీకి ఫోన్ చేయాలి.. నన్ను ఏం చేస్తారు? అంటున్నాడు. ఆయన పేరు కంప్లైంట్ చేసినా సీనియర్లు నాకు ఏమీ నేర్పించకుండా దూరం పెడతారు. తల్లి: సెకండియర్ అంతా ఒక్కటేనా.. అందరూ అలాగే ఉంటారా..? ప్రీతి: అందరూ ఆయనలాగా ఉండరు.. తల్లి: వాళ్లు అతన్ని ఏమీ అనడం లేదా.. అలా ఎందుకు చేస్తున్నావని..? ప్రీతి: అలా ఎవరూ అనడం లేదు. తల్లి: వీడు అంత ఇదా.. హెచ్ఓడీ మాట కూడా వినడా..? ప్రీతి: ఏం తెలియదు.. తల్లి: నువ్వేపోయి చెప్పినావా..? ప్రీతి: లేదు.. ప్రిన్సిపాల్కు డాడీ ఎవరితో చెప్పించిండో తెలియదు.. హెచ్ఓడీ పిలిపించి అడిగిండు. ప్రిన్సిపాల్ దగ్గరికి ఎందుకు వెళ్లినావు అన్నాడు. నేను పడుతున్న ఇబ్బంది గురించి హెచ్ఓడీకి చెప్పినా. తల్లి: ఏం భయపడకు.. మనం వరంగల్లోనే ఉన్నాం. ఎక్కడో దేశంలో లేం.. రెండు, మూడు రోజుల్లో కాలేజీకి వస్తాం. రేపు యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశం పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనలో సైఫ్పై వస్తున్న ఆరోపణలతోపాటు పోలీసులు నమోదు చేసిన కేసులపై మంగళవారం కేఎంసీలో యాంటీ ర్యాంగింగ్ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాస్ తెలిపారు. సైఫ్ ఘటనలో జరిగిన వివరాలను చర్చించి ఢిల్లీ యాంటీ ర్యాగింగ్ కమిటీతోపాటు కాళోజీ ఆరోగ్య వర్సిటీకి సైతం నివేదిక సమర్పించనున్నారు. యాంటీ ర్యాగింగ్ కమిటీలో తీసుకున్న నిర్ణయం మేరకు సైఫ్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నారు. -
ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఫోన్
కీవ్: సైనిక చర్య పేరుతో రష్యా భీకర దాడులకు పాల్పడుతున్న క్రమంలో మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ. ఈ క్రమంలోనే భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో టెలిఫోన్లో మాట్లాడినట్లు సోమవారం ప్రకటించారు. తన శాంతి ఫార్ములాను అమలు చేయడంలో భారత్ పాలుపంచుకుంటుందనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే.. జీ20 దేశాల సదస్సుకు భారత్ విజయవంతంగా అధ్యక్షత వహించాలని మోదీకి శుభాకాంక్షలు తెలిపినట్లు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ‘భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడాను. జీ20 ప్రెసిడెన్సీని విజయవంతంగా పూర్తిచేయాలని ఆకాంక్షించాను. ఈ ప్లాట్ఫామ్ వేదికగా నేను శాంతి ఫార్ములాను ప్రకటించాను. దానిని అమలు చేసేందుకు భారత్ తన వంతు పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నా. ఐక్యరాజ్య సమితిలో మానవతా సాయం, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపాను.’ - వొలొదిమిర్ జెలెన్స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈ విషయంపై భారత్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పాటు జెలెన్స్కీతో పలు సందర్భాల్లో మాట్లాడారు. ప్రస్తుతం యుద్ధాలు చేసే సమయం కాదని, ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లాలని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు మోదీ. I had a phone call with @PMOIndia Narendra Modi and wished a successful #G20 presidency. It was on this platform that I announced the peace formula and now I count on India's participation in its implementation. I also thanked for humanitarian aid and support in the UN. — Володимир Зеленський (@ZelenskyyUa) December 26, 2022 ఇదీ చదవండి: China Covid Fever: శ్మశానాల ముందు మృతదేహాలతో భారీ క్యూ.. చైనాలో దారుణ పరిస్థితులు -
స్వామీజీ-రోహిత్ రెడ్డి సంభాషణ వైరల్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
ఆటా కన్వెన్షన్ 2024: ఆకాశమే హద్దుగా సాగుతున్న నృత్య పోటీలు!
చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
పేదల పథకాలపై కూటమి కుట్ర..!
బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత
తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా
Summer 2024 : కీరదోసను తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ
జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం
చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement