-
ఐపీఎల్లో నా పేరు లేకపోవటమే మంచిదైంది: సర్ఫరాజ్ తమ్ముడు
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడాలని ఎవరు మాత్రం కోరుకోరు?!.. అయితే, అందుకు కెరీర్ను మూల్యంగా చెల్లించే పరిస్థితి రాకూడదనే జాగ్రత్తపడుతున్నానంటున్నాడు భారత యువ సంచలనం ముషీర్ ఖాన్! కాగా క్యాష్ రిచ్ లీగ్ ద్వారానే ఎంతో మంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చి.. టీమిండియాలో పాతుకుపోయిన విషయం తెలిసిందే. టీనేజ్లోనే కోట్లు కొల్లగొట్టి స్టార్లుగా మారిపోయిన వాళ్లూ ఉన్నారు. అందుకే.. ప్రతి యువ క్రికెటర్ ఐపీఎల్లో ఆడే ఛాన్స్ కోసం తహతహలాడుతుంటారు. ముషీర్ ఖాన్ కూడా ఆ కోవకు చెందినవాడే! అయితే, అనుకున్న వెంటనే అతడికి ఛాన్స్ రాలేదు. గతేడాది వేలంలో పేరు నమోదు చేసుకున్న 19 ఏళ్ల ముషీర్పై ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపకపోవడంతో అతడు అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. దీంతో నిరాశలో కూరుకుపోయాడు. అయితే, ఆ సమయంలో తండ్రి నౌషద్ ఖాన్ చెప్పిన మాటలు తనలో స్ఫూర్తి నింపాయని.. టీ20 ఫార్మాట్ గురించి పూర్తిగా అర్థం చేసుకునేందుకు తనకు మరింత సమయం దొరికిందని సంతోషంగా చెప్తున్నాడు ఈ ఏడాది ‘రంజీ’ ఫైనల్ హీరో ముషీర్ ఖాన్. నాన్న చెప్పాడు ‘‘ఐపీఎల్లో నా పేరు లేదు. అయినా.. మరేం పర్లేదు.. టెస్టు క్రికెట్పై దృష్టి పెట్టి.. టీమిండియాలో చోటే లక్ష్యంగా అడుగులు వేయాలని మా నాన్న చెప్పారు. ఆ క్రమంలో సరైన సమయంలో ఐపీఎల్లో చోటు కూడా దక్కుతుందన్నారు. ఈరోజు కాకపోతే.. రేపైనా ఐపీఎల్లో నేను తప్పక అవకాశం దక్కించుకుంటానని బలంగా చెప్పారు. నిజానికి ఈసారి నేను ఎంపిక కాకపోవడమే మంచిదైంది. టీ20 క్రికెట్ను నేను పూర్తిగా అర్థం చేసుకోవాలి. అన్ని రకాలుగా పొట్టి ఫార్మాట్ కోసం సిద్ధం కావాలి’’ అని ముషీర్ ఖాన్ పీటీఐతో చెప్పుకొచ్చాడు. మా అన్నయ్యే నాకు స్ఫూర్తి ఇక తన అన్న సర్ఫరాజ్ ఖాన్ గురించి మాట్లాడుతూ..‘‘ ఆట పట్ల మా అన్నయ్యకు ఉన్న అంకిత భావం, అతడి బ్యాటింగ్ శైలి నాకెంతో నచ్చుతాయి. మా ఇద్దరి బ్యాటింగ్ శైలి దాదాపుగా ఒకేలా ఉంటుంది. రంజీ ఫైనల్ మ్యాచ్కు వెళ్లే ముందు అతడే నాలో ధైర్యం నింపాడు. ఫైనల్ అని ఒత్తిడిలో కూరుకుపోతే మొదటికే మోసం వస్తుందని.. సాధారణ మ్యాచ్లలాగే అక్కడా ఆడాలని చెప్పాడు’’ అని ముషీర్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా విదర్భతో జరిగిన రంజీ ట్రోఫీ 2023-24 ఫైనల్లో ముషీర్ ఖాన్ 136 పరుగుల(సెకండ్ ఇన్నింగ్స్)తో చెలరేగి జట్టును విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ముంబై రికార్డు స్థాయిలో 42వ సారి టైటిల్ గెలవడంలో భాగమై ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అనంతరం ముషీర్ ఖాన్ మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. సర్ఫరాజ్కూ నో ఛాన్స్ కాగా ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా రాజ్కోట్ మ్యాచ్లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడే ముషీర్. అండర్-19 వరల్డ్కప్లో సత్తా చాటి.. రంజీలోనూ అదరగొట్టాడు. ఇప్పటి వరకు అతడు కేవలం ఐదు ఫస్ట్క్లాస్ మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఇదిలా ఉంటే.. సర్ఫరాజ్ను సైతం ఐపీఎల్-2024 వేలంలో ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. అంతకు ముందు అతడు ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహించాడు. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. ఇకపై -
BCCI: శ్రేయస్ అయ్యర్కు శుభవార్త!?
ఐపీఎల్-2023 నేపథ్యంలో కోల్కతా నైట్ రైడర్స్ అభిమానులకు శుభవార్త! ఆ జట్టు కెప్టెన్, టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పూర్తి ఫిట్గా ఉన్నట్లు సమాచారం. రెండు రోజుల వ్యవధిలో అతడు కేకేఆర్ ప్రి- ఐపీఎల్ క్యాంపులో చేరనున్నట్లు తెలుస్తోంది. రంజీ ట్రోఫీ 2023- 24 సీజన్ విజేత ముంబై జట్టు మేనేజర్ భూషణ్ పాటిల్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు క్రిక్బజ్ పేర్కొంది. కాగా రంజీ తాజా సీజన్ ఆరంభం నుంచి ముగింపు మధ్యలో శ్రేయస్ అయ్యర్ కెరీర్లో సంచలన మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు ముంబై తరఫున రంజీ బరిలో దిగిన అయ్యర్.. ఆ తర్వాత టీమిండియాతో చేరాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రెండు టెస్టుల్లో విఫలం కావడంతో బీసీసీఐ అతడిని పక్కనపెట్టింది. ఈ క్రమంలో వెన్నునొప్పితో బాధపడుతున్న అతడు.. జాతీయ క్రికెట్ అకాడమీలో చేరాడు. అయితే, అప్పటికే బీసీసీఐ.. సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాళ్లను ఉద్దేశించి ఓ నిబంధన ప్రవేశపెట్టింది. జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు.. పూర్తి ఫిట్గా ప్రతీ ఆటగాడు రంజీల్లో ఆడాలని ఆదేశించింది. దీంతో తాను ఫిట్గా లేనంటూ అయ్యర్ ముంబై క్రికెట్ అసోసియేషన్కు తెలియజేయగా.. ఎన్సీఏ అతడు పూర్తి ఫిట్గా ఉన్నట్లు చెప్పడంతో అతడిపై వేటు పడింది. క్రమశిక్షణరాహిత్యం నేపథ్యంలో యువ ఓపెనర్ ఇషాన్ కిషన్తో పాటు శ్రేయస్ అయ్యర్ కాంట్రాక్టును కూడా బీసీసీఐ రద్దు చేసింది. ఈ క్రమంలో మళ్లీ రంజీ టోర్నీలో అడుగుపెట్టిన అయ్యర్.. విదర్భతో ఫైనల్ మ్యాచ్లో అదరగొట్టాడు. 95 పరుగులతో అదరగొట్టి ముంబై విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, బ్యాటింగ్ అనంతరం రెండురోజుల పాటు అయ్యర్ ఫీల్డింగ్కు దూరంగా ఉండటంతో వెన్నునొప్పి తిరగబెట్టిందనే వార్తలు వచ్చాయి. ఫలితంగా అతడు ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నాడనే ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ముంబై జట్టు మేనేజర్ భూషణ్ పాటిల్ మాట్లాడుతూ.. ‘‘అయ్యర్ ఫిట్నెస్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అతడు బాగున్నాడు. రెండు రోజుల్లో ప్రి- ఐపీఎల్ క్యాంపులో చేరతాడు’’ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. అయ్యర్ కాంట్రాక్టు విషయంలో బీసీసీఐ పునరాలోచన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టును పునరుద్ధరించే యోచనలో ఉన్నట్లు వదంతులు వస్తున్నాయి. చదవండి: హార్దిక్ రిటైర్ అవ్వటమే బెటర్: భారత మాజీ పేసర్ షాకింగ్ కామెంట్స్ -
‘రంజీ’ రారాజు ముంబై... ఆటగాళ్లపై కోట్లాభిషేకం
విదర్భ ఇన్నింగ్స్లో 135వ ఓవర్... అప్పటికే 9 వికెట్లు పడ్డాయి... కెరీర్లో చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్న ముంబై పేసర్ ధవల్ కులకర్ణి ఇంత సుదీర్ఘ ఇన్నింగ్స్లో 8 ఓవర్లే వేశాడు... ఒక్కసారిగా ధవల్ చేతికి కెప్టెన్ రహానే బంతిని అందించాడు... మూడో బంతికి ఉమేశ్ యాదవ్ క్లీన్బౌల్డ్... ముంబై శిబిరంలో సంబరాలు షురూ... వెరసి దేశవాళీ క్రికెట్ దిగ్గజం ఖాతాలో మరో రంజీ ట్రోఫీ చేరింది. ముంబై జట్టు ఏకంగా 42వ సారి రంజీ టైటిల్ను సొంతం చేసుకుంది. ఎనిమిదేళ్ల తర్వాత టీమ్ ఖాతాలో మరో కప్ చేరగా... ధవల్ ఐదో రంజీ విజయంలో భాగంగా నిలిచి సగర్వంగా ఆటకు వీడ్కోలు పలికాడు. ముంబై: భారత దేశవాళీ క్రికెట్లో ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీని ముంబై జట్టు సొంతం చేసుకుంది. గురువారం ముగిసిన ఐదు రోజుల ఫైనల్లో ముంబై 169 పరుగుల తేడాతో రెండుసార్లు చాంపియన్ విదర్భపై ఘన విజయం సాధించింది. విదర్భ చివరి రోజు వరకు పోరాడినా అసాధ్యమైన లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది. 538 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్నైట్ స్కోరు 248/5తో ఆట కొనసాగించిన విదర్భ 368 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (199 బంతుల్లో 102; 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ పూర్తి చేసుకోగా... హర్‡్ష దూబే (128 బంతుల్లో 65; 5 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించాడు. వీరిద్దరు ఆరో వికెట్కు 130 పరుగులు జోడించారు. అక్షయ్, హర్‡్ష చాలాసేపు ముంబై బౌలర్లకు లొంగకుండా ఇబ్బంది పెట్టారు. అయితే ఎట్టకేలకు తనుష్ బౌలింగ్లో అక్షయ్ వికెట్ల ముందు దొరికిపోవడంతో ముంబై గెలుపు బాట పట్టింది. మిగిలిన నాలుగు వికెట్లను 15 పరుగుల వ్యవధిలోనే తీసి ముంబై చాంపియన్గా అవతరించింది. సెంచరీ సాధించడంతో పాటు 2 వికెట్లు తీసిన ముషీర్ ఖాన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. అతనికి రూ. 50 వేలు ప్రైజ్మనీ దక్కింది. టోర్నీ మొత్తంలో 502 పరుగులు, 29 వికెట్లతో ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన ముంబై ఆటగాడు తనుష్ కొటియన్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. తనుష్ కు రూ. 2 లక్షల 50 వేలు ప్రైజ్మనీ లభించింది. 1934–35 సీజన్లో తొలిసారి విజేతగా నిలిచిన ముంబై (బాంబే) జట్టు ఈ టైటిల్కు ముందు 2015–16 సీజన్లో చివరిసారి ట్రోఫీని అందుకుంది. ఆటగాళ్లపై కోట్లాభిషేకం... ప్రైజ్మనీలో ముంబై డబుల్ ధమాకా కొట్టింది. సీజన్ విజేతకు బీసీసీఐ రూ. 5 కోట్ల ప్రైజ్మనీ ఇవ్వగా... ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) తమ క్రికెటర్లకు ప్రత్యేకంగా రూ.5 కోట్ల నజరానా ప్రకటించింది. దీంతో తాజా రంజీ విజేతకు వచ్చిన ప్రైజ్మనీ రెట్టింపైంది. ‘ఈ సీజన్లో మా జట్లు బాగా ఆడాయి. బీసీసీఐ నిర్వహించిన వయో విభాగాల టోర్నీలన్నింటిలోనూ ఫైనల్ చేరాయి. దీంతో ఎంసీఏ ప్రోత్సాహకంగా రూ. 5 కోట్ల బహుమతి ఇస్తోంది’ అని కార్యదర్శి అజింక్య నాయక్ తెలిపారు. -
మా జట్టులో తక్కువ పరుగులు చేసింది నేనే: రహానే
Ajinkya Rahane Comments After Guiding Mumbai to Ranji Trophy Title Win: ‘‘మా జట్టులో తక్కువ పరుగులు స్కోరు చేసిన బ్యాటర్ను నేనే.. అయినప్పటికీ అందరికంటే అత్యంత సంతోషడే వ్యక్తిని కూడా నేనే.. ట్రోఫీ గెలవడం ఆనందంగా ఉంది. ప్రతి ఆటగాడి కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు ఉంటాయి. ఏదేమైనా డ్రెసింగ్ రూంలో అందరూ పరస్పరం ఒకరి విజయాలు మరొకరు సెలబ్రేట్ చేసుకునే వాతావరణం కల్పించడమే అత్యంత ముఖ్యమైనది. నా జీవితంలో ఈరోజు ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. గతేడాది ఒక్క పరుగు తేడాతో ఓడి.. నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోయాం. అయితే, ఇప్పుడు జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడి పట్ల మరింత బాధ్యత తీసుకుని.. వారి ఆటిట్యూడ్, ఫిట్నెస్, సహచర సభ్యులతో మెలిగే విధానం.. ఇలా ప్రతి అంశంలోనూ మరింత శ్రద్ధ వహించాం. ముంబై క్రికెట్ అసోసియేషన్ అన్ని వేళలా మాకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు’’ అని రంజీ ట్రోఫీ 2023-24 టైటిల్ విన్నింగ్ కెప్టెన్ అజింక్య రహానే హర్షం చేశాడు. అదే విధంగా.. విదర్భ సైతం ఆఖరి వరకు విజయం కోసం అద్భుతంగా పోరాడిందని కొనియాడాడు. కాగా వాంఖడే స్టేడియంలో గురువారం ముగిసిన రంజీ ట్రోఫీ 2023- 24 ఫైనల్ మ్యాచ్లో ముంబై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. విదర్భను 169 పరుగుల తేడాతో చిత్తు చేసి రికార్డు స్థాయిలో ఏకంగా 42వ సారి ట్రోఫీ గెలుచుకుంది. ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన ముషీర్ ఖాన్(136) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక రహానే 73 విలువైన పరుగులు చేయగా.. శ్రేయస్ అయ్యర్ 95 పరుగులతో అదరగొట్టాడు. షమ్స్ ములానీ సైతం అజేయ అర్ధ శతకంతో రాణించాడు. కాగా రంజీ తాజా ఎడిషన్లో అదరగొట్టి టీమిండియాలో రీఎంట్రీ ఇవ్వాలనుకున్న రహానే.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. మొత్తంగా పదమూడు ఇన్నింగ్స్ ఆడి కేవలం 214 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 𝐌𝐮𝐦𝐛𝐚𝐢 are WINNERS of the #RanjiTrophy 2023-24! 🙌 Mumbai Captain Ajinkya Rahane receives the coveted Trophy 🏆 from the hands of Mr Ashish Shelar, Honorary Treasurer, BCCI. 👏 👏#Final | #MUMvVID | @ShelarAshish | @ajinkyarahane88 | @MumbaiCricAssoc | @IDFCFIRSTBank pic.twitter.com/LPZTZW3IV4 — BCCI Domestic (@BCCIdomestic) March 14, 2024 For his superb hundred in the #RanjiTrophy #Final, Musheer Khan is named the Player of the Match. 👍 👍 He receives the award from the hands of Mr Ashish Shelar, Honorary Treasurer, BCCI. 👏 👏#MUMvVID | @ShelarAshish | @IDFCFIRSTBank pic.twitter.com/T3l6mLW6kP — BCCI Domestic (@BCCIdomestic) March 14, 2024 Tanush Kotian bagged the Player of the Tournament award for brilliant all-round display 🙌 🙌 He receives the award from Mr Ajinkya Naik, Honorary Secretary, Mumbai Cricket Association. 👏 👏#RanjiTrophy | #Final | #MUMvVID | @ajinkyasnaik | @MumbaiCricAssoc | @IDFCFIRSTBank pic.twitter.com/eMbRcr4s24 — BCCI Domestic (@BCCIdomestic) March 14, 2024 -
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్.. స్పందించిన రోహిత్
టీమిండియా వెటరన్, ముంబై స్టార్ పేసర్ ధవల్ కులకర్ణి తన ఫస్ట్క్లాస్ కెరీర్ను ఘనంగా ముగించాడు. రంజీ ట్రోఫీ 2023-24లో భాగంగా విధర్బతో జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం ఫస్ట్క్లాస్ క్రికెట్ నుంచి కులకర్ణి తప్పుకున్నాడు. ఈ ఫైనల్ పోరులో విధర్బను 164 పరుగుల తేడాతో చిత్తు చేసిన ముంబై.. 42వ సారి రంజీ ట్రోఫీ టైటిల్ను ముద్దాడింది. తన కెరీర్ చివర మ్యాచ్లో కూడా కులకర్ణి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మొత్తంగా రెండు ఇన్నింగ్స్లు కలిపి ధవల్ 4 వికెట్లు పడగొట్టాడు. కాగా సెకెండ్ ఇన్నింగ్స్లో విధర్బ చివరి వికెట్ను కూడా కులకర్ణినే పడగొట్టడం గమనార్హం. ఉమేశ్ యాదవ్ను క్లీన్ బౌల్డ్ చేసి ముంబైని ఛాంపియన్స్గా కులకర్ణి నిలిపాడు. ముంబై తరపున 96 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన కులకర్ణి.. 281 వికెట్లు పడగొట్టాడు. ఇక 2016లో ధోని సారథ్యంలో టీమిండియా తరపున కులకర్ణి అరంగేట్రం చేశాడు. అతడికి ధోని నుంచి మంచి సపోర్ట్ కూడా ఉండేది. కానీ తర్వాత కులకర్ణి విఫలం అవ్వడంతో జట్టులో చోటు కోల్పోయాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మకు ధవల్ కులకర్ణి మంచి స్నేహితుడు. ఇద్దరూ కలిసి చాలా కాలం పాటు ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడారు. వీరిద్దరూ మంబైకు ఎన్నో అద్బుతమైన విజయాలు అందించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ తరపున ధవల్ పలు ఐపీఎల్ సీజన్లు ఆడాడు. ఈ క్రమంలో కులకర్ణి రిటైర్మెంట్పై హిట్మ్యాన్ స్పందించాడు. "ది వారియర్ ఆఫ్ ముంబై, వెల్డన్, వాట్ ఏ కెరీర్" అంటూ రోహిత తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. -
రంజీ ట్రోఫీ ఛాంపియన్స్గా ముంబై.. 42వ సారి
రంజీ ట్రోఫీ 2023-24 విజేతగా ముంబై నిలిచింది. వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్లో విదర్భను 169 పరుగుల తేడాతో చిత్తు ముంబై చిత్తు చేసింది. తద్వారా 42వ సారి రంజీ ట్రోఫీ టైటిల్ను ముంబై తమ ఖాతాలో వేసుకుంది. 538 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ 368 పరుగులకు ఆలౌటైంది. విదర్భ బ్యాటర్లలో కెప్టెన్ ఆక్షయ్ వాద్కర్(102), కరుణ్ నాయర్(74) పరుగులతో పోరాడనప్పటికీ తమ జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. ముంబై బౌలర్లలో తనీష్ కొటియన్ 4 వికెట్లతో చెలరేగగా.. తుషార్ దేశ్ పాండే,ముషీర్ ఖాన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు ధావల్ కులకర్ణి, సామ్స్ ములానీ చెరో వికెట్ సాధించారు. ఫైనల్ మ్యాచ్లో సెంచరీతో పాటు బౌలింగ్లో అదరగొట్టిన ముషీర్ ఖాన్కు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది. అదేవిధంగా సీజన్ అసాంతం బౌలింగ్ ప్రదర్శనతో అకట్టుకున్న తనీష్ కొటియన్ ప్లేయర్ ఆఫ్ది సిరీస్గా నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై తమ మొదటి ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆలౌటైంది. అనంతరం విధర్బ సైతం తొలి ఇన్నింగ్స్లో పేలవ ప్రదర్శన కనబరిచింది. ముంబై బౌలర్ల దాటికి విదర్బ కేవలం 105 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లలో కులకర్ణి, ములానీ, కొటియన్ తలా మూడు వికెట్లతో విధర్బను దెబ్బతీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్లో ముంబై 418 పరుగుల భారీ స్కోర్ సాధించింది. తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని జోడించి విధర్బ ముందు 538 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఉంచింది. ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించలేక విధర్బ చతికిలపడింది. -
ముంబైకు టైటిల్ లాంఛనమే!
ముంబై: అత్యద్భుతం జరిగితే తప్పించి... ముంబై జట్టు 42వసారి రంజీ ట్రోఫీ చాంపియన్గా నిలవడం లాంఛనం కానుంది. ముంబై నిర్దేశించిన 538 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన విదర్భ జట్టు బ్యాటర్లు బుధవారం పట్టుదలతో ఆడారు. ముంబై బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఓవర్నైట్ స్కోరు 10/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ జట్టు ఆట ముగిసే సమయానికి 92 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 248 పరుగులు సాధించింది. విదర్భ విజయం సాధిచాలంటే మ్యాచ్ చివరిరోజు మరో 290 పరుగులు సాధించాలి. చేతిలో 5 వికెట్లు ఉన్నాయి. ఒకవేళ మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా ముంబై జట్టును విజేతగా ప్రకటిస్తారు. నాలుగో రోజు ఆటలో విదర్భ బ్యాటర్లు కరుణ్ నాయర్ (220 బంతుల్లో 74; 3 ఫోర్లు), కెపె్టన్ అక్షయ్ వాడ్కర్ (91 బంతుల్లో 56 బ్యాటింగ్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. వీరిద్దరు ఐదో వికెట్కు 90 పరుగులు జోడించారు. అంతకుముందు అథర్వ తైడె (64 బంతుల్లో 32; 4 ఫోర్లు), ధ్రువ్ షోరే (50 బంతుల్లో 28; 4 ఫోర్లు), అమన్ మోఖాడె (78 బంతుల్లో 32; 2 ఫోర్లు) కూడా ముంబై బౌలర్లకు అంత తొందరగా వికెట్ సమరి్పంచుకోకుండా క్రీజులో సాధ్యమైనంత ఎక్కువసేపు ఉండేందుకు ప్రయత్నించారు. విదర్భ కోల్పోయిన ఐదు వికెట్లు ముంబై స్పిన్నర్లకే లభించడం గమనార్హం. -
రాణించిన రహానే, ముషీర్ ఖాన్.. టైటిల్ దిశగా ముంబై
రంజీ ట్రోఫీ 2024 ఫైనల్లో ముంబై టీమ్ గెలుపు దిశగా సాగుతుంది. విదర్భతో జరుగుతున్న తుది సమరంలో ఆ జట్టు పటిష్ట స్థితిలో ఉంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెకెండ్ ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసి, 260 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ముషీర్ ఖాన్ (51), కెప్టెన్ అజింక్య రహానే (58) అర్దసెంచరీలతో అజేయంగా క్రీజ్లో ఉన్నారు. 119 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై.. 34 పరుగులకే ఓపెనర్లు పృథ్వీ షా (11), భూపేన్ లాల్వాని (18) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే ముషీర్ ఖాన్, రహానే మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి తమ జట్టును సేఫ్ జోన్లోకి చేర్చారు. వీరు మూడో వికెట్కు అజేయమైన 107 పరుగులు జోడించి ముంబైను గెలుపు దిశగా నడిపిస్తున్నారు. చాలాకాలం తర్వాత ముంబై కెప్టెన్ రహానే ఫామ్లోకి వచ్చాడు. కీలకమైన ఫైనల్లో రహానే బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో మెరిశాడు. విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్ అద్భుతమైన బంతితో పృథ్వీ షాను క్లీన్ బౌల్డ్ చేశాడు. లాల్వాని వికెట్ హర్ష్ దూబేకు దక్కింది. అంతకుముందు విదర్భ తొలి ఇన్నింగ్స్లో 105 పరుగులకే కుప్పకూలింది. దవళ్ కులకర్ణి (3/15), షమ్స్ ములానీ (3/32), తనుశ్ కోటియన్ (3/7) విదర్భను దారుణంగా దెబ్బకొట్టారు. విదర్భ ఇన్నింగ్స్లో అథర్వ తైడే (23), యశ్ రాథోడ్ (27), ఆదిత్య థాకరే (19), యశ్ ఠాకూర్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ముంబై కూడా తొలి ఇన్నింగ్స్లో తక్కువ స్కోర్కే పరిమితమైంది. విదర్భ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో ఆ జట్టు 224 పరుగులకే పరిమితమైంది. యశ్ ఠాకూర్ 3, హర్ష్ దూబే 3, ఉమేశ్ యాదవ్ 2, ఆదిత్య థాకరే ఓ వికెట్ పడగొట్టారు. ముంబై ఇన్నింగ్స్లో శార్దూల్ ఠాకూర్ (75) టాప్ స్కోరర్గా నిలిచాడు. ముంబైకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించడంతో పాటు ఆ జట్టు సెకెండ్ ఇన్నింగ్స్లోనూ పటిష్టంగా ఉండటంతో ఆ జట్టునే విజయం వరించవచ్చు. ముంబై ఇప్పటికే ఏ జట్టుకు సాధ్యపడని రీతిలో 41 రంజీ టైటిళ్లు సాధించింది. -
Ranji- శార్దూల్ ఏమన్నాడో విన్నాను: ద్రవిడ్
దేశవాళీ క్రికెట్లో మ్యాచ్ల మధ్య ఎక్కువ విరామం ఉండాలన్న టీమిండియా పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ వ్యాఖ్యలపై హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. శార్దూల్ మాదిరే మెజారిటీ ఆటగాళ్లు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే తప్పక పరిగణనలోకి తీసుకోవాలని బీసీసీఐకి సూచించాడు. కాగా జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనప్పుడు రంజీల్లో కచ్చితంగా ఆడాలంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆటగాళ్లను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముంబై తరుఫు బరిలోకి దిగిన శార్దూల్ ఠాకూర్ సెమీ ఫైనల్లో అదరగొట్టాడు. అలా అయితే కష్టమే కదా తమిళనాడుతో జరిగిన ఈ మ్యాచ్లో సంచలన సెంచరీ(109)తో జట్టును ఫైనల్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. ‘‘కేవలం మూడు రోజుల గ్యాప్లో వరుసగా 10 మ్యాచ్లు ఆడటం అంటే దేశవాళీ క్రికెటర్లకు చాలా కష్టం. ముఖ్యంగా ఫాస్ట్బౌలర్లు ఎక్కువగా గాయాలబారిన పడే అవకాశం ఉంటుంది. గతంలో రెగ్యులర్ మ్యాచ్లకు మూడు రోజులు, నాకౌట్ మ్యాచ్లకు ఐదు రోజుల విరామం ఉండేది. కానీ.. ఇప్పుడు అన్నింటికి కేవలం మూడు రోజుల వ్యవధే ఉంటోంది’’ అని పేర్కొన్నాడు. శరీరాలను పణంగా పెడుతోంది వాళ్లే ఈ నేపథ్యంలో... ఇంగ్లండ్పై టీమిండియా 4-1 సిరీస్ విజయం తర్వాత హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్కు ఈ విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ఈ కామెంట్లు చేసింది శార్దూల్ అనుకుంటా.. అతడే కాదు చాలా మంది క్రికెటర్లు ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తపరిచారు. ఇండియాలో లాంటి పెద్ద దేశంలో ప్రయణాలు, విరామం లేని షెడ్యూళ్లు అంటే కష్టమే. ఆటగాళ్ల ఇబ్బందుల గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే.. విరామం లేని ఆట కోసం వారి శరీరాల(ఆరోగ్యాన్ని)ను పణంగా పెడుతోంది వాళ్లే. కాబట్టి.. ఇలాంటి అంశాల్ని లేవనెత్తుతూ వారు గళం వినిపించినపుడు తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా పలు మార్పులు చేర్పులు ఉండేలా షెడ్యూళ్లను ఎలా ప్లాన్ చేసుకోవాలో ఆలోచించుకోవాలి’’ అని రాహుల్ ద్రవిడ్ శార్దూల్ ఠాకూర్ వంటి ఆటగాళ్లకు అండగా నిలిచాడు. ఆధునిక యుగంలో అవసరం లేదనుకున్న కొన్ని టోర్నీల నిర్వహణ గురించి.. ఆటగాళ్లు, కోచ్ల నుంచి అభిప్రాయాలు సేకరించి పునరాలోచన చేస్తే బాగుంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. చదవండి: షూ కొనుక్కోవడానికీ డబ్బు లేదు.. అతడే ఆదుకున్నాడు -
షూ కొనేందుకు డబ్బు లేదు.. అతడే ఆదుకున్నాడు: శార్దూల్ భావోద్వేగం
“When I did not have money to buy shoes: ‘‘ఇదే తన చివరి ఫస్ట్క్లాస్ మ్యాచ్. తనతో పాటు నాకు కూడా భావోద్వేగ సమయం. చిన్ననాటి నుంచే అతడి ఆటను గమనిస్తూ ఉన్నాను. బౌలింగ్లో నాకెన్నో నైపుణ్యాలు నేర్పించాడు. అంతేకాదు.. షూ కొనడానికి నా దగ్గర డబ్బు లేని సమయంలో.. తన దగ్గర ఉన్న బూట్ల జతలు నాకు ఇచ్చాడు. కెరీర్ ఆరంభంలో నాకెంతో సహాయం చేశాడు’’ అని టీమిండియా క్రికెటర్, ముంబై ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఉద్వేగానికి లోనయ్యాడు. I.C.Y.M.I The Mumbai team gave a Guard Of Honour on Day 1 to Dhawal Kulkarni, who is playing his final first-class game 👏@dhawal_kulkarni | @IDFCFIRSTBank | #Final | #MUMvVID Follow the match ▶️ https://t.co/k7JhkLhOID pic.twitter.com/LTCs0142fc — BCCI Domestic (@BCCIdomestic) March 11, 2024 కాగా రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ ఫైనల్కు చేరుకున్న ముంబై.. టైటిల్ కోసం విదర్భతో పోటీ పడుతోంది. ఇరు జట్ల మధ్య ఆదివారం ఫైనల్ మ్యాచ్ మొదలైంది. టాస్ ఓడిన ముంబై తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా(46), భూపేన్ లల్వాణి(37) మెరుగైన ఆరంభమే అందించినా.. విదర్భ బౌలర్ల దెబ్బకు మిడిలార్డర్ కుప్పకూలింది. ఫలితంగా 111 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన శార్దుల్ ఠాకూర్ (69 బంతుల్లో 75; 8 ఫోర్లు, 3 సిక్స్లు) విదర్భ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 37 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసిన శార్దుల్ చివరి వికెట్గా వెనుదిరిగాడు. దీంతో 224 పరుగుల వద్ద ముంబై తొలి ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం.. తొలి రోజే బ్యాటింగ్కు దిగిన విదర్భను ముంబై పేసర్ ధవళ్ కులకర్ణి దెబ్బకొట్టాడు. The experience of Dhawal Kulkarni provides Mumbai a wicket in the evening session! Vidarbha lose the crucial wicket of Karun Nair. Follow the match ▶️ https://t.co/L6A9dXYmZA#RanjiTrophy | #MUMvVID | #Final | @IDFCFIRSTBank pic.twitter.com/VNk7HAkgSU — BCCI Domestic (@BCCIdomestic) March 10, 2024 ధవళ్ కులకర్ణిని అభినందిస్తున్న సహచరులు (PC: PTI) మరో పేసర్ శార్దూల్ ఠాకూర్ కూడా రాణించాడు. తొలిరోజు ఆట ముగిసే ధవళ్ రెండు, శార్దూల్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఆట పూర్తయ్యేసరికి విదర్భ 3 వికెట్లు కోల్పోయి 31 పరుగులు మాత్రమే చేసింది. ధవళ్ కులకర్ణి రిటైర్మెంట్ ఇదిలా ఉంటే.. 35 ఏళ్ల ధవళ్ కులకర్ణి ఈ మ్యాచ్ తర్వాత ఫస్ట్క్లాస్ క్రికెట్ నుంచి కూడా సెలవు తీసుకోకున్నాడు. ఇప్పటికే రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన ఈ రైటార్మ్ పేసర్.. మోహిత్ అవస్థి గాయం కారణంగా విదర్భతో ఫైనల్ మ్యాచ్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో తొలి రోజు ఆట అనంతరం శార్దూల్ ఠాకూర్ మాట్లాడుతూ.. ధవళ్ కులకర్ణితో తన అనుబంధం గురించి గుర్తుచేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాను బాధపడిన సమయంలో కులకర్ణి తనకు అండగా నిలబడ్డాడంటూ అభిమానం చాటుకున్నాడు. చదవండి: Ind vs Eng 2024: టీమిండియా నయా సంచలనాలు.. ధనాధన్ దంచికొట్టి హీరోలుగా! -
Ranji Trophy 2024: ముంబై 224 ఆలౌట్
ముంబై: విదర్భ జట్టుతో ఆదివారం మొదలైన రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీ ఫైనల్లో తొలుత బ్యాటింగ్కు దిగిన ముంబై తొలి ఇన్నింగ్స్లో 64.3 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు పృథ్వీ షా (46; 5 ఫోర్లు), భూపేన్ లాల్వాని (37; 4 ఫోర్లు) తొలి వికెట్కు 81 పరుగులు జోడించారు. భూపేన్ అవుటయ్యాక ముంబై పతనం మొదలైంది. ముంబై 111/6తో ఇబ్బందుల్లో పడిన దశలో శార్దుల్ ఠాకూర్ (69 బంతుల్లో 75; 8 ఫోర్లు, 3 సిక్స్లు) విదర్భ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 37 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసిన శార్దుల్ చివరి వికెట్గా వెనుదిరిగాడు. విదర్భ బౌలర్లలో హర్‡్ష దూబే, యశ్ ఠాకూర్ 3 వికెట్ల చొప్పున తీయగా... ఉమేశ్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భ ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది. -
మరోసారి రెచ్చిపోయిన శార్దూల్ ఠాకూర్
టీమిండియా ఆల్రౌండర్, ముంబై ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ రంజీల్లో చెలరేగిపోతున్నాడు. ఇటీవల తమిళనాడుతో జరిగిన సెమీఫైనల్లో మెరుపు శతకం (104 బంతుల్లో 109) బాది జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన శార్దూల్.. ప్రస్తుతం విదర్భతో జరుగుతున్న ఫైనల్లో విధ్వంసకర అర్దసెంచరీ (69 బంతుల్లో 75; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ను అందించాడు. Century in the semi-final& a brilliant 75 when the team was struggling at 111-6 in finalLORD @imShard show in #RanjiTrophy2024 🔥pic.twitter.com/U1vjWvk9Ws— CricTracker (@Cricketracker) March 10, 2024 ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. విదర్భ బౌలర్లు రెచ్చిపోవడంతో 224 పరుగులకే పరిమితమైంది. హర్ష్ దూబే (3/62), యశ్ ఠాకూర్ (3/54), ఉమేశ్ యాదవ్ (2/43), ఆదిత్య థకారే (1/36) ముంబై పతనాన్ని శాశించారు. ముంబై ఇన్నింగ్స్లో శార్దూల్ ఠాకూర్ టాప్ స్కోరర్గా నిలిచాడు. ముంబై ఇన్నింగ్స్కు ఓపెనర్లు పృథ్వీ షా (46), భూపేన్ లాల్వాని (37) శుభారంభాన్ని అందించినప్పటికీ.. మిడిలార్డర్ వైఫల్యం ఆ జట్టు కొంప ముంచింది. ముషీర్ ఖాన్ (6), అజింక్య రహానే (7), శ్రేయస్ అయ్యర్ (7), హార్దిక్ తామోర్ (5), షమ్స్ ములానీ (13) తక్కువ స్కోర్లకే పెవిలియన్కు చేరారు. భీకరఫామ్లో ఉన్న 10, 11వ ఆటగాళ్లు తనుశ్ కోటియన్ (8), తుషార్ దేశ్పాండే (14) ఈ మ్యాచ్లో చేతులెత్తేశారు. బ్యాటింగ్లో రాణించిన శార్దూల్.. బౌలింగ్లోనూ సత్తా చాటాడు. ముంబై ఇన్నింగ్స్ అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భను శార్దూల్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. శార్దూల్ విదర్భ ఓపెనర్, ఇన్ ఫామ్ బ్యాటర్ దృవ్ షోరేను డకౌట్ చేసి పెవిలియన్కు పంపాడు. నాలుగు ఓవర్ల అనంతరం విదర్భ స్కోర్ వికెట్ నష్టానికి నాలుగు పరుగులుగా ఉంది. -
ఏమైంది శ్రేయస్? మరోసారి ఫెయిల్! ఇక కష్టమే మరి
రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ ఫైనల్లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై, విధర్భ జట్లు తలపడుతున్నాయి. ఈ ఫైనల్ పోరులో టీమిండియా స్టార్, ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్ దారుణంగా విఫలమయ్యాడు. కీలక సమయంలో బ్యాటింగ్ వచ్చిన అయ్యర్.. కేవలం 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. అయ్యర్ షార్ట్ బాల్ వీక్నెస్ను విధర్బ బౌలర్ ఉమేశ్ యాదవ్ క్యాష్ చేసుకున్నాడు. షార్ట్ పిచ్ బంతులతో అయ్యర్ను ఉమేశ్ ముప్పుతిప్పలు పెట్టాడు. ఆఖరి ఉమేశ్ బౌలింగ్లోనే స్లిప్లో కరుణ్ నాయర్కు క్యాచ్ ఇచ్చి అయ్యర్ ఔటయ్యాడు. ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టుల్లో విఫలమై భారత జట్టులో చోటు కోల్పోయిన అయ్యర్.. ఇప్పుడు దేశీవాళీ క్రికెట్లో సైతం సతమతమవుతున్నాడు. అదే విధంగా బీసీసీఐ కాంట్రాక్ట్ను సైతం అయ్యర్ కోల్పోయాడు. దీంతో అయ్యర్ భారత జట్టులోకి ఎంట్రీ ప్రశ్నార్థకంగా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు లంచ్ విరామానికి ముంబై 4 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. క్రీజులో హార్దిక్ తామోర్(4), అజింక్యా రహానే(6) పరుగులతో ఉన్నారు. అంతకుముందు పృథ్వీ షా(46) పరుగులతో రాణించాడు. చదవండి: IPL 2024: 'చెన్నై, ముంబై, సన్రైజర్స్ కాదు.. ఈ సారి ఐపీఎల్ టైటిల్ ఆ జట్టుదే' -
ముంబై X విదర్భ
ప్రతిష్టాత్మక దేశవాళీ ఫస్ట్ క్లాస్ టోర్నీ రంజీ ట్రోఫీ ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. నేటినుంచి జరిగే ఈ తుది సమరంలో 41 సార్లు చాంపియన్ ముంబై, 2 సార్లు విజేత విదర్భతో తలపడనుంది. ఉ.గం.9.30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమాలో ప్రత్యక్షప్రసారం -
Ranji Trophy: ఉత్కంఠ పోరులో ఘన విజయం.. మూడోసారి ఫైనల్కు
నాగ్పూర్: రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో విదర్భ ఫైనల్కు దూసుకెళ్లింది. ఆఖరి రోజు వరకు రసవత్తరంగా సాగిన సెమీస్లో మధ్యప్రదేశ్ను ఓడించి తుదిపోరుకు అర్హత సాధించింది. ఆఖరి మెట్టుపై ముంబైతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. నాగ్పూర్ వేదికగా మధ్యప్రదేశ్- విదర్భ మధ్య రంజీ తాజా ఎడిషన్ తొలి సెమీ ఫైనల్ జరిగింది. శనివారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన విదర్భ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మధ్యప్రదేశ్ బౌలర్ల దెబ్బకు తొలి ఇన్నింగ్స్లో కేవలం 170 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన మధ్యప్రదేశ్ 252 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. వికెట్ కీపర్ హిమాన్షు మంత్రి అద్భుత శతకం(126) కారణంగా ఈ మేరకు మెరుగైన స్కోరు సాధించింది. విదర్భపై 82 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన విదర్భ 402 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆరో నంబర్ బ్యాటర్ యశ్ రాథోడ్ సూపర్ సెంచరీ(141), కెప్టెన్, వికెట కీపర్ బ్యాటర్ అక్షయ్ వాడ్కర్ అద్భుత అర్ధ శతకం(77) కారణంగా మధ్యప్రదేశ్కు దీటుగా బదులివ్వగలిగింది. మధ్యప్రదేశ్కు 321 పరుగుల లక్ష్యం విధించింది. ఈ క్రమంలో మంగళవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మధ్యప్రదేశ్ తమ రెండో ఇన్నింగ్స్లో 71 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. గెలుపు దక్కాలంటే మధ్యప్రదేశ్ మరో 93 పరుగులు చేయాల్సి ఉండగా... నాలుగు వికెట్లు పడగొడితే విదర్భ మూడోసారి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకునే స్థితిలో నిలిచింది. ఈ క్రమంలో బుధవారం నాటి ఐదో రోజు ఆటను 228/6 ఓవర్నైట్ స్కోరుతో మొదలుపెట్టిన మధ్యప్రదేశ్.. ఆరంభంలోనే కుమార్ కార్తికేయ(4), అతడి స్థానంలో వచ్చిన అనుభవ్ అగర్వాల్(6) వికెట్లు కోల్పోయింది. నైట్వాచ్ మన్ సారాంశ్ జైన్ ఆవేశ్ ఖాన్తో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు బౌల్డ్ కావడంతో.. మధ్యప్రదేశ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో 81.3 ఓవర్ వద్ద ఖెజ్రోలియా(11) బౌల్డ్ అవడంతో మధ్యప్రదేశ్ ఓటమి ఖరారైంది. 𝐕𝐢𝐝𝐚𝐫𝐛𝐡𝐚 𝐚𝐫𝐞 𝐢𝐧𝐭𝐨 𝐭𝐡𝐞 𝐟𝐢𝐧𝐚𝐥! 🙌🙌 They beat Madhya Pradesh by 62 runs in a tightly fought contest. A terrific comeback from the Akshay Wadkar-led side 👌@IDFCFIRSTBank | #VIDvMP | #RanjiTrophy | #SF1 Scorecard ▶️ https://t.co/KsLiJPuqXr pic.twitter.com/YFY1kaO1x7 — BCCI Domestic (@BCCIdomestic) March 6, 2024 విదర్భ 62 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్లో అడుగుపెట్టింది. అద్భుత శతకంతో విదర్భ విజయంలో కీలక పాత్ర పోషించిన యశ్ రాథోడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. కాగా అంతకుముందు మరో సెమీస్ మ్యాచ్లో ముంబై తమిళనాడుపై గెలిచి రికార్డు స్థాయిలో 48వ సారి ఫైనల్లో ప్రవేశించింది. ఇక విదర్భ ఫైనల్ చేరడం ఇది మూడోసారి. మార్చి 10న ముంబై, విదర్భ టైటిల్ కోసం పోటీ మొదలుపెట్టనున్నాయి. Timber Strikes 🔥 Vidarbha wrapped it up early today, picking up the remaining 4️⃣ wickets to enter the final. 👌@IDFCFIRSTBank | #VIDvMP | #RanjiTrophy | #SF1 Scorecard ▶️ https://t.co/KsLiJPuYMZ pic.twitter.com/ny6DYBQ7bM — BCCI Domestic (@BCCIdomestic) March 6, 2024 -
ఇషాన్, శ్రేయస్ల కాంట్రాక్ట్ రద్దు: సచిన్ రియాక్షన్ వైరల్
దేశవాళీ క్రికెట్ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి తీసుకున్న నిర్ణయంపై దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ హర్షం వ్యక్తం చేశాడు. అగ్రశ్రేణి ఆటగాళ్లు ఫస్ల్క్లాస్ క్రికెట్ బరిలో దిగడం ద్వారా డొమెస్టిక్ టోర్నీలకు మరింత ఆదరణ పెరుగుతుందన్నాడు. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా ముంబై తరఫున ఆడేందుకు ఎంతో ఆతురతగా ఎదురుచూసే వాడినని సచిన్ టెండుల్కర్ గుర్తు చేసుకున్నాడు. కాగా జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు సెంట్రల్ కాంట్రాక్ట్ క్రికెటర్లు కచ్చితంగా రెడ్ బాల్ క్రికెట్(ఫస్ట్క్లాస్) ఆడాల్సిందేనని బీసీసీఐ ఇటీవల నిబంధన విధించిన విషయం తెలిసిందే. ఫిట్నెస్ కారణాల దృష్ట్యా ఇబ్బందిపడే వారు మినహా ప్రతి ఒక్కరు.. ముఖ్యంగా యువ ఆటగాళ్లు రంజీ బరిలో దిగాల్సిందేనని బోర్డు ఆటగాళ్లకు ఆదేశాలిచ్చింది. హెడ్కోచ్, కెప్టెన్, సెలక్టర్లు చెప్పినపుడు ఏ ఆటగాడైనా సరే దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో 2023-24 ఏడాదికిగానూ ప్రకటించిన వార్షిక కాంట్రాక్టులలో ముంబై బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, జార్ఖండ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్లకు మొండిచేయి చూపింది. రంజీ బరిలో దిగాలన్న కోచ్ ఆదేశాలను పెడచెవిన పెట్టారనే కారణంతో వారిద్దరిపై వేటు పడినట్లు తెలిసింది. ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్ ఎక్స్ వేదికగా రంజీ ట్రోఫీ ప్రాధాన్యం గురించి వివరిస్తూ.. ‘‘తాజా రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముంబై జట్టు పడిలేచిన కెరటంలా ఫైనల్కు దూసుకువచ్చింది. మరో సెమీస్ మ్యాచ్లో చివరి రోజు వరకు ఆట కొనసాగుతున్న వైనం ముచ్చటగా ఉంది. ఈ మ్యాచ్లో మధ్యప్రదేశ్ విజయానికి 90కి పైగా పరుగులు, విదర్భకు నాలుగు వికెట్లు కావాలి. నిజానికి నా కెరీర్ ఆసాంతం ఎప్పుడు ముంబైకి ఆడే అవకాశం వచ్చినా కచ్చితంగా బరిలో దిగే వాడిని. అక్కడి డ్రెస్సింగ్ రూంలో దాదాపు 7-8 మంది టీమిండియా ఆటగాళ్లు ఉండేవారు. వారితో కలిసి అక్కడ రూం షేర్ చేసుకోవడం మరింత సరదాగా ఉండేది. టీమిండియా తరఫున టాప్ ప్లేయర్లుగా ఉన్నవాళ్లు దేశవాళీ క్రికెట్లో వారి వారి జట్లకు ఆడితే ఆదరణ పెరుగుతుంది. యువ ఆటగాళ్లకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. కొత్త ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అంతేకాదు ఫామ్లేమితో ఇబ్బంది పడేవాళ్లు తిరిగి బేసిక్స్ నుంచి మొదలుపెట్టి పొరపాట్లను సరిచేసుకునే అవకాశం దొరుకుతుంది. స్టార్ క్రికెటర్లు డొమెస్టిక్ టోర్నీల్లో ఆడితే క్రమక్రమంగా అభిమానులు కూడా దేశవాళీ జట్లకు మద్దతుగా నిలుస్తారు. నిజంగా దేశవాళీ క్రికెట్కు కూడా బీసీసీఐ సమాన ప్రాధాన్యం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది’’ అని సుదీర్ఘ నోట్ షేర్ చేశాడు. కాగా సచిన్ టెండుల్కర్ మంగళవారం ఈ మేరకు పోస్ట్ చేయగా.. బుధవారం నాటి ఆటలో భాగంగా రంజీ సెమీస్లో మధ్యప్రదేశ్పై విదర్భ 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. The Ranji Trophy semi-finals have been riveting! @MumbaiCricAssoc’s march into the finals was aided by a brilliant batting recovery, while the other semi-final hangs in the balance going into the last day - Madhya Pradesh need 90+ runs to win, Vidarbha need 4 wickets.… — Sachin Tendulkar (@sachin_rt) March 5, 2024 -
ఇంట్లో డబ్బు సంచులు.. పోలీసులకు చిక్కిన మాజీ క్రికెటర్
భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కోచ్ తుషార్ ఆరోథే మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. అతడి ఇంట్లో కోటి రూపాయల నగదు పట్టుబడటంతో వడోదర పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. కాగా గుజరాత్కు చెందిన ఫస్ట్క్లాస్ క్రికెటర్ తుషార్ ఆరోథే. 1985- 2004 మధ్య రంజీల్లో బరోడా జట్టు తరఫున వందకు పైగా మ్యాచ్లు ఆడాడు ఈ స్పిన్ ఆల్రౌండర్. కెప్టెన్గానూ వ్యవహరించిన అనుభవం అతడికి ఉంది. అయితే, ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం తుషార్ ఆరోథే కోచ్గా అవతారమెత్తాడు. ఈ క్రమంలో అంచెలంచెలుగా ఎదిగి భారత మహిళా జట్టుకు కోచ్గా 2013లో నియమితుడయ్యాడు. ఆ మరుసటి ఏడాదే మళ్లీ బరోడా కోచ్గా వచ్చి.. 2015లో రాజీనామా చేశాడు. తుషార్ ఆరోథే కుమారుడు రిషి ఆరోథే కూడా ఫస్ట్క్లాస్ క్రికెటరే. ఇదిలా ఉంటే.. వివాదాలతో సావాసం చేయడం తుషార్ ఆరోథేకు అలవాటు. 2019లో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఓ కేఫ్లో బెట్టింగ్ చేస్తున్న సమయంలో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో బెయిల్ మీద విడుదలైన అనంతరం.. క్రికెట్ మాత్రమే తనకున్న ఉపాధి అని, ఇలాంటి చెత్త పనులు చేయనంటూ తుషార్ ఆరోథే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే, తాజాగా మరోసారి పోలీసులకు చిక్కడం గమనార్హం. తుషార్ కొడుకు రిషి అపార్ట్మెంట్కు భారీ మొత్తంలో నగదు తరలినట్లు తమకు సమాచారం అందిందని స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఇన్స్పెక్టర్ వీఎస్ పాటిల్ జాతీయ మీడియాకు తెలిపారు. ఈ క్రమంలో తుషార్ ఆరోథేకు చెందిన ప్రతాప్గంజ్ నివాసంలోనూ సోదాలు జరుపగా కోటికి పైగా నగదు పట్టుబడిందని.. దీంతో అతడిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. డబ్బులన్నీ సంచుల్లో కుక్కి పెట్టారని.. ఈ లావాదేవీల గురించి వివరణ అడుగగా తుషార్ సంతృప్తికర సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు. కాగా ఆదివారం నాటి ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
మరీ ఇంత స్వార్థమా?.. కోచ్ ఇలా చేయడం తప్పే: డీకే ఫైర్
DK Fumes As Tamil Nadu Coach 'Throws Captain Under The Bus': తమిళనాడు క్రికెట్ కోచ్ సులక్షణ్ కులకర్ణి తీరుపై టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్ మండిపడ్డాడు. జట్టు ఓటమికి కెప్టెన్ను బాధ్యుడిని చేసేలా స్వార్థపూరితంగా మాట్లాడటం కోచ్ స్థాయికి తగదని చురకలు అంటించాడు. కాగా రంజీ ట్రోఫీ 2023-24లో భాగంగా ముంబైతో జరిగిన సెమీ ఫైనల్లో తమిళనాడు ఓటమిపాలై.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇన్నింగ్స్ 70 పరుగుల భారీ తేడాతో ఓడి ఇంటిబాటపట్టింది. ఈ నేపథ్యంలో తమిళనాడు కోచ్ సులక్షణ్ కులకర్ణి స్పందిస్తూ.. కెప్టెన్ ఆర్.సాయి కిషోర్ నిర్ణయాలను తప్పుబట్టాడు. ఓ ముంబైకర్గా నాకన్నీతెలుసు.. కానీ టాస్ గెలిచినప్పుడు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని పొరపాటు చేశాడని విమర్శించాడు. ఈ మేరకు.. ‘‘ఆరోజు వికెట్ను నేను గమనించాను. కోచ్గా, మంబైకర్(ముంబైకి చెందినవాడు)గా అక్కడి పిచ్ పరిస్థితులపై నాకు పూర్తి అవగాహన ఉంది. టాస్ గెలిచినపుడు బౌలింగ్ చేయించాలని అనుకుంటే.. మా కెప్టెన్ మాత్రం తనకు నచ్చినట్లుగా నిర్ణయం తీసుకున్నాడు. ఏదేమైనా బాస్ అతడే. అతడి నిర్ణయమే ఫైనల్. కేవలం ఇన్పుట్స్, ఫీడ్బ్యాక్ ఇవ్వడం వరకే నేను పరిమితం’’ అని సులక్షణ్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు. నిజానికి తాము మొదటి రోజు ఆట టాస్ సమయంలోనే ఓడిపోయామంటూ సాయి కిషోర్ను ఓటమికి బాధ్యుడిని చేసేలా వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంపై దినేశ్ కార్తిక్ ఎక్స్ వేదికగా స్పందించాడు. కోచ్కు ఇంత స్వార్థం పనికిరాదు.. ‘‘ఇలా మాట్లాడటం కచ్చితంగా తప్పే. కోచ్ నుంచి ఇలాంటి మాటలు వినాల్సి రావడం నన్ను నిరాశకు గురిచేసింది. ఏడేళ్ల తర్వాత తొలిసారి జట్టును రంజీ సెమీస్ వరకు తీసుకువచ్చిన కెప్టెన్ను అభినందించాల్సింది పోయి.. ఇలా కోచే స్వయంగా.. బహిరంగంగా అతడిని విమర్శించడం సరికాదు’’ అని తమిళనాడు వికెట్ కీపర్ బ్యాటర్ డీకే ఆగ్రహం వ్యక్తం చేశాడు. This is soo WRONG This is so disappointing from the coach ..instead of backing the captain who has brought the team to the semis after 7 yrs and thinking it's a start for good things to happen, the coach has absolutely thrown his captain and team under the bus 👎🏽👎🏽👎🏽👎🏽👎🏽 https://t.co/Ii61X7Ajqs — DK (@DineshKarthik) March 5, 2024 తమిళనాడు ఆట ముగిసిందిలా.. ఫైనల్లో ముంబై రంజీ ట్రోఫీలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ 41 సార్లు చాంపియన్ ముంబై జట్టు 47వ సారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. సొంతమైదానంలో తమిళనాడుతో జరిగిన తొలి సెమీఫైనల్లో ముంబై ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓవర్నైట్ స్కోరు 353/9తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై 106.5 ఓవర్లలో 378 పరుగులకు ఆలౌటైంది. తమిళనాడు బౌలర్లలో కెప్టెన్ సాయికిశోర్ 6 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం 232 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తమిళనాడు షమ్స్ ములానీ (4/53), శార్దుల్ ఠాకూర్ (2/16), మోహిత్ (2/26), తనుష్ (2/18) ధాటికి 162 పరుగులకే కుప్పకూలి ఓడిపోయింది. శార్దుల్ ఠాకూర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. చదవండి: గోపీచంద్ అకాడమీకి బైబై..!.. అమెరికాకు పయనం! -
యశ్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్.. 261 పరుగుల ఆధిక్యంలో విదర్భ
రంజీ ట్రోఫీ 2024 తొలి సెమీఫైనల్లో విదర్భ జట్టు 261 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. మధ్యప్రదేశ్తో జరుగుతున్న ఈ మ్యాచ్లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఎంపీ టీమ్ సెకెండ్ ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 343 పరుగులు చేసింది. యశ్ రాథోడ్ (97 నాటౌట్).. కెప్టెన్ అక్షయ్ వాద్కర్తో (77) కలిసి బాధ్యతాయుతమై ఇన్నింగ్స్ ఆడి విదర్భకు ఆధిక్యతను అందించాడు. తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకే కుప్పకూలిన విదర్భ సెకెండ్ ఇన్నింగ్స్లో అనూహ్యంగా పుంజుకుని మధ్యప్రదేశ్పై పైచేయి సాధించింది. యశ్, అక్షయ్తో పాటు అయన్ మోఖడే (59) అర్దసెంచరీతో రాణించగా.. దృవ్ షోరే (40), కరుణ్ నాయర్ (38) పర్వాలేదనిపించారు. యశ్తో పాటు ఆదిత్య సర్వటే (14) క్రీజ్లో ఉన్నాడు. ఎంపీ బౌలర్లలో అనుభవ్ అగర్వాల్, కుమార్ కార్తికేయ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఆవేశ్ ఖాన్, కేజ్రోలియా చెరో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులకు ఆలౌటైంది. హిమాన్షు మంత్రి (126) సూపర్ సెంచరీతో సత్తా చాటాడు. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్లో మంత్రి మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. విదర్భ బౌలర్లలో ఉమేశ్ యాదవ్, యశ్ ఠాకూర్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. వాఖరే 2, సర్వటే ఓ వికెట్ దక్కించుకున్నారు. దీనికి ముందు విదర్భ తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకే కుప్పకూలింది. ఆవేశ్ ఖాన్ (4/49), కేజ్రోలియా (2/38), వెంకటేశ్ అయ్యర్ (2/28), అనుభవ్ అగర్వాల్ (1/42), కుమార్ కార్తికేయ (1/2) విదర్భ ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. విదర్భ ఇన్నింగ్స్లో కరుణ్ నాయర్ (63) ఒక్కడే పర్వాలేదనిపించాడు. కాగా, మరో సెమీఫైనల్లో తమిళనాడును మట్టికరిపించి ముంబై ఫైనల్కు చేరింది. -
తమిళనాడును చిత్తు చేసిన ముంబై.. రికార్డు స్థాయిలో 48వ సారి ఫైనల్లోకి ప్రవేశం
ముంబై క్రికెట్ జట్టు రంజీ ట్రోఫీలో తమ గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఈ జట్టు రికార్డు స్థాయిలో 48వ సారి ఫైనల్లోకి ప్రవేశించింది. రంజీ ట్రోఫీ చరిత్రలో ఏ జట్టు ఇన్ని సార్లు ఫైనల్స్కు అర్హత సాధించలేదు. ముంబై తర్వాత ఆత్యధికంగా (14) కర్ణాటక/మైసూర్ ఫైనల్స్కు చేరింది. ఈ రెండు జట్ల తర్వాత ఢిల్లీ (15), మధ్యప్రదేశ్/హోల్కర్ (12), బరోడా (9), సౌరాష్ట్ర (5), విదర్భ (2), బెంగాల్ (15), తమిళనాడు/మద్రాస్ (12), రాజస్థాన్ (10), హైదరాబాద్ (5) అత్యధిక సార్లు ఫైనల్స్కు అర్హత సాధించాయి. దేశవాలీ టోర్నీలో 48 సార్లు ఫైనల్స్కు చేరిన ముంబై ఏ జట్టుకు ఊహకు సైతం అందని విధంగా 41 సార్లు టైటిల్ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్గా సౌరాష్ట్ర ఉంది. ఈ జట్టు అనూహ్య రీతిలో క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టింది. మ్యాచ్ విషయానికొస్తే.. ఇవాళ (మార్చి 4) ముగిసిన రెండో సెమీఫైనల్లో ముంబై తమిళనాడును ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో చిత్తు చేసింది. శార్దూల్ ఠాకూర్ ఆల్రౌండ్ షోతో (109, 4 వికెట్లు) ముంబై గెలుపులో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు తొలి ఇన్నింగ్స్లో 146 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ముంబై తొలి ఇన్నింగ్స్లో 378 పరుగుల భారీ స్కోర్ చేసింది. శార్దూల్ ఠాకూర్ మెరుపు సెంచరీతో విరుచుకుపడ్డాడు. సెకెండ్ ఇన్నింగ్స్లో సైతం చేతులెత్తేసిన తమిళనాడు 162 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్న శార్దూల్ ఠాకూర్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మరోవైపు మధ్యప్రదేశ్తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో విదర్భ 199 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఆట మూడో రోజు కొనసాగుతుంది. -
శార్దూల్, హిమాన్షు శతకాలు.. ముంబై, మధ్యప్రదేశ్ పైచేయి
రంజీ ట్రోఫీ 2024 సెమీఫైనల్స్లో ముంబై, మధ్యప్రదేశ్ జట్లు పైచేయి సాధించాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఈ రెండు జట్లు.. తమతమ ప్రత్యర్దుల కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. ముంబై తమిళనాడుపై.. మధ్యప్రదేశ్ విదర్భపై ఆధిక్యతను ప్రదర్శిస్తున్నాయి. హిమాన్షు సూపర్ సెంచరీ.. నాగ్పూర్లో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో విదర్భ రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెకెండ్ ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది. ఈ జట్టు మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 69 పరుగులు వెనుకపడి ఉంది. అథర్వ తైడే (2) ఔట్ కాగా.. దృవ్ షోరే (10), అక్షయ్ వాఖరే (1) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు హిమాన్షు మంత్రి (126) సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులు చేసింది. హిమాన్షు మినహా మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్లో ఎవరూ రాణించలేకపోయారు. ఉమేశ్ యాదవ్ (3/40), యశ్ ఠాకూర్ (3/51), వాఖరే (2/68), సర్వటే (1/48) మధ్యప్రదేశ్ పతనాన్ని శాశించారు. దీనికి ముందు ఆవేశ్ ఖాన్ (4/49) విజృంభించడంతో విదర్భ తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకే ఆలౌటైంది. కరుణ్ నాయర్ (63) టాప్ స్కోరర్గా నిలిచాడు. శతక్కొట్టిన శార్దూల్.. ముంబై వేదికగా తమిళనాడుతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో ముంబై ఆధిక్యత ప్రదర్శిస్తుంది. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన శార్దూల్ (109) మెరుపు శతకంతో విరుచుకుపడటంతో ముంబై తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. 10, 11 స్థానాల్లో వచ్చి సెంచరీలతో (క్వార్టర్ ఫైనల్స్లో) సంచలనం సృష్టించిన తనుశ్ కోటీయన్ (74), తుషార్ దేశ్ పాండే (17) క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం ముంబై 207 పరుగుల లీడ్లో కొనసాగుతుంది. సాయికిషోర్ ఆరేసి (6/97) ముంబైను దెబ్బకొట్టాడు. అంతకుముందు తమిళనాడు తొలి ఇన్నింగ్స్లో 146 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లు సంయుక్తంగా రాణించడంతో తమిళనాడు ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. తుషార్ దేశ్ పాండే 3, ముషీర్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, తనుశ్ కోటియన్ తలో 2 వికెట్లు, మోహిత్ అవస్థి ఓ వికెట్ పడగొట్టారు. తమిళనాడు ఇన్నింగ్స్లో విజయ్ శంకర్ (44), వాషింగ్టన్ సుందర్ (43) కాస్త పర్వాలేదనిపించగా.. మిగతా వాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. -
సెంచరీ సాధించిన శార్దూల్ ఠాకూర్.. మొట్టమొదటిది
ముంబై ఆటగాడు, టీమిండియా ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ సెంచరీతో (109) మెరిశాడు. రంజీ ట్రోఫీ 2024లో భాగంగా తమిళనాడుతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో అతను ఈ ఫీట్ను సాధించాడు. జట్టు కష్టాల్లో (106/7) ఉన్నప్పుడు బరిలోకి దిగిన శార్దూల్.. బాధ్యతాయుతంగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీని అతను కేవలం 89 బంతుల్లోనే సాధించాడు. ఇందులో 13 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. రంజీల్లో శార్దూల్కు ఇది మొదటి సెంచరీ. Shardul Thakur 🫡pic.twitter.com/6ySG9JOwcA — CricTracker (@Cricketracker) March 3, 2024 శార్దూల్ సెంచరీతో కదంతొక్కడంతో ముంబై తమ తొలి ఇన్నింగ్స్లో గౌరవప్రదమైన స్కోర్ చేసింది. 88 ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసి, 157 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. తనుశ్ కోటియన్ (40), తుషార్ దేశ్పాండే క్రీజ్లో ఉన్నారు. ముంబై ఇన్నింగ్స్లో ముషీర్ ఖాన్ (55) అర్ద సెంచరీతో రాణించగా.. హార్దిక్ తామోర్ (35) పర్వాలేదనిపించాడు. సాయికిషోర్ (6/79) ముంబైని ముప్పుతిప్పలు పెట్టాడు. కుల్దీప్ సేన్ 2, సందీప్ వారియర్ ఓ వికెట్ దక్కించకున్నారు. దీనికి ముందు తొలి ఇన్నింగ్స్లో తమిళనాడు 146 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లు సంయుక్తంగా రాణించడంతో తమిళనాడు ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. తుషార్ దేశ్ పాండే 3, ముషీర్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, తనుశ్ కోటియన్ తలో 2 వికెట్లు, మోహిత్ అవస్థి ఓ వికెట్ పడగొట్టారు. తమిళనాడు ఇన్నింగ్స్లో విజయ్ శంకర్ (44), వాషింగ్టన్ సుందర్ (43) కాస్త పర్వాలేదనిపించగా.. మిగతా వాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. -
రికార్డుల్లోకెక్కిన తమిళనాడు కెప్టెన్
తమిళనాడు రంజీ జట్టు కెప్టెన్ సాయికిషోర్ రికార్డు పుటల్లోకెక్కాడు. ముంబైతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో 6 వికెట్లు తీయడం ద్వారా ప్రస్తుత సీజన్లో తన వికెట్ల సంఖ్యను 52 పెంచుకున్నాడు. తద్వారా ఓ రంజీ సీజన్లో 50 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన మూడో తమిళ బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. అలాగే ప్రస్తుత సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గానూ నిలిచాడు. ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో సాయికిషోర్ తర్వాత అజిత్ రామ్ (41), ధరేంద్ర సిన్హ్ జడేజా (41), హితేశ్ వాలుంజ్ (41), గౌరవ్ యాదవ్ (41) ఉన్నారు. ఇదిలా ఉంటే, ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో తమిళనాడు తడబాటుకు గురైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న తమిళనాడు.. ముంబై బౌలర్లు సంయుక్తంగా రాణించడంతో 146 పరుగులకే కుప్పకూలింది. తుషార్ దేశ్ పాండే 3, ముషీర్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, తనుశ్ కోటియన్ తలో 2 వికెట్లు, మోహిత అవస్థి ఓ వికెట్ పడగొట్టారు. తమిళనాడు ఇన్నింగ్స్లో విజయ్ శంకర్ (44), వాషింగ్టన్ సుందర్ కాస్త పర్వాలేదనిపించగా.. మిగతా వాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై... శార్దూల్ ఠాకూర్ (82 నాటౌట్), ముషీర్ ఖాన్ (55) రాణించడంతో రెండో రోజు మూడో సెషన్ సమయానికి 8 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. హార్దిక్ తామోర్ (35) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. శార్దూల్కు జతగా నుశ్ కోటియన్ (20) క్రీజ్లో ఉన్నాడు. సాయికిషోర్ (6/79) ముంబైని ముప్పుతిప్పలు పెట్టాడు. సందీప్ వారియర్, కుల్దీప్ సేన్ తలో వికెట్ దక్కించకున్నారు. ప్రస్తుతం ముంబై 108 పరుగుల లీడ్లో ఉంది. -
కష్టాల్లో జట్టు.. తుస్సుమన్పించిన శ్రేయస్ అయ్యర్! స్టంప్స్ ఎగిరిపోయాయిగా
ఫస్ట్క్లాస్ క్రికెట్లో రీ ఎంట్రీ ఇచ్చిన ముంబై బ్యాటర్, టీమిండియా మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ తన తొలి మ్యాచ్లోనే నిరాశపరిచాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ సెకెండ్ సెమీఫైనల్లో క్రికెట్ అకాడమీ వేదికగా ముంబై, తమిళనాడు జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో అయ్యర్ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో 167 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ముంబై జట్టు కష్టాల్లో పడింది. ప్రస్తుతం ముంబై 22 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. తమిళనాడు స్పిన్నర్ సాయికిషోర్ 5 వికెట్లతో ముంబైను దెబ్బతీశాడు. అంతకుముందు తమిళనాడు సైతం తొలి ఇన్నింగ్స్లో విఫలమైంది. కేవలం 146 పరుగులు మాత్రమే చేసింది. బీసీసీఐ సీరియస్.. అయ్యర్ రీ ఎంట్రీ వాస్తవానికి అయ్యర్ బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్కు ముంబై జట్టుకు అందుబాటులో ఉండాల్సింది. కానీ వెన్ను నొప్పి సాకు చెప్పి క్వార్టర్స్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న బీసీసీఐ శ్రేయస్ను ఏకంగా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. బీసీసీఐ తీవ్రమైన చర్యలు తీసుకోవడంతో ఎట్టకేలకు దిగిచ్చొన అయ్యర్ సెమీఫైనల్స్కు అందుబాటులోకి వచ్చాడు. -
తమిళనాడు 146 ఆలౌట్
ముంబై: రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్లో ముంబై సమష్టి బౌలింగ్ ప్రదర్శనతో తమిళనాడును పడగొట్టింది. మ్యాచ్ తొలి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన తమిళనాడు తొలి ఇన్నింగ్స్లో 64.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. విజయ్ శంకర్ (44), వాషింగ్టన్ సుందర్ (43) కొంత పోరాడినా...మిగతావారంతా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో తుషార్ పాండే 24 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... తనుష్ కొటియాన్, ముషీర్ ఖాన్, శార్దుల్ ఠాకూర్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం ముంబై బ్యాటింగ్ కూడా తడబడింది. శనివారం ఆట ముగిసే సమయానికి ముంబై తమ తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. పృథ్వీ షా (5) విఫలం కాగా...ముïÙర్ ఖాన్ (24 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నాడు. రంజీ ట్రోఫీ మ్యాచ్లో ఆడని కారణంగా బీసీసీఐ కాంట్రాక్ట్ను కోల్పోయిన భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఈ సెమీ ఫైనల్ మ్యాచ్లో బరిలోకి దిగాడు. విదర్భ 170 ఆలౌట్... నాగ్పూర్: మధ్యప్రదేశ్ పేస్ బౌలర్ అవేశ్ ఖాన్ (4/49) పదునైన బౌలింగ్ ముందు విదర్భ బ్యాటర్లు విఫలమయ్యారు. రంజీ ట్రోఫీ రెండో సెమీస్ మ్యాచ్లో విదర్భ తమ తొలి ఇన్నింగ్స్లో 56.4 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. కరుణ్ నాయర్ (63) అర్ధ సెంచరీ సాధించగా, అథర్వ తైడే (39) ఫర్వాలేదనిపించాడు. ఒక దశలో 101/2తో మెరుగైన స్థితిలో కనిపించిన విదర్భ 36 పరుగుల వ్యవధిలో తర్వాతి 6 వికెట్లు కోల్పోయింది. వెంకటేశ్ అయ్యర్, కుల్వంత్ ఖెజ్రోలియా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆట ముగిసే సరికి మధ్యప్రదేశ్ వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది.
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ప్రత్యేక పోలింగ్ కేంద్రాలిక్కడే..
వేసవిలోనూ నిరంతరం మంచినీటి సరఫరా
‘రిజర్వేషన్ల వ్యతిరేక బీజేపీని ఓడించాలి’
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీకి విద్యార్థుల ఎంపిక
ఐటీఐలో కొత్త కొర్సులు
ఎట్టకేలకు వీడిన ఉత్కంఠ
అంగన్వాడీల రిటైర్మెంట్..!
● నేటి సాయంత్రం 4గంటల వరకే అనుమతి ● బంద్ కానున్న ఎన్నికల ప్రచార మోత
ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement