-
ఓటింగ్ శాతం పెంచేలా..రెస్టారెంట్ల అసోసీయేషన్ కస్టమర్లకు భలే ఆపర్ అందించింది!
ప్రజలు తమ ఓటు హక్కును వినయోగించుకునేలా స్వయం సహాయక బృందాల నుంచి ఆఫీసర్ల వరకు వినూత్న పద్ధతిలో అవగాహన కల్పించే యత్నం చేశారు. అలానే నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) కూడా చేరి తన వంతుగా ఓటు వేసేలా ప్రజలను ప్రోత్సహించింది. ఓటు వేస్తే మా రెస్టారెంట్లలో తక్కువ బిల్లుకే మంచి భోజనం తినొచ్చు అంటూ చక్కటి 'డెమోక్రసీ డిస్కౌంట్'ని అందిచింది కస్టమర్లకు. ఎక్కడంటే..ముంభైలోని నేషనల్ రెస్టారెంట్ అసోసీయేషన్ ఆప్ ఇండియా(ఎన్ఆర్ఏఐ) ఈ ఆఫర్ అందిస్తోంది. ఈ ఎన్నికల సీజన్లో బయటకు వెళ్లేందుకు కారణం కోసం చూస్తున్నారా! ఐతే ఇది మీకు మంచి అవకాశం. ఈ ఎన్నికల్లో ఓటు వేయండి. ఓటువేసినట్లు సిరా చుక్క వేయించకున్నా.. మీ వేలుని చూపించి ముంబై నగరంలోని రెస్టారెంట్లో చక్కటి భోజనం ఆస్వాదించి బిల్లులో 20% డిస్కౌంట్ పొందండి అంటూ ప్రచారం చేస్తోంది ఎన్ఆర్ఏఐ. నగరంలో దాదాపు వంద రెస్తారెంట్లు ఈ ఆఫర్ని అందిస్తున్నాయిని ఎన్ఆర్ఏఐ పేర్కొంది. ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య వేడుకలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయ్యేలా చూసేందుకు తమ వంతుగా చేస్తున్న ప్రయత్నం అని ముంబై ఎన్ఆర్ఏఐ సీఈవో రాచెల్ గోయెంకా చెప్పారు. మహారాష్ట్రలో మే 20, 21వ తేదీల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇలా వినూత్నమైన రీతీలో ప్రచారం చేస్తోంది ఎన్ఆర్ఏఐ. ఇప్పటికే ముంభైలో సుమారు 150 రెస్టారెంట్లు ఈ ఆపర్లను అందిస్తున్నాయని చెప్పారు. అందుకు సంబంధించిన డెమోక్రసీ డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చే రెస్టారెంట్ల పూర్తి జాబితాను కూడా వెల్లడించారు. మీ సమీపంలో ఉన్న రెస్టారెంట్ని ఎంచుకుని చక్కగా ఓటు వేసి 20% డిస్కౌంట్లో చక్కటి భోజనం ఆస్వాదించడని చెబుతున్నారు గోయెంకా. (చదవండి: వైద్యుడి నిర్లక్ష్యం..నాలుగేళ్ల చిన్నారి గొంతు మూగబోయింది!) -
డీజిల్తో పరాటా చేయడమా? చివరికి యజమాని..
ఇటీవల కొందరూ సోషల్ మీడియా స్టార్డమ్ కోసం పిచ్చిపనులు మతిపోయేలా ఉంటాయి. అస్సలు అర్థంపర్థం లేని విధంగా రోతగా ఏవేవో రీల్స్ చేసేస్తుంటారు. చూశావాడి కర్మలే అనో లేక ఇలా చేస్తే వ్యూస్ పెరుగతాయన్న భావమో గానీ ఇలాంటి వాటి వల్ల కొందరూ ప్రాణాలు పోగొట్టుకుంటే మరికొందరూ నెగిటివిటీని తెచ్చుకుని చివరికి వివరణ ఇచ్చుకునే పరిస్థితి తెచ్చుకుంటారు. అలాంటి ఘటనే చండీగఢ్లో ఒకటి చోటు చేసుకుంది. చండీగఢ్లో ఓ ఆహార విక్రేత డీజిల్తో చేసిన పరాఠాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద దూమరం రేపింది. ఒక్కసారిగా నెటిజన్లు దీనిపై భారత ఫుడ్ కార్పొరేషన్ తనిఖీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దెబ్బకు సదరు ఫుడ్ యజమాని చన్నీ సింగ్ దిగొచ్చి తాము డీజిల్ పరాటా వంటవి చేయమని వివరణ ఇచ్చారు. అలాగే వీడియోలో చెప్పినట్లుగా కస్టమర్లకు అలాంటి పరాటాలను అందించమని తెలిపారు.True recipe for cancer (petrol diesel wala paratha)Where r we heading? 🤦#AlluArjun #Pithapuram #MondayVibes #MorningVibes #MadhaviLatha #ViralVideo #ElectionDay pic.twitter.com/GyxC1xhQeb— K.P.Brinda Reddy (@kpbrindareddy) May 13, 2024 కేవలం వినోదం కోసం సరదాగా చేసిన రీల్ అని చెప్పుకొచ్చారు. మా కంటెంట్ మిమ్మల్ని ఎంతగానో బాధించిందనందుకు తనని క్షమించండని వేడుకున్నాడు. అలాగే తాము ఈ ఆలు పరాటాలను శుద్దమైన నెయ్యి, నూనెలతోనే తయారు చేస్తామని చెప్పారు. అలాగే ఆ వీడియోని తీసిన అమన్ ప్రీత్ సింగ్ కూడా ఇన్స్టామ్ వేదికగా క్షమాపణ తెలిపాడు. View this post on Instagram A post shared by Amanpreet Singh (@oyefoodiesinghఈ మేరకు సదరు వ్యక్తులు ఇన్స్టామ్లో.. చండీగఢ్ పరిపాలనా యంత్రాంగానికి, యావత్తు భారతదేశ ప్రజలకు నా హృదయపూర్వక క్షమాపణలు. తాము తీసిని వీడియో కంటెంట్ మిమ్మల్ని ఎంతో భాదించదనందుకు చింతిస్తున్నాం అని అందుకు మమల్ని క్షమించండని వేడుకున్నారు. సరదా కోసి ఇలా ఏదిపడితే అది చేస్తే జనాలు ఊరుకోరు. స్టార్ డమ్, వ్యూస్ మాట పక్కన ఉంచితే ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించారని ఎవరైనా కేసు పెడితే ఊచలు లెక్కించా ల్సిందే. సరదా అనేది అందరికీ సంతోషమే తెప్పించాలి గానీ ఆగ్రహం తెప్పించేలా ఉండకూడదు.(చదవండి: నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!) -
Rakul Preet Singh: హైదరాబాద్లో రెస్టారెంట్ బిజినెస్ మొదలుపెట్టిన రకుల్ (ఫోటోలు)
-
హైదరాబాద్ లో హీరోయిన్ రకుల్ ప్రీత్ మరో బిజినెస్
తెలుగులో చాలామంది హీరోహీరోయిన్లు.. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపారాల్లోనూ రాణిస్తుంటారు. పలువురు హీరోలకు హైదరాబాద్ లో పబ్స్ ఉన్నాయి. కొందరు హీరోయిన్లకు జిమ్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి. అలాంటి వాళ్లలో రకుల్ ప్రీత్ ఒకరు. ఈ మధ్యే పెళ్లి చేసుకున్న ఈమె తాజాగా మరో వ్యాపారంలోకి అడుగుపెట్టబోతుంది. హీరోయిన్ గా తెలుగులో చరణ్, బన్నీతో సినిమాలు చేసిన రకుల్.. ఫిట్ నెస్ కి ఎక్కువ ప్రాధాన్యమిస్తూ ఉంటుంది. ఇదే కాన్సెప్టుతో గతంలో జిమ్స్ ప్రారంభించింది. హైదరాబాద్, వైజాగ్ తదితర నగరాల్లో ఎఫ్ 45 పేరుతో రకుల్ కి జిమ్స్ ఉన్నాయి. చాలామంది తెలుగు స్టార్ వీటికి వెళ్తుంటారు కూడా. (ఇదీ చదవండి: Yatra 2 In OTT: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'యాత్ర 2'.. స్ట్రీమింగ్ అందులోనే) వెల్ బీయింగ్ న్యూట్రిషన్, వెల్ నెస్ న్యూట్రిషన్ బ్రాండ్స్లోనూ రకుల్ ప్రీత్ పెట్టుబడులు పెట్టింది. హెల్త్ అండ్ స్కిన్ రంగంలో కూడా అడుగుపెట్టింది. 2019లో న్యూబూ‘పేరుతో బయోడీగ్రేడబుల్, రీ యూజబుల్ డైపర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు మరో రంగంలోకి అడుగుపెట్టబోతుంది. ఫుడ్ బిజినెస్ స్టార్ చేసింది. హైదరాబాద్ ఆరంభం పేరుతో త్వరలో ఓ రెస్టారెంట్ ప్రారంభం కానుంది. ఇందులో మిల్లెట్స్ తో తయారు చేసిన పుడ్ లభించనుంది. మొన్నీ మధ్యే పెళ్లి చేసుకున్న రకుల్.. ఇప్పుడు కొత్తగా బిజినెస్ గా మొదలుపెట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటోంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన రెండు హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ అందులోనే) -
ఇంట్లో కంటే బయటి దానికే ఎక్కువ ఖర్చు
మారుతున్న జీవనప్రమాణాల కారణంగా మనం తీసుకునే ఆహారంలోనూ విభిన్న ధోరణి కనిపిస్తుంది. గడిచిన దశాబ్దకాలంలో పట్టణ ప్రాంతంలోని ప్రజలు ఆహారం విషయంలో దేనికి ఎక్కువగా ఖర్చు చేస్తున్నారో తెలియజేస్తూ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇప్లిమెంటేషన్(మోస్పీ), ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఆసక్తికర నివేదికను విడుదల చేశాయి. నివేదిక వివరాల ప్రకారం.. దశాబ్దకాలంలో ఆహార ఖర్చులు పెరిగాయి. మొత్తం ఫుడ్ బడ్జెట్లో ఇంట్లో ఆహారం తయారీకి 2012లో 42.6 శాతం వెచ్చించేవారు. ఫాస్ట్ఫుడ్, జంక్ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ వంటి బయటి ఆహారానికి 57.4 శాతం ఖర్చు చేశారు. అదే 2023లో ఇంట్లో ఫుడ్ తయారీకి 39.7 శాతం, బయటిఫుడ్ కోసం 60.3శాతం ఖర్చు చేసినట్లు తెలిసింది. అందులో భారీగా ప్రాసెస్డ్ ఫుడ్, బెవరేజెస్కు ఎక్కువగా డబ్బు వెచ్చించినట్లు నివేదికలో తెలిపారు. కింద ఇచ్చిన వివరాల ద్వారా కేటగిరీవారీగా ఎంత శాతం ఖర్చుచేశారో తెలుసుకోవచ్చు. ఇదీ చదవండి: 100 నుంచి 75 వేల పాయింట్ల వరకు ప్రస్థానం 2012లో.. 2023లో.. బేవరేజెస్, ప్రాసెస్డ్ఫుడ్ 9 శాతం 10.5 శాతం పాలు, పాల ఉత్పత్తులు 7 శాతం 7.2 శాతం తృణధాన్యాలు 6.6 శాతం 4.5శాతం కూరగాయలు 4.6 శాతం 3.8 శాతం గుడ్లు/ ఫిష్/ మాంసం 3.7 శాతం 3.5 శాతం పండ్లు/ డ్రైఫ్రూట్స్ 3.4 శాతం 3.8 శాతం పప్పులు 1.9 శాతం 1.2 శాతం చక్కెర, ఉప్పు 1.2 శాతం 0.6 శాతం -
న్యూయార్క్ బెస్ట్ రెస్టారెంట్లుగా ఆ నాలుగు భారత రెస్టారెంట్లు!
న్యూయార్క టైమ్స్ 2024 ఏడాదికి న్యూయార్క్ నగరంలో చక్కగా తినేందుకు అత్యుత్తమమైన రెస్టారెంట్ల జాబితాలను విడుదల చేసింది. న్యూయార్క్లో రెస్లారెంట్లపై అభిరుచిగల పీట్వెల్స్ అనే ప్రముఖ వ్యక్తి ఈ వంద అత్యుత్తమ బెస్ట్ రెస్టారెంట్ల జాబితాను ఎంపిక చేశారు. వాటిలో భారతీయ వంటకాలను అందించే నాలుగు రెస్టారెంట్లకు చోటు దక్కడం విశేషం. ఆ అత్యుత్తమ రెస్టారెంట్లలలో గ్రీన్విచ్ విలేజ్లో ఉండే సెమ్మా అనే రెస్టారెంట్ టాప్ 10లో ఏడో స్థానంలో ఉంది. గతేడాది ఇదే రెస్టారెంట్ 12వ స్థానంలో ఉంది. ఈ సెమ్మా రెస్టారెంట్ని చెఫ్ విజయకుమార్ నిర్వహిస్తున్నారు. ఆయన మంచి సౌత్ ఇండియన్ వంటకాలను అందిస్తున్నారు. అలాగే మాన్హట్టన్ దిగువ తూర్పు వైపునున్న ధమాకా 54వ స్థానంలో ఉంది. దీనికి చెఫ్ భాగస్వామి చింతన్ పాండ్యా , రెస్టారెంట్ రోనీ మజుందార్ కలిసి నిర్వహిస్తున్నారు. క్వీన్స్లోని టెంపుల్ క్యాంటీన్ 80వ స్థానంలో నిలిచింది. ఇది హిందూ దేవాలయం నేలమాళిగలో ఉంది. ఇది సంప్రదాయ దక్షిణాది వంటకాలను అందిస్తుంది. మిడ్టౌన్ మాన్హట్టన్లోని హైదరాబాదీ జైకా న్యూయార్క్ నగరంలోని టాప్ 100 ఉత్తమ రెస్టారెంట్లలో చివరి భారతీయ రెస్టారెంట్. ఇది 95వ స్థానంలో ఉంది. ఇది బిర్యానీలకు ప్రత్యేకత గాంచిన రెస్టారెంట్. ఈ మేరకు పీట్ వెల్స్ అత్యుత్తమ రెస్టారెంట్ల జాబితా తోపాటుగా చివర నోట్లో ఇలా రాశాడు. అందులో.."న్యూయార్క్ ఒక పెద్ద నగరం. ఇక్కడ ప్రజలు తమ పరిసరాలకు సమీపంలో మంచి రెస్టారెంట్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునేలా ఈ టాప్ 100 బెస్ట్ రెస్టారెంట్ల జాబితాను లిస్ట్ చేశాను. ఈ జాబితాతో కావాల్సిన వంటకాలు దొరికే రెస్టారెంట్లు ఏంటో కూడా ఈజీగా తెలుసుకోగలరు. చక్కగా రుచులను ఆస్వాదించగలరు అని రాశారు పీట్ వేల్స్. View this post on Instagram A post shared by Semma (@semmanyc) (చదవండి: యంగ్ హీరోలకు ధీటుగా మాధవన్.. ఫిట్నెస్ రహస్యం ఇదే!) -
చూడటానికి పసందైనా.. ధరకి వామ్మో అనాల్సిందే..!
చూడటానికి ఎంతో పసందుగా ఉన్న ఈ మిఠాయి ఖరీదు తెలుసుకుంటే మాత్రం కళ్లు చెదురుతాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మిఠాయి. ఈ మిఠాయి పేరు ‘స్ట్రాబెర్రీస్ ఆర్నాడ్’. అమెరికాలోని న్యూ ఆర్లీన్లో ఉన్న ‘ఆర్నాడ్’ రెస్టారెంట్ ప్రత్యేకంగా రూపొందించిన మిఠాయి ఇది. సన్నగా తరిగిన స్ట్రాబెర్రీ ముక్కలు, నారింజ ముక్కలు, లవంగం, దాల్చినచెక్క, వెనీలా ఐస్క్రీమ్, బాగా గిలకొట్టిన పాలమీగడతో తయారు చేసిన ఈ మిఠాయిపైన ఆరురకాల ఖరీదైన షాంపేన్ చిలకరించి, దీనిపైన తాజా పుదీనా ఆకులను, మేలిమి బంగారు రేకులను అలంకరిస్తారు. దీని ఖరీదు 9.85 మిలియన్ డాలర్లు (రూ.81.50 కోట్లు). దీనికి ఇంత ఖరీదు ఎందుకని ఆశ్చర్యపోతున్నారా? దీనిని అలా ఊరకే కప్పులో పెట్టి వడ్డించి వదిలేయరు. దీంతో పాటే, కప్పు అడుగున ఉన్న సాసర్లో చక్కని పెట్టెలో 10.06 కేరట్ల వజ్రాలను పొదిగిన బంగారు ఉంగరాన్ని ఉంచి మరీ వడ్డిస్తారు. ఐస్క్రీమ్ తినేసి, వజ్రాల ఉంగరాన్ని తీసేసుకోవచ్చు. ఇవి చదవండి: ఈ పండుగ కొందరకి హోలీ అయితే.. మరి కొందరికి ‘హోలా మొహల్లా’.. -
‘బొద్దింకల దోసె’?! షాక్ అయిన అమ్మడు
సామాన్యంగా బొద్దింకలను చూస్తేనే శరీరం ఝల్లుమంటుంది...అలాంటి బొద్దింక ఆహారంలో కనిపిస్తే..? ఆ భోజనం తినగలమా? ఈ మధ్యకాలంలో మనకు ఎక్కువగా వినిపిస్తున వార్త "ఆహారంలో బొద్దింక". ట్రైన్, రెస్టారెంట్, విమానాల్లో ఇలా ఎక్కడ చూసినా ఇవే వార్తలు. తాజాగా ఢిల్లీలో ఇలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. న్యూఢిల్లీలోని కనౌట్ ప్లేస్లోని ఓ రెస్టారెంట్లో మధ్యాహ్న భోజనం కోసం ఓక మహిళ, ఆమె స్నేహితురాలు దోసను ఆర్డర్ చేసారు. సరిగ్గా అలా తినడం మొదలు పెట్టిందో లేదో.. అక్కడ అనుమానాస్పదంగా ఏదో కనిపించింది. ఏంటా అని పరిశీలనగా చూసింది. అంతే.. ఒకటి కాదు రెండు కాదు ఎకంగా ఎనిమిది బొద్దింల్ని చూసి ఒక్కసారిగా షాక్ అయింది. ఇవి చదవండి: నిత్యం వీటిని తినడంతో.. కలిగే మార్పులు తెలుసా! దీంతో ఈ సంఘటనను రికార్డుచేయాలని నిర్ణయించుకుంది. స్నేహితురాలి సాయంతో వీడియో రికార్డ్ చేస్తోంది. ఇంతలోనే హోటల్ సిబ్బందిలో ఒకరు ఎంట్రీ ఇచ్చాడు. అకస్మాత్తుగా ప్లేట్ను లాగేసుకున్నాడు. ఈ విషయాన్ని ఇషాని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ‘బొద్దింకల’పై ఆరా తీస్తున్నారు. తనకెదురైన భయంకరమైన అనుభవాన్ని ఇషాని ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ కేఫ్ లైసెన్స్, శుభ్రతపై అనేక ప్రశ్నల్ని లేవనెత్తింది. రెస్టారెంట్ల పరిశుభ్రత స్థాయి, లైసెన్స్లను తనిఖీ చేయడానికి అధికారులు క్రమం తప్పకుండా రెస్టారెంట్లను సందర్శించి తగిన చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు నమోదు కావంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ‘ది క్వింట్’ షేర్ చేసిన ఈ వీడియో ఇపుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
ఆసియాలోని బెస్ట్ రెస్లారెంట్లుగా ఐదు భారత రెస్టారెంట్లు!
యూకే ఆధారిత విలియం రీడ్ బిజనెస్ మీడియా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 50 బెస్ట్ రెస్టారెంట్ల జాబితాను విడుదల చేయనుంది. అందుకోసం మిడిల్ ఈస్ట్ నార్త్ ఆఫ్రికాకు సంబంధించి సుమారు 50 బెస్ట్ రెస్టారెంట్ల ఎంట్రీలను ఆహ్వానించింది. వాటిలో 51 నుంచి 100 ర్యాంకుల వరకు ఆసియాకి సంబంధించిన వివిధ రెస్టారెంట్లే ఉన్నాయి. ఇక ఈ ప్రతిష్టాత్మక జాబితాలో ఐదు భారతీయ సంస్థలు ఉండటం విశేషం. ఈ ఏడాదికి సంబంధించిన ఆసియా టాప్ 50 బెస్ట్ రెస్టారెంట్ల జాబితాను ఈ నెలాఖరులోగా వెల్లడించనుంది. ఈ జాబితా ఎంట్రీల్లో 51-100 ర్యాంకుల్లో మూడు ముంబై రెస్లారెంట్లు, డిల్లీకి సంబంధించిన రెండు రెస్టారెంట్లు చోటు దక్కించుకున్నాయి. ముంబైలోని అమెరికాలనో(61), ది బాంబే క్యాంటీన్(70), ఎకా(98), ఇక ఢిల్లీకి సంబంధించి గురుగ్రామ్లో కొమెరిన్(79), న్యూఢిల్లీలోని దమ్ పుఖ్త్ (87)వ స్థానంలో ఉన్నాయి. ఈ జాబితా ఎంట్రీలో దేశం వెలుపల ఉన్న రెస్టారెంట్లు, బ్యాంకాక్కి సంబంధించిన ఇతర రెస్టారెంట్లు తర్వాత స్థానంలో ఉన్నాయి. దీనికి భారతీయ చెఫ్ గరిమా అరోరా నాయకత్వం వహిస్తున్నారు. ఇక ఈ ఆసియా బెస్ట్ రెస్టారెంట్ ఎంట్రీల జాబితాలో టోక్యో, సింగపూర్ అగ్రస్థానంలో ఉన్నాయి. ఇక 51 నుంచి 100 ర్యాంకుల జాబితాలో మాత్రం ఆసియాలోని 16 నగరాలకి సంబంధించిన ఇతర రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ ఆసియా బెస్ట్ రెస్టారెంట్ల 2024 జాబితాన మార్చి 26, 2024న దక్షిణ కొరియాలోని సియోల్లో జరిగే అవార్డుల కార్యక్రమంలో వెల్లడించనున్నారు. ఈ బెస్ట్ రెస్టారెంట్ల ఎంట్రీల జాబితాకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వుతోంది. కాగా, గతేడాదిలో ఈ బెస్ట్ రెస్టారెంట్ జాబితాలో అమెరికానో 66వ స్థానాన్ని, ఎకా 93వ స్థానాన్ని దక్కించుకుంది. View this post on Instagram A post shared by The Worlds 50 Best Restaurants (@theworlds50best) (చదవండి: బెస్ట్ శాండ్విచ్గా ఈ భారతీయ స్ట్రీట్ ఫుడ్కి చోటు! ఎన్నో ర్యాంకులో నిలిచిందంటే..) -
మన దేశంలోని టాప్ మహిళా చెఫ్లు వీరే!
ఇంతవరకు రెస్టారెంట్లో పురుషులే చెఫ్లుగా రాణించడం గురించి విన్నాం. అదీగాక మన పురాణాల్లో కూడా నల భీములు పాకశాస్త్ర ప్రావీణ్యం గురించి కథలుగా విన్నాం. అందుకు తగ్గట్టుగానే పురుష చెఫ్లు ఈ రంగంలో సత్తా చాటారు, వారే ఈ రంగంలో మహారాజుల్లా ఏలుతున్నారు. అలాగే టీవీ షోల్లో కూడా ప్రముఖ రెస్టారెంట్ చెఫ్లు సంజయ్ కపూర్ వంటి దిగ్గజ చెఫ్లను చూశాం. అయితే ఇదే రంగంలో సత్తా చాటుతున్న టాప్ మహిళా చెఫ్లు ఉన్నారు. అంతేగాదు వాళ్లే రెస్టారెంట్లను స్వయంగా నిర్వహించి కిచెన్ క్వీన్స్లా రాణిస్తున్నారు. ఆ టాప్ మహిళా చెఫ్లు ఎవరంటే..? గరీమా ఆరోరా ఉత్తర భారతదేశానికి చెందిన ఈమె మనదేశంలో టాప్ -10 ఫీ మేల్ చెఫ్ లలో ఒకరు.. బ్యాంకాక్ లో 'గాతో' అనే పేరుతో ఒక రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. ఇది సూపర్ సక్సెస్ కావడంతో మిచెలి స్టార్ పేరుతో మరో రెండు రెస్టారెంట్లు ఏర్పాటు చేసింది. ఈమెకు పాక శాస్త్రంలో మంచి ప్రావీణ్యం ఉంది. అందుకే రెస్టారెంట్ల వ్యాపారంలో శరవేగంగా దూసుకుపోతోంది. 'గాతో' రెస్టారెంట్కు బ్యాంకాక్లో మంచి ఫేమ్ ఉంది. View this post on Instagram A post shared by Vikas Khanna (@vikaskhannagroup) అనహిత దొండి పార్సికి చెందిన యువతి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ నేర్చుకుంటా అంటే కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆమె ఇష్టాన్ని తెలుసుకొని గౌరవించారు. హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేసిన వెంటనే ఆమెనే సొంతంగా రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు. పార్సి వంటకాలను తన కస్టమర్లకు పరిచయం చేశారు. అందులోనూ కొత్త కొత్త రకాలను సృష్టించి కస్టమర్ల నోటికి సరికొత్త రుచులు అందిస్తున్నారు. ఔత్సాహిక చెఫ్ గా అనహిత దొండి పేరు గడించారు. రీతు దాల్మియా పాత తరం మహిళ చెఫ్లలో ఈమెకు అగ్ర తాంబూలం దక్కుతుంది. పురుషాధిక్యమైన హోటల్ బిజినెస్ లో.. ఈమె ప్రవేశించి సత్తా చాటారు. తన కస్టమర్లకు తానే స్వయంగా వంట వండి పెడతారామే. ముఖ్యంగా నార్త్ ఇండియన్ వంటకాలు చేయడంలో ఈమె దిట్ట. పెద్ద పెద్ద వ్యాపారులు ఈమె వంటకు డైలీ కస్టమర్లు అంటే అతిశయోక్తి కాదు. శిఫ్రా ఖన్నా నార్త్ ఇండియాకు చెందిన ఈ యువతికి వంట చేయడం అంటే చాలా ఇష్టం. అలా అనేక రకాల వంటలను ఆమె సృష్టించింది.. నార్త్, సౌత్ అని తేడా లేకుండా అన్ని రకాల వంటల్లోనూ ప్రయోగాలు చేసింది. ఏకంగా మాస్టర్ చెఫ్ రెండవ సీజన్లో విజేతగా నిలిచింది. టీవీ హోస్ట్గా కూడా పనిచేస్తోంది. ఈమెకు ఒక క్లౌడ్ కిచెన్ ఉంది. కాకపోతే అందులో వెస్ట్రన్ డిషెస్ మాత్రమే లభిస్తాయి. పంకజ్ బదౌరియా మనదేశంలో మాస్టర్ చెఫ్ మొదటి సీజన్ విజేతగా పంకజ్ బదౌరియా నిలిచింది. సంప్రదాయ వంటలకు ఆధునిక మేళవింపు అద్దడంలో పంకజ్ ముందు వరుసలో ఉంటుంది. అలా వంట చేస్తుంది కాబట్టే ఆమె మాస్టర్ చెఫ్ మొదటి సీజన్ విజేత అయింది. ప్రస్తుతం ఈమె ఒక రెస్టారెంట్ నిర్వహిస్తోంది.. అందులో అన్ని రకాల వంటకాలూ లభిస్తాయి. పూజా దింగ్రా ఈమె టాప్ పేస్ట్రీ చెఫ్లలో పూజా ఒకరు. పేస్ట్రీ తయారీలో తనకు ఉన్న నైపుణ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ధైర్యంగా ఓపెద్ద పేస్ట్రీ తయారీ యూనిట్ నెలకొల్పింది. అలా రకరకాల పేస్ట్రీలు తయారుచేసి యువతను బాగా ఆకట్లుకున్నారు. అంతేగాదు వెస్ట్రన్ పేస్ట్రీస్ కోసం ఏకంగా మకరాన్ అనే పేరుతో పెద్ద హోటల్ కూడా ఏర్పాటు చేసింది.. బనీ నందా మన దేశానికి ఫ్రెంచ్ డిసర్ట్స్ను పరిచయం చేసిన ఘనత బని నందాకు దక్కుతుంది. ఇటీవల అంబానీ ఇంట్లో వేడుకలు జరిగినప్పుడు.. ఈమె రెస్టారెంట్ నుంచే అక్కడికి ఫ్రెంచ్ వంటకాలు వెళ్లాయి. Le cordn bleu పేరుతో ఆమె రెస్టారెంట్లు నిర్వహిస్తున్నారు. తేజస్వి చండేలా యూరోపియన్ వంటకాలు వండటంలో తేజస్వీకి మంచి ప్రావిణ్యం ఉంది. యూరోపియన్ పేస్ట్రీలకు మోడ్రన్ టచ్ ఇచ్చి అద్భుతంగా తయారు చేయగల నేర్పరితనం ఈమె సొంతం. ఈమె తయారు చేసే పేస్ట్రీలకు ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే ఆమె తయారుచేసే విధానం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంజిలత్ ఫాతిమా నవాబ్ అవధ్ కుటుంబానికి చెందిన మహిళ ఈమె. నవాబు వంటకాలను వండటంలో ఫాతిమాకు మంచి ప్రావిణ్యం ఉంది. అందువల్లే ఆమె పలు రెస్టారెంట్లు ఓపెన్ చేసి కస్టమర్లకు నవాబుల వంటకాలను రుచి చూపిస్తున్నారు. బిర్యానీలో రకాలు మాత్రమే కాకుండా, చికెన్, మటన్తో తయారు చేసే ప్రత్యేకమైన వంటకాలను కస్టమర్లకు అందిస్తోంది. (చదవండి: మిస్ వరల్డ్ పోటీల్లో పింక్ సీక్విన్ గౌనుతో మెరిసిన పూజా హెగ్డే!) -
24 క్యారెట్ల బంగారంతో దాల్ రెసిపీ! షాక్లో నెటిజన్లు
ఎన్నో రకాల వంటకాలను చూసి ఉంటారు. కానీ ఇలాంటి వంటకం మాత్రం చూసి ఉండరు. గోల్డ్తో తయారు చేసిన కొన్ని రకాల రెసిపీలు కూడా చూసి ఉంటారు. కానీ మరీ ఇలా పప్పుని గోల్డ్తో వడించడం చూసి ఉండరు. గోల్డ్ని ఇలా ఆహారం తీసుకుంటే అరుగుతుందా అన్న డౌట్లు వచ్చేస్తుంటాయి. కానీ ఓ రెస్టారెంట్ తన కస్టమర్లకు ఈ ప్రత్యేకమైన వంటకాన్ని అందిస్తుంది. పైగా ధర కూడా ఎక్కువే. ఎక్కడంటే..దుబాయ్లోని కుష్కన్లో పలు అవార్డులు పొందిన సెలబ్రిటీ చెఫ్ రణవీర్ బ్రార్కి చెందిన రెస్టారెంట్ బంగారంతో ప్రత్యేక వంటకాన్ని అందిస్తుంది. ఇది విశేష ప్రజాదరణ పొందిన వంటకం అని చెప్పొచ్చు. దీన్ని 'దాల్ కష్కన్' అనిపిలుస్తారు. పప్పుని 24 క్యారెట్ల బంగారపు రజనుతో తయారు చేస్తారు. దీని ధర ఏకంగా 58 దిర్హామ్లు (సుమారు ₹ 1,300). మెహుల్ హింగు అనే ఫుడ్ బ్లాగర్ ఇన్స్టాగ్రామలో ఆ రెసీపీకి సంబంధించిన వీడియోని షేర్ చేశారు. ఆ వీడియోలో ఒక చెక్కపెట్టేలో ప్రీమియం మసాలాలు, నెయ్యితో తయారు చేసిన పప్పును తీసుకు వస్తారు. సర్వర్ కస్టమర్కు ఆ డిష్ ప్రత్యేకతను వివరించడం జరగుతుంది. ఆ తర్వాత ఒక గిన్నేలోని బంగారు రజనుతో ఉన్న లిక్విడ్ని పప్పుపై వేసి కలపడం కనిపిస్తుంది. ఇది కష్కన్లో దుబాయ్ ఫెస్టివ్ సిటీ మాల్లోని రణ్వీర్ బ్రార్ రెస్టారెంట్ '24 క్యారెట్ల గోల్డెన్ తడ్కే వాలీ దాల్' అనే క్యాప్షన్ని జోడించి మరీ పోస్ట్ చేశాడు మెహుల్ హింగు. దీన్ని చూసిన నెటిజన్లు బంగారాన్ని మన శరీరం శోషించుకోలేదు. అయినా దీనిలో ఏం పోషకాలు ఉంటాయని ఇలా చేస్తున్నారని, మరోకరు ఫైర్ అవ్వుతూ కామెంట్లతో పోస్ట్లు పెట్టారు. View this post on Instagram A post shared by Mehul Hingu (@streetfoodrecipe) (చదవండి: మద్యపాన వ్యసనానికి చెక్పెట్టే సరికొత్త చికిత్స విధానం! పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
వామికతో కలిసి రెస్టారెంట్ లో విరాట్ కోహ్లి
-
రెస్టారెంట్గా మారిపోయే ట్రక్ - వీడియో వైరల్
సోషల్ మీడియాలో ఆసక్తిగా ఉన్న వీడియోలను పోస్ట్ చేస్తూ ఉండే దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' ఇటీవల ఓ టెక్నాలజీకి సంబంధించిన వీడియో షేర్ చేశారు. ఇందులో ఒక ట్రక్ నిమిషాల వ్యవధిలో ఫుడ్ రెస్టారెంట్గా మారిపోయింది. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో రోడ్డు పక్కన ఒక ట్రక్కు ఆగింది. బయట నిలబడి ఉన్న ఒక వ్యక్తి బటన్ నొక్కిన వెంటనే.. ఏదో ఒక రోబో మాదిరిగా తనకు తానుగానే డోర్స్ ఓపెన్ చేసుకుని.. గోడలు లాంటివి సెట్ చేసుకుని ఓ అద్భుతమైన రెస్టారెంట్గా మారిపోయింది. ఇలాంటి ట్రక్కులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి, ఎలా అంటే బిజినెస్ ఎక్కడ ఎక్కువ జరుగుతుందనుకుంటే అక్కడ ఈ ట్రక్కును ఆపి బిజినెస్ చేసుకోవచ్చు. దీని వల్ల రూమ్ రెంట్స్ వంటివి తగ్గుతాయి. ఈ వీడియో చూస్తున్నంత సేపు ఆ టెక్నాలజీకి ఎవ్వరైనా ముగ్దులై ఉండిపోతారు. ఈ వీడియో షేర్ చేస్తూ.. ఫాస్ట్ ఫుడ్, ఫుడ్ ట్రక్.. ఇప్పుడు ఫాస్ట్ రెస్టారెంట్ అంటూనే ఇలాంటి ట్రక్ ఉంటే ఒకే స్థానంలో రెస్టారెంట్ ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడ మార్కెట్ ఉంటె అక్కడకు వెళ్లొచ్చు అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. Fast Food. Food trucks. And now: Fast Restaurants. A new business model since it gives liberation from location to full-size restaurants. It just goes where the market is. 👏🏽👏🏽👏🏽👍🏽pic.twitter.com/qU5hSBxUWx — anand mahindra (@anandmahindra) February 20, 2024 -
మరో బిజినెస్లోకి గౌరీ ఖాన్ : గ్రాండ్ లాంచింగ్, స్టార్ల సందడి
ప్రముఖ ఇంటీరీయర్ డిజైనర్, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ భార్య గౌరీఖాన్ కొత్త బిజినెస్ షురూ చేశారు. ముంబైలోని తొలి రెస్టారెంట్ ‘టోరీ’ ని మంగళవారం రాత్రి ఘనంగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా గౌరీ ఖాన్ స్నేహితులు, ఇండస్ట్రీ ప్రముఖులు, ఇంటీరియర్, ఫ్యాషన్ డిజైనర్లు ఈ వేడుకలో సందడి చేశారు. నిర్మాత కరణ్ జోహార్, భావనా పాండే, నటులు సంజయ్ కపూర్, మహీప్ కపూర్, చుంకీ పాండే, నీలం కొఠారి,సీమా సజ్దేహ్ తదితరులు మెరిసారు. ముఖ్యంగా సుస్సానే ఖాన్ తన ప్రియుడు, నటుడు అర్స్లాన్ గోనితో కలిసి లాంచ్కి హాజరై స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. కాగాఇంటీరీయర్ డిజైనర్గా వ్యాపార రంగంలో సక్సెస్ఫుల్గా రాణిస్తూ, అనేక మంది సెలబ్రిటీల ఫ్యావరెట్గా మారిపోయింది గౌరీ ఖాన్. అలాగే రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్లు నిర్మిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది గౌరీఖాన్. ఇపుడికముంబైలోని విలాసవంతమైన ఏరియాలో లగ్జరీ హెటెల్తో హాస్పిటాలిటీ రంగంలో కూడా ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. -
వివాదంలో అయోధ్యలోని రెస్టారెంట్ : నోటీసులు
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య అనే నగరం గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తోంది. ప్రతిష్టాత్మకమైన శ్రీ రామ జన్మభూమి దేవాలయం నిర్మాణ ప్రతిపాదన మొదలు, ఇటీవల ఘనంగా రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుక దాకా ప్రతీదీ విశేషంగా నిలుస్తోంది. తాజాగా అయోధ్యలో కొత్తగా ప్రారంభించిన రెస్టారెంట్ ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. తక్కువ ధరల్లో భక్తుల సేవలందించాల్సిన హోటల్ అధిక చార్జీలు వసూలు చేస్తోందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. శ్రీరాముడికి ఎంగిలి పళ్లు తినిపించిన అపర భక్తురాలైన శబరి పేరుతో ఏర్నాటైన రెస్టారెంట్ నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. శబరి రసోయిలో రెండు కప్పుల టీ , రెండు బ్రెడ్ ముక్కల కోసం ఏకంగా రూ. 252 వసూలు చేసింది. సంబంధిత బిల్లును కస్టమర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, పోస్ట్ చేసిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంత అన్యాయం అంటూ నెటిజన్లు మండిపడ్డారు. ఈ అంశం చివరికి అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ (ఏడీఏ)కి చేరింది. దీంతో సదరు హోటల్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. మూడు రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని రెస్టారెంట్ను ఆదేశించింది, లేని పక్షంలో ఒప్పందాన్ని రద్దు చేస్తామని ఏడీఏ వైస్ చైర్మన్ విశాల్ సింగ్ హెచ్చరించారు. अयोध्या | शबरी रसोई 55 रुपए की एक चाय 65 रुपए का एक टोस्ट राम नाम की लूट है, लूट सके तो लूट pic.twitter.com/rRrl6eRBaB — Govind Pratap Singh | GPS (@govindprataps12) January 24, 2024 ఒప్పందం ప్రకారం బడ్జెట్ కేటగిరీ కింద జాబితా చేయబడిన ఈ రెస్టారెంట్ భక్తులకు , యాత్రికులకు రూ. 10కి ఒక కప్పు టీ, రెండు టోస్ట్లను అందించాల్సి ఉంది. మరోవైపు ఈ ఆరోపణలు సదరు రెస్టారెంట్ ఖండించింది. ఇది ఫ్రీ గా తినాలనుకుని భావించిన కస్టమర్ల పన్నాగమని, బిల్లును సోషల్ మీడియాలో వైరల్ కావడం వెనుక కుట్ర ఉందని శబరి రసోయి రెస్టారెంట్ ప్రాజెక్ట్ హెడ్ సత్యేంద్ర మిశ్రా వ్యాఖ్యానించారు. తమ వద్ద పెద్ద పెద్ద హోటళ్లలో ఉండే సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. అథారిటీ నోటీసులకు సమాధానమిచ్చినట్టు తెలిపారు.. అరుంధతీ భవన్ పేరుతో కొత్తగా నిర్మించిన వాణిజ్య సముదాయంలో శబరి రసోయి ఉంది. ఇది రామ మందిరం సమీపంలోని తెహ్రీ బజార్లో అహ్మదాబాద్కు చెందిన కవాచ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ లిమిటెడ్ దీన్ని ఏర్పాటు చేసింది. -
నటి సన్నీ లియోన్ కొత్త వ్యాపారం.. వీడియో వైరల్
సన్నీ లియోన్ గురించి సినిమా ప్రేమికులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే పోర్న్స్టార్గా ఉన్న ఈమె.. ఆ తర్వాత నటిగా బాలీవుడ్లోకి ఎంటరైంది. స్పెషల్ సాంగ్స్తో పాటు పలు పాత్రల్లోనూ నటించి ఆకట్టుకుంది. తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు భర్తతో కలిసి కొత్తగా ఓ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. అందుకు సంబంధించిన వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి: అత్తారింట్లో కండీషన్స్? మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్) మారిపోయిన సన్నీ లియోనీ సన్నీ లియోన్ పేరు చెప్పగానే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఒకప్పుడు పోర్న్ చిత్రాల్లో నటించడమే దీనికి కారణం. ఆ ఇండస్ట్రీని వదిలి ఏళ్లకు ఏళ్లకు గడిచిపోయినా సరే ఇప్పటికీ చాలామంది.. ఈమెని ఆ ఉద్దేశంతోనే చూస్తుంటారు. కానీ సన్నీ లియోనీ.. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వ్యాంప్ క్యారెక్టర్స్ చేసినా సరే.. బయట మాత్రం కొన్ని మంచి పనులు చేసింది. ఓ అనాథ బాలికని కూడా దత్తత తీసుకుని పెంచుకుంటోంది. ఏంటా బిజినెస్? గత కొన్నేళ్ల నుంచి సినిమాల పరంగా ఈమెకు పెద్దగా అవకాశాలు రావట్లేదు. దీంతో రూట్ మార్చేసింది. భర్త డేనియల్ వెబర్తో రెస్టారెంట్ బిజినెస్ మొదలుపెట్టింది. ఢిల్లీలోని నోయిడాలో 'చికలోక' పేరుతో ఓ రెస్టారెంట్ ఈ మధ్య ఓపెన్ చేసింది. ఇందులో కుక్ చేస్తున్న ఓ వీడియో తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో వ్యాపారంలోకి సన్నీ లియోన్ అడుగుపెట్టిన విషయం అందరికీ తెలిసింది. (ఇదీ చదవండి: టీనేజీలోనే గట్టిగా సంపాదిస్తున్న మహేశ్ కూతురు సితార.. నెలకు ఎన్ని లక్షలంటే?) View this post on Instagram A post shared by Chica Loca Noida (@chicalocanoida) -
దయాగుణ సంపన్నుడు
పేదింటి భార్యాభర్తలు, వారి ముగ్గురు పిల్లలు ఆకలితో ఉన్నారు. ‘పిల్లలు ఆకలితో ఉన్నారు. మా దగ్గర డబ్బులు లేవు. సహాయం చేయండి’ అని ఆశిష్ అనే యువకుడిని అడిగారు ఆ దంపతులు. పదో పరకో వారి చేతిలో పెట్టి తన దారిని తాను వెళ్లిపోలేదు ఆశిష్. దగ్గరలో ఉన్న రెస్టారెంట్కు తీసుకువెళ్లి వారు కోరిన పదార్థాలు తినిపించాడు. ఆ తరువాత వారిని ఆటో ఎక్కించి డ్రైవర్కు తానే డబ్బులు ఇచ్చాడు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు సోషల్ మీడియా యూజర్ల నుంచి భారీ స్పందన లభించింది. పోస్ట్ చేసిన రెండు రోజుల్లోనే పదిలక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ‘ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అంటే వారి ఆకలి తీర్చడం మాత్రమే కాదు మీ ప్రయాణంలో మీరు ఒంటరి వారు కాదు అని ధైర్యం చెప్పడం కూడా’ అని రాశాడు ఆశిష్. ‘దయాగుణానికి ఉన్న గొప్పదనం ఏమిటంటే వినికిడి శక్తి లేని వారు కూడా వినగలరు. కంటిచూపు లేని వారు కూడా చూడగలరు. దయాగుణాన్ని మించిన సంపద లేదు’ అని ఒక యూజర్ రాశాడు. -
ముంబైలో అరకు - ప్రత్యేకతలు ఏంటంటే?
భారతదేశంలో ప్రముఖ స్పెషాలిటీ కాఫీ బ్రాండ్గా అవతరించిన 'అరకు' (Araku).. ఇటీవల ముంబైలోని కొలాబాలో తన కొత్త రెస్టారెంట్ను ఆవిష్కరించింది. అరకు పేరుతో ఉన్న ఈ రెస్టారెంట్ 'సూరత్ నవాబ్' 1897లో నిర్మించిన శతాబ్దపు పురాతన భవనం సన్నీ హౌస్లో ఏర్పాటైంది. ఈ రెస్టారెంట్ 2,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో సుమారు 55 మంది భోజనం చేయడానికి సరిపడే విధంగా ఏర్పాటు చేశారు. న్యూయార్క్కు చెందిన ఆర్కిటెక్ట్ జార్జ్ జపాటా రూపొందించిన ఇంటీరియర్లు, భారతీయ డిజైనర్లు రూపొందించిన ఫర్నీషింగ్ వంటివి ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ముంబైలో ప్రారంభమైన అరకు రెస్టారెంట్ ఇంటీరియర్స్ స్కాండినేవియన్ మినిమలిజమ్ను తలపిస్తాయి. రంగు రంగుల పొడవైన కిటికీలు, ఎత్తైన పైకప్పులు, చెక్క అలంకరణలు, మొక్కల పెంపకానికి అనుకూలమైన ప్రదేశాలు చూడచక్కగా ఉండటమే కాకుండా.. అతిధులను ప్రత్యేకమైన ప్రదేశంలోకి ఆహ్వానించినట్లు భావించేలా చేస్తాయి. ఇందులో ఓక్ కలప, తెల్లటి ప్లాస్టర్ గోడలు, న్యాచురల్ స్టోన్స్, సిరామిక్ సెంటర్ స్టేజ్ వంటివి కూడా ఇక్కడ గమనించవచ్చు. బెంగళూరుకు చెందిన డిజైనర్ సందీప్ సంగారు కూడా తనదైన శైలిలో ఇక్కడ అద్భుతాలను రూపొందించారు. ఇందులో 60,000కు పైగా చిన్న కాఫీ ఎస్టేట్లలో గిరిజన రైతులు కాఫీ పండించే అరకు భూభాగానికి సంబంధించిన 3డీ ఫోటోలు గోడలకు ఉండటం చూడవచ్చు. గోడల మీద సౌబియా చస్మావాలా కళాఖండాలు, రిచర్డ్ మాథర్ పైక్ గిరిజన ఆర్ట్స్ ఉండటం గమనించవచ్చు. ఇదీ చదవండి: 2023లో ఎక్కువగా ఈ కార్ల కోసమే సెర్చ్ చేశారు మెనూ విషయానికి వస్తే.. ఇందులో దేశీయ వంటకాలు మాత్రమే కాకుండా ఇతర దేశ వంటకాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో చెప్ రాహుల్ రుచులు ప్రత్యేకమైనవని చెబుతారు. ఈ రెస్టారెంట్లో కిడ్నీ బీన్ ఐయోలీ, కంట్రీ చికెన్, పిక్లింగ్ టొమాటో, చీజ్ సలాడ్, పర్పుల్ స్వీట్ పొటాటో గ్నోచీ, గ్రిల్డ్ ఫ్రెంచ్ బీన్స్ టాకో, హాట్-సాస్ నూడుల్స్, ష్రిమ్ప్ టోస్ట్, టోఫు, స్క్విడ్ క్రాకర్స్, కోజీ ఫ్రైడ్ చికెన్, స్ట్రీమ్డ్ చికెన్, కొబ్బరి నూడుల్స్, బీస్వాక్స్ ఐస్ క్రీమ్, పొటాటో చాక్లెట్ కేక్, క్రీమ్ కేక్ మొదలైనవి ఉన్నట్లు సమాచారం. -
విలక్షణమైన రెస్టారెంట్: అక్కడ ఆర్డర్ తారుమారైనా పొరపాటు కాదు!
ఎన్నో రెస్టారెంట్లు చూసుంటారు. కానీ ఇలాంటి రెస్టారెంట్ చూసే అవకాశమే లేదు. ఎందుకంటే? ఎక్కడైన కస్టమర్ ఆర్డర్ చేసింది కాకుండా మరోకటి ఆర్డర్ తీసుకువస్తే..జరిగే రచ్చ అంతా ఇంత కాదు. ఏకంగా రెస్టారెంట్నే క్లోజ్ అయ్యేలా గొడవ చేస్తారు కస్టమర్లు. కానీ ఇక్కడ ఆర్డర్ తప్పుగా తెచ్చిన సద్దుకుపోతారు కస్టమర్లు. పైగా రెస్టారెంట్కి జనాలు రావడం తగ్గించరు కూడా. అదేంటీ? అనిపిస్తుంది కదూ!. ఐతే ఆ రెస్టారెంట్ ఏంటో ఎక్కడ ఉందో చదివేయండి మరీ..! ఇదో విలక్షణమైన రెస్టారెంట్. జపాన్ రాజధాని టోక్యో పశ్చిమ శివార్లలో ఉందిది. దీని పేరు ‘రెస్టారెంట్ ఆఫ్ మిస్టేకెన్ ఆర్డర్స్’. ఇక్కడ మీరు సుషి ఆర్డరిస్తే, మీ టేబుల్ మీదకు నూడుల్స్ రావచ్చు. నూడుల్స్ ఆర్డరిస్తే, సూప్ రావచ్చు. మీరు ఆర్డర్ ఇచ్చేది ఒకటైతే, మీ టేబుల్ మీదకు వచ్చేది మరొకటి కావడం ఈ రెస్టారెంట్లో సర్వసాధారణం. ఒక్కోసారి మీరు ఆర్డరిచ్చిన ఐటెమ్స్ ఎంతసేపటికీ మీ టేబుల్ మీదకు రాకపోవచ్చు. ఏదైనా ఒక రెస్టారెంట్లో ఇంత అవకతవకగా సర్వీస్ ఉన్నట్లయితే, కస్టమర్లు గొడవలకు దిగుతారు. పద్ధతి మార్చుకోకపోతే, రెస్టారెంట్కు రావడమే మానేస్తారు. చివరకు రెస్టారెంట్ మూతబడే పరిస్థితి వస్తుంది. అయితే, ‘రెస్టారెంట్ ఆఫ్ మిస్టేకెన్ ఆర్డర్స్’ మాత్రం విజయవంతంగా నడుస్తోంది. ఆర్డర్లు తారుమారైనా ఇక్కడకు వచ్చే కస్టమర్లు ఏమాత్రం పట్టించుకోరు. టేబుల్ మీదకు వచ్చిన దాంతోనే సర్దుకుపోతారు. ఒకటి ఆర్డరిస్టే, మరొకటి తీసుకొచ్చినందుకు సర్వర్లపై విరుచుకుపడరు. వారిని సానుకూలంగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే, ఇక్కడ సర్వర్లుగా పనిచేసేవారు వయోవృద్ధులు, పైగా డెమెన్షియా బాధితులు. అందువల్ల వారు ఆర్డర్లను తారుమారు చేసినా, కస్టమర్లెవరూ వారి మీద కోపగించుకోరు. డెమెన్షియా వల్ల మతిమరుపుతో బాధపడే వయోవృద్ధులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతోనే షిరో ఒగుని అనే వ్యాపారవేత్త ఈ రెస్టారెంట్ను ప్రారంభించాడు. (చదవండి: మహిళ కళ్లల్లో 60కి పైగా సజీవ పురుగులు!) -
ఈ రెస్టారెంట్లో చెంపదెబ్బలు వడ్డిస్తారు!
అనగనగా జపాన్లో ‘షచిభొకయ–యా’ అనే రెస్టారెంట్ ఉంది. నాగోయ నగరంలో ఉన్న ఈ రెస్టారెంట్కు రుచుల కోసం కాదు చెంపదెబ్బల కోసం కస్టమర్లు క్యూ కట్టేవారు. రెస్టారెంట్లోకి అడుగు పెట్టగానే కస్టమర్ చెంప చెళ్లుమనిపిస్తుంది వెయిటర్. ఈ రెస్టారెంట్లో ఒక లేడి వెయిటర్ కస్టమర్ చెంప చెళ్లుమనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘ఇదెక్కడి చోద్యమమ్మా ’ అని ప్రపంచం బిత్తరపోతుండగానే రెస్టారెంట్ వాళ్లు ‘ఎక్స్’ వేదికగా ప్రకటన చేశారు. ‘మా రెస్టారెంట్లో ప్రస్తుతం చెంపదెబ్బలు లేవు. రెస్టారెంట్కు రావడానికి ముందు ఈ విషయాన్ని గమనించాలని మనవి’ అనేది ఆ ప్రకటన సారాంశం. పబ్లిసిటీ కోసం చెంపదెబ్బల సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారా? లేక దీని వెనుక ‘ఈ రెస్టారెంట్లో చెంపదెబ్బ తింటే కలిసి వస్తుంది’ అనే సెంటిమెంట్ దాగుందా అనేది తెలియదుగానీ రుచులతో సంబంధం లేకుండానే ఈ రెస్టారెంట్ పేరు ప్రపంచవ్యాప్తంగా సుపరిచితం అయింది. -
భారతీయ వంటకాలతో అదరహో అనిపిస్తున్న జపాన్ కుర్రాళ్లు! ఏకంగా..
జపాన్ వాసులు ఆహారాన్ని చేతితో తినడానికి కూడా ఇష్టపడరు. అలాంటి వారు మన భారతీయ వంటకాలను అందించే రెస్టారెంట్ని నిర్వహిస్తున్నారంటే నమ్ముతారా!. వెంటనే జోక్ చేస్తున్నారా..!అని కచ్చితంగా అంటాం. కానీ ఇది నిజం. నమ్మశక్యంగా లేకపోయిన నమ్మకతప్పని నిజం. ఆ రెస్టారెంట్లో ఎక్కువ కస్టమర్లు కూడా జపాన్ వాసులు కావడం విశేషం. భారతీయులు ముఖ్యంగా విదేశాలకు వెళ్తే భారతీయ వంటకాలను కూడా పట్టకెళ్తారు. కనీసం ఊరు నుంచి ఎవ్వరైనా విదేశాలకు వస్తున్నారని తెలిసినా.. వెంటనే వారిని సంప్రదించి మనకు కావల్సినవి తెప్పించేసుకుంటాం. అదృష్టం కొద్దీ..మన దేశం నుంచి వచ్చి విదేశాల్లో సెటిల్ అయినవాళ్లు ఎవరైనా.. ఇండియన్ రెస్టారెంట్ పెట్టుకుంటే..హమ్మయ్యా మనోడిది అంటూ లొట్టలేసుకుంటూ తినేందుకు ఆ రెస్టారెంట్లో వాలిపోతాం. కానీ జపాన్లోని తడ్కా అనే ప్రాంతంలో క్యోటోలో ఈ కిక్ ఎ అనే సౌత్ ఇండియన్ రెస్టారెట్ ఉంది. ఐతే దీన్ని మన భారతీయులు నిర్వహిస్తున్నారనుకుంటే పొరపాటే. ఎందుకంటే దీన్ని ఇద్దరు జపాన్ కుర్రాళ్లు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా భారతీయులు ఇష్టంగాతినే ఇడ్లీ, దోస, అన్నం, పప్పు తదితర వంటకాలన్నీ భారత చెఫ్లకు తీసుపోనీ విధంగా రుచికరంగా అందిస్తున్నారు. వాస్తవానికి జపాన్ వాసులు ఆహారాన్ని చాప్ స్టిక్లతో తప్పించి చేతితో తినేందుకే ఇష్టపడరు. అలాంటి వారు మన ఆహారాన్ని రుచికరంగా వండటమే విశేషమంటే..? మనలానే అక్కడ జపాన్ ప్రజలు మన వంటకాలను చేతితో తినడం మరింత ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒక్కసారిగా వాళ్లు కూడా మన సంస్కృతిని ఫాలో అవుతున్నారా? అని షాకింగ్ అనిపిస్తుంది. అంతేగాదు ఈ రెస్టారెంట్కి మన భారతీయుల కంటే చైనా కస్టర్లే ఎక్కువగా వస్తారు. అందుకు సంబంధించిన విషయాన్ని గోవా ముఖ్యమంత్రికి మాజీ పాలసీ సలహదారు ప్రసన్న కార్తీక్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నాడు. ఆయన అందుకు సంబంధించిన ఫోటోలను నెట్టింట షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ విషయం వైరల్గా మారింది. అంతేకాదు ఆ రెస్టారెంట్ని నిర్వహిస్తున్న జపాన్ కుర్రాళ్లు ప్రతి ఏడాది చెన్నై వెళ్లి అక్కడ దోస, ఇడ్లీ తయారీ విధానాన్ని నేర్చుకుని వస్తుంటారని పోస్ట్లో పేర్కొన్నారు కార్తీక్. In the process, the two have truly embraced Indian culture from the bottom of their heart. They developed a deeper understanding of Hinduism and fell in love with it. pic.twitter.com/Jbhpglskyo — Prasanna Karthik (@prasannakarthik) October 29, 2023 పైగా చెన్నై వెళ్లిన ప్రతిసారి తిరువనమలై దేవాలయాన్ని సందర్శించడమే గాక భగవాన్ రమణ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించి కొద్దిసేపు ధ్యానం చేసి వస్తుంటారని చెప్పుకొచ్చాడు. అంతేగాదు మన ఇండియన్ రెస్టారెంట్ల మాదిరిగా కాంప్లిమెంటరీ కాఫీని సైతం ఆ జపాన్ కుర్రాళ్లు అందించినట్లు వెల్లడించారు. ఈ కుర్రాళ్లిద్దరూ జపాన్ స్థాయిని ఒక్కసారిగా పెంచేశారంటూ ట్విట్టర్లో ప్రశంసలతో ముంచెత్తాడు. I don’t have coffee or tea. But when I was leaving, they gave me a complimentary cup of south Indian filter coffee. Since I did not want to be rude, I accepted it. It turned out to be the best filter coffee I’ve ever had. These guys took Japanese precision to an all new level. pic.twitter.com/ZETj1lUN9T — Prasanna Karthik (@prasannakarthik) October 29, 2023 (చదవండి: వికీపీడియాలో మహిళా శాస్త్రవేత్తల బయోగ్రఫీ ఉందా? గమనించారా?) -
ఈ శాండ్విచ్ ధర వింటే..కళ్లు బైర్లు కమ్మడం ఖాయం!
ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన శాండ్విచ్. న్యూయార్క్లోని సెరండిపిటీ–3 అనే రెస్టారెంట్ ఈ శాండ్విచ్ను ‘నేషనల్ గ్రిల్డ్ చీజ్ డే’ సందర్భంగా ఏప్రిల్ 12 నుంచి తన మెనూలో చేర్చి, కస్టమర్లకు వడ్డిస్తోంది. ఈ గ్రిల్డ్ చీజ్ శాండ్విచ్ ఖరీదు 214 డాలర్లు (రూ.18,229). న్యూయార్క్ రెస్టారెంట్లలో పూర్తి స్థాయి భోజనం ఖరీదే 30 డాలర్లకు (రూ.2,497) మించదు. అలాంటిది ఈ శాండ్విచ్ ధరకు అమెరికన్లే కళ్లు తేలేస్తున్నారు. అయినా, కొందరు సంపన్నులు ఈ శాండ్విచ్ను రుచి చూడటానికి సెరండిపిటీ–3 రెస్టారెంట్ వద్ద క్యూ కడుతుండటం విశేషం. ఈ శాండ్విచ్ తయారీకి ఫ్రెంచ్ పల్మన్ షాంపేన్ బ్రెడ్, గడ్డిలో పెరిగే తెల్ల పుట్టగొడుగులు, అరుదైన కాషియోకవాలో పొడోలికా గ్రిల్డ్ చీజ్, తినడానికి ఉపయోగించే 23 క్యారెట్ల బంగారు రేకులు ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఇందులో వినియోగించే కాషియోకవాలో పొడోలికా చీజ్ను పొడోలికా జాతి ఆవుల పాల నుంచి తయారు చేస్తారు. ఈ జాతి ఆవులు ప్రపంచంలో దాదాపు పాతికవేలు మాత్రమే ఉన్నాయి. ఇవి ఏడాదిలో కేవలం మే, జూన్ నెలల్లో మాత్రమే పాలు ఇస్తాయి. అందువల్ల వీటి పాలు, వీటి పాలతో తయారయ్యే చీజ్ వంటి ఉత్పత్తులు అత్యంత ఖరీదైనవి. (చదవండి: జపాన్లో కూడా కణకణలాడే నిప్పుల మీద నడిచే ఆచారం..!) -
రోజా చేతుల మీదుగా ‘మీ కడుపునిండా’ రెస్టారెంట్ ప్రారంభం (ఫొటోలు)
-
గడ్డకట్టిన మంచుతో భారీ రెస్టారెంట్.. ఎక్కడో తెలుసా?
గడ్డకట్టిన మంచుతో శిల్పాలు చెక్కి ప్రదర్శనకు పెట్టడం చలి ప్రదేశాల్లో మామూలే! స్వీడన్లోనైతే ఏకంగా గడ్డకట్టిన మంచుతో ఒక భారీ హోటల్నే నిర్మించారు. ఇందులోని మంచాలు, కుర్చీలు, బల్లలు వంటివన్నీ గడ్డకట్టిన మంచుతో తయారు చేసినవే కావడం విశేషం. జేమ్స్బాండ్ సినిమా ‘డై ఎనదర్ డే’లో కనిపించిన భవంతి నమూనా ఆధారంగా ఈ హోటల్ను నిర్మించడం విశేషం. టోర్నె నదిలో గడ్డ కట్టిన మంచును తవ్వి తెచ్చి, నదికి సమీపంలోనే దీనిని ఐదువందల టన్నుల మంచుతో నిర్మించారు. ఇందులో పన్నెండు ఆర్ట్ స్వీట్రూమ్స్, ఒక డీలక్స్ స్వీట్రూమ్, థీమ్డ్ రూమ్లు, బార్ సహా పలు వసతులు ఉన్నాయి. ఈ హోటల్లో పది ఒలింపిక్ స్విమింగ్ పూల్స్, ముప్పయిమూడు చిన్న స్విమింగ్పూల్స్ కూడా ఉన్నాయి. లూకా రోంకొరోని నేతృత్వంలో ఇరవై నాలుగు మంది హిమశిల్పులు దీనిని నిర్మించారు. దీని లోపలి భాగంలో ఉష్ణోగ్రత మైనస్ ఐదు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుంది. ఇది ఏడాది పొడవునా అతిథులకు అందుబాటులో ఉంటుంది. -
సముద్రంలో రెస్టారెంట్.. చూడటానికి రెండు కళ్లు సరిపోవు
సముద్రంలో రెస్టారెంట్ సముద్రంలో బయటకు పొడుచుకొచ్చిన ఒక కొండ మీద పూరిగుడిసెలా కనిపిస్తున్నది ఒక రెస్టారెంట్. కొండ కొమ్ముమీద నిర్మించడం వల్ల దీనికి ‘ది రాక్’ అని పేరుపెట్టారు. టాంజానియాలోని జాంజిబార్ ద్వీపసమూహంలో ఒకటైన ఉంగుజా ద్వీప తీరానికి ఆవల హిందూ మహాసముద్రంలో ఉందిది. ఈ రెస్టారెంట్లో భోంచేయాలంటే, ఉంగుజా దీవి నుంచి పడవ మీద వెళ్లాల్సిందే! పీతలు, రొయ్యలు, ఆక్టోపస్ వంటి సీఫుడ్కు ఈ రెస్టారెంట్ పెట్టింది పేరు. టాంజానియాకు వచ్చే విదేశీ పర్యాటకుల్లో చాలామంది పనిగట్టుకుని మరీ ఈ రెస్టారెంట్కు వచ్చి, ఇక్కడి రుచులను ఆరగించి వెళుతుంటారు. View this post on Instagram A post shared by ZANZIBAR DRONE SERVICES 📸🛸 (@dronezanzibar) View this post on Instagram A post shared by ZANZIBAR DRONE SERVICES 📸🛸 (@dronezanzibar) View this post on Instagram A post shared by ZANZIBAR DRONE SERVICES 📸🛸 (@dronezanzibar) విగ్గుతో గిన్నిస్ రికార్డ్ విగ్గుల వాడకం అందరికీ తెలిసిందే! సినీ నాటక రంగాల్లో విగ్గుల వాడకం ఎక్కువ. ఇటీవలి కాలంలో బట్టతలలు గల సాధారణ వ్యక్తులు కూడా విగ్గులు వాడుతున్నారు. సాధారణంగా వాడుకలో ఉన్న ఈ విగ్గులు నెత్తిని జుట్టుతో నిండుగా కప్పేంత పరిమాణంలో ఉంటాయి. కొన్ని విచిత్రవేషాల కోసం వాడే విగ్గులైతే తల మీద దాదాపు ఒక అడుగు మందం వరకు కూడా ఉంటాయి. అయితే, అలాంటి విగ్గులు చాలా అరుదు. ఇక ఇటీవల ఆస్ట్రేలియన్ ఫ్యాషన్ డిజైనర్ డానీ రేనాల్డ్స్ రూపొందించిన అతిభారీ విగ్ గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకుంది. బైక్ హెల్మెట్ను చట్రంగా చేసుకుని రూపొందించిన ఈ విగ్గు వెడల్పు ఎనిమిది అడుగుల ఆరంగుళాలట. దీని తయారీకి పీవీసీ పైపులు, అల్యూమినియం రాడ్లు, కేబుల్ వైర్లు వంటి వస్తువులను ఉపయోగించడం విశేషం. ఈ విగ్గు ప్రపంచంలోనే అత్యంత వెడల్పాటి విగ్గుగా గిన్నిస్ రికార్డు సాధించింది. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords)
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
జీతాలపై ప్రభావం.. ఎయిర్ఇండియా ఉద్యోగుల ఆందోళన!
స్వాతిమలివాల్పై దాడి.. తొలిసారి స్పందించిన కేజ్రీవాల్
'నేనేమి షాహిది అఫ్రిదిని కాను'.. రిటైర్మెంట్ యూటర్న్పై రైనా
టీడీపీ రిగ్గింగ్.. పూర్తి వీడియో బయటపెట్టాలి: కాసు మహేష్రెడ్డి
విడాకుల రూమర్స్.. ఈ ప్రపంచం గురించి పట్టించుకోనంటున్న నటుడు
నటుడు వరుణ్ సూద్కు వచ్చిన బ్రెయిన్ ఇంజూరీ అంటే? ఎందువల్ల వస్తుంది?
Virat Kohli: కీలక మ్యాచ్కు ముందు ఆర్సీబీకి షాక్?!
T20 Worldcup 2024: భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు అంపైర్లు వీరే..
ఒకపుడు జర్నలిస్టు, అంబానీని మించిన ఇంద్రభవనంలో : అత్యంత అందమైన రాణి
చరణ్.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. ఉపాసన పోస్ట్
తప్పక చదవండి
- ఒకపుడు జర్నలిస్టు, అంబానీని మించిన ఇంద్రభవనంలో : అత్యంత అందమైన రాణి
- ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసీ సీరియస్
- T20: బంగ్లాకు షాకిచ్చిన పసికూన.. మినీ టీమిండియా అంటూ..
- చనుగొండ్లలో చిరుత పిల్లల సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు
- ఇజ్రాయెల్ హెచ్చరిక.. రాయబారులు వెనక్కి రండి
- మూడేళ్ల చిన్నారిపై విద్యుత్ చౌర్యం కేసు
- నిర్మాత మోసం.. నిజాలు బయటపెట్టిన హీరోయిన్ నమిత
- నేమ్ప్లేట్ మార్చేసిన సూపర్ మామ్ సానియా మీర్జా ఫోటోలు వైరల్
- RR vs RCB: వార్ వన్సైడ్.. గెలిచేది ఆ జట్టే: టీమిండియా దిగ్గజం
- Kalki 2898: 12 సెకన్లు.. రూ.3 కోట్లు, రాజమౌళిని ఫాలో అవుతున్న ‘కల్కి’టీమ్!
Advertisement