-
ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు ఊరట
ఢిల్లీ, సాక్షి: ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఆయన్ని సీఎం పదవి నుంచి తొలగించాలని ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అయితే.. ఢిల్లీ హైకోర్టు గురువారం ఆ పిల్ను కొట్టేసింది. కేజ్రీవాల్ను సీఎంగా తొలగించలేమని.. అలాగే జైలు నుంచి కేజ్రీవాల్ పాలన నడిపించడాన్ని కూడా తాము అడ్డుకోలేమని ఉన్నత న్యాయస్థానం పిటిషనర్కు తెలిపింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ మన్మోహన్(తాత్కాలిక), జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా నేతృత్వంలోని ధ్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఆర్థిక కుంభకోణంలో నేరారోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి సీఎం పదవిలో కొనసాగేందుకు అనర్హుడంటూ ఢిల్లీకి చెందిన రైతు, సామాజిక వేత్త సుర్జిత్సింగ్ యాదవ్ ఈ పిటిషన్ వేశారు. -
ప్రభుత్వం ఘనతలను చెప్పుకోవడంలో తప్పేముంది?
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో అధికారులు పాల్గొనకుండా, ప్రభుత్వ నిధులు ఖర్చు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం తన ఘనతలను ప్రజలకు చెప్పుకోవడంలో తప్పేముందని పిటిషనర్ను ప్రశ్నించింది. సంక్షేమ పథకాలను ప్రభుత్వ యంత్రాంగం ద్వారా వివరించడంలో తప్పేమీ లేదంది. ఏ ప్రభుత్వమైనా ఇదే చేస్తుందని వ్యాఖ్యానించింది. ఇది ప్రచారం మాత్రమే కాదని, ప్రజలకు సమాచారం అందించడం కూడా అని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోజూ వాటి ఘనతల గురించి పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇస్తున్నా యంది. తాము (హైకోర్టు) కూడా ప్రజల కోసం అమలు చేస్తున్న పథకాలను బుక్లెట్ రూపంలో న్యాయ సేవాధికార సంస్థ ద్వారా వివరిస్తున్నామంది. ఇందుకు ప్రభుత్వసాయం కూడా తీసుకుంటున్నామని చెప్పింది. ‘రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి’ కార్యక్రమంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగుదేశం పార్టీ మద్దతుతో పిల్ ‘రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి’ కార్యక్రమాన్ని అడ్డుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ మద్దతుతో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. జర్నలిస్ట్ కట్టెపోగు వెంకయ్య దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాదులు నర్రా శ్రీనివాసరావు, పీవీజీ ఉమేష్ చంద్ర వాదనలు వినిపిస్తూ, ఈ కార్యక్రమాన్ని మొదట అధికార పార్టీ కార్యక్రమంగా చేపట్టారన్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్మీట్లో కూడా చెప్పారన్నారు. ఆ తరువాత ప్రభుత్వ కార్యక్రమంగా మార్చారని, వాలంటీర్లను, అధికారులను భాగస్వాములను చేశారన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ బుక్లెట్లు ముద్రించి వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయిస్తున్నారన్నారు. ఇందుకోసం రూ.20 కోట్లు విడుదల చేశారని చెప్పారు. వాలంటీర్లు అధికార పార్టీ జెండాలను ఎగురవేస్తున్నారని, ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం ఇదంతా చేస్తోందన్నారు. పత్రికా కథనాలను పరిగణనలోకి తీసుకోవద్దని సుప్రీంకోర్టు చెప్పింది ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఇందులో తప్పేముందని ప్రశ్నించింది. వాలంటీర్లు జెండాలు ఎగురవేస్తున్నారనడానికి ఆధారాలు ఏమున్నాయని అడిగింది. పత్రికల్లో కథనాలు వచ్చాయని నర్రా శ్రీనివాసరావు చెప్పగా.. వాటిని పరిగణనలోకి తీసుకోబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఉమేష్ చంద్ర స్పందిస్తూ.. పత్రికా కథనాలను హైకోర్టులు సుమోటో పిల్గా పరిగణిస్తూ విచారణ జరుపుతున్నాయన్నారు. విచారణ సందర్భంగా పత్రికా కథనాలను పరిగణనలోకి తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఇటీవల చాలా స్పష్టంగా చెప్పిందని సీజే స్పష్టం చేశారు. రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి వంటి కార్యక్రమాల్లో అధికారులు పాల్గొనడం కేంద్ర సివిల్ సర్వీసెస్ రూల్స్కు విరుద్ధమని శ్రీనివాసరావు అనగా.. ఆ రూల్స్ ఐఏఎస్లకే వర్తిస్తాయని, మిగిలిన వారికి కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. సంక్షేమ పథకాలను అధికారుల ద్వారా ప్రచారం చేయడంలో తప్పేముందని ప్రశ్నించింది. తన స్వరాష్ట్రం జమ్మూ కాశ్మీర్లో కూడా ఇలాగే చేశారని సీజే జస్టిస్ ఠాకూర్ వివరించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) మహేశ్వర్రెడ్డి స్పందిస్తూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. -
తవ్వి తలకు పోసుకుందామా?
పిచ్చి కుదిరింది... తలకు రోకలి చుట్టమన్నాడట! చరిత్ర పేరుచెప్పి, దేశంలో ప్రతి ఊరి పేరు, వీధి పేరు, స్థలం పేరూ మార్చేయాలని చూస్తున్న వేలంవెర్రిని గమనిస్తే, ఆ నానుడి గుర్తుకొస్తుంది. సర్వోన్నత న్యాయస్థానానికి సైతం అదే గుర్తొచ్చింది. ఆ మాటనే పస లేని పిటిషన్తో వచ్చిన ఫిర్యాదీతో సహా పదుగురికీ మరో పద్ధతిలో గుర్తూ చేసింది. ‘ఆటవిక విదేశీ దురాక్రమణదారులు మార్చిన’ చారిత్రక ప్రదేశాల ‘అసలు’ పేర్లను పునరుద్ధరించడానికి ఒక కమిషన్ను ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ బీజేపీ నేత అశ్వినీ ఉపాధ్యాయ్ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సోమవారం సుప్రీమ్ కోర్ట్ కొట్టేసింది. జస్టిస్ జోసెఫ్, నాగరత్నల ధర్మాసనం పిటిషనర్ అత్యు త్సాహాన్ని తప్పుబట్టింది. భారత్ పదేపదే దాడులకు గురైంది నిజమే. విదేశీయులు మనల్ని పాలించినదీ నిజమే. దాన్ని గుర్తిస్తూనే, ‘సమాజంలో విభేదాల’ సృష్టికి ‘చరిత్రను కొంతమేరకే తవ్వి తలకుపోస్తున్న’ ప్రయత్నాలను సుప్రీమ్ నిరసించడం సరైన సమయంలో వెలువడింది. చరిత్ర పట్ల ఏదో నిర్ణీత దృక్పథం పెట్టుకొని, తదనుగుణంగా ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర దేశాన్ని గత చరిత్రలో బందీని చేయరాదంటూ పిటిషనర్కు కోర్ట్ హితవు చెప్పాల్సి వచ్చింది. వర్తమాన భారతావనిలో పరిష్కరించాల్సిన అనేక అంశాలుండగా, ఈ పేర్ల మార్పిడినే అజెండాగా పాలకులు, వారి భావజాల దాసులు తలకెత్తుకోవడం విచిత్రం. తాజాగా మహారాష్ట్రలో మొఘల్ పాలకులు ఔరంగజేబ్, మీర్ ఉస్మాన్ అలీఖాన్ పేర్ల మీద వెలసిన నగరాలైన ఔరంగాబాద్ను ఛత్రపతి శంభాజీ నగర్గా, ఉస్మానాబాద్ను ధారాశివ్గా ఆ రాష్ట్ర పాలకులు మార్చేశారు. గత వారమే కేంద్రం దానికి రాజముద్రా వేసింది. ఇప్పుడిక అహ్మద్నగర్ను రాణి అహిల్యాదేవి హోల్కర్ పేరిట మార్చాలన్న డిమాండ్ ఊపందుకుంది. సరిగ్గా అదే రోజున పేర్ల మార్పిడిపై సుప్రీమ్ చేసిన ఈ వ్యాఖ్యలు కళ్ళు తెరిపించేలా ఉన్నాయి. ఆత్మశోధనకు ప్రేరేపిస్తున్నాయి. పేరులో ఏముంది పెన్నిధి అన్నారు పెద్దలు. కానీ, పేరులోనే అంతా ఉంది, ఒక వర్గం పాల కులు వచ్చి మన పేర్లు మార్చేశారంటూ రాగద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేయడం నేటి వికృత ధోరణి. పాత పేర్లను మార్చడం ద్వారా సమాజంలో ఒక వర్గం ఏకీకృతమై, తమ వైపు మొగ్గేలా చేసుకోవాలన్న వ్యూహం దేశ రాజకీయాల్లో ఇటీవల ప్రబలుతోంది. ఇది ప్రమాదకరం. ఈ నేపథ్యంలో ‘నేను క్రైస్తవుణ్ణి. అయితేనేం, నాకు హిందూయిజమూ ఇష్టం. ఎంతో గొప్పదైన హిందూ ధర్మాన్ని తక్కువ చేయకూడదు’ అని జస్టిస్ జోసెఫ్ వ్యాఖ్యానించడం విశేషం. మన దేశానికి పునాదులుగా నిలిచిన సహనం, సౌభ్రాతృత్వం, భిన్నత్వం, సమ్మిళితత్వాలకు ఒక రకంగా ఇది పునరుద్ఘాటన. భిన్నత్వంలో ఏకత్వానికి ఘనత వహించిన గడ్డపై ఒక విధమైన భావజాలమే ఉండాలనీ, ఈ దేశాన్ని పాలించిన విభిన్న వర్గీయులంతా వట్టి ‘దురాక్రమణదారులు, విదేశీ దోపిడీదారులు’ అనీ ప్రచారం చేస్తే మూర్ఖత్వమే. అన్ని పేర్లూ మార్చి, అన్ని ముఖాలకూ సున్నం కొట్టి ఒకే ఉనికిని ధ్రువపరచాలనుకోవడం సాంస్కృతిక, భావజాల సామ్రాజ్యవాదమే తప్ప సమానత్వం కానేరదు. గద్దె మీది పెద్దలైనా, సమాజంలోని ఇతరులైనా ఈ ఉన్మాదాన్ని పెంచిపోషిస్తే, సామరస్యం దెబ్బతింటుంది. ఎవరైనా చేయాల్సింది మెరుగైన ప్రజాజీవనానికి తోడ్పడేలా విధానపరమైన మార్పులు తప్ప, ఒకరిపై మరొకరిని ఉసిగొలిపే పేరు మార్పులు కాదు. పాత గాయాలను కెలికి, ప్రజల్లో విభేదాలు సృష్టించే ఇలాంటి చర్యలను న్యాయవ్యవస్థే కాదు... బుద్ధిజీవులతో పాటు రాజకీయ సారథులూ నిర్ద్వంద్వంగా ఖండించాలి. అయితే, అధికారం చేపట్టిన ప్రతి పార్టీ ఇదే పేర్ల మార్పిడి తప్పు చేస్తోంది. గతంలో కాంగ్రెస్ దేశ రాజధానిలోని ప్రసిద్ధ కన్నాట్ ప్లేస్ను రాజీవ్ చౌక్గా, కన్నాట్ సర్కిల్ను ఇందిరా చౌక్గా పేర్లు మార్చింది. రెండు తడవలుగా కేంద్రంలో చక్రం తిప్పుతున్న బీజేపీ గడచిన కొన్ని నెలల్లో ఎన్ని పేర్లు మార్చిందో లెక్కే లేదు. బ్రిటీషు, మొఘల్ పాలకుల గతాన్ని వదిలించుకోవడానికంటూ కొత్త పేర్ల కథను సమర్థించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. వర్తమానమే వివాదాలమయం అయినప్పుడు గతం అందుకు భిన్నంగా ఉండే అవకాశం లేదు. వివాదాలు నిండిన ఆ గతాన్ని పట్టుకొని వేలాడి, ఆగతాన్ని వదిలేసి, నవ నామ్నీకరణలకు దిగితే... కాలహరణమే తప్ప ప్రజానీకానికి పైసా ప్రయోజనం లేదు. దాని బదులు పాలనపై శ్రద్ధపెట్టి, అందమైన భవిష్యత్తు దిశగా అడుగులు వేయడం ఇప్పుడు ముఖ్యం. ప్రస్తుత పాలకులు రాజ్పథ్ను కర్తవ్యపథ్ అన్నా, మొఘల్ గార్డెన్స్ను అమృతోద్యానంగా మార్చినా, ఢిల్లీలోని ఔరంగ్జేబ్ రోడ్, యూపీలోని అలహాబాద్, మొఘల్ సరాయ్లకు కొత్త పేర్లు పెట్టినా సామాన్యుల జీవితమేమైనా మారిందా? చరిత్రను భూతంగా, ఒక వర్గం పాలకులనంతా పీడకులుగా, హిందువులు తప్ప మిగతా అందరూ ‘బయటివాళ్ళు’, ‘దోపిడీదొంగలు’గా అసత్య చిత్రణ వల్ల లాభం ఎవరికి? ఈ మిడిమిడి వాట్సప్ జ్ఞానంతో, మధ్యతరగతిని రెచ్చగొట్టే భావోద్వేగ రాజకీయ విన్యాసంతో ఓట్లు, సీట్ల లెక్కల్లో తాత్కాలిక ప్రయోజనం సిద్ధించవచ్చు. కానీ, స్వార్థంతో నాటుతున్న నేటి ఈ విషబీజాలు రేపటి సమాజాన్ని చీలుస్తుంటే ఆ శాశ్వత ప్రమాదానికి బాధ్యు లెవరు? కులమత విభేదాలకు అతీతమైన నవ భారత నిర్మాణాన్ని నిజంగా స్వప్నించేవారెవరూ ఈ పని చేయరు. పాలకుల స్వప్రయోజనాలతో రోజుకో రకం చరిత్ర చదివితే, అసలు కథ మరుగునపడే దుఃస్థితి దేశానికి దాపురిస్తుంది. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడడమంటే ఇదే! -
ఎంబీబీఎస్ ప్రవేశాల్లో ఎన్సీసీ రిజర్వేషన్కు పిల్
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో ఎన్సీసీ విద్యార్థులకు 1 శాతం రిజర్వేషన్ను అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని, డాక్టర్ వైఎస్సార్ వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, వైఎస్సార్ వైద్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్, ఎన్సీసీ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2022–23 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో ఎన్సీసీ సర్టిఫికెట్లను అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఫెడరేషన్ అధ్యక్షుడు జె.లక్ష్మీనరసయ్య నర్సింహ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. నిబంధనల ప్రకారం ఎన్సీసీ విద్యార్థులకు 1 శాతం రిజర్వేషన్ అమలు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది కవిత గొట్టిపాటి వాదనలు వినిపిస్తూ.. ఎన్సీసీ కోటా విషయంలో అధికారులు ప్రభుత్వ జీవో ప్రకారం నడుచుకోవడం లేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. బాధిత విద్యార్థులు వస్తే ఈ వ్యవహారంపై తగిన విధంగా స్పందిస్తామని తెలిపింది. ఇది సర్వీసు వివాదమని, ఇలాంటి వ్యవహారంలో పిల్ దాఖలు చేయడం ఏమిటని ప్రశ్నించింది. అయినా కూడా ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపింది. కవిత జోక్యం చేసుకుంటూ.. ప్రవేశాలు జరుగుతున్నాయని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. పిటిషన్ను కొట్టేయకుండా ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపింది. నోటీసులు జారీ చేస్తే సమస్య పరిష్కారమవుతుందన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నామని పేర్కొంది. -
రుషికొండ తవ్వకాలపై సర్వే
సాక్షి, అమరావతి: విశాఖలోని రుషికొండ రిసార్ట్ పునరుద్ధరణ పనుల్లో భాగంగా చేపట్టిన తవ్వకాల విషయంలో సర్వే నిర్వహించి నివేదిక ఇవ్వాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ(ఎంవోఈఎఫ్)ను హైకోర్టు గురువారం ఆదేశించింది. ఇందుకోసం బాధ్యతాయుతమైన అధికారి నేతృత్వంలో ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. రిసార్ట్ పునరుద్ధరణ ప్రాజెక్టు పనుల పురోగతి వివరాలతో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)ను ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజుల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ దాఖలు చేసిన వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. రాజకీయ ప్రయోజన వ్యాజ్యాలు... ఏపీఎండీసీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రాజెక్టు పనుల్లో భాగంగా తొలగించిన చెట్ల స్థానంలో కొత్తవి నాటుతున్నామని, అది భారీ స్థాయిలో చేపట్టామని వివరించారు. ఈ వ్యాజ్యాలు దాఖలు చేసిన పిటిషనర్లు రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులన్నారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాల్లో పిటిషనర్ల చిత్తశుద్ధి, నిజాయితీని చూడాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ దురుద్దేశాలతో ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ పిల్ దాఖలు చేసే ప్రతి వ్యక్తి ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలం గానే ఉంటారని వ్యాఖ్యానించింది. పిటిషనర్ మూర్తి యాదవ్ తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్
కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి
నర్రెడ్డి నాటకాలు చాలు
థ్యాంక్స్ టూ మనీష్ మల్హోత్రా.. సమ్మర్ 2024 స్పెషల్ డిజైన్స్ (ఫొటోలు)
సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
టీ20 వరల్డ్కప్ 2024 కోసం మరో జట్టు ప్రకటన
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్
‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
హైదరాబాద్లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్!
తప్పక చదవండి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement