-
Rakul Preet Singh: హైదరాబాద్లో రెస్టారెంట్ బిజినెస్ మొదలుపెట్టిన రకుల్ (ఫోటోలు)
-
హైదరాబాద్ లో హీరోయిన్ రకుల్ ప్రీత్ మరో బిజినెస్
తెలుగులో చాలామంది హీరోహీరోయిన్లు.. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపారాల్లోనూ రాణిస్తుంటారు. పలువురు హీరోలకు హైదరాబాద్ లో పబ్స్ ఉన్నాయి. కొందరు హీరోయిన్లకు జిమ్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి. అలాంటి వాళ్లలో రకుల్ ప్రీత్ ఒకరు. ఈ మధ్యే పెళ్లి చేసుకున్న ఈమె తాజాగా మరో వ్యాపారంలోకి అడుగుపెట్టబోతుంది. హీరోయిన్ గా తెలుగులో చరణ్, బన్నీతో సినిమాలు చేసిన రకుల్.. ఫిట్ నెస్ కి ఎక్కువ ప్రాధాన్యమిస్తూ ఉంటుంది. ఇదే కాన్సెప్టుతో గతంలో జిమ్స్ ప్రారంభించింది. హైదరాబాద్, వైజాగ్ తదితర నగరాల్లో ఎఫ్ 45 పేరుతో రకుల్ కి జిమ్స్ ఉన్నాయి. చాలామంది తెలుగు స్టార్ వీటికి వెళ్తుంటారు కూడా. (ఇదీ చదవండి: Yatra 2 In OTT: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'యాత్ర 2'.. స్ట్రీమింగ్ అందులోనే) వెల్ బీయింగ్ న్యూట్రిషన్, వెల్ నెస్ న్యూట్రిషన్ బ్రాండ్స్లోనూ రకుల్ ప్రీత్ పెట్టుబడులు పెట్టింది. హెల్త్ అండ్ స్కిన్ రంగంలో కూడా అడుగుపెట్టింది. 2019లో న్యూబూ‘పేరుతో బయోడీగ్రేడబుల్, రీ యూజబుల్ డైపర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు మరో రంగంలోకి అడుగుపెట్టబోతుంది. ఫుడ్ బిజినెస్ స్టార్ చేసింది. హైదరాబాద్ ఆరంభం పేరుతో త్వరలో ఓ రెస్టారెంట్ ప్రారంభం కానుంది. ఇందులో మిల్లెట్స్ తో తయారు చేసిన పుడ్ లభించనుంది. మొన్నీ మధ్యే పెళ్లి చేసుకున్న రకుల్.. ఇప్పుడు కొత్తగా బిజినెస్ గా మొదలుపెట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటోంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన రెండు హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ అందులోనే) -
ఇంట్లో కంటే బయటి దానికే ఎక్కువ ఖర్చు
మారుతున్న జీవనప్రమాణాల కారణంగా మనం తీసుకునే ఆహారంలోనూ విభిన్న ధోరణి కనిపిస్తుంది. గడిచిన దశాబ్దకాలంలో పట్టణ ప్రాంతంలోని ప్రజలు ఆహారం విషయంలో దేనికి ఎక్కువగా ఖర్చు చేస్తున్నారో తెలియజేస్తూ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇప్లిమెంటేషన్(మోస్పీ), ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఆసక్తికర నివేదికను విడుదల చేశాయి. నివేదిక వివరాల ప్రకారం.. దశాబ్దకాలంలో ఆహార ఖర్చులు పెరిగాయి. మొత్తం ఫుడ్ బడ్జెట్లో ఇంట్లో ఆహారం తయారీకి 2012లో 42.6 శాతం వెచ్చించేవారు. ఫాస్ట్ఫుడ్, జంక్ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ వంటి బయటి ఆహారానికి 57.4 శాతం ఖర్చు చేశారు. అదే 2023లో ఇంట్లో ఫుడ్ తయారీకి 39.7 శాతం, బయటిఫుడ్ కోసం 60.3శాతం ఖర్చు చేసినట్లు తెలిసింది. అందులో భారీగా ప్రాసెస్డ్ ఫుడ్, బెవరేజెస్కు ఎక్కువగా డబ్బు వెచ్చించినట్లు నివేదికలో తెలిపారు. కింద ఇచ్చిన వివరాల ద్వారా కేటగిరీవారీగా ఎంత శాతం ఖర్చుచేశారో తెలుసుకోవచ్చు. ఇదీ చదవండి: 100 నుంచి 75 వేల పాయింట్ల వరకు ప్రస్థానం 2012లో.. 2023లో.. బేవరేజెస్, ప్రాసెస్డ్ఫుడ్ 9 శాతం 10.5 శాతం పాలు, పాల ఉత్పత్తులు 7 శాతం 7.2 శాతం తృణధాన్యాలు 6.6 శాతం 4.5శాతం కూరగాయలు 4.6 శాతం 3.8 శాతం గుడ్లు/ ఫిష్/ మాంసం 3.7 శాతం 3.5 శాతం పండ్లు/ డ్రైఫ్రూట్స్ 3.4 శాతం 3.8 శాతం పప్పులు 1.9 శాతం 1.2 శాతం చక్కెర, ఉప్పు 1.2 శాతం 0.6 శాతం -
న్యూయార్క్ బెస్ట్ రెస్టారెంట్లుగా ఆ నాలుగు భారత రెస్టారెంట్లు!
న్యూయార్క టైమ్స్ 2024 ఏడాదికి న్యూయార్క్ నగరంలో చక్కగా తినేందుకు అత్యుత్తమమైన రెస్టారెంట్ల జాబితాలను విడుదల చేసింది. న్యూయార్క్లో రెస్లారెంట్లపై అభిరుచిగల పీట్వెల్స్ అనే ప్రముఖ వ్యక్తి ఈ వంద అత్యుత్తమ బెస్ట్ రెస్టారెంట్ల జాబితాను ఎంపిక చేశారు. వాటిలో భారతీయ వంటకాలను అందించే నాలుగు రెస్టారెంట్లకు చోటు దక్కడం విశేషం. ఆ అత్యుత్తమ రెస్టారెంట్లలలో గ్రీన్విచ్ విలేజ్లో ఉండే సెమ్మా అనే రెస్టారెంట్ టాప్ 10లో ఏడో స్థానంలో ఉంది. గతేడాది ఇదే రెస్టారెంట్ 12వ స్థానంలో ఉంది. ఈ సెమ్మా రెస్టారెంట్ని చెఫ్ విజయకుమార్ నిర్వహిస్తున్నారు. ఆయన మంచి సౌత్ ఇండియన్ వంటకాలను అందిస్తున్నారు. అలాగే మాన్హట్టన్ దిగువ తూర్పు వైపునున్న ధమాకా 54వ స్థానంలో ఉంది. దీనికి చెఫ్ భాగస్వామి చింతన్ పాండ్యా , రెస్టారెంట్ రోనీ మజుందార్ కలిసి నిర్వహిస్తున్నారు. క్వీన్స్లోని టెంపుల్ క్యాంటీన్ 80వ స్థానంలో నిలిచింది. ఇది హిందూ దేవాలయం నేలమాళిగలో ఉంది. ఇది సంప్రదాయ దక్షిణాది వంటకాలను అందిస్తుంది. మిడ్టౌన్ మాన్హట్టన్లోని హైదరాబాదీ జైకా న్యూయార్క్ నగరంలోని టాప్ 100 ఉత్తమ రెస్టారెంట్లలో చివరి భారతీయ రెస్టారెంట్. ఇది 95వ స్థానంలో ఉంది. ఇది బిర్యానీలకు ప్రత్యేకత గాంచిన రెస్టారెంట్. ఈ మేరకు పీట్ వెల్స్ అత్యుత్తమ రెస్టారెంట్ల జాబితా తోపాటుగా చివర నోట్లో ఇలా రాశాడు. అందులో.."న్యూయార్క్ ఒక పెద్ద నగరం. ఇక్కడ ప్రజలు తమ పరిసరాలకు సమీపంలో మంచి రెస్టారెంట్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునేలా ఈ టాప్ 100 బెస్ట్ రెస్టారెంట్ల జాబితాను లిస్ట్ చేశాను. ఈ జాబితాతో కావాల్సిన వంటకాలు దొరికే రెస్టారెంట్లు ఏంటో కూడా ఈజీగా తెలుసుకోగలరు. చక్కగా రుచులను ఆస్వాదించగలరు అని రాశారు పీట్ వేల్స్. View this post on Instagram A post shared by Semma (@semmanyc) (చదవండి: యంగ్ హీరోలకు ధీటుగా మాధవన్.. ఫిట్నెస్ రహస్యం ఇదే!) -
చూడటానికి పసందైనా.. ధరకి వామ్మో అనాల్సిందే..!
చూడటానికి ఎంతో పసందుగా ఉన్న ఈ మిఠాయి ఖరీదు తెలుసుకుంటే మాత్రం కళ్లు చెదురుతాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మిఠాయి. ఈ మిఠాయి పేరు ‘స్ట్రాబెర్రీస్ ఆర్నాడ్’. అమెరికాలోని న్యూ ఆర్లీన్లో ఉన్న ‘ఆర్నాడ్’ రెస్టారెంట్ ప్రత్యేకంగా రూపొందించిన మిఠాయి ఇది. సన్నగా తరిగిన స్ట్రాబెర్రీ ముక్కలు, నారింజ ముక్కలు, లవంగం, దాల్చినచెక్క, వెనీలా ఐస్క్రీమ్, బాగా గిలకొట్టిన పాలమీగడతో తయారు చేసిన ఈ మిఠాయిపైన ఆరురకాల ఖరీదైన షాంపేన్ చిలకరించి, దీనిపైన తాజా పుదీనా ఆకులను, మేలిమి బంగారు రేకులను అలంకరిస్తారు. దీని ఖరీదు 9.85 మిలియన్ డాలర్లు (రూ.81.50 కోట్లు). దీనికి ఇంత ఖరీదు ఎందుకని ఆశ్చర్యపోతున్నారా? దీనిని అలా ఊరకే కప్పులో పెట్టి వడ్డించి వదిలేయరు. దీంతో పాటే, కప్పు అడుగున ఉన్న సాసర్లో చక్కని పెట్టెలో 10.06 కేరట్ల వజ్రాలను పొదిగిన బంగారు ఉంగరాన్ని ఉంచి మరీ వడ్డిస్తారు. ఐస్క్రీమ్ తినేసి, వజ్రాల ఉంగరాన్ని తీసేసుకోవచ్చు. ఇవి చదవండి: ఈ పండుగ కొందరకి హోలీ అయితే.. మరి కొందరికి ‘హోలా మొహల్లా’..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
మండుటెండను లెక్కచేయని అభిమానం..!
పాతదాన్ని తుక్కుగా మారిస్తే కొత్త వాహనానికి రాయితీ..ఎంతంటే..
మరోసారి పీఠమెక్కేదెవరో..?
విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు
Actor Nani HD Stills: వారెవ్వా... బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో నాని.. ఫ్యాన్స్ ఫిదా
ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!
హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు
అసలు ఇది చాలు! వీళ్లకు ఓటేయకుండా ఉండటానికి!
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Trisha Krishnan : త్రిష పుట్టినరోజు స్పెషల్.. ప్రత్యేకమైన ఫోటోలు వైరల్
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- అచ్చెన్న దృష్టిలో ఉద్యోగులంటే.. ఊడిగం చేసే వారే!
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement