-
‘శ్రీ రాముడి’ కోసం రణ్బీర్ దిమ్మదిరిగే వర్కవుట్..వైరల్ వీడియో
చాక్లెట్ బాయ్గా బాలీవుడ్లో అడుగుపెట్టి.. నటుడుగా తానేంటో నిరూపించుకున్నాడు హీరో రణ్బీర్ కపూర్. ‘యానిమల్ మూవీతో టాలెండెట్ హీరోగా తెలుగు ఆడియెన్స్కు దగ్గరయ్యాడు. తాజాగా రానున్న మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘రామాయణం’ కోసం రణ్బీర్ కపూర్ తీవ్ర కసరత్తు చేస్తున్నాడు. శ్రీరాముడి పాత్ర కోసం జిమ్లో తెగ కష్టపడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు నెట్టింట వైరల్గా మారింది. రణ్బీర్ పెర్సనల్ ట్రైనర్ నామ్ వర్కౌట్ వీడియోను షేర్ చేశాడు. స్విమ్మింగ్ రన్నింగ్, బైక్ రైడింగ్.. జిమ్ బాల్, కెటిల్బెల్స్, జిమ్ రోప్లతో వర్క్అవుట్లు ఈ వీడియోలో చూడొచ్చు. ప్రశాంతంగా గ్రామీణ ప్రాంతంలో ట్రెక్కింగ్, బైక్ రైడింగ్, బరువులు ఎత్తడం లాంటి కీలకమైన ఎక్సర్సైజ్లు చేస్తుండటం గమనార్హం. రణ్బీర్ సతీమణి, హీరోయిన్ అలియా భట్, కూతురు రాహా కూడా ఉందంటూ ఫ్యాన్స్ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Training With Nam (@trainingwithnam) ఏ ప్రాతకోసమైనా పాత్రకు తగ్గట్టు ఒదిగిపోయేలా తీవ్ర కసరత్తులు చేయడం రణబీర్కు అలవాటు. అలా ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులకు మరింత దగ్గర య్యాడు. తాజా ఆయన వర్కవుట్స్ చూసి ఆయనఅంకితభావం అలాంటిది అంటూ ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంతో రానున్న 'రామాయణం' మూవీలో రణబీర్ కపూర్ రాముడిగా అలరించ నున్నాడు. గత ఏడాది రికార్డు కలెక్షన్స్ రాబట్టిన యానిమల్ మూవీ కోసం కూడా రణ్బీర్ భారీగా కండలు పెండిన సంగతి తెలిసిందే. -
ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఫోటోలు లీక్.. స్టార్ డైరెక్టర్ కఠిన నిర్ణయం!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న చిత్రం రామాయణం. ఈ సినిమాకు తెలుగు వర్షన్ సంభాషణలు రాసే బాధ్యతను చిత్ర బృందం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్కు అప్పగించినట్లు సమాచారం. ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి , రావణుడిగా కేజీఎఫ్ స్టార్ యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్ప్రీత్సింగ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. పార్ట్-2 వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. గోరేగావ్ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా వైరలయ్యాయి. గత రెండు రోజులుగా షూటింగ్ విజువల్స్ విస్తృతంగా బయటకొచ్చాయి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న మూవీ ఫోటోలు నెట్టిం లీక్ అవ్వడంతో దర్శకుడు నితీష్ తివారీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నారని బీ టౌన్లో టాక్ వినిపిస్తోంది. ఇక నుంచి షూటింగ్ సెట్స్లో నో ఫోన్ పాలసీని అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇటీవల సోషల్ మీడియాలో లీకైన చిత్రాలలో కైకేయిగా లారా దత్తా, దశరథ్గా అరుణ్ గోవిల్ కనిపించారు. దీంతో ఆగ్రహానికి గురైన నితీశ్.. నో-ఫోన్ విధానం అమలు చేయనున్నారు. చిత్రీకరణ సమయంలో అదనపు సిబ్బంది సెట్కు దూరంగా ఉండాలని ఆదేశించారు. కేవలం సన్నివేశంలో పాల్గొనే నటీనటులు, సాంకేతిక నిపుణులు మాత్రమే సెట్లోకి అనుమతించబడతారు. కాగా.. రామాయణం కోసం రూ.11 కోట్లతో సెట్ను నిర్మించారు. త్వరలోనే రణ్బీర్ కపూర్, సాయి పల్లవి సెట్స్లో జాయిన్ కానున్నారు. యష్ జూలైలో షూటింగ్లో పాల్గొననున్నారు. Ramayana set 😻💥#RanbirKapoor #niteshtiwari pic.twitter.com/SuUzwwjyUX — Ranbir Kapoor 👑❤️ (@Khushali_rk) April 3, 2024 Shoot for The BIGGEST movie of Indian Cinema - RAMAYANA has started. 💥 Casting is already looking 🔥, I have high hopes from this one directed by very talented Nitish Tiwari 🤞#ArunGovil #LaraDutta #Ramayana #RanbirKapoor #Yash #SaiPallavi #Ramayan 🚩 pic.twitter.com/HAmguvmmFc — αbhι¹⁸ (@CricCineHub) April 4, 2024 -
ఖరీదైన కారు కొనుగోలు చేసిన స్టార్ హీరో.. ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ గతేడాది యానిమల్ చిత్రంతో బ్లాక్బస్టర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో రణ్బీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించింది. అంతే కాకుండా మరో బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రీ కీలక పాత్రలో కనిపించింది. అయితే తాజాగా రణ్బీర్ కపూర్ ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ యానిమల్ హీరో దాదాపు రూ.8 కోట్ల విలువైన కొత్త బెంట్లీ కాంటినెంటల్ కారును కొనుగోలు చేశారు. ఈ లగ్జరీ కారులో ముంబైలోని తన నివాసానికి వెళ్తూ కెమెరాలకు చిక్కారు. కాగా.. గతేడాది సైతం బెల్గ్రేవియా గ్రీన్ ఎక్స్టీరియర్స్తో కూడిన అత్యంత ఖరీదైన రేంజ్ రోవర్ను కొనుగోలు చేశాడు. ఇదిలా ఉంటే బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ను రణ్బీర్ కపూర్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ రాహా కపూర్ అనే కూతురు జన్మించారు. ఇటీవలే తమ కూతురి కోసం దాదాపు రూ.250 కోట్లతో ఇంటిని నిర్మించి ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే అత్యంత పిన్న వయసులోనే కోట్ల ఆస్తులున్న స్టార్ కిడ్గా రికార్డ్ సృష్టించనుంది. కాగా.. ప్రస్తుతం రణ్బీర్ కపూర్.. నితీష్ తివారీ తెరకెక్కించనున్న రామాయణంలో నటించనున్నారు. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
బాలీవుడ్లో రిచెస్ట్ స్టార్ కిడ్.. ఏకంగా షారుక్, అమితాబ్ను మించి!
గతేడాది యానిమల్ మూవీతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన హీరో రణ్బీర్ కపూర్. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించింది. అయితే రణ్బీర్ కపూర్ బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు రాహా కపూర్ అనే ముద్దుల కూతుకు కూడా ఉన్నారు. అయితే ఈ జంట తమ ముద్దుల కూతురి ఖరీదైన గిఫ్ట్ను ఇచ్చినట్లు బీటౌన్లో టాక్ వినిపిస్తోంది. ఓ నివేదిక ప్రకారం లగ్జరీ బంగ్లాను నిర్మించి ఇవ్వనున్నట్లు సమాచారం. అది పూర్తయితే ముంబైలోనే అత్యంత ఖరీదైన బంగ్లాగా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఈ బంగ్లా నిర్మాణానికి దాదాపు రూ.250 కోట్లకు పైగానే ఖర్చు చేయనున్నారు. ఇది పూర్తయితే షారుక్ ఖాన్ మన్నత్, అమితాబ్ బచ్చన్ జల్సా బంగ్లాలతో పోలిస్తే అత్యంత ఖరీదైన సౌధంగా నిలవనుంది. రిచెస్ట్ స్టార్ కిడ్.. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఓ బంగ్లాలో బాలీవుడ్ జంట రణ్ బీర్ కపూర్, అలియా భట్తోపాటు నీతూ కపూర్ కలిసి కనిపించారు. ఆ బంగ్లాకు రణ్ బీర్ తన కుమార్తె రాహా కపూర్ పేరు పెట్టనున్నట్లు సమాచారం. దీంతో ఏడాది వయసులోనే రాహా కపూర్ బాలీవుడ్లో అత్యంత పిన్న వయసులో ధనవంతురాలిగా గుర్తింపు దక్కించుకోనుంది. రణ్బీర్, ఆలియా తమ కూతురి కోసం సమానంగా పెట్టుబడి పెడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో పాటు వీరికి ముంబైలో నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయి. వాటి విలువ రూ. 60 కోట్లకు పైగానే ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్గా మారింది. ఈ బంగ్లాకు రాహా నానమ్మ నీతూ కపూర్ సహ-యజమానిగా ఉంటారని తెలుస్తోంది. ఆమె ఇటీవల బాంద్రా ప్రాంతంలోనే రూ.15 కోట్ల విలువైన విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసింది. బంగ్లా పూర్తయిన తరువాత నీతూ కపూర్తో సహా ఫ్యామిలీ మొత్తం ఇదే బంగ్లాలో ఉండనున్నారని సమాచారం. అలియా, రణ్ బీర్, రాహా ప్రస్తుతం వస్తు అనే ప్రాంతంలో ఉంటున్నారు. -
ఓటీటీలో యానిమల్.. ఆ రెండు సూపర్ హిట్ సినిమాలను దాటేసింది!
సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం యానిమల్. రణ్బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. గతడాది డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం రూ.900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ కలెక్షన్స్పై ఎలాంటి ప్రభావం చూపలేదు. అయితే గతనెలలో ఓటీటీకి వచ్చేసిన యానిమల్.. అదే జోరుతో దూసుకెళ్తోంది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కు వచ్చింది. రిలీజైన మొదటి మూడు రోజుల్లోనే టాప్ టైన్లో ట్రెండింగ్లోకి వచ్చేసింది. అంతే కాకుండా మొదటి వారంలోనే ప్రభాస్ సలార్ మూవీని వెనక్కి నెట్టి రికార్డును బ్రేక్ చేసింది. తాజాగా మరో రికార్డ్ను తన ఖాతాలో వేసుకుంది యానిమల్. రెండోవారంలో ఏకంగా టాప్-1 ప్లేస్లో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం సలార్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. యానిమల్ మూవీకి మొదటి 10 రోజుల్లోనే ఏకంగా ఏకంగా 3.93 కోట్ల గంటల వ్యూయర్షిప్ నమోదు చేసింది. ఇప్పటికే ఆల్ టైమ్ అత్యధిక వ్యూయర్షిప్ సాధించిన ఇండియన్ సినిమాగా యానిమల్ నిలిచింది. ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేక్ ఆర్ఆర్ఆర్ మూవీ గతంలో తొలి 10 రోజుల్లో అత్యధిక వ్యూయర్షిప్ సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఆ మూవీకి 2.55 కోట్ల గంటల వ్యూయర్షిప్ వచ్చింది. గతేడాది షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీకి కూడా ఇదే స్థాయిలో నమోదైంది. తాజాగా ఈ రికార్డ్ను యానిమల్ అధిగమించింది. ఆర్ఆర్ఆర్, జవాన్ సినిమాల కంటే చాలా ఎక్కువ వ్యూయర్షిప్ను యానిమల్ సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో నెట్ఫ్లిక్స్ లో రిలీజైన ఏ సినిమాకూ ఈ స్థాయిలో ఆదరణ లభించలేదు. -
యానిమల్పై మండిపడ్డ స్టార్ హీరోయిన్.. ఆ విషయంలో నేనైతే!
సినీ ఇండస్ట్రీలో డేరింగ్ హీరోయిన్ ఎవరంటే తాప్సీనే. తనకు నచ్చకపోయినా.. తనకు తోచింది ఏదైనా బయటకు చెప్పే మనస్తత్వం ఆమెది. టాలీవుడ్లో ‘ఝుమ్మంది నాదం’తో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ తాప్సీ.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత బాలీవుడ్లో అడుగుపెట్టి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే గతంలో తెలుగు దర్శకులపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. తాజాగా నటి రష్మిక మందన్నను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఏకంగా బాలీవుడ్లో వసూళ్ల వర్షం కురిపించిన యానిమల్ చిత్రంపై విమర్శించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా తాప్సీ సైతం తనదైన శైలిలో యానిమల్ చిత్రంపై విమర్శలు చేశారు. తానైతే ఈ చిత్రంలో నటించేదాన్ని కాదని పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులకు ఒక పవర్ ఉంటుందని.. అదే విధంగా సమాజంపై బాధ్యత ఉంటుందని అన్నారు. అలాగని యానిమల్ తరహా చిత్రాల్లో నటించే.. ఇతర తారలు ఇలాంటివీ పట్టించుకుంటే బాగుంటుందని తాను చెప్పలేనన్నారు. అది వారి వ్యక్తిగత విషయమని తాప్సీ పేర్కొన్నారు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని, నచ్చింది చేసే హక్కు అందరికీ ఉంటుందన్నారు. అయితే తానైతే యానిమల్ చిత్రంలో నటించడానికి సమ్మతించేదాన్ని కాదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కాగా.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించి చిత్రం యానిమల్. అర్జున్రెడ్డి ఫేమ్ సందీప్రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అయినప్పటికీ ఈ చిత్రంపై విమర్శలు సైతం అదేస్థాయిలో వచ్చాయి. మహిళల పట్ల హింసాత్మక సంఘటనలు, వ్యతిరేక సన్నివేశాలు ఉన్నాయంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నటి రాధికా శరత్కుమార్ యానిమల్ అసలు చిత్రమే కాదంటూ తీసి పారేశారు. ప్రముఖ గాయకుడు శ్రీనివాస్ ఆది జంతువుల కోసం తీసిన చిత్రం అని పేర్కొన్నారు. -
ఓటీటీలో యానిమల్.. నెట్ఫ్లిక్స్పై నెటిజన్స్ ఫైర్.. ఎందుకంటే?
ఓటీటీ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న చిత్రం 'యానిమల్'. ఈ సినిమా గణతంత్రం దినోత్సవం రోజునే ఓటీటీలోకి వచ్చేసింది. రిపబ్లిక్ డే కానుకగా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, దక్షిణాది భాషల్లో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చేసింది. సినీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తెగ చూసేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబరు 1న థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే అంతే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంది. అయితే తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రంపై నెటిజన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. నెట్ఫ్లిక్స్ నుంచి ఈ సినిమాను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ట్విటర్ ద్వారా నెటిజన్స్ అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకిలా యానిమల్ చిత్రంపై వ్యతిరేకత వస్తోంది? దీని వెనుక ఉన్న కారణాలేంటో ఓసారి తెలుసుకుందాం. అయితే ఈ చిత్రంపై థియేటర్లో రిలీజ్ అయినప్పటి నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. స్త్రీలను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు సైతం తప్పుపట్టారు. ఈ సినిమా స్త్రీల పట్ల ద్వేషాన్ని పెంపొందించేలా ఉందంటూ పలు సందర్భాల్లో విమర్శించారు. తాజాగా ఓటీటీలో రిలీజ్ కాగా.. ఈ సినిమా చూసిన నెటిజన్స్ మేకర్స్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చిత్రాలను ఎలా ప్రసారం చేస్తారని నెట్ఫ్లిక్స్ను ప్రశ్నిస్తున్నారు. తక్షణమే ఓటీటీ నుంచి యానిమల్ను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒక నెటిజన్ తన ట్వీట్లో రాస్తూ.. "నేను యానిమల్ చిత్రం చూసి కలత చెందా. ఈ సినిమా భారతీయ మహిళలను కించపరిచేలా ఉంది. ఇది భారతీయ వివాహా బంధాలపై వ్యతిరేక ప్రభావం చూపుతోంది. మన సంప్రదాయం, వారసత్వం ప్రకారం ఒక వ్యక్తికి ఒకే భార్య అన్న భావనకు భంగం కలిగిస్తోంది. దయచేసి ఇలాంటి సినిమాపై చర్యలు తీసుకోండి.' అంటూ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా నయనతార నటించిన అన్నపూరణి చిత్రం నెట్ఫ్లిక్స్ తొలగించిన విషయాన్ని నెటిజన్స్ గుర్తు చేస్తున్నారు. మరో నెటిజన్స్ రాస్తూ..'దయచేసి నెట్ఫ్లిక్స్ నుంచి యానిమల్ సినిమాని తీసేయండి. ఇది మహిళలపై ఘోరమైన హింసను ప్రతిబింబిస్తోంది. దీన్ని ఎంటర్టైన్మెంట్ అని ఎవరూ పిలవరు" అంటూ మండిపడ్డారు. కాగా.. గతంలో భారత ప్రముఖ గేయ రచయిత, ఐదు జాతీయ అవార్డుల విన్నర్ అయిన జావేద్ అక్తర్ యానిమల్ సినిమాపై పరోక్షంగా కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. యానిమల్లో రణబీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, ట్రిప్తీ డిమ్రీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. Remove annapoorani @NetflixIndia but promotes Misogyny and hatred. And you ma'am @NayantharaU have apologized to these vadakans. Shame on Netflix #AnimalOnNetflix #Animal https://t.co/ouKElRp1G7 — Andrew (@Noob_Diablo) January 28, 2024 Lol good one, I watched Annaporani wondering what was so offensive in the movie that Netflix removed it. It is an average movie just like Animal. It came to my mind that, why didn't @netflix remove Animal as well which has hurt sentiments of women. — Kushel Giriraj (@g_kushel) January 27, 2024 Hello @NetflixIndia @annamalai_k I’m an Indian Hindu woman disturbed by the movie Animal which shows an Indian man having affairs outside marriage. Cultural heritage what makes India & this movie disturbs the “one man one wife” concept of this country. Plz take action. — Ana De Friesmass 2.0 (@ka_fries2366) January 27, 2024 @NetflixIndia @netflix please remove Hindi movie ANIMAL from Netflix, it reflects gore violence and abuse against women, this isn’t called entertainment — JaganN (@JaganJ80470849) January 26, 2024 -
Animal OTT Release: నేడు అర్థరాత్రి నుంచి ఓటీటీలోకి 'యానిమల్'
బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ నటించిన సూపర్హిట్ మూవీ 'యానిమల్'. సందీప్ రెండ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తండ్రీ-కుమారుల సెంటిమెంట్తో గతేడాదిలో వచ్చిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. యానిమల్ సినిమా ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందని ఎదురు చూసిన ప్రేక్షకులకు తాజగా నెట్ఫ్లిక్స్ ఒక టీజర్ విడుదల చేసి ఫ్యాన్స్కు గుడ్న్యూస్ చెప్పింది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీ నుంచి హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో యానిమల్ చిత్రం ఉంటుందని నెట్ఫ్లిక్స్ తెలిపింది. ఈమేరకు చిన్న గ్లింప్స్ వదిలింది. అయితే ఈ వీడియో చివర్లో 'రూ.199 చెల్లించి చూడండి' అని సూచించింది. అంటే ఇది నెలవారీ సబ్స్క్రిప్షన్ వివరాలా? లేదంటే అద్దె పద్ధతిలో మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు హింటిచ్చిందా? అన్నది అర్థం కాక నెటిజన్లు అయోమయానికి లోనవుతున్నారు. యానిమల్ రన్టైమ్ 3:21 గంటలు కానీ ఓటీటీ కోసం అదనపు సీన్లు యాడ్ చేస్తున్నట్లు చిత్ర టీమ్ తెలిపింది. దీంతో ఈ సినిమా మూడున్నర గంటల నిడివి ఉండనుంది. 'యానిమల్ పార్క్' టైటిల్తో ఈ చిత్రానికి సీక్వెల్ను నిర్మిస్తున్నట్లు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఓటీటీకి యానిమల్.. ఆ రోజే రిలీజ్?
బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన సూపర్హిట్ మూవీ 'యానిమల్'. సందీప్ రెండ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తండ్రీ-కుమారుల సెంటిమెంట్తో గతేడాదిలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. అయితే ఈ చిత్రం అంతేస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. స్త్రీలను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ పలువురు ఈ చిత్రాన్ని తప్పుబట్టారు. అయితే బాక్సాఫీస్ సూపర్హిట్గా నిలిచిన ఈ మూవీ ఓటీటీకి రిలీజ్పై సస్పెన్ష్ కొనసాగుతోంది. ఈ చిత్రాన్ని జనవరి 26న ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ఊహించని విధంగా యానిమల్ మూవీపై వివాదం తలెత్తింది. ఓటీటీ రిలీజ్ను నిలిపివేయాలని కోర్టులో దావా వేసింది చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకరైన సినీ1 స్టూడియోస్. దీంతో రిపబ్లిక్ డే రోజున ఓటీటీ రిలీజ్పై సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది. (ఇది చదవండి: చెంపదెబ్బ వల్ల చాలా గట్టిగా ఏడ్చేశాను: హీరోయిన్ రష్మిక) అసలేం జరిగిందంటే.. కాగా.. యానిమల్ చిత్రాన్ని టి-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా కలిసి తెరకెక్కించాయి. ఇందులో సినీ1 స్టూడియోస్ 'యానిమల్' ఓటీటీ రిలీజ్ను నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. యానిమల్ శాటిలైట్ హక్కుల విషయంలో సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, క్లూవర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలతో ఒప్పందం జరిగితే.. వారి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా తనకు చెందలేదని సినీ1 స్టూడియోస్ ఆరోపిస్తూ కోర్టులో దావా వేసింది. దీంతో నెట్ఫ్లిక్స్తో పాటు చిత్ర నిర్మాణ సంస్థలకు కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో జనవరి 22న ఈ వివాదంపై విచారణ జరిగింది. వివాదం తొలగినట్లే..! ఈ అంశంపై ఈ నెల 22న ఢిల్లీ న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ విచారణకు హాజరైన సినీ1 స్టూడియోస్, టీ సిరీస్ సంయుక్తంగా ఓ అవగాహన ఒప్పందానికి ఓకే చెప్పినట్లు ఇరు పక్షాల తరపున సీనియర్ న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఈ ఒప్పందాన్ని కోర్టుకు సమర్పించేందుకు అంగీకరించారు. వారి మధ్య అవగాహన ఒప్పందం కుదరడంతో యానిమల్ ఓటీటీ రిలీజ్కు మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసును మరోసారి జనవరి 24న విచారించనున్నారు. కాగా.. ఈ సినిమాను ఓటీటీలో 3 గంటల 29 నిమిషాల రన్టైమ్ ఉండనుంది. థియేటర్ వర్షన్కు అదనంగా మరో 8 నుంచి 10 నిమిషాల పాటు సీన్స్ అదనంగా చేర్చారు. -
అలియా భట్ ప్రొత్సాహంతోనే ఆ సన్నివేశాల్లో నటించా : రణ్బీర్ కపూర్
ఈ మధ్య కాలంలో సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు కామన్ అయిపోయాయి. ముద్దు సీన్స్ లేని సినిమాలు చాలా అంటే చాలా రేర్గా వస్తున్నాయి. అయితే కొన్ని సినిమాల్లో కథ డిమాండ్ మేరకు అలాంటి సన్నివేశాలను పెడితే..మరికొన్ని సినిమాల్లో మసాల యాడ్ చేస్తేనే టికెట్లు తెగుతాయనే ఉద్దేశంతో శృంగార సన్నివేశాలను ఇరికిస్తున్నారు. ప్రేక్షకులు అయితే ఇంటిమేట్ సన్నివేశాలను లైట్ తీసుకొని, సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. (చదవండి: ఆ హీరో సడన్గా దగ్గరకు వచ్చి వింతగా ప్రవర్తించాడు: భాగ్యశ్రీ) ఇటీవల ఇంటిమేట్ సన్నివేశాలపై చర్చ జరిగిన ఏకైక సినిమా యానిమల్ మాత్రమే. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. మోతాదుకు మించిన ఇంటిమేట్ సన్నివేశాలు ఉన్నప్పటికీ..అన్ని ప్రాంతాల ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించారు. అలాంటి సన్నివేశాలే సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి కూడా. అయితే ఇంటిమేట్, హింసాత్మక సన్నివేశాల్లో నటించినప్పుడు హీరో రణ్బీర్ కపూర్ చాలా అసౌకర్యంగా ఫీలయ్యారట. కెరీర్ పరంగా చెడ్డ పేరు వస్తుందని భయపడ్డాడట. కానీ భార్య అలియా భట్ మాత్రం చాలా ఎంకరేజ్ చేసిందట. ఆమె ప్రోత్సాహంతోనే ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించానని రణ్బీర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. (చదవండి: ‘తొలిప్రేమ’లో పవన్ చెల్లెలు.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?) ‘ఒక నటుడిగా నాకుంటూ కొన్ని హద్దులు ఉన్నాయి. వాటిని దాటాలని ఎప్పుడూ అనుకోలేదు. దర్శకుడు సందీప్ వంగా యానిమల్ కథ చెబుతూ.. ఇంటిమేట్, హింసాత్మక సన్నివేశాలు ఇలా ఉంటాయని చెప్పారు. నేను చాలా భయపడ్డాను. కొన్ని సన్నివేశాల్లో నటించాల్సి వచ్చినప్పుడు ఇలా చేయాలా? వద్దా? అనే డైలమాలో పడేవాడిని. కానీ నా భార్య అలియా భట్ చాలా సపోర్ట్గా నిలిచింది. ‘సినిమా కోసమే చేస్తున్నావు. ఇది కేవలం పాత్ర మాత్రమే’ అంటూ ధైర్యం చెప్పింది. సినిమాకు సంబంధించిన ప్రతి సన్నివేశాన్ని ఆమెతో చర్చించేవాడిని. ఈ సినిమా విషయంలో తను నాకెంతో అండగా నిలిచింది’అని రణ్బీర్ చెప్పారు. యానిమల్ విషయానికొస్తే.. ‘అర్జున్ రెడ్డి’ఫేమ్ సందీప్ వంగా తెరకెక్కించిన మూడో చిత్రమిది. రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటించారు. తండ్రీకొడుకుల సెంటిమెంట్తో రూపొందిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 1న విడుదలై ఘన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి..రణ్బీర్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. దీనికి కొనసాగింపుగా ‘యానిమల్ పార్క్’ రానుంది. -
యానిమల్ వివాదం.. రచయితకు గడ్డి పెట్టిన మేకర్స్!
రణ్బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్. డిసెంబర్ 1న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేర్ చేసింది. దాదాపు రూ.800 కోట్ల పైగా వసూళ్లు సాధించి బ్లాక్బస్టర్గా నిలిచింది. అయితే ఈ మూవీ ఎంత హిట్ అయిందో.. అంతేస్థాయిలో విమర్శలకు గురైంది. ఆర్జీవీ లాంటి సంచలన డైరెక్టర్ ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. కానీ కొందరు మాత్రం సమాజంలో స్త్రీలను తక్కువ చేసి చూపేలా ఉందంటూ పలువురు మండిపడ్డారు. త తాజాగా యానిమల్ చిత్రంపై ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సినిమాలు భారీ విజయాలు సాధించడానికి కారణమైన ప్రేక్షకులను ఆయన తప్పుబట్టారు. ఐదు జాతీయ అవార్డుల విన్నర్ అయిన జావేద్ అక్తర్ యానిమల్పై పరోక్షంగా కామెంట్స్ చేశారు. జావేద్ అక్తర్ మాట్లాడుతూ.. ఒక చిత్రంలో ఒక పురుషుడు.. స్త్రీని తన షూ నాకమని అడిగితే.. మరోక చిత్రంలో ఒక స్త్రీ ఆ హీరోను చెంపదెబ్బ కొడుతుంది. ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అర్థం కావడం లేదని జావేద్ అక్తర్ అభిప్రాయపడ్డారు. ఇదీ ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఇది సమాజానికి ఎంతో ప్రమాదకరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ వివాదంపై యానిమల్ చిత్రబృందం స్పందించింది. జావేద్ అక్తర్ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. ట్వీట్లో రాస్తూ..'జోయా, రణ్వీర్ మధ్య జరిగిన ద్రోహాన్ని రచయిత అర్థం చేసుకోలేకపోతే.. మీ కళ అంతా ఒక పెద్ద అబద్ధం. ఒక స్త్రీని ప్రేమ పేరుతో ఒక వ్యక్తి మోసం చేస్తే నా షూ నాకండి అని అనవచ్చు. అప్పుడు మీరు దానిని స్త్రీవాదం అనే పేరుతో గొప్పగా చెప్పుకుంటారు. లింగ భేదమనే రాజకీయాల్లో ప్రేమకు విముక్తి కల్పించండి. అప్పడే వారిని ప్రేమికులు అంటారు. ప్రియురాలు మోసం చేసి.. అతనికి అబద్ధం చెప్పింది. అందుకే ప్రియుడు షూ నాకమని అన్నాడు' అంటూ రిప్లై ఇచ్చింది. అయితే యానిమల్ చిత్రంలో త్రిప్తి డిమ్రీని ఉద్దేశించి.. రణ్బీర్ కపూర్ ఈ విధంగా డైలాగ్ చెప్పారు. యానిమల్ చిత్రంలో రణబీర్ కపూర్, త్రిప్తి డిమ్రీ మధ్య ఈ సీన్ జరుగుతుంది. రణబీర్ కనుచూపుతో తన షూ నాకమని త్రిప్తి డిమ్రీకి చెప్పుతాడు. మరొకటి షాహిద్ కపూర్, కియారా అద్వానీ నటించిన కబీర్ సింగ్ చిత్రంలోనిది అందులో హీరోను కియారా చెంపదెబ్బ కొడుతుంది. మరొక సీన్లో హీరోయిన్పై బూతు పదాన్ని ఉపయోగిస్తూ హీరో చెంపదెబ్బ కొడుతాడు. ఇదే చిత్రం తెలుగులో అర్జున్రెడ్డిగా వచ్చిన విషయం తెలిసిందే. జావేద్ అక్తర్ టార్గెట్ చేసిన ఈ రెండు చిత్రాలను కూడా డైరెక్ట్ చేసింది సందీప్రెడ్డి వంగానే. Writer of your calibre cannot understand the betrayal of a lover (Between Zoya & Ranvijay) then all your art form is big FALSE 🙃 & If a woman (betrayed and fooled by a man in the name of love) would have said "lick my shoe" then you guys would have celebrated it by calling it… — Animal The Film (@AnimalTheFilm) January 7, 2024 -
సందీప్ రెడ్డి యానిమల్.. ఆ సీన్ కూడా కాపీనేనా?
రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన చిత్రం ‘యానిమల్’. డిసెంబర్ 1న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. ఈ మూవీపై మొదట చాలామంది విమర్శలొచ్చాయి. అయితే విమర్శలతో పాటు ప్రశంసలు కూడా అదేస్థాయిలో వచ్చాయి. అయితే ఈ చిత్రంలో ఫైట్ సీన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. (ఇది చదవండి: 'యానిమల్' సినిమా చూసి నా కూతురు ఏడ్చేసింది.. కాంగ్రెస్ ఎంపీ ఫైర్) అయితే తాజాగా బాబీ డియోల్, రణ్బీర్ కపూర్ క్లైమాక్స్ ఫైట్ సీన్పై కాపీ విమర్శలు వైరలవుతున్నాయి. 2001లో వచ్చిన ఆషిక్ మూవీలోని సీన్ను కాపీ కొట్టారంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఆషిక్ మూవీ వీడియోను షేర్ చేసిన ఓ నెటిజన్ ఫన్నీ కామెంట్ చేశాడు. నేను పొరపాటున రాంగ్ యానిమల్ మూవీ సీన్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అయితే ఆషిక్ చిత్రంలో బాబీ డియోల్ హీరోగా నటించారు. అయితే గతంలోనూ యానిమల్పై కాపీ ఆరోపణలు వచ్చాయి. యానిమల్ ట్రైలర్ను విడుదలైన వెంటనే హువా మైన్ పాటలో రష్మిక, రణబీర్ ఫ్లైట్ సీన్ను 50 షేడ్స్ ఆఫ్ గ్రే చిత్రం కాపీ కొట్టారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. అంతే కాకుండా మరో ఫైట్ సీక్వెన్స్ కొరియన్ చిత్రం నుండి కాపీ చేశారంటూ విమర్శించిన సంగతి తెలిసిందే. ఎన్ని విమర్శలు ఎదురైనా ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా బాక్సాఫీస్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో అనిల్ కపూర్, త్రిప్తి డిమ్రీ, శక్తి కపూర్, సురేష్ ఒబెరాయ్, ప్రేమ్ చోప్రా బాలీవుడ్ తారలు నటించారు. #Animal#AnimalReview #AnimalMovie #RanbirKapoor𓃵 #SandeepReddyVanga Ranbir and Bobby Fight Scene Glimpse 🔥🔥🔥🔥 pic.twitter.com/ylMpVhIZov — ASHISH kushwaha (@ASHISHk18033956) December 2, 2023 -
యానిమల్ మూవీ ఎవరెవరో సాంగ్
-
2023లో ఉత్తమ చిత్రం యానిమల్: స్టార్ డైరెక్టర్ ప్రశంసలు
రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం 'యానిమల్'. గతేడాది డిసెంబర్ 1న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం విడుదలై నెల రోజులవుతున్నా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ సైతం ఈ చిత్రానికి ఫిదా అయ్యారు. తాజాగా ఈ మూవీపై ఇప్పటికీ మరో డైరెక్టర్ కరణ్ జోహార్ ప్రశంసలు కురిపించారు. 2023లో తాను చూసిన వాటిలో యానిమల్ బెస్ట్ మూవీ అంటూ కితాబిచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కరణ్ జోహార్ యానిమల్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. చాలామంది నా వద్దకు వచ్చి నువ్వు రాకీ ఔర్ రాణి సినిమా తీశారు కదా.. అది యానిమల్ వంటి చిత్రానికి టీకా లాంటిదేనా అని ప్రశ్నించారు. దీనిపై కరణ్ స్పందిస్తూ..'నేను మీతో విభేదించలేను. ఎందుకంటే యానిమల్ 2023లో నా ఉత్తమ చిత్రంగా నేను భావిస్తున్నాను. ఈ ప్రకటన చేయడానికి నాకు కొంత సమయం పట్టింది. కానీ ఇలా చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే మన చుట్టు ప్రజలు ఉన్నప్పుడు.. మనం చెప్పే తీర్పు గురించి భయం ఉంటుందని చెప్పారు. అంతే కాకుండా యానిమల్ మూవీని తాను రెండుసార్లు చూశానని అన్నారు. మొదట ఆ సినిమాను ఒక ప్రేక్షకుడిగా.. రెండోసారి సినిమాను అధ్యయనం చేసేందుకు చూసినట్లు తెలిపారు. సినిమా సక్సెస్ని గేమ్ చేంజర్గా అభివర్ణించారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతోపాటు రాణీ ముఖర్జీ, తాప్సీ పన్నులాంటి వాళ్లు పాల్గొన్న రౌండ్ టేబుల్ మీట్లో కరణ్ ఇలాంటి కామెంట్స్ చేశారు. యానిమల్ చూసి తాను కంటతడి పెట్టినట్లు తెలిపాడు. ఈ మూవీ సక్సెస్ సందీప్ రెడ్డి వంగా ఎంచుకున్న కథపై నమ్మకమే ప్రధాన కారణమని కరణ్ జోహార్ ప్రశంసించారు. సినిమా క్లైమాక్స్ గురించి కరణ్ మాట్లాడుతూ..'చివర్లో రణబీర్ కపూర్, బాబీ డియోల్ ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. వెనుక ఆ సాంగ్ వస్తుంటుంది. ఆ సమయంలో నా కళ్లలో నీళ్లు తిరిగాయి. అక్కడంతా రక్తమే కనిపించింది. అప్పుడు నాకనిపించింది ఏంటంటే.. నాలో ఏదైనా లోపం ఉండాలి.. లేదంటే అతనిలో అయినా ఉండాలి. కానీ ఆ సీన్ సినిమాకు చాలా అవసరం. సందీప్ సినిమా చూసి నా దిమ్మదిరిగిపోయింది' అని అన్నారు. బంధాలను, సంప్రాదాయలను పక్కన పెట్టి తీసిన సినిమా యానిమల్ అని.. అందుకే తనకు నచ్చిందని అన్నారు. ఈ చిత్రంలో అనిల్ కపూర్,త్రిప్తి డిమ్రీ కీలకపాత్రల్లో కనిపించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 850 కోట్ల మార్క్ను దాటేసింది. -
Alia-Ranbir: ముద్దుల కూతురిని పరిచయం చేసిన స్టార్ కపుల్!
బాలీవుడ్ స్టార్ జంట ఆలియా భట్, రణ్బీర్కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. బ్రహ్మాస్త్ర చిత్రంలో జంటగా కనిపించిన వీరిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. గతేడాది ఏప్రిల్ 14న పెళ్లిబంధంతో ఒక్కటైన ఈ స్టార్ కపుల్కు రాహా అనే కూతురు జన్మించింది. అయితే ఇప్పటివరకు తమ గారాల పట్టి మొహాన్ని అభిమానులకు పరిచయం లేదు. తాజాగా క్రిస్మస్ సెలబ్రేషన్స్లో పాల్గొన్న ఈ జంట ఎట్టకేలకు తమ కూతురి మొహాన్ని ఫ్యాన్స్కు పరిచయం చేశారు. తమ ఇంటి వద్దకు విచ్చేసిన మీడియా ప్రతినిధులకను పలకరిస్తూ కుమార్తెతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. రాహా చాలా క్యూట్గా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఫ్యాన్స్ అచ్చం రణ్బీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ లానే ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. రణ్బీర్ కపూర్ ఇటీవలే యానిమల్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మరోవైపు అలియాభట్ రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ, హార్ట్ ఆఫ్ స్టోన్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. Rishi kapoor + Raj kapoor + Ranbir kapoor genes won for me😭♥️ https://t.co/0mX7C4xwAL — Susmita✨ (@SSusmita0319) December 25, 2023 Raha baby dito assemble of rishi kapoor 💏 God bless her#RanbirKapoor pic.twitter.com/Q0gY0AQ14S — r (@rajkbest) December 25, 2023 Raha is so beautiful , so elegant just looking like a Wow❤️🔥 Glimpse of Rishi Kapoor😍#AliaBhatt#RanbirKapoor#rahakapoorpic.twitter.com/ZxXiEKARwe — India's Elon Musk (@EshhanMusk) December 25, 2023 -
ఆ సీన్ లేకుంటే ‘యానిమల్’ ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదు: బాబీ డియోల్
రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘యానిమల్’. ‘అర్జున్ రెడ్డి’ఫేమ్ సందీప్రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదలై పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. విడుదలైన 12 రోజుల్లోనే దాదాపు 750 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందంటే.. యానిమల్ ఏ స్థాయిలో విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమాపై మొదట్లో విమర్శలు వచ్చాయి. కొన్ని సన్నివేశాలు అసభ్యకరంగా ఉన్నాయని, హింస ఎక్కువగా చూపించారంటో కొంతమంది విమర్శించారు. ముఖ్యంగా బాబీ డియోల్ పాత్రకు సంబంధించిన ఓ సన్నివేశంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ చిత్రంలో విలన్గా నటించిన బాబీ డియోల్.. ఓ సీన్లో పెళ్లి వేదికపై పెళ్లికూతురిపై అత్యాచారానికి పాల్పడతాడు. ఆ తర్వాత తన ఇద్దరు భార్యలను కూడా గదిలోకి రమ్మని బలవంతం చేస్తాడు. ఈ సన్నివేశాలపై విమర్శలు వచ్చాయి. వైవాహిక అత్యాచారాన్ని ప్రోత్సహించేలా ఆ సన్నివేశాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో బాబీ డియోల్ని ట్రోల్ చేశారు. తాజాగా తనపై వచ్చిన ట్రోల్స్పై బాబీ డియోల్ స్పందించాడు. పాత్ర డిమాండ్ మేరకే ఆ సన్నివేశంలో నటించానని, ఆ సీన్ లేకుంటే యానిమల్ అంత పెద్ద హిట్ కాకపోయేదన్నాడు. ‘పాత్ర తీరుతెన్నులను అర్థం చేసుకొని నటించి ప్రేక్షకులను అలరించడమే నటుల పని. యానిమల్లో నేను పోషించిన అబ్రార్ హక్ పాత్ర నిడివి చాలా తక్కువ. ఉన్న సమయంలో క్యారెక్టర్ ఎలాంటిదో ప్రేక్షకులకు అర్థం కావాలనే అలాంంటి సీన్స్ క్రియేట్ చేశారు. సమాజంలో జరుగుతున్న ఘటనలే సినిమాల్లో కనిపిస్తాయి తప్ప.. వాటిని సినిమాలు ప్రమోట్ చేయట్లేదు’ అని బాబీ డియోల్ చెప్పుకొచ్చాడు. -
బాక్సాఫీస్ వద్ద యానిమల్ ప్రభంజనం.. 9 రోజుల్లో ఎన్ని కోట్లంటే?
రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన రోజే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.660.89 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద రూ. 650కి పైగా వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో నాలుగోస్థానంలో నిలిచింది. మొదటి మూడు స్థానాల్లో పఠాన్, జవాన్, గదర్-2 ఉన్నాయి. ఇదే స్థాయిలో కలెక్షన్స్ వస్తే త్వరలోనే వెయ్యి కోట్లకు చేరుకునేలా కనిపిస్తోంది. తొమ్మిది రోజుల్లో ఇండియావ్యాప్తంగా రూ.400 కోట్లు వసూలు చేసిన యానిమల్.. ప్రపంచవ్యాప్తంగా రూ.660.89 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. #Animal Roars Louder 🔥🪓 Book your Tickets 🎟️https://t.co/kAvgndK34I#AnimalTakesOverTheNation #AnimalInCinemasNow #Animal #AnimalHuntBegins #BloodyBlockbusterAnimal #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23… pic.twitter.com/rXLUe4SSod — Animal The Film (@AnimalTheFilm) December 10, 2023 -
‘యానిమల్’లో హీరో బ్రహ్మానందం అయితే.. వీడియో వైరల్
సోషల్ మీడియాలో కమెడియన్ బ్రహ్మానందానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నెట్టింట యాక్టివ్గా ఉండరు కానీ..ఆయన మీమ్స్ మాత్రం వైరల్ అవుతుంటాయి. సినిమాపైనే కాదు ట్రెండింగ్లో ఏ అంశం ఉన్నా..బ్రహ్మానందంపై మీమ్స్ రెడీ అయిపోతుంటాయి. అవి చూస్తే చాలు.. సీరియస్ అంశం అయినా సరే..పగలబడి నవ్వేస్తాం. తాజాగా బ్రహ్మానందంకు సంబంధించిన ఓ స్ఫూప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ‘యానిమల్’సినిమాపై చేసిన స్ఫూప్ వీడియా. రణ్బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదలైంది. మొదటి రోజే పాజిటివ్ రావడంతో పాటు విమర్శకులు ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ని షేక్ చేస్తుంది. ఇప్పటికే రూ. 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్, అనిల్ కపూర్ తండ్రి కొడుకులుగా నటించారు. ఈ సినిమా ట్రైలర్ లో రణబీర్కు బదులుగా బ్రహ్మీని పెట్టి ఓ వీడియోని రూపొందించారు. అందులో బ్రహ్మానందం నటించిన పలు సినిమాల్లోని సీన్లతో వాడేశారు. ఇక అనిల్ కపూర్ పాత్రకి బదులుగా నాజర్ని చూపించారు. బ్రహ్మానందం, నాజర్ తండ్రి కొడుకులైతే..యానిమల్ మూవీ ఇలా ఉంటుందంటూ ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘యానిమల్’ లోని కొన్ని సీన్లకి సరిగ్గా సూట్ అయ్యేలా బ్రహ్మానందం సినిమాల సీన్లను పెట్టారు. ఇది ఎవరు క్రియేట్ చేశారో తెలియదు కానీ.. అందరిని కడుపుబ్బా నవ్విస్తోంది. మీరు కూడా ఈ వీడియో చూసి నవ్వుకోండి. Bramhi in & as Animal😁✂️ Share & Follow @TeluguBroEdits .#brahmandam #AnimalTheMovie #AnimalPark @imvangasandeep @AnimalTheFilm pic.twitter.com/Cbc5VqwPQU — Telugu Bro (@TeluguBroEdits) December 9, 2023 -
'అమ్మాయిలు చప్పట్లు కొడుతుంటే బయటకొచ్చేశా'.. యానిమల్ చిత్రంపై తీవ్ర విమర్శలు..!
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే దాదాపు రూ.500 కోట్ల చేరువలో కలెక్షన్స్ సాధించింది. రణ్బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదలైంది. అయితే మొదటి రోజే పాజిటివ్ రావడంతో విమర్శకులు ప్రశంసలు అందుకుంది. అయితే ఈ చిత్రంపై అభిమానులతో సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. అయితే ఈ చిత్రానికి ప్రశంసల కంటే విమర్శించే వారు ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై టీమిండియా క్రికెటర్ జయదేవ్ ఉనద్కత్ విమర్శలు చేశారు. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారని మండిపడ్డారు. తాజాగా ఈ లిస్ట్లో ప్రముఖ లిరిసిస్ట్ స్వానంద్ కిర్కిరే కూడా చేరిపోయారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్లో వరుస పోస్టులు చేశారు. స్వానంద్ కిర్కిరే తన ట్వీట్లో రాస్తూ.. 'యానిమల్ సినిమా చూశాక.. నేటి తరం మహిళలపై నాకు నిజంగా జాలి కలిగింది. మీకోసం కొత్త వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు. అంతే కాదు.. అతను మరింత భయంకరంగా ఉన్నాడు. ఇక నుంచి మిమ్మల్ని ఎవరూ గౌరవించరు. మిమ్మల్ని అణచివేసే వ్యక్తి గురించి నువ్వు గర్వపడుతున్నావు. నేటి తరం అమ్మాయిలు థియేటర్లో కూర్చోని రష్మికను చూసి చప్పట్లు కొడుతుంటే.. మనసులో సమానత్వం అనే ఆలోచనకు నివాళులు అర్పించి నిరాశ, నిస్పృహలతో బయటకు వచ్చేశా. ఈ సినిమా విపరీతంగా వసూళ్లు రాబట్టినప్పటికీ.. నా భారతీయ సినిమా ఉజ్వల చరిత్ర మాత్రం దారి తప్పుతోంది. యానిమల్ భారతీయ సినిమా భవిష్యత్తును నిర్దేశిస్తుంది. భయంకరమైన, ప్రమాదకరమైన దిశలో తీసుకెళ్తోంది.' అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ చూసిన యానిమల్ చిత్రబృందం స్పందించింది. అతని ట్వీట్లను ఉద్దేశించి తగిన రీతిలో కౌంటర్ ఇచ్చింది. ట్వీట్లో రాస్తూ.. "మీ మోకాళ్లను మీ కాలి ముందు పడనివ్వకండి. మీ భుజం, పాదాలు బ్యాలెన్స్ కోసం వేరు వేరుగా ఉంచండి. మీ పాదాలను సురక్షితంగా ల్యాండ్ చేయండి. అప్పుడు అది కచ్చితంగా ల్యాండ్ అవుతుంది' అంటూ గట్టిగానే కౌంటరిచ్చింది. కాగా.. యానిమల్ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, ట్రిప్తీ డిమ్రీ, సురేష్ ఒబెరాయ్, శక్తి కపూర్ కీలక పాత్రల్లో నటించారు. शांतराम की - औरत , गुरुदुत्त की - साहब बीवी और ग़ुलाम , हृषीकेश मुखर्जी की - अनुपमा , श्याम बेनेगल की अंकुर और भूमिका , केतन मेहता की मिर्च मसाला , सुधीर मिश्रा की मैं ज़िंदा हूँ , गौरी शिंदे की इंगलिश विंगलिश , बहल की क्वीन सुजीत सरकार की पीकू आदि , हिंदुस्तानी सिनेमा — Swanand Kirkire (@swanandkirkire) December 2, 2023 Do not let your knees fall ahead of your toes or cave in towards each other. Keep feet shoulder-width apart to maintain a good base of support for balance. Land softly on the balls of the feet to help absorb the force of the landing. Yes.... now it landed perfectly 😘… pic.twitter.com/OxTOE0vlvI — Animal The Film (@AnimalTheFilm) December 6, 2023 -
యానిమల్ సక్సెస్.. క్రేజీ ట్యాగ్ కోల్పోయిన రష్మిక!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఆ ఒక్క పేరే దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇక సోషల్ మీడియాలో అయితే తెగ ట్రెండ్ అవుతోంది. అదేనండీ మన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ మూవీ. రిలీజైన మొదటి రోజే హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైంది. అయితే ఈ చిత్రంలోని కొన్ని సీన్స్పై కొందరు తప్పుపడుతున్నారు. ఇలాంటి సినిమాలను ఎలా ప్రోత్సహిస్తారంటూ ఇటీవలే టీమిండియా క్రికెటర్ జయదేవ్ ఉనద్కత్ మండిపడ్డారు. మరోవైపు ఈ చిత్రంపై ఆర్జీవీ ప్రశంసల వర్షం కురిపించారు. ఇదంతా పక్కన పెడితే బాలీవుడ్తో పాటు సౌత్లోనూ ఆమె పేరే వినిపిస్తోంది. ఈ చిత్రంలో జోయా పాత్రలో నటించిన బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రి. హీరోయిన్ రష్మిక కంటే ఆమె పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రంలోని రణ్బీర్ కపూర్తో త్రిప్తి రొమాంటిక్ సీన్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. రణ్బీర్, రష్మిక కెమిస్ట్రీ కంటే.. త్రిప్తి దిమ్రి కెమిస్ట్రీ అదిరిపోయిందంటూ కామెంట్ చేస్తున్నారు. త్రిప్తినే అసలైన నేషనల్ క్రష్ అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో త్రిప్తి ఓవర్నైట్ స్టార్గా గుర్తింపు తెచ్చుకుందని అంటున్నారు. రణబీర్ కపూర్, తృప్తి దిమ్రీల జోడీ భవిష్యత్తులోనూ తెరపై చూడాలనుకుంటున్నట్లు పోస్టులు పెడుతున్నారు. కాగా.. ఫిబ్రవరి 23, 1994న ఉత్తరాఖండ్లో జన్మించిన తృప్తి డిమ్రీ యానిమల్ చిత్రం కంటే ముందే చాలా సినిమాల్లో నటించింది. 'పోస్టర్ బాయ్స్ మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత 'కాలా', బుల్ బుల్ లాంటి చిత్రాలకు ప్రశంసలు అందుకుంది. తాజాగా రణబీర్ కపూర్ బ్లాక్ బస్టర్ యానిమల్లో చేసిన చిన్న పాత్రతో ఒక్కసారిగా ఫేట్ మారిపోయింది. The New National Crush 💘#TriptiDimri pic.twitter.com/J8je1gfKji — RANVIJAY 🦁 (@EddyTweetzBro) December 4, 2023 Loving their Chemistry. ❤️🔥 Ft. Fitoor Song#RanbirKapoor𓃵 #RanbirKapoor #TriptiDimri #AnimalTheFilm pic.twitter.com/89k6Ad8jtu — Ayan Sanger (@I_Ranbir_Fan) December 4, 2023 #TriptiDimri stole the show 🥵 pic.twitter.com/IEbv4ckVMz — Sia⋆ (@siappaa_) December 4, 2023 -
యానిమల్ ఓ బిగ్ డిజాస్టర్.. మండిపడ్డ టీమిండియా ఫాస్ట్ బౌలర్!
బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో యానిమల్ మూవీ బ్లాక్బస్టర్గా కానుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సైతం తన రివ్యూను ప్రకటించారు. (ఇది చదవండి: 'నా సామిరంగ'.. వరలక్ష్మి ఎలా ఉందో చూశారా?) అయితే సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ చిత్రంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ మూవీ బిగ్ డిజాస్టర్ అంటూ పోస్ట్ చేశారు. ఈ సినిమా చూసి అవసరంగా మూడు గంటల టైమ్ వృథా చేశానని రాసుకొచ్చారు. సినిమా వాళ్లకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని సూచించారు. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించే వారిపై ప్రశంసలు కురిపించడం తనకు బాధ కలిగించిందని ఇన్స్టాలో పోస్ట్ చేశారు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ ఇన్స్టా స్టోరీస్లో రాస్తూ.. 'మనమేమీ అడవుల్లో నివసించటం లేదు. ప్రస్తుతం యుద్దాలు చేస్తూ వేటాడే సమాజంలో బతకడం లేదు. యాక్టింగ్ ఎంత గొప్పగా ఉన్నా సరే మితిమీరిన వయోలెన్స్ చూపించడం మంచిదికాదు. ఇలాంటి హింసను ప్రేరేపించే వారిని ఆదరించి ప్రశంసలు కురిపించడం బాధ కలిగించింది. లక్షల మంది సినిమాలు చూస్తారు. మీకు కూడా కనీస సామాజిక బాధ్యత ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈ సినిమా వల్ల మూడు గంటల సమయం వేస్ట్ చేసుకున్నా' అని పోస్ట్ పెట్టారు. (ఇది చదవండి: కాంగ్రెస్ విజయం.. అల్లు అరవింద్ శుభాకాంక్షలు..) -
'యానిమల్'లో రష్మిక కంటే హైలైట్ అయిన బ్యూటీ.. ఈమె ఎవరంటే?
'యానిమల్' మీలో చాలామంది చూసే ఉంటారు. కొందరికి నచ్చింది, మరికొందరికి నచ్చలేదు. సరే అదంతా పక్కనబెడితే సినిమాలో చాలామంది వావ్ అనిపింంచారు. హీరో రణ్బీర్ కపూర్ వేరే లెవల్ యాక్టింగ్తో ఇచ్చిపడేశారు. హీరోయిన్ రష్మిక కూడా ఆశ్చర్యపరిచింది. కానీ ఈమె కంటే మరో బ్యూటీ.. ఈ మూవీలో ఎక్కువ హైలైట్ అయ్యింది. కిస్సలు, రొమాన్స్తో రెచ్చిపోయింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? ఎవరా బ్యూటీ? 'యానిమల్' సినిమా మొదలైన 15 నిమిషాల్లోనే రణ్బీర్-రష్మిక పాత్రలకు పెళ్లయిపోతుంది. దీంతో హీరోయిన్ రష్మిక పాత్రకు గ్లామర్ చూపించడానికి కుదరదు. దీంతో ఇంటర్వెల్ తర్వాత జోయా అనే పాత్ర ఎంటర్ అవుతుంది. బాలీవుడ్ నటి తృప్తి దిమ్రి.. ఈ క్యారెక్టర్ చేసింది. విలన్ గ్యాంగ్కి చెందిన ఈమె.. సీక్రెట్గా రహస్యాలు తెలుసుకోవడానికి హీరో దగ్గరికి వస్తుంది. తెలియకుండానే అతడితో ప్రేమలో పడిపోతుంది. (ఇదీ చదవండి: 'యానిమల్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అందులోనే) అలాంటి సీన్లోనూ దీంతో ఈ రెండు పాత్రల మధ్య రొమాన్స్ దగ్గర కిస్సులు ఓ రేంజులో ఉంటాయి. ఓ సీన్లో అయితే బెడ్పై నగ్నంగా కనిపించే సీన్ ఒకటుంటుంది. ఇందులో రణ్బీర్-తృప్తి దిమ్రి రెచ్చిపోయారు. ఓ రకంగా చెప్పాలంటే రష్మిక పాత్ర కంటే తృప్తి పాత్రనే ఎక్కువ హైలైట్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే 'యానిమల్' మూవీ గురించి.. లేదంటే 'తృప్తి దిమ్రి' గురించే మాట్లాడుకుంటున్నారు. తృప్తి బ్యాక్గ్రౌండ్ ఈమె అసలు పేరు లైలా తృప్తి దిమ్రి. ఓటీటీ అభిమానులు మాత్రం ఈ బ్యూటీని 'బుల్బుల్' అని ముద్దుగా పిలుస్తారు. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ లో తృప్తి పుట్టింది. 2017లో 'పోస్టర్ బాయ్స్' అనే సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది. 'లైలా మజ్ను', 'బుల్ బుల్' సినిమాలు చేసింది. ఇకపోతే 'బుల్ బుల్' మూవీ ప్రొడ్యూసర్ కర్నేశ్తో ఈమె డేటింగ్లో ఉందని రూమర్స్ ఉన్నాయి. ఇకపోతే సందీప్ రెడ్డి వంగా తీసిన అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రల కంటే సెకండాఫ్లో కనిపించిన బ్యూటీస్ అనుకోని విధంగా హైలైట్ కావడం విశేషం. (ఇదీ చదవండి: Animal Review: ‘యానిమల్’మూవీ రివ్యూ) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) #TriptiDimri #Animal pic.twitter.com/OBegRMvwyz — Madhu Parmar (@MadhuPa37121193) December 2, 2023 -
Animal Review: ‘యానిమల్’మూవీ రివ్యూ
టైటిల్: యానిమల్ నటీనటులు: రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు నిర్మాణ సంస్థలు:టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా నేపథ్య సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ సినిమాటోగ్రఫీ: అమిత్ రాయ్ ఎడిటింగ్: సందీప్ రెడ్డి వంగా విడుదల తేది: డిసెంబర్ 1, 2023 ‘యానిమల్’ కథేంటంటే.. బల్బీర్ సింగ్(అనిల్ కపూర్) దేశంలోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త. అతని కొడుకు రన్ విజయ్ సింగ్ బల్బీర్(రణ్బీర్ కపూర్). విజయ్కి చిన్నప్పటి నుంచే కాస్త అగ్రెసివ్. తండ్రి అంటే చాలా ఇష్టం. అతనితో గడిపేందుకు చాలా ప్రయత్నిస్తాడు. కానీ బల్బీర్ బిజినెస్ పనుల్లో బిజీ కావడంతో ఫ్యామిలీకి టైమ్ కేటాయించేవాడు కాదు. ఇదిలా ఉంటే.. విజయ్ స్కూల్ డేస్లో తన అక్కను ఒకరు ర్యాగింగ్ చేశారని గన్తో బెదిరిస్తాడు. ఈ విషయం బల్బీర్కి తెలియడంతో బోర్డింగ్ స్కూల్కి పంపిస్తాడు. తండ్రికి దూరంగా పెరిగిన విజయ్..కొన్నాళ్లకు తిరిగి వస్తాడు. నాన్న 60వ బర్త్డే సెలబ్రేషన్స్లో బావతో గొడవ పడతాడు. దీంతో మళ్లీ తండ్రి కొడుకుల మధ్య దూరం పెరుగుతుంది. స్కూల్మేట్ గీతూ అలియాస్ గీతాంజలి(రష్మిక మందన్నా)ని పెళ్లి చేసుకొని విజయ్ అమెరికాకు వెళ్తాడు. కొన్నాళ్లకు తండ్రిపై అటాక్ జరిగిందని తెలిసి తిరిగి ఇండియాకు వస్తాడు. నాన్నను చంపేందుకు ప్రయత్నించివారిని తలలు నరుకుతానని ప్రామిస్ చేస్తాడు. అసలు బల్బీర్పై అటాక్ చేసిందెవరు? వారిని విజయ్ ఎలా కనిపెట్టాడు? తండ్రిని కాపాడుకోవడం కోసం విజయ్ ఏం చేశాడు? సొంత బావను ఎందుకు చంపాల్సివచ్చింది? అబ్రార్ హక్(బాబీ డియోల్) ఎవరు? అతనికి బల్బీర్ సింగ్ ప్యామిలీకి మధ్య ఉన్న శత్రుత్వం ఏంటి? చివరకు విజయ్ తన తండ్రిని కాపాడుకున్నాడా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. తండ్రి కోసం ఏదైనా చేయగలిగే ఓ కొడుకు పిచ్చి ప్రేమ కథే ‘యానిమల్’. ఇదొక రివేంజ్ డ్రామా. కానీ సందీప్ రెడ్డి వంగా ఈ కథను చాలా బోల్డ్గా, వయోలెంట్గా తెరపై చూపించాడు. కథగా చూస్తే..ఇందులో తండ్రి కొడుకుల ప్రేమ, కుటుంబ అనుబంధాలు, భార్య భర్తల బాండింగ్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఫ్యామిలీతో కలిసి చూడలేని విధంగా కథనం సాగుతుంది. అలాగే కామెడీ కూడా బోల్డ్గానే ఉంటుంది. సినిమా మొత్తం సందీప్రెడ్డి వంగా స్టైల్లోనే సాగుతుంది. నాన్న పాటతో చాలా ఎమోషనల్గా కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హీరో పాత్ర అగ్రెసివ్గా ఉంటుందని ఒకటి, రెండు సన్నివేశాలతో తెలియజేశాడు. హీరోయిన్ ఎంట్రీ చాలా సింపుల్గా ఉంటుంది. ఎంగేజ్మెంట్ అయిన హీరోయిన్ని..తన మాటలతో హీరో ప్రేమలో పడేసే సీన్ చాలా కొత్తగా,థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఫస్టాఫ్లో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్ చాలా బోల్డ్గా ఉంటాయి. అలాగే వయోలెన్స్ కూడా ఎక్కువే. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్ అయితే అదిరిపోతుంది. తనదైన స్క్రీన్ప్లేతో ఫస్టాఫ్ని చాలా ఇంట్రెస్టింగ్గా నడిపించాడు సందీప్ రెడ్డి. ఇక సెకండాఫ్లో చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. హీరో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి వచ్చిన తర్వాత ఇంట్లో డాక్టర్లతో మాట్లాడే మాటలు చాలా బోల్డ్గా ఉంటాయి. హీరో నగ్నంగా ఆరు బయటకు రావడానికి గల కారణం కన్విన్సింగ్గానే ఉంటుంది. ఈ సీన్ కంటే ముందు వచ్చే సన్నివేశాల్లో రణ్బీర్ ఫెర్ఫార్మెన్స్ అదిరిపోయేలా ఉంటుంది. విజయ్ ఎంత క్రూరంగా ప్రవర్తించినప్పటికీ.. గీతాంజలి ఎందుకు భరిస్తుందో తెలియజేసే సీన్..భార్య భర్తల మధ్య ఉన్న బాడింగ్ని తెలియజేస్తుంది. ఇక జోయాతో రొమాన్స్ తర్వాత..గీతాంజలి, విజయ్ మధ్య వచ్చే సీన్లు చాలా మెచ్యుర్డ్గా ఉంటాయి. బాబీ డియోల్ పాత్ర ఎంట్రీ సీన్ అదిరిపోతుంది. క్లైమాక్స్లో బాబీ, రణ్బీర్కి మధ్య వచ్చే యాక్షన్ సీన్ సినిమాకు మరో హైలెట్. యాక్షన్, ఫ్యాక్షన్ కలబోసిన ఓ ఎమోషననల్ ఫ్యామిలీ డ్రామా ఇది. అయితే మితిమీరిన హింస, శృంగార సన్నివేశాల కారణంగా ఫ్యామిలీ ఆడియెన్స్ కు కాస్త ఇబ్బంది అనిపించొచ్చు కానీ, మిగతావారికి మాత్రం ఓ డిఫరెంట్ మూవీ చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. ఎవరెలా చేశారంటే.. రణ్బీర్ కపూర్ నటన గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేస్తాడు. రణ్ విజయ్ సింగ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. టీనేజ్.. యంగ్ ఏజ్, ఓల్డ్ ఏజ్ ఇలా మూడు దశల పాత్రల్లోనూ తనదైన నటనతో అదరగొట్టేశాడు. ఈ క్యారెక్టర్లో రణ్బీర్ తప్ప మరొకరు నటించలేరు అనేంతలా అతని యాక్టింగ్ ఉంటుంది. గీతాంజలి పాత్రకు రష్మిక న్యాయం చేసింది. రణ్బీర్, రష్మికల మధ్య ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. రొమాంటిక్ సీన్స్లో ఇద్దరూ జీవించేశారు. జోయా గా తృప్తి దిమ్రి తన పాత్ర పరిధిమేర నటించింది. బల్బీర్ సింగ్ పాత్రలో అనిల్ కపూర్ ఒదిగిపోయాడు. కథ మొత్తం ఆయన పాత్ర చుట్టే తిరుగుతుంది. బాబీ డియోల్ విలనిజం బాగా పండించాడు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం రామేశ్వర్ నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో సినిమాను ఓ రేంజ్కు తీసుకెళ్లాడు. యాక్షన్ సీన్స్కి అతను అందించిన బీజీఎం వేరే లెవెల్. ఈ చిత్రం నిడివి 3.23 గంటలు. అయితే చాలా సన్నివేశాలను తొలగించే అవకాశం ఉన్నప్పటికీ..డైరెక్టర్ సందీప్ రెడ్డే ఎడిటర్గా వ్యవరించడంతో కత్తిరించడానికి మనసు ఒప్పుకోనట్లుంది. సెకండాఫ్లో కొన్ని సీన్స్ని మరింత క్రిస్పీగా కట్ చేసి నిడివిని కాస్త తగ్గిస్తే బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
యానిమల్ అసలు రన్టైమ్ అది కాదు.. వామ్మో అంతకుమించి!
ప్రస్తుతం సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం యానిమల్. రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటిస్తోన్న ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు అమాంతెం పెంచేసింది. తాజాగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న చిత్రబృందం చెన్నైలోనూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మీట్కు రణ్బీర్ కపూర్, రష్మిక, సందీప్ రెడ్డి వంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యానిమల్ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా మూవీ రన్టైమ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. (ఇది చదవండి: బిగ్బాస్ వార్నింగ్.. డబ్బులిచ్చి మరీ ఎలిమినేట్ అవుతానంటున్న కంటెస్టెంట్!) ప్రస్తుతం ఆడియన్స్ రెండున్నర గంటల సినిమా చూసేందుకే బోరింగ్గా ఫీలవుతున్నారు. అలాంటిది సందీప్ రెడ్డి ఏకంగా మూడు గంటల 21 నిమిషాల రన్టైమ్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. అయితే దీనిమీదే ప్రస్తుతం ఆడియన్స్లో తెగ చర్చ నడుస్తోంది. అయితే చెన్నైలో జరిగిన ఈవెంట్లో దీనిపై మేకర్స్ చేసిన కామెంట్స్ మరింత వైరలవుతున్నాయి. కాగా.. ఇప్పటికే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సందీప్ రెడ్డి వంగా చిత్రానికి అసలు రన్ టైమ్ సుమారు 3 గంటల 49 నిమిషాలుగా ఉందట. ఇంత లాంగ్ రన్టైమ్ మూవీని చూడాలంటే ఆడియన్స్కు కష్టమే. అందులోనూ రోజు నాలుగు షోలు వేయాలంటే కూడా వీలు కాదు. అందువల్లే 3 గంటలా 21 నిమిషాలకు తగ్గించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రణ్బీర్ కపూర్ ప్రమోషన్స్లో వెల్లడించారు. మరోవైపు ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ ఏకంగా 18 నిమిషాల పాటు సాగుతుందని సమాచారం. దీనిపై స్పష్టత రావాలంటే సినిమా వచ్చే దాకా వేచి చూడాల్సిందే. అయితే ఓటీటీలోనైనా ఫుల్ మూవీని రిలీజ్ చేస్తారేమో చూడాలి. (ఇది చదవండి: రణ్బీర్.. ఇక్కడికి షిఫ్ట్ అయిపో.. తెలుగువాళ్లు బాలీవుడ్ను..) -
నన్ను హీరో చేసింది తెలుగు డైరెక్టరే.. అనిల్ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్. ఈ చిత్రాన్ని అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ట్రైలర్ను యూట్యూబ్ను షేక్ చేస్తోంది. ఈ ట్రైలర్పై సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఈవెంట్కు హాజరైన మరో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అనిల్ కూపూర్ మాట్లాడుతూ..' అందరూ బాగున్నారా? ట్రైలర్ చూశారా? నచ్చిందా? మీకు ఓ విషయం చెప్పాలి. ఒక నటుడిగా నాకు లైఫ్ ఇచ్చింది తెలుగు సినిమానే. నాకు మొదటి చిత్రం తెలుగులోనే. 1980లో వంశవృక్షం చిత్రంలో నటించా. డైరెక్టర్ బాపు నన్ను హీరోగా టాలీవుడ్కు పరిచయం చేశారు. ఆయన వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. దాదాపు 43 ఏళ్ల తర్వాత మళ్లీ మీ ముందుకు వస్తున్నా. ఇది ప్రత్యేకమైన ఫీలింగ్ ఇస్తోంది. సందీప్ వంగా బ్రిలియంట్ డైరెక్టర్. ఇది నా రెండో తెలుగు చిత్రం. మహేశ్ బాబుతో నాకు కుటుంబంలాంటి అనుబంధం. మీరు ఒక ఫ్యామిలీ మ్యాన్. ది గ్రేటెస్ట్, గ్లోబల్ డైరెక్టర్ రాజమౌళి సార్. మన సినిమా ఇండస్ట్రీలోని ప్రపంచానికి పరిచయం చేశారంటూ ' అంటూ ప్రశంసలు కురిపించారు. కాగా.. ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలో సందడి చేయనుంది.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
మిస్టరీ.. 'ఏదో బలమైన శక్తి తన కాళ్లను పట్టుకుని ఈడ్చుకెళ్లినట్లు'..
ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ హిట్ సినిమా
కోకిలా! నోట్లో వేలు పెట్టుకోవడం మంచి అలవాటు కాదమ్మా!’
బంగ్లాదేశ్ను చిత్తు చేసిన జింబాబ్వే.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం
కేరాఫ్ క్లాసిక్ బ్యూటీ.. 'సంజనా బత్రా'!
మే 13న ఎన్నికలు.. ఈ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు
చల్లదనంతోపాటు ఆహ్లాదాన్నీ పంచే పంచే చెట్లు ఇవిగో..
ఆ వ్యక్తుల హెల్త్ సీక్రెట్స్తో యూస్ ఉండదట!
కేకేఆర్ ఆల్రౌండర్కు బిగ్ షాక్.. మ్యాచ్ పీజులో 50 శాతం కోత
RCB vs DC: మరో కీలక మ్యాచ్
తప్పక చదవండి
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement