-
DC Vs GT: ఇదేమి అంపైరింగ్.. పృథ్వీ షాది ఔటా? నాటౌటా? వీడియో వైరల్
ఐపీఎల్-2024లో మరోసారి థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఢిల్లీ వేదికగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ పృథ్వీ షా వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు. ప్రస్తుతం పృథ్వీ షా ఔట్ క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.అసలేం జరిగిందంటే?ఢిల్లీ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన సందీప్ వారియర్ ఐదో బంతిని పృథ్వీ షాకు షార్ట్ పిచ్ డెలివరీని సంధించాడు. ఆ బంతిని పృథ్వీ షా పుల్ షాట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. కానీ షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ నుంచి నూర్ అహ్మద్ పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్ను అందుకున్నాడు.దీంతో గుజరాత్ ఆటగాళ్లంతా సంబరాల్లో మునిగి తేలిపోయారు. కానీ ఫీల్డ్ అంపైర్లు క్లీన్ క్యాచ్ అవునా కాదా అనే సందేహంతో థర్డ్ అంపైర్కు రిఫర్ చేశారు. థర్డ్ అంపైర్ పలు కోణాల్లో పరిశీలించి బంతి కింద చేతి వేళ్లు ఉన్నయాని తన నిర్ణయాన్ని ఔట్గా ప్రకటించాడు. అయితే రిప్లేలో బంతి గ్రౌండ్కు టచ్ అయినట్లు కన్పించినప్పటికి అంపైర్ మాత్రం క్లీన్ క్యాచ్గా ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.కామెంటెటర్లు ఆకాష్ చోప్రా, పార్థివ్ పటేల్ సైతం క్యాచ్ను అందుకునే సమయంలో బంతి నేలను తాకిందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు చెత్త అంపైరింగ్.. అది క్లియర్గా నాటౌట్ అని కామెంట్లు చేస్తున్నారు. Woah 🔥🔥Noor Ahmad holds on to a sharp catch in the deep as #DC lose both their openers!Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #DCvGT pic.twitter.com/8zmIDwCdf2— IndianPremierLeague (@IPL) April 24, 2024 -
ఖరీదైన ఫ్లాట్ కొన్న క్రికెటర్.. ‘డ్రీమ్ హౌజ్’ చూశారా? (ఫోటోలు)
-
లగ్జరీ ఫ్లాట్ కొన్న ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్.. కోట్లు పెట్టి మరీ ఇలా!
టీమిండియా బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ పృథ్వీ షా ఖరీదైన ఇల్లు కొన్నాడు. దాదాపు రూ. 20 కోట్లు ఖర్చు చేసి విలాసవంతమైన ఫ్లాట్ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని బాంద్రాలో సముద్ర ముఖంగా ఉన్న ఫ్లాట్ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తన లగ్జరీ ఫ్లాట్కు సంబంధించిన ఫొటోలను పృథ్వీ షా మంగళవారం షేర్ చేశాడు. ‘‘నాకంటూ ఓ సొంత ప్రదేశం. అందుకోసం ఎంతగానో శ్రమించి ఇప్పుడు ఇలా ఇక్కడ అడుగుపెట్టడం ఎంతో ప్రత్యేకం. ఈ ప్లేస్ గురించి కలలగనడం.. ఇప్పుడు ఇక్కడ వాటిని నిజం చేసుకోవడం.. నాకంటూ సొంత ఇల్లు.. స్వర్గం లాంటిది! ఇక ముందు అంతా మంచే జరగాలి’’ అంటూ ఉద్వేగపూరిత నోట్ రాశాడు పృథ్వీ షా. ఈ ఫొటోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కాగా టీమిండియా ఓపెనర్గా అరంగేట్రంలోనే అదరగొట్టిన ముంబై బ్యాటర్ పృథ్వీ షా.. ఆ తర్వాత తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. అనంతరం దేశవాళీ క్రికెట్లో అదరగొట్టినా మళ్లీ సెలక్టర్ల పిలుపు అందుకోలేకపోయాడు. ఇక ఇటీవల గాయంతో సతమతమైన పృథ్వీ షా రంజీ బరిలో దిగి.. ముంబై ట్రోఫీ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఐపీఎల్-2024 సీజన్తో ఈ ఓపెనింగ్ బ్యాటర్ బిజీగా ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న పృథ్వీ షా.. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లలో కలిపి 119 పరుగులు సాధించాడు. కాగా ఢిల్లీ ఫ్రాంఛైజీ పృథ్వీ షా కోసం రూ. 8 కోట్లు చెల్లించింది. చదవండి: #Klaasen: గంటకు 140 కి.మీ వేగంతో బౌలింగ్.. అయినా మెరుపు స్టంపింగ్! వీడియో -
కళ్లు చెదిరే యార్కర్ వేసిన బుమ్రా.. పృథ్వీ షాకు ఫ్యూజులు ఔట్
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో ఇవాళ (ఏప్రిల్ 7) జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా తనదైన శైలిలో కళ్లు చెదిరే యార్కర్ సంధించాడు. ఈ బంతిని ఎదుర్కోలేక బ్యాటర్ పృథ్వీ షా (40 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బుమ్రా వేసిన ఈ సూపర్ యార్కర్కు షా వద్ద సమాధానం లేకుండా పోయింది. అతనితో సహా మ్యాచ్ చూస్తున్న వారందరికీ ఈ యార్కర్ చూసి ఫ్యూజులు ఎగిరిపోయాయి. YORKER OF IPL 2024. 🤯💥 - Jasprit Bumrah, the GOAT. 🐐 pic.twitter.com/PtfUrFbYNH — Mufaddal Vohra (@mufaddal_vohra) April 7, 2024 235 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో షా అద్భుతమైన టచ్లో ఉన్నప్పుడు బుమ్రా తన మార్కు మ్యాజిక్ చేశాడు. ఫలితంగా ఢిల్లీ కష్టాల్లో పడింది. బుమ్రా సూపర్ యార్కర్కు సంబంధించిన వీడియో నెట్టంట వైరలవుతుంది. షాను ఔట్ చేసిన అనంతరం బుమ్రా మరోసారి విజృంభించాడు. 15వ ఓవర్ ఆఖరి బంతికి అభిషేక్ పోరెల్ను (41) కూడా పెవిలియన్కు పంపించాడు. దీంతో ఢిల్లీ కష్టాలు తీవ్రమయ్యాయి. 15 ఓవర్ల అనంతరం ఢిల్లీ స్కోర్ 144/3గా ఉంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ గెలవాలంటే 30 బంతుల్లో 91 పరుగులు చేయాల్సి ఉంది. ట్రిస్టన్ స్టబ్స్ (26), రిషబ్ పంత్ క్రీజ్లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. రోహిత్ శర్మ (27 బంతుల్లో 49; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (23 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్), టిమ్ డేవిడ్ (21 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (10 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. నోర్జే వేసిన ఆఖరి ఓవర్లో షెపర్డ్ విధ్వంసం సృష్టించాడు. 4 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేశాడు. -
అతడు చాలా బాధపడ్డాడు.. అందుకే చెలరేగిపోయాడు: సెహ్వాగ్
ఐపీఎల్-2024 సీజన్ను ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా ఘనంగా ఆరంభించాడు. ఈ ఏడాది సీజన్లో తొలి రెండు మ్యాచ్లకు బెంచ్కే పరిమితమైన పృథ్వీ షా.. ఆదివారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్కు ఢిల్లీ తుది జట్టులోకి వచ్చాడు. తనకు వచ్చిన అవకాశాన్ని పృథ్వీ షా సద్వినియోగ పరుచుకున్నాడు. షా అద్బుతమైన ఇన్నింగ్స్తో ఢిల్లీ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. కేవలం 27 బంతుల్లోనే 4 ఫోర్లు,2 సిక్స్లతో అతడు 43 పరుగులు చేశాడు. డేవిడ్ వార్నర్తో కలిసి ఢిల్లీ జట్టుకు అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు ఈ ముంబైకర్. ఈ నేపథ్యంలో పృథ్వీ షా ఉద్దేశించి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పృథ్వీ షా తనలో ఉన్న బాధనంతా తన ఇన్నింగ్స్ రూపంలో చూపించాడని సెహ్వాగ్ అన్నాడు. "ప్రతీ టీమ్ మేనేజ్మెంట్ తమ ఆటగాడు రిథమ్లో ఉన్నాడా లేదా నెట్స్లో ఎప్పుడూ పరిశీలిస్తుంటుంది. ఈ ఇన్నింగ్స్ పృథ్వీకి చాలా ముఖ్యమైనది. గత సీజన్లో కూడా పెద్దగా జట్టులో షా కన్పించలేదు. ఈ ఏడాది సీజన్లో కూడా తొలి రెండు మ్యాచ్ల్లో అతడికి ఆడే ఛాన్స్ రాలేదు. ఈ విషయంలో అతడు బాధపడి ఉండవచ్చు. అందుకే తన బాధను ఆట రూపంలో చూపించాడని" క్రిక్బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. -
'అతడొక విధ్వంసకర ఆటగాడు.. మీరు అలా చేయడం కరెక్ట్ కాదు'
ఐపీఎల్-2024 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. గురువారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 12 పరుగులతో తేడాతో ఢిల్లీ ఓటమి పాలైంది. కాగా వరుసగా రెండో మ్యాచ్లోనూ పృథ్వీ షాకు ఢిల్లీ తుది జట్టులో చోటు దక్కలేదు. అతడి స్ధానంలో ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్కు ఢిల్లీ జట్టు మెనెజ్మెంట్ అవకాశమిచ్చింది. ఈ క్రమంలో పృథ్వీ షాను కేవలం బెంచ్కే పరిమితం చేయడాన్ని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ తప్పుబట్టాడు. "పృథ్వీ షా అద్భుతమైన ఆటగాడు. అతడికి అంతర్జాతీయ స్ధాయిలో ఆడిన అనుభవం ఉంది. ఆటువంటి ఆటగాడిని డగౌట్లో ఎందుకు కూర్చునిబెట్టారో నాకు ఆర్ధం కావడం లేదు. గత సీజన్లో అతడు బాగా రాణించకపోవచ్చు. కానీ అతడు చాలా డేంజరస్ క్రికెటర్. కాబట్టి అతడికి అవకాశాలు ఇవ్వాలి. అంతే తప్ప డగౌట్లో కూర్చోనిబెడితే పరుగులు చేయలేడు కదా" అని మూడీ ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మూడీ పేర్కొన్నాడు. కాగా గతేడాది సీజన్లో షా దారుణంగా విఫలమయ్యాడు. ఐపీఎల్-2023లో పృథ్వీ షా ఎనిమిది ఇన్నింగ్స్లలో 13.25 సగటుతో కేవలం 106 పరుగులు మాత్రమే చేసాడు. అయితే అంతకుముందు సీజన్లలో మాత్రం పృథ్వీ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. కాగా తర్వాతి మ్యాచ్ల్లోనైనా పృథ్వీ షాకు ఢిల్లీ తుది జట్టులో చోటు దక్కుతుందో లేదో వేచి చూడాలి. -
IPL 2024: మెరుపులా వచ్చి మాయం!.. ఇకనైనా మారు!
టీమిండియాలోకి మెరుపులా వచ్చి మాయమైన క్రికెటర్లు చాలా మందే ఉన్నారు. ముంబై బ్యాటర్ పృథ్వీ షా కూడా ఆ కోవకు చెందినవాడేనని చెప్పవచ్చంటారు విశ్లేషకులు. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించి దిగ్గజాలను మెప్పించిన పృథ్వీ.. ఐసీసీ అండర్-19 వరల్డ్కప్ గెలిచిన కెప్టెన్గా పేరొందాడు. ఈ క్రమంలో 2018లో వెస్టిండీస్తో టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. అరంగేట్ర మ్యాచ్లోనే అద్భుత సెంచరీ(134)తో అలరించాడు. ఆ తర్వాత రెండేళ్లకు పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ అరంగేట్రం చేశాడు. కానీ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో రాణించలేక శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్తో పోటీలో వెనుకబడి టీమిండియాకు దూరమయ్యాడు. ఆఖరిగా శ్రీలంకతో టీ20 సిరీస్లో ఆడిన పృథ్వీ షా.. ఐపీఎల్-2023 సీజన్లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఎనిమిది మ్యాచ్లు ఆడి కేవలం 106 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే, ఇటీవల ముగిసిన రంజీ ట్రోఫీ 2023-24 టోర్నీలో మాత్రం ఫర్వాలేదనిపించాడు. మోకాలి గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన అతడు.. ఛత్తీస్గఢ్తో మ్యాచ్లో 159 పరుగులతో అదరగొట్టాడు. ఆ తర్వాత మళ్లీ మూడంకెల స్కోరును అందుకోలేకపోయినా.. ట్రోఫీ గెలిచిన జట్టులో మాత్రం సభ్యుడిగా ఉన్నాడు పృథ్వీ షా. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024కు రెట్టించిన ఉత్సాహంతో సిద్దమయ్యాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ పృథ్వీ షాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘పృథ్వీ షా ఫామ్లో ఉన్నట్లు కనిపించడం లేదు. అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. తన ఆట తీరులో కచ్చితంగా మార్పులు చేసుకోవాలి. బ్యాట్ ఝులిపించగలిగితేనే మునుపటిలా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలుగుతాడు. ముఖ్యంగా పవర్ప్లేలో పరుగులు రాబట్టడం పృథ్వీ షాతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్కు కూడా ఎంతో కీలకం. వార్నర్తో కలిసి ఓపెనర్గా పృథ్వీ రాణిస్తేనే మిడిలార్డర్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలుగుతుంది’’ అని ఆస్ట్రేలియా తరఫున రెండుసార్లు వరల్డ్కప్ గెలిచిన బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2024తో రిషభ్ పంత్ ఢిల్లీ కెప్టెన్గా పునరాగమనం చేయనున్నాడు. తాజా ఎడిషన్లో పంజాబ్ కింగ్స్తో ఢిల్లీ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. -
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ..
Shreyas Iyer named in Mumbai squad: టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో తిరిగి అడుగుపెట్టనున్నాడు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు ఆంధ్రతో మ్యాచ్లో ఆడిన ఈ ముంబై బ్యాటర్.. తాజాగా సెమీ ఫైనల్ మ్యాచ్తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదేశాల మేరకు తప్పక రంజీ బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో తమిళనాడుతో సెమీస్ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్కు చోటు ఇచ్చినట్లు ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు అజింక్య రహానే సారథ్యంలోని 16 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. కాగా ముంబై- తమిళనాడు మధ్య మార్చి 2 నుంచి రంజీ సెమీ ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది. వెన్ను నొప్పి అని చెబితే ఎన్సీఏ మాత్రం అలా ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో సిరీస్లో అయ్యర్ పూర్తిగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. తొలి రెండు టెస్టుల్లో ఆడి మొత్తంగా కేవలం 104 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో మూడో టెస్టు నుంచి జట్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో రంజీ బరిలో దిగాలన్న బీసీసీఐ నిబంధన నుంచి తప్పించుకునేందుకు వెన్నునొప్పిని కారణంగా చూపాడు. అయితే, జాతీయ క్రికెట్ అకాడమీ మాత్రం అయ్యర్ పూర్తి ఫిట్గా ఉన్నాడని ముంబై క్రికెట్ అసోసియేషన్కు తెలిపినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో రంజీ ట్రోఫీలో ఆడకూడదనే శ్రేయస్ అయ్యర్ ఇలా చేసి ఉంటాడని.. ఈ నేపథ్యంలో అతడిపై గుర్రుగా ఉన్న బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించే యోచనలో ఉందని వదంతులు వ్యాపించాయి. అయితే, తాజాగా తాను ఫిట్గా ఉన్నానంటూ అయ్యర్ రంజీల్లో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం కావడం గమనార్హం. తమిళనాడుతో సెమీస్కు ముంబై జట్టు: అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్, పృథ్వీ షా, భూపేన్ లాల్వానీ, అమోగ్ భత్కల్, ముషీర్ ఖాన్, ప్రసాద్ పవార్, హార్దిక్ తామోర్, శార్దూల్ ఠాకూర్, షామ్స్ ములానీ, తనూష్ కొటియాన్, ఆదిత్య ధుమాల్, తుషార్ దేశ్పాండే, మోహిత్ అవస్తి, రాయ్స్టన్ డయాస్, ధావల్ కులకర్ణి. చదవండి: Rohit Sharma: ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎట్లా? రోహిత్ వ్యాఖ్యలపై టీమిండియా దిగ్గజం స్పందన -
మెరిసిన పృథ్వీ షా.. పోరాటం చేస్తున్న మయాంక్ అగర్వాల్
రంజీ ట్రోఫీ 2024 ఎడిషన్ చివరి దశకు చేరుకుంది. ఈ టోర్నీలో ఇప్పటికే రెండు సెమీస్ బెర్త్లు ఖరారు కాగా.. మరో రెండు బెర్త్ల భవితవ్యం రేపటి లోగా తేలిపోనుంది. సౌరాష్ట్రపై గెలిచి తమిళనాడు.. ఆంధ్రప్రదేశ్పై గెలిచి మధ్యప్రదేశ్ సెమీస్కు అర్హత సాధించగా.. మిగతా క్వార్టర్ ఫైనల్స్లో విదర్భ-కర్ణాటక, ముంబై-బరోడా అమీతుమీ తేల్చుకుంటున్నాయి. బరోడాతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై భారీ ఆథిక్యం సాధించి పటిష్ట స్థితిలో ఉండగా.. విదర్భతో జరుగుతున్న మ్యాచ్లో కర్ణాటక పోరాడుతుంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 415 పరుగుల లీడ్లో ఉండగా.. 371 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కర్ణాటకకు గెలుపు ఛాలెంజ్లా మారింది. మరో రోజు ఆట మిగిలుండగా.. కర్ణాటక లక్ష్యానికి ఇంకా 268 పరుగుల దూరంలో ఉంది. కర్ణాటకను గెలిపించేందుకు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ పోరాటం చేస్తున్నాడు. మెరిసిన పృథ్వీ షా.. బరోడాతో జరుగుతున్న మ్యాచ్లో (సెకెండ్ ఇన్నింగ్స్) హార్దిక్ తామోర్ (114), పృథ్వీ షా (87) సత్తా చాటడంతో ముంబై పటిష్ట స్థితికి చేరింది. ముంబై తొలి ఇన్నింగ్స్ 384 (ముషీర్ ఖాన్ 203 నాటౌట్, భార్గవ్ భట్ 7/112) బరోడా తొలి ఇన్నింగ్స్ 348 (షశ్వత్ రావత్ (124, సోలంకి 136, షమ్స్ ములానీ 4/121) ముంబై సెకెండ్ ఇన్నింగ్స్ 379/9 (హార్దిక్ తామోర్ 114, పృథ్వీ షా 87, భార్గవ్ భట్ 7/142) నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 415 పరుగుల ఆధిక్యంలో ఉంది పోరాడుతున్న మయాంక్.. విదర్భతో జరుగుతున్న మ్యాచ్లో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగార్వల్ పోరాటం చేస్తున్నాడు. విదర్భ తొలి ఇన్నింగ్స్ 460 (అథర్వ తైడే 109, కావేరప్ప 4/99) కర్ణాటక తొలి ఇన్నింగ్స్ 286 (నికిన్ జోస్ 82, యాశ్ ఠాకూర్ 3/48) విదర్భ రెండో ఇన్నింగ్స్ 196 (దృవ్ షోరే 57, కావేరప్ప 6/61) కర్ణాటక రెండో ఇన్నింగ్స్ 103/1 (మయాంక్ అగర్వాల్ 61 నాటౌట్, సర్వటే 1/10) ఈ మ్యాచ్లో కర్ణాటక విజయం సాధించాలంటే మరో 268 పరుగులు చేయాలి -
టీమిండియా ఓపెనర్ అరుదైన రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారి
టీమిండియా ఓపెనర్, ముంబై బ్యాటర్ పృథ్వీ షా రంజీ ట్రోఫీ పునరాగమానాన్ని ఘనంగా చాటుకున్నాడు. రాయ్పూర్ వేదికగా ఛత్తీస్గఢ్తో జరుగుతున్న మ్యాచ్లో మెరుపు సెంచరీతో పృథ్వీ షా చెలరేగాడు. 107 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా తొలి ఇన్నింగ్స్లో 185 బంతులు ఎదుర్కొన్న పృథ్వీ షా.. 18 ఫోర్లు, 3 సిక్స్లతో 159 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్లో సెంచరీతో మెరిసిన పృథ్వీ షా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో తొలి రోజు లంచ్కు ముందే కెరీర్లో రెండు సెంచరీలు చేసిన క్రికెటర్గా రికార్డులకెక్కాడు. గతంలో అసోంపై 379 బంతుల్లో 383 పరుగులు చేసిన పృథ్వీ.. రంజీ ట్రోఫీలోనే రెండో అత్యధిక స్కోరు సాధించాడు. అప్పుడు కూడా మొదటి రోజు లంచ్కు ముందే సెంచరీని నమోదు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్లో ముంబై 351 పరుగులకు ఆలౌటైంది. ముంబై బ్యాటర్లలో భూపేన్ లల్వాణీ (102) పరుగులతో రాణించాడు. ఛత్తీస్గఢ్ బౌలర్లలో ఆశిష్ చౌహాన్ 6 వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు రవి కిరణ్ మూడు, మాలిక్ ఒక్క వికెట్ సాధించాడు. -
రీ ఎంట్రీలో టీమిండియా ఓపెనర్ ధనాధన్ శతకం.. ఫోర్ల వర్షం
Ranji Trophy 2023-24: ముంబై బ్యాటర్ పృథ్వీ షా రంజీ ట్రోఫీ పునరాగమనంలో ధనాధన్ శతకంతో సత్తా చాటాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ.. ఫోర్ల వర్షం కురిపిస్తూ.. వంద పరుగుల మార్కు అందుకున్నాడు. కాగా దాదాపు ఆరు నెలల విరామం తర్వాత పృథ్వీ షా మళ్లీ మైదానంలో దిగాడు. గతేడాది ఆగష్టులో మోకాలి నొప్పి కారణంగా దేశవాళీ క్రికెట్కూ దూరమైన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్.. జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందాడు. క్రమక్రమంగా కోలుకున్న పృథ్వీ షా.. నెట్స్లో కఠిన శ్రమకోర్చి.. మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. ఎన్సీఏలో పునరావాసం పొంది ఈ క్రమంలో రిటర్న్ టు ప్లే సర్టిఫికెట్ సంపాదించి రంజీ ట్రోఫీ-2024 సీజన్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. బెంగాల్తో మ్యాచ్ సందర్భంగా పునరాగమనం చేసిన పృథ్వీ.. తన మొదటి మ్యాచ్లో 35 పరుగులకే పరిమితమయ్యాడు. తాజాగా.. శుక్రవారం ఛత్తీస్గఢ్తో మొదలైన మ్యాచ్లో సెంచరీతో మెరవడం విశేషం. రాయ్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ పృథ్వీ షా.. 107 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. పదమూడో సెంచరీ మరో ఓపెనర్ భూపేన్ లల్వాణీ 37 పరుగులతో ఆడుతున్నాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆటలో భాగంగా 32 ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్ నష్టపోకుండా 140 పరుగులు చేసింది. ఇక పృథ్వీ షాకు ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇది పదమూడో సెంచరీ కావడం విశేషం. కాగా 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన పృథ్వీ షా ఓపెనర్గా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే, శుబ్మన్ గిల్తో ఎదురైన పోటీలో వెనుకబడ్డ అతడు.. మళ్లీ జాతీయ జట్టులో చోటు సంపాదించలేకపోయాడు. ఈ క్రమంలో 2021లో టీమిండియా తరఫున ఆఖరి టీ20 ఆడాడు పృథ్వీ షా. ఇక భారత్కు అండర్-19 వరల్డ్కప్ అందించిన కెప్టెన్ అయిన పృథ్వీ షా సారథ్యంలో శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్ తదితరులు ఆడటం విశేషం. చదవండి: Ind vs Eng: కేఎస్ భరత్కే పెద్దపీట.. అంతేగానీ అతడిని ఇప్పట్లో ఆడించరు! -
ఎట్టకేలకు టీమిండియా ఓపెనర్ రీఎంట్రీ..
Ranji Trophy 2023-24- Mumbai: టీమిండియా ఓపెనర్, ముంబై బ్యాటర్ పృథ్వీ షా ఎట్టకేలకు మైదానంలో దిగనున్నాడు. సుమారు ఆరు నెలల విరామం తర్వాత మ్యాచ్ ఫిట్నెస్ సాధించి రంజీ టోర్నీ ఆడేందుకు సిద్ధమయ్యాడు. గతేడాది ఆగష్టులో పృథ్వీ షా గాయపడ్డాడు. మెకాలి నొప్పి కారణంగా దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ, టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి కూడా దూరమయ్యాడు. ఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన అతడు ఫిట్నెస్పై దృష్టి సారించాడు. ఇప్పట్లో రాడంటూ వార్తలు నెట్స్లో ప్రాక్టీస్ చేస్తూ క్రమక్రమంగా కోలుకున్నాడు. అయితే, పృథ్వీ షాకు ఇప్పట్లో రిటర్న్ టు ప్లే(ఆర్టీపీ) సర్టిఫికెట్ లభించకపోవచ్చనే వార్తలు వినిపించాయి. దీంతో మరికొన్నాళ్లపాటు అతడు ఆటకు దూరం కానున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ వర్గాలు ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ పృథ్వీ షా గురించి అప్డేట్ అందించాయి. ప్రస్తుతం అతడు పూర్తిగా కోలుకున్నాడని స్పష్టం చేశాయి. ‘‘బీసీసీఐ జాతీయ అకాడమీ పృథ్వీ షాకు ఆర్టీపీ సర్టిఫికెట్ జారీ చేసింది. బుధవారమే దీనిని ముంబై క్రికెట్ అసోసియేషన్కు కూడా పంపించింది. ఎన్సీఏ నెట్స్లో అతడు బాగా ప్రాక్టీస్ చేశాడు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. సెలక్ట్ చేశామన్న సెక్రటరీ మరోవైపు.. ముంబై క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అజింక్య నాయక్ పృథీ షా రీఎంట్రీని ధ్రువీకరించాడు. షాను జట్టులో చేర్చామని.. ముంబై తరఫున తదుపరి మ్యాచ్లో అతడు బరిలోకి దిగుతాడని స్పష్టం చేశాడు. కాగా అజింక్య రహానే కెప్టెన్సీలో ఫిబ్రవరి 2 నుంచి ముంబై.. బెంగాల్తో మ్యాచ్ మొదలుపెట్టనుంది. కోల్కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ ఇందుకు వేదిక. కాగా భారత్కు అండర్-19 వరల్డ్కప్ అందించిన కెప్టెన్గా పేరొందిన పృథ్వీ షా టీమిండియాలో వచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత అతడు దేశవాళీ క్రికెట్లో సత్తా చాటినా ఛాన్స్లు దక్కించుకోలేకపోయాడు. ఇక షా సారథ్యంలో ఆడిన శుబ్మన్ గిల్ టీమిండియాలో రోహిత్ శర్మకు జోడీగా ఓపెనర్గా పాతుకుపోయిన విషయం తెలిసిందే. చదవండి: చరిత్ర సృష్టించిన 12th ఫెయిల్ డైరెక్టర్ కొడుకు.. ప్రపంచంలో ఒకే ఒక్కడు -
టీమిండియాలో రీఎంట్రీకి కసరత్తు: కెప్టెన్గా అజింక్య రహానే
Ranji Trophy 2023-24: రంజీ ట్రోఫీ-2024 సీజన్కు ముంబై క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. తొలి రెండు మ్యాచ్లకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు తెలిపింది. టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే ఈ టీమ్కు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. మరోవైపు.. భారత యువ ఓపెనర్ పృథ్వీ షా గాయం నుంచి కోలుకోని కారణంగా అతడికి ఈ జట్టులో చోటు దక్కలేదు. మోకాలి నొప్పితో బాధపడుతున్న పృథ్వీ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. అదే విధంగా.. గత ఎడిషన్లో ముంబై తరఫున ఆడిన టీమిండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్, టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ ఈసారి జట్టుతో లేరు. యశస్వి టీమిండియాతో కలిసి సౌతాఫ్రికా పర్యటనలో ఉండగా.. సూర్య చీలమండ గాయంతో ఆటకు విరామం ఇచ్చాడు. ఇక సౌతాఫ్రికా-ఏ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్ ముగించుకుని తిరిగి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్పాండేలతో పాటు గత సీజన్లో ఆడిన శివం దూబే సువేద్ పార్కర్, షామ్స్ ములాని, ధవళ్ కులకర్ణి ఈసారి కూడా ముంబై తరఫున మరోసారి బరిలోకి దిగనున్నారు. బిహార్తో తొలి మ్యాచ్ రంజీ ట్రోఫీ-2024లో భాగంగా ముంబై తమ తొలి మ్యాచ్లో బిహార్తో తలపడనుంది. జనవరి 5న జరుగనున్న ఈ టెస్టు మ్యాచ్కు పాట్నాలోని మొయిన్ ఉల్ హక్ స్టేడియం ఇందుకు వేదిక. ఇక జనవరి 12 నాటి రెండో మ్యాచ్లో ముంబై ఆంధ్ర జట్టును ఢీకొట్టనుంది. 39 టైటిళ్లు సాధించిన ఘనత దేశవాళీ టెస్టు క్రికెట్లో ఇప్పటి వరకు జరిగిన 88 రంజీ ఎడిషన్లలో 39సార్లు విజేతగా నిలిచిన జట్టుగా ముంబైకి గొప్ప రికార్డు ఉంది. అయితే, 2014 నుంచి ఇప్పటి దాకా ఒక్కసారి కూడా చాంపియన్గా నిలవలేదన్న వెలితి అలాగే ఉండిపోయింది. గత సీజన్లో రహానే సారథ్యంలో ఆడిన ముంబై.. ఎలైట్ గ్రూప్ బిలో భాగంగా ఆడిన ఏడు మ్యాచ్లలో కేవలం మూడు మాత్రమే గెలిచింది. నాకౌట్స్కు కూడా అర్హత సాధించలేక చతికిలపడింది. అయితే, ఈసారి ఎలాగైనా ఆ అడ్డంకిని అధిగమించాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. రంజీల్లో సత్తా చాటి అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేయాలని రహానే భావిస్తున్నాడు. రంజీ ట్రోఫీ-2024 తొలి రెండు మ్యాచ్లకు ముంబై జట్టు: అజింక్య రహానె (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, శివం దూబే, సువేద్ పార్కర్, షామ్స్ ములాని, హార్దిక్ తామోర్(వికెట్ కీపర్), ప్రసాద్ పవార్(వికెట్ కీపర్), జే బిస్టా, భూపేన్ లల్వానీ, తనూష్ కొటియాన్, తుషార్ దేశ్పాండే, మోహిత్ అవస్తి, ధవళ్ కులకర్ణి, రాయ్స్టన్ డయాస్, అథర్వ అంకోలేకర్. చదవండి: కోహ్లికి బౌలింగ్ చేయడం చాలా కష్టం.. లిస్టులో సచిన్ కూడా! కానీ.. -
సచిన్ అంతటి వాడవుతాడు.. పోలికలే కొంపముంచుతున్నాయి! ఇప్పుడు..
ఓ ప్లేయర్ అద్భుతంగా ఆడుతూ ఉంటే.. ఆ క్రీడలో దిగ్గజాలతో పోలిక పెట్టి మాట్లాడుతూ విశ్లేషణలు సహజం. అయితే, కొన్నిసార్లు ఆ పోలిక వాళ్లకు చేకూర్చే మేలు కంటే.. నష్టమే ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. కొంతమంది టీమిండియా యువ క్రికెటర్ల విషయంలో ఇలాగే జరిగింది. ప్రస్తుతం.. అంతర్జాతీయ టీ20లలో రింకూ సింగ్ అదరగొడుతున్న తరుణంలో దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో అతడి ఆట తీరును పోలుస్తున్నారు విశ్లేషకులు. ధోని స్టైల్లో మ్యాచ్ ముగిస్తున్న తీరుకు ఫిదా అవుతూ నయా ఫినిషర్ వచ్చేశాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, మరికొందరు మాత్రం ఇప్పుడే ధోని వారసుడిగా ట్యాగ్ వేసి రింకూపై ఒత్తిడి పెంచొద్దనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విధ్వంసకర బ్యాటింగ్తో ప్రత్యర్థి జట్టు బౌలర్లపై విరుచుకుపడుతున్న రింకూపై ఇలాంటి ప్రశంసలు ఒత్తిడి పెంచే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. హార్దిక్ వారసుడంటూ.. గతంలో వెంకటేశ్ అయ్యర్, పృథ్వీ షా విషయంలో ఇలాంటి పోలికలు కొంపముంచాయంటూ వారి పేర్లను ఉదాహరిస్తున్నారు. కాగా ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న వెంకటేశ్ అయ్యర్.. ఐపీఎల్ 2021లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేయగలడంటూ ప్రశంసల వర్షం కురిసింది. గాయాల బెడదతో సతమతమవుతున్న పాండ్యా కెరీర్ సందిగ్దంలో పడిన సమయంలో వెంకటేశ్ అతడి వారసుడిగా భారత జట్టులో చోటు ఖాయం చేసుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జట్టులో చోటే కరువు కానీ.. పాండ్యా రీఎంట్రీ ఇచ్చి.. వైస్ కెప్టెన్ స్థాయికి ఎదిగిన తర్వాత వెంకటేశ్ అయ్యర్కు జట్టులో స్థానమే కరువైంది. గతేడాది ఫిబ్రవరిలో చివరగా వెంకటేశ్ టీమిండియా తరఫున ఆడాడు. సచిన్ అంతటి వాడవుతాడు ఇక పృథ్వీ షా.. ఈ ముంబై బ్యాటర్ దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్న సమయంలోనే దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్తో పోలిక తెచ్చారు విశ్లేషకులు. భవిష్యత్తులో కచ్చితంగా టీమిండియా ఓపెనర్గా అద్భుతాలు చేస్తాడని ఈ అండర్-19 వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్ను కొనియాడారు. తన కెప్టెన్సీలో ఆడిన వాళ్లు స్టార్లు.. అతడేమో ఇలా కానీ.. సీన్ రివర్స్ అయింది.. పృథ్వీ కెప్టెన్సీలో ఆడిన శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్ భారత జట్టులో తమ స్థానం సుస్థిరం చేసుకున్నారు. ముఖ్యంగా శుబ్మన్ ఇప్పటికే మూడు ఫార్మాట్లలో ఓపెనర్గా పాతుకుపోయి.. భావి భారత జట్టు కెప్టెన్గా, తదుపరి సూపర్స్టార్గా నీరాజనాలు అందుకుంటున్నాడు. అయితే, పృథ్వీ షాకు టీమిండియాలో ఎంట్రీ కాదు.. కనీసం ఐపీఎల్లో అయినా స్టార్ బ్యాటర్గా గుర్తింపు దక్కడం లేదు. వరుస వైఫల్యాలతో చతికిలపడ్డ పృథ్వీని గాయాలు వేధిస్తుండటంతో దెబ్బమీద దెబ్బ పడుతోంది. అతడు మళ్లీ భారత జట్టులో పునరాగమనం చేయడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. ఇప్పుడు రింకూ విషయంలో ఇలా.. ఉత్తరప్రదేశ్కు చెందిన లెఫ్టాండ్ బ్యాటర్ రింకూ సింగ్. అనేక కష్టనష్టాలకోర్చి క్రికెటర్గా తన ప్రయాణం మొదలుపెట్టాడు. కోల్కతా నైట్రైడర్స్ మేనేజ్మెంట్ దృష్టిలో పడటంతో అతడి దశ తిరిగింది. అంచెలంచెలుగా ఎదిగి టీమిండియా స్థాయికి ఇంటింటికీ సిలిండర్లు మోస్తూ తండ్రి సంపాదిస్తే.. తాను స్వీపర్గా పనిచేసేందుకు కూడా సిద్ధపడి కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించుకున్న రింకూ.. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆటను మాత్రం వీడలేదు. అంచెలంచెలుగా ఎదిగి తాజా ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో వరుసగా ఆరు సిక్సర్లు బాది కేకేఆర్ను గెలపించిన తీరు నభూతో అనిపించింది. ఈ క్రమంలో.. 2023, ఆగష్టులో ఐర్లాండ్తో టీ20 సందర్భంగా అతడు టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. నయా ఫినిషర్గా కితాబులు ప్రస్తుతం స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్తో బిజీగా ఉన్న రింకూ.. మొత్తంగా 7 మ్యాచ్లు ఆడి 216.95 స్ట్రైక్రేటుతో 128 పరుగులు సాధించాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇస్తూ జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ధోనితో పోలిక తెస్తూ రింకూ ఆట తీరును కొనియాడుతూ తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా పలువురు మాజీ క్రికెటర్లు కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే వన్డే క్రికెట్లోనూ అతడు అడుగుపెడతాడని జోస్యం చెబుతున్నారు. పోలికలు వద్దు.. మద్దతు ముఖ్యం అయితే, మరికొంత మంది మాత్రం.. రింకూను ఇప్పుడు ప్రశంసిస్తున్న వాళ్లు కష్టకాలంలో అతడికి అండగా నిలబడితే చాలని.. పోలికలకు బదులు నైతికంగా మద్దతునివ్వడం అతి ముఖ్యమని పేర్కొంటున్నారు. రింకూ ధోని స్థాయికి ఎదిగే సత్తా ఉన్నవాడే అయినా కెరీర్ ఆరంభంలోనే పోలికలు తెచ్చి అతడిపై అనవసరపు ఒత్తిడి పెంచొద్దని హితవు పలుకుతున్నారు. కాగా పటిష్ట ఆసీస్తో ఇప్పటి వరకు ఆడిన రెండు టీ20లలో రింకూ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. వరుసగా.. 22(14 బంతుల్లో), 31(9 బంతుల్లో) పరుగులు సాధించాడు. చదవండి: క్రికెటర్లు అలా ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు.. నేనైతే 2011లో: గంభీర్ -
IPL 2024: ఢిల్లీ వదిలించుకున్న ఆటగాళ్లు వీరే.. పృథ్వీ షా కొనసాగింపు
ఐపీఎల్ 2024 సీజన్కు సంబంధించి అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను (Retention), రిలీజ్ (Release) చేసే ఆటగాళ్ల జాబితాను అన్ని ఫ్రాంచైజీలు ఇవాళ (నవంబర్ 26) ప్రకటించాయి. ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తంగా 11 మందిని విడుదల చేసి, 16 మందిని కొనసాగించింది. ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే.. రోవ్మన్ పావెల్ రిలీ రొస్సో మనీష్ పాండే సర్ఫరాజ్ ఖాన్ చేతన్ సకారియా ఫిల్ సాల్ట్ ముస్తాఫిజుర్ రెహమాన్ కమలేష్ నాగర్కోటి రిపల్ పటేల్ అమన్ ఖాన్ ప్రియమ్ గార్గ్ ఢిల్లీ క్యాపిటల్స్ కొనసాగించనున్న ఆటగాళ్లు వీరే.. రిషబ్ పంత్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, పృథ్వీ షా, ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్, ప్రవీణ్ దూబే, ముఖేష్ కుమార్, యశ్ ధుల్, విక్కీ ఓస్త్వాల్, అభిషేక్ పోరెల్, అన్రిచ్ నోర్జే, లుంగి ఎంగిడి. -
IPL 2024: పృథ్వీ షాకు బిగ్ షాక్ ఇవ్వనున్న ఢిల్లీ..!
ఐపీఎల్-2024 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విధ్వంసకర ఓపెనర్ పృథ్వీ షాను విడిచిపెట్టాలని ఢిల్లీ ఫ్రాంచైజీ నిర్ణయించకున్నట్లు సమాచారం. తన ఐపీఎల్ అరంగేట్రం నుంచి ఢిల్లీ క్యాపిటల్స్కే పృథ్వీ షా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2018 సీజన్లో ఐపీఎల్లో అడుగుపెట్టిన పృథ్వీ షా.. ఢిల్లీ జట్టులో తనకంటూ ఒక ప్రత్యేక స్ధానాన్ని ఏర్పరుచుకున్నాడు. తన మొదటి మూడు సీజన్లలో పర్వాలేదన్పించిన ఈ ఢిల్లీ యువ ఓపెననర్.. ఆఖరి సీజన్లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్-2023లో 8 మ్యాచ్లు ఆడిన పృథ్వీ షా కేవలం 106 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలోనే అతడిని విడిచిపెట్టాలని ఢిల్లీ ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఐపీఎల్-2024 సీజన్కు సంబంధించిన మినీవేలం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది. ఈ వేలానికి ముందు ఐపీఎల్ ఫ్రాంచైజీలు నవంబర్ 15లోగా రిటైన్ చేసుకున్న, రిలీజ్ చేసిన ఆటగాళ్ల వివరాలను అందజేయాల్సి ఉంటుంది. చదవండి: World Cup 2023: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్.. వర్షం పడితే పరిస్థితి ఏంటి? -
టీమిండియా స్టార్ ఓపెనర్కు షాక్.. ఏకంగా 3-4 నెలల పాటు..
Huge Blow For Prithvi Shaw: టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా అభిమానులకు చేదు వార్త! ఈ ముంబై బ్యాటర్ ఏకంగా మూడు నుంచి నాలుగు నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు. కాగా ఐసీసీ అండర్-19 వరల్డ్కప్ గెలిచిన కెప్టెన్ పృథ్వీ షా.. 2018లో వెస్టిండీస్తో టెస్టు సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అరంగేట్ర మ్యాచ్లోనే అద్భుత సెంచరీ(134)తో అదరగొట్టిన షా.. రెండేళ్ల తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడ కుదిరేలా లేదని.. అక్కడికెళ్లాడు అయితే, దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికీ.. రెండేళ్ల నుంచి పృథ్వీ షాకు జట్టులో చోటే కరువైంది. ఒకవేళ టీమిండియాకు సెలక్ట్ అయినా.. తుదిజట్టులో ఆడే అవకాశం మాత్రం రావడం లేదు. ఈ క్రమంలో ఇంగ్లండ్లో క్రికెట్ ఆడేందుకు నిర్ణయించుకున్న షా.. ఇంగ్లండ్ దేశవాళీ వన్డే కప్-2023లో అద్భుతాలు చేశాడు. సెంచరీల మోత.. వెక్కిరించిన దురదృష్టం ఆఖరిగా ఆడిన రెండు మ్యాచ్లలో డబుల్ సెంచరీ(244)తో పాటు అజేయ శతకం(125- నాటౌట్)తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న సమయంలో గాయం రూపంలో షాను దురదృష్టం వెంటాడింది. జాతీయ క్రికెట్ అకాడమీలో దీంతో భారత్కు తిరిగి వచ్చిన పృథ్వీ షా.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకున్నాడు. అయితే, మోకాలి గాయం తీవ్రతరమైనందున అతడు కనీసం మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఉబ్బిపోయిన మోకాలు ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం.. ‘‘పృథ్వీ షా గాయపడిన తర్వాత ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు. ఆ తర్వాత అతడు ఎన్సీఏకు వచ్చాడు. మోకాలు పూర్తిగా ఉబ్బిపోయింది. డాక్టర్ దిన్షా పర్దీవాలా పర్యవేక్షణలో షాకు చికిత్స అవసరమని భావించాం. గరిష్టంగా ఇంకో నాలుగు నెలల పాటు అతడు క్రికెట్ ఆడే పరిస్థితి లేదు’’ అని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాతే 23 ఏళ్ల పృథ్వీ షా మోకాలికి సర్జరీ చేయాలా లేదా అన్న అంశంపై నిర్నయం తీసుకుంటామని తెలిపారు. దేశవాళీ క్రికెట్కు దూరం దీంతో.. వచ్చే నెలలో మొదలుకానున్న దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, నవంబరులో ఆరంభం కానున్న విజయ్ హజారే వన్డే టోర్నీ, జనవరిలో మొదలయ్యే రంజీ ట్రోఫీకి పృథ్వీ షా దూరం కానున్నాడు. వాళ్ల నుంచి షాకు గట్టిపోటీ కాగా ఇప్పటికే టీమిండియా ఓపెనర్గా పృథ్వీ షా ఒకప్పటి డిప్యూటీ శుబ్మన్ గిల్ స్థిరపడిపోగా.. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైశ్వాల్ రూపంలో ఈ ముంబై బ్యాటర్కు గట్టిపోటీ ఎదురవుతోంది. ఇలాంటి సమయంలో ఇంగ్లండ్లో అదరగొట్టి.. దేశవాళీ క్రికెట్లో నిరూపించుకుని.. కమ్బ్యాక్ ఇవ్వాలని భావించిన పృథ్వీ షాను విధి ఇలా వెక్కిరించింది. చదవండి: Asia Cup: ఫైనల్లో భారత్ వర్సెస్ పాక్ లేనట్లే! మూటాముల్లె సర్దుకోండి.. -
కౌంటీల్లో ఎంట్రీ ఇవ్వనున్న టీమిండియా బౌలర్.. పుజారాతో పాటు..!
విండీస్తో తాజాగా జరిగిన టెస్ట్ సిరీస్తో జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన వెరటన్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ ఇంగ్లండ్ కౌంటీల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ససెక్స్ కౌంటీ ఉనద్కత్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఆ కౌంటీ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. ఉనద్కత్.. సెప్టెంబర్లో పునఃప్రారంభంకానున్న కౌంటీ సీజన్లో తమతో జతకట్టనున్నాడని వారు పేర్కొన్నారు. ఈ స్టింక్ట్లో ఉనద్కత్ ససెక్స్ తరఫున 3 మ్యాచ్లు ఆడే అవకాశం ఉంటుంది. టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా తర్వాత ససెక్స్కు ఆడే అరుదైన అవకాశం ఉనద్కత్ దక్కింది. భారత దేశవాలీ అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగిన ఉనద్కత్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 101 మ్యాచ్లు ఆడి 382 వికెట్లు పడగొట్టాడు. ఈ ట్రాక్ రికార్డు చూసే ససెక్స్ ఉనద్కత్ను తమ జట్టులో చేర్చుకుంది. ససెక్స్కు ఆడుతున్న ఇద్దరు భారతీయ క్రికెటర్లు సౌరాష్ట్రకు చెందిన వారే కావడం విశేషం. ఇదిలా ఉంటే, ససెక్స్కు ప్రస్తుత కౌంటీ సీజన్ చెత్త సీజన్గా సాగింది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 9 మ్యాచ్లను డ్రా చేసుకుని కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. అది కూడా ఏప్రిల్లో జరిగిన తమ సీజన్ తొలి మ్యాచ్లో. మరోవైపు ఇంగ్లండ్లో ప్రస్తుతం దేశవాలీ వన్డే కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ససెక్స్ గ్రూప్-బిలో ఆఖరి నుంచి రెండో స్థానంతో చెత్త ప్రదర్శన కొనసాగిస్తుంది. అయితే ఈ టోర్నీలో ససెక్స్ ఆటగాడు పుజారా మాత్రం చెలరేగిపోయాడు. పుజారా తానాడిన 5 మ్యాచ్ల్లో 2 శతకాలు బాదాడు. ఇదే టోర్నీలో భారత యువ ఓపెనర్ పృథ్వీ షా కూడా చెలరేగిపోయాడు. ఈ సీజన్తోనే కౌంటీల్లోకి ఎంట్రీ ఇచ్చిన షా.. నార్తంప్టన్షైర్ తరఫున ఓ మెరుపు ద్విశతం, ఓ సుడిగాలి శతకం బాదాడు. అయితే షా అనూహ్యంగా గాయం బారిన పడి అర్థాంతరంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. -
భీకర ఫామ్లో ఉన్న పృథ్వీ షాకు గాయం.. అర్ధాంతరంగా నిష్క్రమణ
టీమిండియా యువ ఓపెనర్, నార్తంప్టన్షైర్ స్టార్ ఆటగాడు పృథ్వీ షా రాయల్ లండన్ వన్డే కప్-2023 నుంచి అర్థంతరంగా నిష్క్రమించాడు. ఈ టోర్నీలో విధ్వంసకర డబుల్ సెంచరీతో పాటు సుడిగాలి సెంచరీ చేసి భీకర ఫామ్లో ఉండిన షా.. డర్హమ్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. ముందుగా అనుకున్న దాని కంటే గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో షా జట్టు నుంచి వైదొలిగాడు. నార్తంప్టన్ యాజమాన్యం షాను అయిష్టంగా జట్టును నుంచి రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని ఆ జట్టు అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ఇది నిజంగా బాధాకరం.. రాయల్ లండన్ వన్డే కప్ తదుపరి మ్యాచ్లకు పృథ్వీ షా అందుబాటులో ఉండడు. డర్హమ్తో మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ షా గాయపడ్డాడు. ఈ టోర్నీలో లిడింగ్ రన్ స్కోరర్ (4 మ్యాచ్ల్లో డబుల్ సెంచరీ, సెంచరీ సాయంతో 429 పరుగులు) అయిన షా జట్టులో లేకపోవడం పూరించలేని లోటు. స్కాన్ రిపోర్ట్ల్లో షాకు తగిలిన గాయం చాలా తీవ్రమైందని తెలిసింది. షా త్వరలో లండన్లో బీసీసీఐ ఆధ్వర్యంలోని స్పెషలిస్ట్ డాక్టర్ను కలుస్తారు. అతి తక్కువ వ్యవధిలో షా నార్తంప్టన్షైర్పై తీవ్ర ప్రభావం చూపాడు అంటూ ఆ జట్టు కోచ్ జాన్ సాడ్లర్ ట్వీట్లో రాసుకొచ్చాడు. This one hurts. 😢 Prithvi Shaw has been ruled out of the remainder of his Steelbacks stint. 😔 pic.twitter.com/8XWLfrlxAY — Northamptonshire CCC (@NorthantsCCC) August 16, 2023 ఇదిలా ఉంటే, రాయల్ లండన్ వన్డే కప్-2023తో ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లోకి అడుగుపెట్టిన పృథ్వీ షా.. నార్తంప్టన్షైర్ తరఫున అరంగేట్రం చేసి తొలి రెండు మ్యాచ్ల్లో కేవలం 60 పరుగులు మాత్రమే చేశాడు. ఇక్కడి నుంచి షా సుడి తిరిగింది. ఆగస్ట్ 9న సోమర్సెట్తో జరిగిన మ్యాచ్లో విధ్వంకర ద్విశతకం (153 బంతుల్లో 244; 28 ఫోర్లు, 11 సిక్సర్లు) బాదిన షా.. ఆతర్వాత ఆగస్ట్ 13న డర్హమ్తో జరిగిన మ్యాచ్లో మెరుపు శతకం చేశాడు. ఈ మ్యాచ్లో 76 బంతులు ఎదుర్కొన్న షా.. 15 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 125 పరుగులు చేసి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. భీకర ఫామ్లో ఉండిన షా ఈ టోర్నీలో మరిన్న అద్భుతాలు చేస్తాడనుకున్న తరుణంలో అనూహ్యంగా గాయపడటంతో నార్తంప్టన్ యాజమాన్యంతోపాటు షా అభిమానులు చాలా బాధపడుతున్నారు. ఈ ప్రదర్శనలతో షా టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని అభిమానులు అనుకుంటున్న తరుణంగా గాయం షా కెరీర్ను మరో నాలుగు మెట్లు వెనక్కు వేసేలా చేసింది. ఈ పరిస్థితుల్లో భారత సెలెక్టర్లు షాను ఆసియా కప్కు కాని, వన్డే వరల్డ్కప్కు కాని పరిగణలోకి తీసుకునే పరిస్థితి లేదు. -
ఆసియా కప్, వరల్డ్కప్లలో రోహిత్కు జత ఎవరు..? కొత్తగా రేసులోకి మరో ఆటగాడు
టీమిండియాను ఓపెనర్ల సమస్య చాలా కాలంగా వేధిస్తూనే ఉంది. సచిన్-గంగూలీ, సచిన్-సెహ్వాగ్, గంభీర్-సెహ్వాగ్ల శకం ముగిసాక కొంతకాలం పాటు రోహిత్ శర్మ-శిఖర్ ధవన్ల జోడీ విజయవంతంగా సాగింది. అయితే కాలక్రమంలో ధవన్ ఫామ్ కోల్పోవడం, కేఎల్ రాహుల్ లాంటి యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో ధవన్ క్రమేనా కనుమరుగైపోయాడు. రాహుల్ అన్ని ఫార్మాట్లలో రాణించడంతో ధవన్ స్థానాన్ని ఆక్రమించాడు. అయితే ఇటీవలి కాలంలో బీసీసీఐ ఫార్మాట్కు ఓ జట్టును ప్రకటిస్తుండటం.. సిరీస్, సిరీస్కు కీలక ఆటగాళ్లను రెస్ట్ పేరుతో పక్కకు పెడుతుండటం.. రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ తరుచూ గాయాల బారిన పడుతుండటంతో ఓపెనర్ల సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఈ క్రమంలో రాహుల్కు ప్రత్యామ్నాయంగా ఐపీఎల్ హీరో శుభ్మన్ గిల్ తెరపైకి వచ్చాడు. రోహిత్కు జతగా గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడి రాహుల్ను మరిపించాడు. అయితే గిల్ ఫామ్ కూడా ఇటీవలికాలంలో ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సమస్య పునరావృతం అయ్యింది. త్వరలో ఆసియా కప్, వన్డే వరల్డ్కప్ లాంటి మెగా ఈవెంట్లు ఉండటంతో బీసీసీఐకి ఓపెనర్ల సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. సీనియర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడం, ఐపీఎల్-2023కి ముందు ఆతర్వాత జరిగిన సిరీస్ల్లో ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ లాంటి యువ ఓపెనర్లు సత్తా చాటడంతో సమస్య మరింత తీవ్రతరమైంది. దీనికి తోడు ప్రస్తుతం జరుగుతున్న రాయల్ లండన్ వన్డే కప్లో మరో యంగ్ ఓపెనర్ పృథ్వీ షా ఆకాశమే హద్దుగా చెలరేగుతుండటం (డబుల్ సెంచరీ, సెంచరీ) బీసీసీఐని మరింత ఇరకాటంలో పడేసింది. మరోవైపు వెటరన్ శిఖర్ ధవన్కు ఆఖరి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్లు కూడా తీవ్రతరమవుతుండటంతో బీసీసీఐకి ఏం చేయాలో పాలుపోక స్తబ్ధతలో ఉండిపోయింది. ప్రస్తుతం లైమ్లైట్లో ఉన్న అందరు ఓపెనర్లను పరిగణలోకి తీసుకుంటే 90 శాతం అర్హులే ఉండటంతో సెలక్టర్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఓపెనింగ్ స్థానాల కోసం రోహిత్తో పాటు మొత్తం 8 మంది (పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, శిఖర్ ధవన్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్) లైన్లో ఉన్నారు. వీరితోనే సతమతమవుతుంటే యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్, దేవ్దత్ పడిక్కల్లు మేము సైతం అంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో భారత సెలెక్టర్లు ఆసియా కప్, వన్డే వరల్డ్కప్లకు రోహిత్కు జతగా ఎవరిని ఎంపిక చేస్తారో వేచి చూడాలి. -
పృథ్వీ షా విధ్వంసకర శతకం.. డబుల్ సెంచరీ మరువక ముందే సుడిగాలి శతకం
రాయల్ లండన్ వన్డే కప్-2023లో నార్తంప్టన్షైర్ ఓపెనర్, టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా మరో సెంచరీ బాదాడు. నాలుగు రోజు కిందట (ఆగస్ట్ 9) సోమర్సెట్పై విధ్వంకర ద్విశతకం (153 బంతుల్లో 244; 28 ఫోర్లు, 11 సిక్సర్లు) బాదిన షా.. ఇవాళ (ఆగస్ట్ 13) డర్హమ్తో జరిగిన మ్యాచ్లో మెరుపు శతకం చేశాడు. ఈ మ్యాచ్లో 76 బంతులు ఎదుర్కొన్న షా.. 15 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 125 పరుగులు చేసి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన డర్హమ్ 43.2 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌట్ కాగా.. నార్తంప్టన్షైర్ 25.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. Prithvi Shaw is in red-hot form in the One-Day Cup tournament in England. pic.twitter.com/pVIQwbOewJ — CricTracker (@Cricketracker) August 13, 2023 చెలరేగిన లూక్ ప్రాక్టర్.. తొలుత బ్యాటింగ్ చేసిన డర్హమ్.. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ లూక్ ప్రాక్టర్ (9-0-34-4) ధాటికి 198 పరుగులకే కుప్పకూలింది. ప్రాక్టర్తో పాటు జేమ్స్ సేల్స్ (8-1-31-2), కియోగ్ (5.2-0-35-2), జాక్ వైట్ (10-0-49-1), కెర్రిగన్ (4-0-22-1) కూడా రాణించడంతో డర్హమ్ జట్టు పేకమేడలా కూలింది. డర్హమ్ ఇన్నింగ్స్లో ట్రెవాస్కిస్ (37), అలెక్స్ లీస్ (34), బుష్నెల్ (32), బోర్త్విక్ (20), ప్రిటోరియస్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. PRITHVI SHOW in One-day cup🔥 @PrithviShaw pic.twitter.com/GxY9uyrlUl — CricTracker (@Cricketracker) August 13, 2023 విధ్వంసకర డబుల్ సెంచరీని మరువక ముందే.. 199 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నార్తంప్టన్షైర్ను ఓపెనర్ పృథ్వీ షా మెరుపు శతకం బాది ఒంటిచేత్తో గెలిపించాడు. సోమర్సెట్పై చేసిన ద్విశతకాన్ని మరువక ముందే షా మరో మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. షాకు రాబ్ కియోగ్ (42) సహకరించగా.. ఎమిలియో గే (17), సామ్ వైట్మన్ (4), లూక్ ప్రాక్టర్ (3) విఫలమయ్యారు. డర్హమ్ బౌలర్లలో జార్జ్ డ్రిస్సెల్ 3 వికెట్లు పడగొట్టగా.. బుష్నెల్ ఓ వికెట్ తీశాడు. -
వన్డే ఫార్మాట్లో మరో డబుల్ సెంచరీ.. ఈసారి..!
రాయల్ లండన్ వన్డే కప్-2023లో నార్తంప్టన్షైర్ ఓపెనర్, టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా చేసిన విధ్వంకర ద్విశతకం (153 బంతుల్లో 244; 28 ఫోర్లు, 11 సిక్సర్లు) మరువక ముందే మరో డబుల్ సెంచరీ నమోదైంది. సోమర్సెట్తో ఇవాళ (ఆగస్ట్ 13) జరుగుతున్న మ్యాచ్లో గ్లోసెస్టర్షైర్ కెప్టెన్ జేమ్స్ బ్రేసీ అజేయ డబుల్ సెంచరీతో (151 బంతుల్లో 224 నాటౌట్; 30 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. బ్రేసీతో పాటు మరో ఓపెనర్ క్రిస్ డెంట్ (38 బంతుల్లో 65; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), ఓలివర్ ప్రైస్ (83 బంతుల్లో 77; 8 ఫోర్లు, సిక్స్), ఆఖర్లో గ్రేమ్ వాన్ బుర్రెన్ (12 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో గ్లోసెస్టర్షైర్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 454 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. సోమర్సెట్ బౌలర్లలో లాంగ్రిడ్జ్, జార్జ్ థామస్, షోయబ్ బషీర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ టోర్నీలో డబుల్ సెంచరీలు నమోదైన రెండు సందర్భాల్లో ప్రత్యర్ధి సోమర్సెటే కావడం విశేషం. నార్తంప్టన్షైర్తో మ్యాచ్లో పృథ్వీ షా, గ్లోసెస్టర్షైర్తో జరుగుతున్న మ్యాచ్లో జేమ్స్ బ్రేసీ సోమర్సెట్ బౌలర్లను ఆడుకున్నారు. ఈ మ్యాచ్లో సోమర్సెట్ బౌలర్లందరూ 9కిపైగా యావరేజ్తో పరుగులు సమర్పించుకున్నారు. లాంగ్రిడ్జ్ను (8 ఓవర్లలో 5 పరుగులు) అయితే బ్రేసీ, బుర్రెన్ ఊచకోత కోశారు. లిస్ట్-ఏ క్రికెట్లో ఏడో అత్యధిక స్కోర్.. లిస్ట్-ఏ క్రికెట్లో (అంతర్జాతీయ, దేశవాలీ వన్డేలు) ఏడో అత్యధిక స్కోర్ నమోదైంది. సోమర్సెట్తో జరుగుతున్న మ్యాచ్లో గ్లోసెస్టర్షైర్ రికార్డు స్థాయిలో 454 పరుగులు స్కోర్ చేసింది. ఈ ఫార్మాట్లో అత్యధిక స్కోర్ రికార్డు తమిళనాడు పేరిట ఉంది. 2022లో అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో తమిళనాడు జట్టు రికార్డు స్థాయిలో 506 పరుగులు చేసింది. లిస్ట్-ఏ క్రికెట్లో ఓ జట్టు 500 పరుగుల మార్కును దాటడం ఇదే మొదటిసారి. దీని తర్వాత అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. 2022లో నెదార్లండ్స్తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ టీమ్ 498 పరుగులు స్కోర్ చేసింది. పదో అత్యధిక వ్యక్తిగత స్కోర్.. లిస్ట్-ఏ క్రికెట్లో పదో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదైంది. సోమర్సెట్తో జరుగుతున్న మ్యాచ్లో గ్లోసెస్టర్షైర్ ఆటగాడు జేమ్స్ బ్రేసీ (151 బంతుల్లో 224 నాటౌట్; 30 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ తమిళనాడు ఆటగాడు ఎన్ జగదీశన్ (277) పేరిట ఉంది. అతని తర్వాత అలిస్టర్ బ్రౌన్ (268), రోహిత్ శర్మ (264), షార్ట్ (257), శిఖర్ ధవన్ (248),పృథ్వీ షా (244), మార్టిన్ గప్తిల్ (237), ట్రవిస్ హెడ్ (230), డంక్ (229), పృథ్వీ షా (227) ఉన్నారు. -
పృథ్వీ షా సునామీ ఇన్నింగ్స్.. 129 బంతుల్లో డబుల్ సెంచరీ! కానీ...
Prithvi Shaw Slams Double Century- Fans Reacts- లండన్: ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో తొలిసారి ఆడుతున్న భారత క్రికెటర్ పృథ్వీ షా దేశవాళీ వన్డే కప్లో డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. సోమర్సెట్తో బుధవారం జరిగిన వన్డే మ్యాచ్లో నార్తంప్టన్షైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 23 ఏళ్ల పృథ్వీ షా విధ్వంసకర ఇన్నింగ్స్తో మెరిశాడు. 153 బంతులు ఆడిన పృథ్వీ షా 28 ఫోర్లు, 11 సిక్స్లతో 244 పరుగులు సాధించి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో అవుటయ్యాడు. పృథ్వీ షా అసాధారణ బ్యాటింగ్తో మొదట బ్యాటింగ్కు దిగిన నార్తంప్టన్షైర్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 415 పరుగులు సాధించింది. అనంతరం సోమర్సెట్ జట్టు 45.1 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌటై 87 పరుగుల తేడాతో ఓడిపోయింది. రికార్డుల పృథ్వీ నార్తంప్టన్షైర్ జట్టు తరఫున మూడో మ్యాచ్ ఆడిన పృథ్వీ షా 81 బంతుల్లో సెంచరీ చేయగా... డబుల్ సెంచరీని 129 బంతుల్లో దాటాడు. ముంబైకి చెందిన పృథ్వీ షాకిది లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో (దేశవాళీ, అంతర్జాతీయ వన్డేలు) రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం. లిస్ట్ ‘ఎ’లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ల లిస్టులో మాత్రం.. జాబితాలో పృథ్వీ షాది ఆరో స్థానం. ఈ జాబితాలో తమిళనాడు క్రికెటర్ నారాయణ్ జగదీశన్ (277; అరుణాచల్ప్రదేశ్పై 2022లో) టాప్ ర్యాంక్లో ఉన్నాడు. అప్పటి నుంచి నో ఛాన్స్! 2021లో భారత దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పుదుచ్చేరిపై పృథ్వీ షా 227 పరుగులతో అజేయంగా నిలిచాడు. 2021 జూలైలో చివరిసారి శ్రీలంక పర్యటనలో భారత జట్టుకు ఆడిన పృథ్వీ షా ఆ తర్వాత ఫామ్ కోల్పోయి జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఇక తాజాగా ఇంగ్లండ్లో అతడు బ్యాట్ ఝులిపించడంతో టీమిండియా సెలక్టర్లను ఉద్దేశించి అభిమానులు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మన వాళ్ల ప్రతిభను మనం గుర్తించకపోతే ఇదిగో ఇలాగే పక్క దేశాల్లో ఆడుకుంటారంటూ ఫైర్ అవుతున్నారు. ఇకనైనా పృథ్వీ వంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. చదవండి: మా కెప్టెన్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు.. అదే నా మెదడును తొలిచేసింది! అందుకే.. ✅ Sixth-highest score in List A history ✅ Second-highest List A score in 🏴 ✅ Highest-ever List A score for @NorthantsCCC @PrithviShaw with one of the all-time great knocks 👑#MBODC23 pic.twitter.com/NfXH7RHfqk — Metro Bank One Day Cup (@onedaycup) August 9, 2023 -
పేట్రేగిపోయిన పృథ్వీ షా.. భారీ ద్విశతకం, 28 ఫోర్లు, 11 సిక్సర్లతో విధ్వంసం
టీమిండియా యంగ్ ఓపెనర్, ముంబై ఆటగాడు పృథ్వీ షా ఇంగ్లండ్ దేశవాలీ వన్డే టోర్నీ (లిస్ట్-ఏ క్రికెట్), మెట్రో బ్యాంక్ వన్డే కప్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సోమర్సెట్తో ఇవాళ (ఆగస్ట్ 9) జరిగిన మ్యాచ్లో భారీ ద్విశతం (153 బంతుల్లో 244; 28 ఫోర్లు, 11 సిక్సర్లు) బాది ఆల్టైమ్ రికార్డులు బద్దలుకొట్టాడు. ఫలితంగా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న నార్తంప్టన్షైర్ తొలుత బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 415 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. ✅ Sixth-highest score in List A history ✅ Second-highest List A score in 🏴 ✅ Highest-ever List A score for @NorthantsCCC @PrithviShaw with one of the all-time great knocks 👑#MBODC23 pic.twitter.com/NfXH7RHfqk — Metro Bank One Day Cup (@onedaycup) August 9, 2023 ఓపెనర్గా బరిలోకి దిగిన షా డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించగా.. సామ్ వైట్మ్యాన్ (54), రికార్డో వాస్కో (47), ఎమిలియో గే (30) రాణించారు. సోమర్ సెట్ బౌలర్లలో జాక్ బ్రూక్స్ 3 వికెట్లు పడగొట్టగా.. డానీ లాంబ్ 2, షోయబ్ బషీర్, జార్జ్ థామస్ తలో వికెట్ దక్కించుకున్నారు. షా విధ్వంసం ధాటికి సోమర్సెట్ బౌలర్లంతా ఊచకోతకు గురయ్యారు. ప్రతి బౌలర్ దాదాపు 9 రన్రేట్తో పరుగులు సమర్పించుకున్నాడు. 🚨 PRITHVI SHAW HAS 200! 🚨#MBODC23 pic.twitter.com/GeVYVD3o6z — Metro Bank One Day Cup (@onedaycup) August 9, 2023 పృథ్వీ షా డబుల్ సెంచరీ విశేషాలు.. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్ల్లో కలిపి 60 పరుగులు చేసిన పృథ్వీ షా.. ఇంగ్లండ్ డొమెస్టిక్ క్రికెట్లో తన మూడో అప్పియరెన్స్లోనే డబుల్ సెంచరీ బాదాడు. ఇదే టోర్నీతో షా ఇంగ్లండ్ డొమెస్టిక్ సర్క్యూట్లోకి అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్లో 153 బంతులను ఎదుర్కొన్న షా 28 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 244 పరుగులు చేసి, ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అలాగే ఈ టోర్నీ డబుల్ సెంచరీ చేసిన మూడో ఆటగాడిగానూ రికార్డుల్లోకెక్కాడు. ఈ టోర్నీ చరిత్రలో డబుల్ సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 129 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసిన షా.. ఇంగ్లండ్ లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో డబుల్ సెంచరీతో చెలరేగిన షా.. ఇంగ్లండ్ లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు చతేశ్వర్ పుజారా (174) పేరిట ఉంది. లిస్ట్-ఏ చరిత్రలో ఆరో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఇంగ్లండ్ లిస్ట్-ఏ క్రికెట్లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నార్తంప్టన్షైర్ తరఫున హైయెస్ట్ లిస్ట్-ఏ స్కోర్ ఇంగ్లండ్ లిస్ట్-ఏ క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడు లిస్ట్-ఏ క్రికెట్లో రెండు వేర్వేరు దేశాల్లో డబుల్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడు. భారత దేశవాలీ వన్డే టోర్నీలోనూ షా ఓ డబుల్ సెంచరీ చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో రోహిత్ శర్మ (3) తర్వాత అత్యధిక డబుల్ సెంచరీలు (2) 100 on the shirt, 100 on the scoreboard 💯 Prithvi Shaw goes full @nassercricket with his celebration! #MBODC23 pic.twitter.com/5UJLbrF2uQ — Metro Bank One Day Cup (@onedaycup) August 9, 2023 Highest List A individual score for Prithvi Shaw. He surpassed his previous best 227*pic.twitter.com/fI783vh7JH — Don Cricket 🏏 (@doncricket_) August 9, 2023 Prithvi Shaw in 2023: Scored his maiden triple hundred - 379 in 383 balls in the Ranji Trophy. Scored 244 in 153 balls in the Royal London One Day Cup. pic.twitter.com/QhG2tOyaWk — Mufaddal Vohra (@mufaddal_vohra) August 9, 2023 -
సెంచరీతో కదం తొక్కిన పుజారా.. తేలిపోయిన పృథ్వీ షా
2021-23 డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన టీమిండియా టెస్ట్ బ్యాటర్, నయా వాల్ చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ దేశవాలీ వన్డే కప్లో సెంచరీతో కదం తొక్కాడు. టోర్నీలో భాగంగా నార్తంప్టన్షైర్తో నిన్న (ఆగస్ట్ 6) జరిగిన మ్యాచ్లో అజేయ శతకంతో (119 బంతుల్లో 106 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిశాడు. టీమిండియాలో చోటు కోల్పోయాక కసితో రగిలిపోతున్న పుజారా.. తన తాజా ఇన్నింగ్స్తో భారత సెలెక్టర్లకు సవాలు విసిరాడు. ఈ మ్యాచ్లో పుజారా ఇన్నింగ్స్ సాగిన తీరు పై పేర్కొన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. పుజారా సెంచరీతో చెలరేగినా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న ససెక్స్ ఓటమిపాలవ్వడం కొసమెరుపు. Great to have you back, @cheteshwar1! 🙌 Century 💯 pic.twitter.com/k7SfSu59si — Sussex Cricket (@SussexCCC) August 6, 2023 వర్షం కారణంగా 45 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ససెక్స్.. పుజారా శతకొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ససెక్స్ ఇన్నింగ్స్లో పుజారా మినహా ఎవరూ రాణించలేదు. కెప్టెన్ టామ్ హెయిన్స్ (13), జేమ్స్ కోల్స్ (29), హడ్సన్ (14), ఒలివర్ కార్టర్ (21), జాక్ కార్సన్ (17), హెన్రీ క్రొకోంబ్ (14 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. నార్తంప్టన్షైర్ బౌలర్లలో జాక్ వైట్ 3, ప్రాక్టర్, కియోగ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. వరుసగా రెండో మ్యాచ్లోనూ తేలిపోయిన పృధ్వీ షా.. గ్లోసెస్టర్షైర్తో జరిగిన మ్యాచ్తో ఇంగ్లండ్ దేశవాలీ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన భారత యువ ఓపెనర్ పృథ్వీ షా.. ఈ టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. గ్లోసెస్టర్తో మ్యాచ్లో 35 బంతుల్లో 34 పరుగులు చేసి విచిత్ర రీతిలో ఔటైన (హిట్ వికెట్) షా.. తాజాగా ససెక్స్తో జరిగిన తన రెండో మ్యాచ్లోనూ తక్కువ స్కోర్కే (17 బంతుల్లో 26; 4 ఫోర్లు) పరిమితమయ్యాడు. ఈ రెండు ఇన్నింగ్స్ల్లో షాకు మంచి ఆరంభమే లభించినా, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. షా భారీ స్కోర్ చేయకపోయినా, మిగతా వారు రాణించడంతో అతని జట్టు విజయం సాధించింది. ససెక్స్తో మ్యాచ్లో 241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నార్తంప్టన్షైర్.. మరో 8 బంతులు మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. నార్తంప్టన్షైర్ ఆటగాళ్లు తలో చేయి వేసి తమ జట్టును గెలిపించుకున్నారు. షాతో పాటు రికార్డో (37), సామ్ వైట్మ్యాన్ (30), రాబ్ కియోగ్ (22), లూక్ ప్రాక్టర్ (10), లెవిస్ మెక్మానస్ (36) రెండంకెల స్కోర్లు చేయగా.. టామ్ టేలర్ (42 నాటౌట్), జస్టిన్ బ్రాడ్ (22 నాటౌట్) నార్తంప్టన్షైర్ను విజయతీరాలకు చేర్చారు. ససెక్స్ బౌలర్లలో కర్రీ, కార్సన్ చెరో 2 వికెట్లు, క్రొకోంబ్, హడ్సన్, జేమ్స్ కోల్స్ తలో వికెట్ దక్కించుకున్నారు.
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
గురజాల ఎమ్మెల్యే అభ్యర్ధి కాసు మహేష్రెడ్డి
ప్రజల నమ్మకం జగనన్న
బెస్ట్ రెసిడెన్షియల్ కాలనీగా తీర్చిదిద్దుతాం
జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందాం
పూర్తయిన పోస్టల్ బ్యాలెట్ రీ పోలింగ్
ఈసారి కూడా గెలుపు నాదే
పరిశీలకులు పరిమళసింగ్ సూచన
మాజీ ఎంపీ మోదుగులకు మాతృవియోగం
పోలీస్ వాహనానికి తప్పిన ప్రమాదం
జగనన్నతోనే సంక్షేమం, అభివృద్ధి
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement