-
No Headline
నామినేషన్లు వేయాల్సిన కార్యాలయాలు నియోజకవర్గం నెల్లూరు లోక్సభ కలెక్టర్ చాంబర్ నెల్లూరు సిటీ కార్పొరేషన్ నెల్లూరు రూరల్ ఆర్డీఓ కందుకూరు సబ్ కలెక్టర్ కావలి ఆర్డీఓ ఆత్మకూరు మున్సిపల్ కోవూరు తహసీల్దార్ సర్వేపల్లి ఎంపీడీఓ ఉదయగిరి తహసీల్దార్ -
108లో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలోని 108 వాహనాల్లో ఈఎంటీ, పైలట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా మేనేజర్ విజయ్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈఎంటీ పోస్టులకు జీఎన్ఎం, బీఎస్సీ లైఫ్ సైస్స్, బీ ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలని చెప్పారు. పైలట్ పోస్టులకు పదో తరగతి పాసై, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి 35 ఏళ్లలోపు వయస్సు, ఇంగ్లిష్ రాయడం, చదవడం వచ్చి ఉండాలన్నారు. జీజీహెచ్ ప్రాంగణంలోని 108 జిల్లా కార్యాలయంలో ఈ నెల 19లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన నెల్లూరు(క్రైమ్): అగ్నిప్రమాద నివారణ చర్యలపై కోవూరులోని చౌదరి పెట్రోల్ బంక్ సిబ్బందికి బుధవారం అవగాహన కల్పించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సహాయ అగ్నిమాపక అధికారి వేణుగోపాల్రావు మాట్లాడారు. ప్రమాదం సంభవిస్తే ఆక్సిజన్ అందకుండా డీసీపీ పౌడర్ను వాడాలని, తీవ్రత ఎక్కువైతే ఫోమ్ను వినియోగించాలని సూచించారు. రూ.1.5 లక్షల సీజ్ ఉదయగిరి: మండలంలోని యర్రబల్లిగడ్డ వద్ద ఎలాంటి పత్రాల్లేకుండా తరలిస్తున్న రూ.1.5 లక్షలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి నారాయణ బుధవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. సీతారామపురం మండలం బాలాయపల్లికి చెందిన ముత్తంశెట్టి కేశవరావు, వెంకటేశ్వర్లు కలిసి ద్విచక్రవాహనంపై శకునాలపల్లికి వెళ్తున్నారు. ఈ క్రమంలో యర్రబల్లిగడ్డ వద్ద వారి వాహనాన్ని తనిఖీ చేయగా, రూ.1.5 లక్షలను కనుగొన్నారు. ఎలాంటి పత్రాల్లేకపోవడంతో నగదును సీజ్ చేసి.. ఉదయగిరి పోలీస్స్టేషన్లో ఎస్సై ఇంద్రసేనారెడ్డికి అప్పగించారు. తదుపరి ట్రెజరీలో జమచేయనున్నామని తెలిపారు. ముగిసిన శ్రీరామకథా తరంగిణి సప్తాహం నెల్లూరు(బృందావనం): రేబాలవారివీధిలోని పీటీజీ టవర్స్లో పద్యసారస్వత పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీరామకథా తరంగిణి సప్తాహం బుధవారంతో ముగిసింది. ఉత్తరకాండంపై విద్వాన్ డాక్టర్ చీమకుర్తి వెంకటేశ్వరరావు ఉపన్యసించారు. సభా పోష కుడిగా సత్యనారాయణ, సభాధ్యక్షుడిగా లక్ష్మీనరసింహరావు వ్యవహరించారు. రామచంద్రప్రసాద్, బలరామయ్యనాయుడు, రామకృష్ణప్రసాద్రావు, రాజశేఖర్, సుబ్బారావు, శ్రీనివాసులురెడ్డి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
తమ్ముళ్లు.. అటో.. ఎటో..!
ఎన్నికలకు పట్టుమని నాలుగు వారాల్లేవు. ఈ దశలోనూ సయోధ్య కుదరక కందుకూరులో టీడీపీ దయనీయ స్థితిని ఎదుర్కొంటోంది. మొదట్నుంచి పార్టీ జెండాను మోసిన వారిని విస్మరించి ఇతరులకు టికెట్ ఇవ్వడంపై ఆ పార్టీలో రాజుకున్న అంతర్గత పోరు నేడు మరింత తీవ్రమవుతోంది. నేతల మధ్య విభేదాలు రోజుకో తరహాలో బయటపడుతున్నాయి. అభ్యర్థి ఎంపిక విషయంలో టీడీపీ అధిష్టాన నిర్ణయాన్ని ఇంటూరి రాజేష్ బహిరంగంగా వ్యతిరేకిస్తుండగా.. పార్టీ అభ్యర్థికి మాజీ ఎమ్మెల్యేలు సహకరించే పరిస్థితి కానరావడంలేదు. ఈ తరుణంలో కీలక నేతల మధ్య కుమ్ములాటలతో పార్టీ కేడర్ డీలాపడుతోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కందుకూరులో టీడీపీ నేతలు ఎవరికి వారే యమునా తీరేననే చందంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావును అధిష్టానం ఖరారు చేయడంతో రాజుకున్న నిప్పు తగ్గకపోగా, ఎన్నికలు సమీపించే కొద్దీ మరింత ఎక్కువవుతోంది. ఈ పరిణామాలతో అయోమయ స్థితిలో కేడర్ కొట్టుమిట్టాడుతోంది. వారి వైఖరి చర్చనీయాంశం కందుకూరు నియోజకవర్గంలో ఇద్దరు మాజీ ఎమ్మె ల్యేలు దివి శివరామ్, పోతుల రామారావు శైలి ఆ పార్టీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో పార్టీ కార్యకలాపాలకు వీరు దూ రంగా ఉండటం అయోమయానికి కారణమవుతోంది. టీడీపీ అభ్యర్థి నాగేశ్వరరావుకు నిన్నా.. మొన్నటి వరకు అన్ని విధాలా అండదండలు అందించిన దివి శివరామ్ ఎన్నికల వేళ ముఖం చాటేస్తున్నారు. మారిన వైఖరి నియోజకవర్గంతో మాజీ ఎమ్మెల్యే దివి శివరామ్కు ఎంతో అనుబంధం ఉంది. ఈ తరుణంలో ఆయనకు పార్టీ అధిష్టానం ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ వచ్చింది. తనకున్న గుర్తింపుతో మొదట్లో నాగేశ్వరరావుకు పార్టీ ఇన్చార్జి పదవిని ఇప్పించారు. తదనంతరం అన్ని కార్యక్రమాల్లో నాగేశ్వరరావుకు శివరామ్ మద్దతిచ్చారు. అయితే నాగేశ్వరరావును అభ్యర్థిగా ప్రకటించాక శివరామ్ వైఖరి పూర్తిగా మారిపోయింది. టీడీపీ నెల్లూరు లోక్సభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డితో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలోనూ వేదికపైకి శివరామ్ వెళ్లకుండా తన అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కారు. కొందరు పార్టీ నేతలు కలగజేసుకొని సర్దిచెప్పేందుకు యత్నించినా, ఆయన ససేమిరా అన్నారు. వ్యతిరేక వర్గానికి సహకారం మరోవైపు శివరామ్ సోదరులు లింగయ్యనాయుడు, రమేష్ సైతం నాగేశ్వరరావుకు దూరమయ్యారు. నాగేశ్వరరావును వ్యతిరేకిస్తున్న ఇంటూరి రాజేష్తో వీరు చేతులు కలుపుతున్నారు. రాజేష్ నిర్వహించే వ్యతిరేక కార్యక్రమాలకు సైతం హాజరవుతున్నారు. నియోజకవర్గంలో ప్రస్తుతం నాగేశ్వరరావు వర్సెస్ దివి అనే తరహాలో రాజకీయాలు సాగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో మీకు సహకరించేది లేదంటూ నాగేశ్వరరావుకు వీరు ముఖానే చెప్పారనే ప్రచారమూ ఉంది. దీంతో అసలు వీరిద్దరి మధ్య ఏమి జరిగిందనే అంశం ప్రశ్నగా మారింది. కన్నెత్తి చూడని పోతుల 2019 ఎన్నికల్లో ఓటమి అనంతరం మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు నియోజకవర్గానికి దూరమయ్యారు. ఇప్పటి వరకు ఆయన కన్నెత్తి చూడలేదు. కందుకూరులో పార్టీ టికెట్ను దక్కించుకునేందుకు శతవిధాలా యత్నించి ఆయన భంగపాటుకు గురయ్యారు. దీంతో నాగేశ్వరరావుకు ఆయన సహకరిస్తారాననేది ప్రశ్నార్థకమే. తగ్గేదేలే అంటున్న రాజేష్.. వరుస పరిణామాలతో డీలా పడిన ఇంటూరి నాగేశ్వరరావుకు తన కుటుంబానికే చెందిన ఇంటూరి రాజేష్ నుంచి సెగ ఎదురవుతోంది. నాగేశ్వరరావుకు టికెట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన పోటీగా ప్రచార కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించారు. ఎన్నికల్లో ఇండిపెండెంట్గా బరిలో నిలిచేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ దిశగా తన కార్యక్రమాలను ముమ్మరం చేశారు. నాగేశ్వరరావు వ్యతిరేక వర్గాలను కలుపుకొంటూ.. తన వర్గాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. ఓట్లను చీల్చి తద్వారా నాగేశ్వరరావును ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మరోవైపు కందుకూరులో టీడీపీ అభ్యర్థిని మారుస్తారంటూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. -
మీ కోసం.. మా వంతుగా..
ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులకు మద్దతుగా వారి కుటుంబసభ్యులు ప్రతి ఇంటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్రెడ్డికి మద్దతుగా ఆయన కోడలు నిహారిక బుధవారం పట్టణంలో ప్రచారం నిర్వహించారు. బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ పరిధిలోని ఏడో వార్డులో కోవూరు అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి తరఫున ఆయన సతీమణి నల్లపరెడ్డి గీతారెడ్డి, కోడలు పూజారెడ్డి ప్రచారం చేశారు. కావలి ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిని మరోసారి గెలిపించాలని కోరుతూ ఆయన కుమారుడు రామిరెడ్డి బాలసాకేత్రెడ్డి – మహిమ దంపతులు, కుమార్తె సంహిత – అఖిలేష్రెడ్డి దంపతులు 35వ వార్డులో కరపత్రాలు పంపిణీ చేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యేగా కాకాణి గోవర్ధన్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఆయన కుమార్తె పూజిత ముత్తుకూరు పట్టణం బీసీ కాలనీ, ఎమ్మార్వో గిరిజన కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి సీఎంను చేయాలని కోరారు. – ఉదయగిరి/బుచ్చిరెడ్డిపాళెం రూరల్/కావలి/ముత్తుకూరు -
టీడీపీ, జనసేన నుంచి 150 మంది చేరిక
నెల్లూరు సిటీ: రూరల్ నియోజకవర్గంలోని 17వ డివిజన్లో జనసేన, టీడీపీకి చెందిన 150 మంది యువకులు వైఎస్సార్సీపీలో చేరారు. నగరంలోని మినీబైపాస్ రోడ్డులో ఆ పార్టీ రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్రెడ్డి కార్యాలయంలో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. పంట్రంగి తేజ, బాలయ్య, సీహెచ్ గోపాల్, ఊటుకూరు అఖిల్, బాలు, హరికృష్ణ తదితరులకు ఆదాల కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉంటుందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మేయర్ స్రవంతి, 17వ డివిజన్ కార్పొరేటర్ పేనేటి సుధాకర్, నాయకులు పాముల రమణయ్య, కఠారి గోపీనాథ్ పాశం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మకూరును అభివృద్ధి చేస్తాం
● మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి మర్రిపాడు: ‘ఆత్మకూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. సంక్షేమ ప్రభుత్వం కొనసాగేందుకు అందరూ సహకరించాలి’ అని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి కోరారు. మండలంలోని చిన్న అల్లంపాడు, పెద్ద అల్లంపాడు గ్రామాల్లో బుధవారం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి పలువురికి ప్యాకేజీలు ఇచ్చి ప్రలోభాలకు గురిచేశారన్నారు. దీని వల్ల వైఎస్సార్సీపీకి మేలు చేకూరిందన్నారు. అనేకమంది విక్రమ్రెడ్డి వెంట నడిచేందుకు సిద్ధమయ్యారన్నారు. ఏఎస్పేటలో జరిగిన కార్యక్రమంలో ఆనం చేసిన వ్యాఖ్యలపై సవాల్ చేస్తున్నామన్నారు. వేమిరెడ్డి ఎంపీ అభ్యర్థిగా వచ్చిన తర్వాతే ఆత్మకూరులో రామనారాయణరెడ్డి తిరుగుతున్నారని చెప్పారు. వెంకటగిరికి వెళ్లిపోయాడని, వేమిరెడ్డి అందజేసిన ప్యాకేజీతో ఆనం ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాడన్నారు. ఆయనకు త్వరలోనే సరైన సమాధానం చెబుతామన్నారు. అలాంటి వారిని ప్రజలు నమ్మరని, వైఎస్సార్సీపీని ప్రజలంతా మళ్లీ గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బొర్రా సుబ్బిరెడ్డి, మాజీ కన్వీనర్ గంగవరపు శ్రీనివాసులునాయుడు, దశరథరామిరెడ్డి, గువ్వల వెంగళరెడ్డి, చెన్ను వెంకటేశ్వరరెడ్డి, మౌలాలి, హజరత్రెడ్డి, దుగ్గిరెడ్డి కృష్ణప్రసాద్రెడ్డి, రేవూ రు వేణుగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముమ్మరంగా తనిఖీలు నెల్లూకరు(క్రైమ్): సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం, నగదు అక్రమ రవాణా కట్టడికి పోలీసు, సెబ్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. మంగళ, బుధవారాల్లో మనుబోలు పోలీసుస్టేషన్ పరిధిలో ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న వివిధ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వెంకటాచలసత్రం పరిధిలో 19, ఇందుకూరుపేటలో 10, సైదాపురంలో ఆరు మద్యం బాటిళ్లు, సెబ్ అధికారులు 195 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కండలేరులో 7.636 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 7.636 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ విజయకుమార్రెడ్డి తెలిపారు. హెడ్రెగ్యులేటర్ నుంచి సత్యసాయిగంగకు 250 క్యూసెక్కులు, పిన్నేరువాగుకు 5, లోలెవల్ కాలువకు 25 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
టీడీపీకి ఓట్లేస్తే చీకటి రోజులు తప్పవు
● కావలి ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డి కావలి: ‘తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తే చీకటి రోజులు తప్పవు. ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి’ అని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి అన్నారు. పట్టణంలోని వెంగళరావునగర్లో బుధవారం జరిగిన ముస్లింల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. వైఎస్సార్సీపీ స్థాపించిన నాటి నుంచి ముస్లింలు అండగా ఉన్నారన్నారు. 2019లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారన్నారు. ఈ ఎన్నికల్లోనూ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ముస్లిం, మైనారిటీలకు వైఎస్ రాజశేఖరరెడ్డి అండగా నిలిచారన్నారు. ఆయన రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో అనేక మంది ఉన్నత స్థానాలకు చేరుకున్నారని చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లింల సంక్షేమానికి పాటుపడ్డారన్నారు. కర్నూలు వంటి కీలక స్థానాల్లో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారన్నారు. అదే విధంగా కార్పొరేషన్లు, నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల్లోనూ ముస్లింలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. ఇమామ్లు, మౌజన్లకు గౌరవ వేతనాలు, హజ్ యాత్రకు ఆర్థిక సాయం అందించిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. టీడీపీ హయాంలో ముస్లింలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. చంద్రబాబు మతతత్వ పార్టీ అయిన బీజేపీతో చేతులు కలిపి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడన్నారు. కార్యక్రమంలో షేక్ నాయబ్ రసూల్, మొగల్ సలీం బేగ్, మొగల్ రహీం బేగ్, పఠాన్ నవాజ్ ఖాన్, షేక్ ఫీర్ మహమ్మద్, నాయబ్ రసూల్, షేక్ అబ్దుల్, నాగూర్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దుతా
నెల్లూరు(స్టోన్హౌస్పేట): నెల్లూరు నగరాన్ని అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు లోక్సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని పదో డివిజన్లో గల ఉస్మాన్సాహెచ్పేట, ఎన్టీఆర్ లేఅవుట్ తదితర ప్రాంతాల్లో పార్టీ నెల్లూరు సిటీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్తో కలిసి బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. నగరాభివృద్ధి తమ హయాంలోనే జరిగిందంటూ నారాయణ తన మాటలను కోటలు దాటిస్తున్నారని విమర్శించారు. ఆయన హయాంలో ఎలాంటి అభివృద్ధీ జరగలేదని చెప్పారు. తమ ప్రభుత్వ పాలనలో నెల్లూరు స్థిరమైన అభివృద్ధి జరిగిందని తెలిపారు. నగరంలో పార్కులు, క్రీడా మైదానాలను ఏర్పాటు చేసి.. ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చడంతో పాటు అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ పనులను పూర్తి చేస్తామని వెల్లడించారు. భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. జాబ్మేళాల ద్వారా ఉపాధి నెల్లూరులో స్థిరనివాసాన్ని ఏర్పర్చుకొని నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. నిరుద్యోగ యువతకు జాబ్మేళాల ద్వారా ఉపాధి కల్పించడంతో పాటు ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్లను నిర్వహించనున్నామని తెలిపారు. రూ.52 కోట్లతో అభివృద్ధి గడిచిన ఐదేళ్లలో పదో డివిజన్లో రూ.52 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టామని పేర్కొన్నారు. ప్రధాన రోడ్ల నిర్మాణానికి రూ.ఆరు కోట్లు.. 9, 10 డివిజన్లకు సంబంధించి ఎఫ్సీఐ కాలనీలో అర్బన్ పీహెచ్సీని ఏర్పాటు చేసిన అంశాన్ని ప్రస్తావించారు. రామ్నగర్, పల్లాపు కాలువలకు రక్షణ గోడలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రేబాలవారివీధిలోని జిల్లా గ్రంథాలయాన్ని ఆధునికీకరిస్తామని చెప్పారు. నగరంలోని రైస్మిల్లుల్లో హమాలీలుగా పనిచేసే కార్మికులు ఈ డివిజన్లో నివసిస్తున్నారని, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. మరోసారి జగనన్నే సీఎం జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని ఖలీల్ అహ్మద్ చెప్పారు. ఎమ్మెల్యేగా తనను.. ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడారు. విజయసాయిరెడ్డిని గెలిపిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి నెల్లూరు అభివృద్ధికి కృషి చేస్తారన్నారు. కార్యక్రమంలో పార్టీ నగరాధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచలరెడ్డి, కార్పొరేటర్ కిన్నెర ప్రేమ్కుమార్, నేతలు ఆనం జయకుమార్, కిన్నెర ప్రసాద్, ముక్కాల ద్వారకానాథ్, మల్లి నిర్మల తదితరులు పాల్గొన్నారు. మెరుగైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తా క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా సింహపురిని మారుస్తా వైఎస్సార్సీపీ నెల్లూరు లోక్సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి -
స్థానికుడిని.. మీకేం కావాలో నాకు తెలుసు
పొదలకూరు: ‘నేను స్థానికుడిని. మండలంలో ప్రతి గ్రామం గురించి తెలుసు. మీకేం కావాలో ఐడియా ఉంది. టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అలియాస్ అల్లీపురంరెడ్డి అవకాశం కోసం వస్తున్నాడు. ఆయన్ను నమ్మొద్దు. ఎన్నికలయ్యాక కనిపించడు’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. మండలంలోని ఆల్తుర్తి, ఆర్వైపాళెం, అంకుపల్లి, వెంకటాపురం, పర్వతాపురం, పులికల్లు, వావింటపర్తి, ఊసపల్లి గ్రామాల్లో బుధవారం మంత్రి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చడంతోపాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేసినట్లు తెలిపారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు రైతులు, పొదుపు మహిళలకు రుణమాఫీ చేస్తానని నమ్మించి అధికారంలోకి వచ్చాడన్నారు. కానీ వారిని మోసం చేసినట్లు చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. సచివాలయాలు, ఆర్బీకే, విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణం జరిగిందన్నారు. ప్రతి వీధిలో సిమెంటురోడ్లు, సైడ్ డ్రెయిన్లు నిర్మించామన్నారు. అధికారం చేజిక్కించుకునేందుకు చంద్రబాబు కూటమిని ఏర్పాటు చేసి వస్తున్నాడని, ఆయన్ను నమ్మొద్దని సూచించారు. ఓటెందుకు వేయాలి సోమిరెడ్డి.. ఏం మేలు చేశావని ప్రజలు నీకు ఓటేయాలని సోమిరెడ్డిని మంత్రి ప్రశ్నించారు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయలేదన్నారు. ఐదేళ్లు ప్రజలకు అందుబాటులో లేకుండాపోయి ఇప్పుడొచ్చి ఓట్లు అడుగుతున్నాడన్నారు. రూ.కోట్లు వెచ్చించి ప్రతి గ్రామంలో మట్టిరోడ్డు లేకుండా చేశానని, మురుగునీరు బయటకు వెళ్లేందుకు డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేయించినట్లు కాకాణి చెప్పారు. పేదలకు భూముల పంపిణీ, చుక్కల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపానన్నారు. మూడో పర్యాయం అవకాశం ఇవ్వాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎవరి హయాంలో అందాయో గుర్తించి ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మంత్రి వెంట చిల్లకూరు వెంకురెడ్డి, పి.బాబిరెడ్డి, బూసుపల్లి చిన్నపరెడ్డి, కె.రామిరెడ్డి, శ్రీహరి, చంద్రశేఖర్, వై.పెంచలరెడ్డి, టి.నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి -
వలంటీర్లపై కక్ష కట్టిన చంద్రబాబు
● కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న బుచ్చిరెడ్డిపాళెం రూరల్: ‘చంద్రబాబు నాయుడు వలంటీర్లపై కక్ష కట్టాడు. వారు సంక్షేమ పథకాలు, వృద్ధులు, దివ్యాంగుల పింఛన్లు ఇవ్వకుండా తన మనుషుల ద్వారా ఈసీకి ఫిర్యాదు చేయించి అడ్డుకున్నాడు’ అని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ పరిధిలోని 200 మంది వలంటీర్లు బుధవారం తమ పోస్టులకు రాజీనామా చేశారు. అనంతరం నెల్లూరులోని ప్రసన్నకుమార్రెడ్డి నివాసంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ప్రసన్నకుమార్రెడ్డి ప్రజల మనిషి అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆయన విజయం కోసం తమవంతు కృషి చేస్తామని వివరించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి సీఎంను చేయడమే తమ లక్ష్యమన్నారు. ప్రజా సేవ చేసే వారికే తమ మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజ, వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు టంగుటూరు మల్లికార్జునరెడ్డి, సచివాలయాల కన్వీనర్ మోర్ల మురళి, నాయకుడు కోడూరు మధుసూదన్రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
బైక్ అదుపుతప్పి యువకుడి మృతి
కొడవలూరు: మోటార్బైక్ అదుపుతప్పి ఓ యువకు డు మృతిచెందిన ఘటన మండలంలోని గౌతమ్నగర్లో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన దగ్గోలు భార్గవ్ (23) మినీ లారీ డ్రైవర్గా ఉన్నాడు. బుధవారం సాయంత్రం ఇంటి నుంచి నార్తురాజుపాళేనికి మోటార్బైక్పై బయలుదేరాడు. కొంత దూరం వెళ్లి దళితవాడ వద్ద మలుపు తిరుగుతుండగా బైక్ అదుపుతప్పి కాలువలో పడింది. ఈ ప్రమాదంలో భార్గవ్ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని కోవూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందాడు. ఈ మేరకు ఎస్సై కె.వీరప్రతాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తొలి ఘట్టానికి వేళాయె..
● నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ● ఏర్పాట్లు పూర్తి పటిష్ట భద్రత ఏర్పాట్లు నెల్లూరు(క్రైమ్): నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభంకానున్న తరుణంలో కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లను పోలీస్ శాఖ చేపట్టింది. కేంద్రాల వద్ద 144 సెక్షన్తో పాటు 30 పోలీస్ యాక్ట్ను అమల్లోకి తీసుకొచ్చారు. అసెంబ్లీ నియోజకవర్గ నామినేషన్ కేంద్రాల వద్ద డీఎస్పీ స్థాయి అధికారి, లోక్సభ నామినేషన్ కేంద్రం వద్ద ఏఎస్పీ ఆధ్వర్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఒక్కో కేంద్రం వద్ద 80 నుంచి 90 మందికిపైగా సిబ్బంది బందోబస్తు విధులను నిర్వర్తించనున్నారు. నామినేషన్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలోనే అభ్యర్థుల ఊరేగింపులను నిలిపేయనున్నారు. ముందస్తు అనుమతులు పొందిన మూడు వాహనాలను నామినేషన్ కేంద్ర గేటు వరకు అనుమతించనున్నారు. నెల్లూరు(దర్గామిట్ట): సార్వత్రిక ఎన్నికలకు తొలి ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభంకానుంది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు.. నెల్లూరు లోక్సభ స్థానానికి నామినేషన్లను ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు అధికారులు స్వీకరించనున్నారు. ప్రక్రియను సమర్థంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక ఖాతా ద్వారానే లావాదేవీలు లోక్సభ, శాసనసభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్కు ముందే బ్యాంకుల్లో ప్రత్యేక ఖాతాను తెరవాలి. దీని ద్వారానే ఎన్నికలు లావాదేవీలను నిర్వహించాలి. ఈసీ నిబంధనల మేరకు నగదును జమ చేసి ధరావతు మొదలుకొని ఎలాంటి ఖర్చులనైనా వీటి ద్వారానే జరపాల్సి ఉంటుంది. రూ.20 వేలు మించితే చెక్కుల రూపంలో అందజేయడంతో పాటు ఖర్చులకు సంబంధించిన బిల్లులను చూపాల్సి ఉంటుంది. సమగ్రంగా నింపాలి అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాల్లో ఆస్తుల వివరాలు, నేరచరిత్ర, అభియోగాలను విధిగా తెలియజేయాలి. రూ.10 స్టాంప్ పేపర్పై అఫిడవిట్ను వేరుగా అందజేయాలి. నామినేషన్ పత్రంలో ఖాళీలను వదలకుండా సమగ్రంగా పూర్తి చేసివ్వాలి. తేడాలుంటే ఆర్వోలు నోటీసులిచ్చే అవకాశం ఉంటుంది. అభ్యర్థులకు పార్టీలు జారీ చేసే బీ – ఫారం, కుల ధ్రువీకరణ పత్రాలను నామినేషన్ చివరి రోజున మూడు గంటల్లోపు అందజేయాలి. అభ్యర్థితో పాటు నలుగురికే అనుమతి నామినేషన్ దాఖలు సమయంలో ఆర్ఓ కార్యాలయంలో అభ్యర్థితో పాటు నలుగురికే అవకాశం ఉంటుంది. నామినేషన్ పత్రాలను ఎన్నికల నిర్వహణ సిబ్బంది ప్రాథమికంగా పరిశీలించిన అనంతరం ఆర్వోకు అందజేసేందుకు పంపుతారు. ఆర్వో కార్యాలయానికి 100 మీటర్ల నుంచి ర్యాలీలు తదితరాల నిషేధం అమల్లో ఉంటుంది. పర్యవేక్షణాధికారులు వీరే.. కలెక్టరేట్లో నిర్వహించనున్న నెల్లూరు లోక్సభ నామినేషన్ల ప్రక్రియకు ఏఎస్పీ సౌజన్య నెల్లూరు సిటీకి నగర డీఎస్పీ శ్రీనివాసరెడ్డి నెల్లూరు రూరల్కు సీసీఎస్ డీఎస్పీ రామకృష్ణాచారి సర్వేపల్లికి నెల్లూరు రూరల్ డీఎస్పీ వీరాంజనేయరెడ్డి కోవూరుకు ట్రాఫిక్ డీఎస్పీ శ్రీనివాసులు ఆత్మకూరుకు స్థానిక డీఎస్పీ కోటారెడ్డి ఉదయగిరికి దిశ డీఎస్పీ సాయినాథ్ కావలికి స్థానిక డీఎస్పీ వెంకటరమణ కందుకూరుకు స్థానిక డీఎస్పీ శ్రీనివాసులు -
నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించండి
● ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి నెల్లూరు(క్రైమ్): ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగరంలోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఎన్నికల్లో పాటించాల్సిన జాగ్రత్తలు, విధులు, నిబంధనలు తదితరాలపై దిశా నిర్దేశం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రచార నిమిత్తం జిల్లాకు విచ్చేసే వీవీఐపీలకు పటిష్ట భద్రతను ఏర్పాటు చేయాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభంకానున్న తరుణంలో, ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. ఆయా కేంద్రాల వద్ద తగిన బందోబస్తును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమస్యాత్మక గ్రామాలు, ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలన్నారు. ఇతర శాఖలు, స్థానిక గ్రామపెద్దల సమన్వయంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, గత ఎన్నికల కేసుల్లోని నిందితులను బైండోవర్ చేయాలని తెలిపారు. చెక్పోస్టుల్లో తనిఖీలను ముమ్మరం చేసి మద్యం, నగదు, ప్రలోభాలకు గురిచేసే వాటిని పూర్తి స్థాయిలో కట్టడి చేయాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఏఎస్పీలు సౌజన్య, ప్రసాద్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
అంతులేని విషాదం
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు గుండెల్ని పిండే విషాదం. బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వలస వెళ్లి స్థిర పడ్డారు. శ్రీరామ నవమి ఉత్సవాల నేపథ్యంలో సొంతూరుకు కుటుంబ సమేతంగా వచ్చారు. కావలిలో షాపింగ్ చేద్దామని కారులో బయలుదేరారు. పల్లె రహదారుల మీదుగా వచ్చి చైన్నె–కోల్కోతా హైవే ఎక్కారు. ఆ తరువాత కొద్ది సేపట్లోనే ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో రెండేళ్ల చిన్నారి సహా ఐదుగురు కుటుంబ సభ్యుల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అర్ధగంట ముందు వరకు తమ కళ్ల ముందే కలివిడిగా తిరిగిన వారంతా విగతజీవులుగా మారడంతో అంతులేని విషాదం అలముకుంది. మితిమీరిన వేగం ఆ కుటుంబాన్ని కబళించింది. మృతులంతా ఒకే కుటుంబం. విషయం తెలుసుకున్న ఊరు ఊరంతా ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరైంది. -
రేపట్నుంచి వేణుగోపాలుడి బ్రహ్మోత్సవాలు
నెల్లూరు(బృందావనం): మూలాపేటలోని రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ నెల 18 నుంచి 28వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ మజ్జిగ చంద్రమౌళిరెడ్డి, ఈఓ విరుపావఝుల గిరికృష్ణ తెలిపారు. మంగళవారం వారు దేవస్థానంలో బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలు, వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. 18న రాత్రి 7గంటలకు అంకురార్పణ, 19న ఉదయం 9గంటలకు ధ్వజారోహణం, రాత్రి 7గంటలకు శేష వా హన సేవ, 20న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి హంస వాహన సేవ, 21న ఉదయం యాళి, రాత్రి చంద్రప్రభ వాహన సేవ, 22న ఉదయం చప్పరోత్సవం, రాత్రి వెండి హనుమంతసేవ, 23న ఉదయం మోహిని అలంకారం(గిన్నెబిక్ష), రాత్రి గరుడ వాహన సేవ నిర్వహించనున్నట్లు చెప్పారు. 24న సాయంత్రం 6గంటలకు శ్రీవారి కల్యాణోత్సవం, రాత్రి 9గంటలకు గజ వాహన సేవ, 25న ఉదయం 9 గంటలకు రథోత్సవం, రాత్రి పుష్పక విమాన అలంకారోత్సవం, 26న ఉదయం వెణ్ణత్తాళి, రాత్రి అశ్వవాహన, 27న ఉదయం 9గంటలకు ముసుగులసేవ, రాత్రి పొన్న వాహన సేవ, 28న ఉదయం చక్రస్నానం, రాత్రి 7గంటలకు ఏకాంతసేవ నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు రంగరాజన్, శ్రీనివాసాచార్యులు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన
● పాస్టర్లతో ఆత్మీయ సమావేశం ● టీడీపీకి ఓట్లు వేయాలంటూ ప్రచారం కందుకూరు: మతం, కులం పేరుతో ఓట్లు అడగరాదు. ఆ విధంగా ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని ఎన్నికల కోడ్ నిబంధనలు చెబుతున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇవేమీ పట్టడం లేదు. ఏకంగా పాస్టర్లతో బహిరంగంగానే మంగళవారం ఆత్మీయ సమావేశం నిర్వహించా రు. స్థానిక వెంగమాంబ కల్యాణ మండపంలో నిర్వహించిన ఈ సమావేశంలో కందుకూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పాల్గొని ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో పాస్టర్లంతా టీడీపీ గెలుపుకోసం పని చేయాలంటూ వారికి పలు హామీలు ఇచ్చారు. ఎక్కడా మతం పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని చెబుతున్న ఎన్నికల అధికారులు టీడీపీ నిర్వహించిన పాస్టర్ల ఆత్మీయ సమావేశంపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. -
నిరుద్యోగ రహిత నెల్లూరే లక్ష్యం
నెల్లూరు(స్టోన్హౌస్పేట): నిరుద్యోగ రహిత నెల్లూరే తన లక్ష్యమని, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రతి ఆరు నెలలకోసారి దేశంలోని ప్రముఖ కంపెనీలను ఆహ్వానించి జాబ్ మేళాలు నిర్వహిస్తామని వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి తెలిపారు. నగరంలోని రామ్మూర్తినగర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో మంగళవారం నిర్వహించిన యువతతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువతకు ఉపాధి కల్పనే ప్రధాన లక్ష్యంగా జాబ్ మేళాలు నిర్వహిస్తామని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వారానికోసారి ప్రజాదర్బార్ నిర్వహిస్తామని చెప్పారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ఎవరికి ఏ సమస్య వచ్చినా నేరుగా ప్రజాదర్బార్కు వచ్చి వినతులు ఇవ్వవచ్చని తెలిపారు. ముఖాముఖిలో యువత ప్రశ్నలకు జవాబిస్తూ నెల్లూరు అభివృద్ధికి ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందించామని, అందులోని వాగ్దానాలను వంద శాతం నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరులో ఐటీ సెజ్, ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఔటర్ రింగ్రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు. నెల్లూరు ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఎంపీ అభ్యర్థిగా తనను సీఎం జగన్మోహన్రెడ్డి పంపించడం తన అదృష్టమన్నారు. దేశ ఉత్పాదకత పెంచే బాధ్యత యువతపై ఉందన్నారు. దేశాభివృద్ధికి, దేశాన్ని అవినీతి రహితంగా తీర్చిదిద్దేందుకు యువత కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు కేవలం 34,108 ఉద్యోగాలు మాత్రమే కల్పించగా, వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక 2,22,000 శాశ్వత ఉద్యోగాలు కల్పించారని వివరించారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలేదని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దాన్ని యువత తిప్పికొట్టాలన్నారు. ఏపీ క్రికెట్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్సార్ గోపీనాథ్రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో విశాఖపట్నంలో ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన సేవలు ఎవ్వరూ మర్చిపోలేరన్నారు. 30 వేల మందికి నిత్యావసర వస్తువులు అందించారన్నారు. 300 బెడ్లతో కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేసి వైద్యసేవలు అందించారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. హనీ గ్రూప్ అధినేత ఓబుల్రెడ్డి, యువత తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఆరు నెలలకోసారి జాబ్ మేళాలు నిర్వహిస్తాం ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి -
జీఐఎస్ సర్వేను త్వరగా పూర్తి చేయాలి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జీఐఎస్ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈ విజయన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన నగరంలోని విద్యుత్ భవన్లోని తన చాంబర్ నుంచి విద్యుత్ ఈఈలు, డీఈఈలు, ఏఈలు, అకౌంట్స్ ఆఫీసర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఏఎస్పేట, అనంతసాగరం, ఆత్మకూరు రూరల్, వింజమూరు, కావలి, దుత్తలూరు, ఇందుకూరుపేట, సీతారామపురం సెక్షన్ల పరిధిలో జీఐఎస్ సర్వే పనులు ఇంకా పూర్తవలేదని తెలిపారు. ఇప్పటికే ఆయా సెక్షన్ల అధికారులను పలుమార్లు హెచ్చరించామన్నారు. ఈ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయకపోతే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. బిట్రగుంట, బోగోలు ఫీడర్లకు సంబంధించిన సిబ్బంది బుధవారం నాటికి పనులు పూర్తి చేయపోతే వెంటనే వారిని రిలీవ్ చేయాలని కావలి ఈఈను ఆదేశించారు. అక్క ఐఏఎస్.. తమ్ముడికి సివిల్స్ ర్యాంక్ కందుకూరు: కందుకూరు సబ్కలెక్టర్ విద్యాధరి తమ్ముడు కృష్ణ శ్రీవాస్తవ మంగళవారం వెలువడిన సివిల్స్–2023 ఫలితాల్లో ఆల్ ఇండియా 444వ ర్యాంకు సాధించాడు. ఈ మేరకు తన తమ్ముడు సివిల్స్ ర్యాంకు సాధించినట్లు సబ్కలెక్టర్ విద్యాధరి వెల్లడించారు. ఒకే ఇంట్లో అక్కా, తమ్ముడు ఐఏఎస్ అధికారులుగా రాణించనున్నారు. వైఎస్సార్ జిల్లా నందలూరు మండలం గొల్లపల్లె గ్రామానికి చెందిన విద్యాధరి సివిల్స్–2020 ఫలితాల్లో జాతీయ స్థాయిలో 211వ ర్యాంకు సాధించి ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. శిక్షణానంతరం ఆమె మొదటి పోస్టింగ్గా ప్రస్తుతం కందుకూరు సబ్కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అదే బాటలో ఆమె తమ్ముడు కృష్ణ శ్రీవాస్తవ సివిల్స్ రాసి విజయం సాధించాడు. ఆయన 2023లో గ్రూప్–1 రాసి విజయం సాధించారు. జిల్లా రిజిస్ట్రార్గా ఎంపికై రిజిస్ట్రేషన్ శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సివిల్ సర్వీస్ పరీక్ష రాసిన ఆయన మంగళవారం వెలువడిన ఫలితాల్లో జాతీయ స్థాయిలో 444వ ర్యాంకు సాధించడంతో సబ్కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. తమ్ముడికి శుభాకాంక్షలు తెలిపారు. వీఏఏపై కేసు నమోదుసీతారామపురం(ఉదయగిరి):సీతారామపురం మండలం బాలాయపల్లి సచివాలయంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కే వెంకటపతి టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తూ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన నేపథ్యంలో ఎస్సై అనూష మంగళవారం కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ మేరకు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం ద్వారా వేతనాలు పొందుతున్న వ్యక్తులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు. అయినప్పటికీ కొందరు ఖాతరు చేయకుండా రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో అధికారులు కేసులు నమోదుచేసి సస్పెండ్ చేస్తున్నారు. అయినా ఇంకా కొందరు ఉద్యోగులు ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తుండటం విశేషం. మీ వాడ్ని.. మీలో ఒకడ్ని నెల్లూరు సిటీ: ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని ఏసీ కూరగాయల మార్కెట్ను వైఎస్సార్సీపీ నెల్లూరు లోక్సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి మంగళవారం సందర్శించారు. వ్యాపారులు, కూలీలతో మాటామంతి నిర్వహించి వారి యోగక్షేమాలను ఆరాతీశారు. మీ వాడ్ని.. మీలో ఒకడ్ని అంటూ వారితో మమేకమై భరోసా కల్పించారు. జగనన్న సారథ్యంలో ప్రభుత్వం మరోసారి ఏర్పడిన వెంటనే మీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వ్యాపారి అవతారమెత్తి కూరగాయలను విజయసాయిరెడ్డి విక్రయించగా, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్రెడ్డి కొనుగోలు చేసి అక్కడి వారిలో నూతనోత్సాహాన్ని నింపారు. -
రేపట్నుంచి నామినేషన్ల స్వీకరణ
నెల్లూరు(దర్గామిట్ట): సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. నెల్లూరు పార్లమెంట్కు సంబంధించి కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి నేతృత్వంలో మంగళవారం ఉదయం 11 గంటలకు మాక్ నామినేషన్ ప్రక్రియ చేపట్టారు. నామినేషన్ల పరిశీలనకు తగిన సిబ్బందిని నియమించుకుని పరిశీలించారు. నామినేషన్ దాఖలు చేసిన వ్యక్తికి సంబంధించిన ఓటరు జాబితా పరిశీలనతో పాటు ప్రతిజ్ఞ, ఫీజు చెల్లింపు పత్రాలు, తదితర అన్ని కాలమ్స్ను పూర్తి చేసిన నామినేషన్ను క్షుణ్ణంగా పరిశీలించారు. నామినేషన్ల స్క్రూట్నీ, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు తదితర అంశాలను నిశితంగా పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియ మొత్తాన్ని ఫొటోగ్రఫీ, వీడియో రికార్డింగ్ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మాక్ నామినేషన్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. నెల్లూరు ఎంపీతో పాటు 8 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు ఆర్వో కార్యాలయాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్వో బాపిరెడ్డి, ఏఆర్వో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు ఎంపీతో పాటు 8 అసెంబ్లీ స్థానాలకు ఏర్పాట్లు పూర్తి విజయవంతంగా మాక్ నామినేషన్ ప్రక్రియ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ -
No Headline
కావలి/జలదంకి: జలదంకి మండలం చామదలకు చెందిన దావులూరి శ్రీనివాసులు (51) హైదరాబా ద్లో సిమెంట్ వ్యాపారం చేస్తున్నాడు. కుటుంబంతో సహా అక్కడే స్థిర పడ్డాడు. శ్రీరామనవమి ఉత్సవాల నేపథ్యంలో భార్య వరలక్ష్మి (45), వదిన లక్ష్మమ్మ (48), కుమార్తె నీలిమ (24), మనుమడు నందు (2)తో కలిసి సొంతూరికి వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం భోజనం చేసుకుని షాపింగ్ నిమిత్తం కారులో కావలికి బయలుదేరారు. దావులూరి శ్రీనివాసులు కారు డ్రైవ్ చేస్తున్నాడు. ముందు సీట్లో భార్య వరలక్ష్మి, వెనుక సీట్లో వదిన లక్ష్మమ్మ, కుమార్తె నీలిమ, మనుమడు నందు కూర్చున్నారు. చామదల నుంచి కావలికి చేరుకునేందుకు మూడు మార్గాలు ఉన్నాయి. బ్రాహ్మణక్రాక, తొమ్మిదో మైలు, జలదంకి మీదుగా కావలి చేరుకోవచ్చు. మరో మార్గంలో తాళ్లూరు, బోగోలు మీదుగా చైన్నె–కోల్కత్తా హైవేకు చేరుకోవచ్చు. దగ్గరగా ఉంటుందని, ట్రాఫిక్ సమస్య ఉండదని తాళ్లూరు మీదుగా కొండబిట్రగుంట నుంచి చైన్నె–కోల్కత్తా హైవేలోకి వచ్చారు. కారు హైవే ఎక్కిన వెంటనే వేగాన్ని బాగా పెంచాడు. అక్కడి నుంచి అర కిలోమీటరు దూరంలోనే శివకాశి నుంచి జార్ఖండ్కు అగ్గిపెట్టెల లోడుతో వెళుతున్న లారీ రోడ్డు మార్జిన్లోనే ఆగి ఉంది. ముందు వెళుతున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో రోడ్డు మార్జిన్లో ఆగి ఉన్న అగ్గిపెట్టెల లారీని రెప్పపాటు వ్యవధిలోనే కారు ఢీకొట్టింది. కారు వేగానికి లారీ కిందకు దూసుకుపోవడంతో అందులోని ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కారు ముందు భాగంతో పాటు మృతదేహాలు కూడా లారీ కింద ఇరుక్కుపోవడంతో ఘటనా స్థలం భీతావహంగా మారింది. కావలి రూరల్ సీఐ కే శ్రీనివాసరావు, కావలి డీఎస్పీ వెంకటరమణ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కావలి రూరల్ పోలీసులు లారీ కింది భాగంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కావలి రెడ్క్రాస్ బృందం సహాయక చర్యలు చేపట్టింది. ఈ మేరకు కావలి రూరల్ పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉలికి పడిన చామదల ప్రమాద విషయం తెలిసిన వెంటనే చామదల ఉలికి పడింది. హైదరాబాద్ నుంచి వచ్చి అప్పటి వరకు అందరితో సరదాగా గడిపిన వాళ్లు అంతలోనే విగతజీవులుగా మారారనే విషయం గ్రామాన్ని కుదిపేసింది. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు గ్రామస్తులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కుప్ప కూలిపోయారు. కొన్ని నిమిషాల ముందు వరకు తమ కళ్లముందే ఉన్న వాళ్లు అంతలోనే మృతువాత పడటాన్ని జీ ర్ణించుకోలేకపోయారు. రెండేళ్ల చిన్నారి సహా అందరూ మృత్యువాత పడడంతో చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. మృత్యు ఘంటికలు మోగిస్తున్న లారీలు హైవేపై ఆగి ఉన్న లారీలు నిత్యం మృత్యు ఘంటికలు మోగిస్తూనే ఉన్నాయి. కావలి మండలం రుద్రకోట నుంచి దగదర్తి మండలం సున్నపుబట్టీ వరకు హైవేకు ఇరు వైపులా లారీలు ఇష్టం వచ్చినట్లు నిలిపేస్తున్నారు. ముఖ్యంగా దాబా హోటళ్లు, టిఫిన్ అంగళ్లు, కూడళ్ల వద్ద రోడ్డు మార్జిన్లోనే నిలుపుతున్న లారీల కారణంగా నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. -
ఆర్వోలు వీరే..
ఎంపీ/ఎమ్మెల్యే స్థానం ఆర్వో నామినేషన్ కార్యాలయం నెల్లూరు ఎంపీ హరినారాయణన్ కలెక్టర్ కార్యాలయం, నెల్లూరు కందుకూరు విద్యాధరి సబ్కలెక్టర్ కార్యాలయం, కందుకూరు కావలి శీనానాయక్ ఆర్డీఓ కార్యాలయం, కావలి ఆత్మకూరు మధులత మున్సిపల్ కార్యాలయం, ఆత్మకూరు కోవూరు మాధవన్ తహసీల్దార్ కార్యాలయం, కోవూరు నెల్లూరు సిటీ వికాస్మర్మత్ కార్పొరేషన్ కార్యాలయం నెల్లూరు రూరల్ మలోల ఆర్డీఓ కార్యాలయం, నెల్లూరు. సర్వేపల్లి చిన్నఓబులేసు ఎంపీడీఓ కార్యాలయం, వెంకటాచలం ఉదయగిరి రాజారమేష్ప్రేమ్కుమార్ తహసీల్దార్ కార్యాలయం, ఉదయగిరి -
మార్కెట్ చెక్పోస్ట్ ఉద్యోగి ఆత్మహత్య
గుడ్లూరు: వ్యవసాయ మార్కెట్ చెక్పోస్ట్ ఉద్యోగి ఒకరు మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై వేధింపులతోనే అతను బలవన్మరణానికి పాల్పడ్డాడని బంధువులు ఆరోపిస్తున్నారు. కుటుంబసభ్యులు, పోలీసుల కథనం మేరకు.. గుడ్లూరు మండలం గుండ్లపాళేనికి చెందిన పోకూరి సురేష్రెడ్డి (35)కి భార్య వసంత, ఇద్దరు కుమార్తెలున్నారు. అతను తెట్టు దగ్గర ఉన్న వ్యవసాయ మార్కెట్ చెక్పోస్ట్ వద్ద ఒప్పంద ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈనెల 11వ తేదీన తెట్టుకు చెందిన మరో యువకుడితో కలిసి సురేష్రెడ్డి విధులు నిర్వహిస్తుండగా ఎస్సై లక్ష్మణరావు అక్కడికి వెళ్లి హైవేపై వెళ్లే రేషన్ వాహనాల వివరాలను తెలియజేయాలని అడిగాడు. వాటి గురించి తనకు తెలియదని సురేష్రెడ్డి చెప్పాడు. వివరాలు నీకు తెలుసని, సహోద్యోగి అశోక్ మాకు అంతా తెలియజేశాడని ఎస్సై వాదనకు దిగాడు. తనకేమీ తెలియదని సురేష్ చెప్పడంతో ఎస్సై అతడి మీద దాడి చేసి పోలీస్స్టేషన్కు తీసుకెళ్లాడు. మోటార్బైక్, సెల్ఫోన్ తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు నమోదు చేశారు. జరిమానా చెల్లిస్తే బైక్ ఇస్తానని చెప్పాడు. అయితే సురేష్రెడ్డి సెల్ఫోన్ ఇవ్వాలని ఎస్సై చుట్టూ తిరిగాడు. తనకు తెలిసిన నాయకుల చేత చెప్పించినా ఫోన్ ఇవ్వకపోగా తిట్టాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సురేష్రెడ్డి మంగళవారం ఉదయం తన చావుకు ఎస్సై లక్ష్మణరావు కారణమంటూ లెటర్ రాసి ఇంట్లో ఉరేసుకున్నాడు. గమనించిన బంధువులు కిందకు దించి ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారణ అయింది. లెటర్ చూసిన కుటుంబసభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతదేహాన్ని గుడ్లూరు పోలీస్స్టేషన్ వద్దకు తీసుకెళ్లి ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న కందుకూరు, నెల్లూరు డీఎస్పీలు శ్రీనివాసరావు, శ్రీనివాసరెడ్డి పోలీస్స్టేషన్కు చేరుకుని మృతుడి తరఫు బంధువులతో మాట్లాడారు. విచారణ జరిపించి ఎస్సైపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇద్దరు చిన్నపిల్లలతో తాను ఎలా బతకాలంటూ భర్త మృతదేహం వద్ద వసంత కన్నీరుమున్నీరుగా రోదించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సుబ్బారావు తెలిపారు. ఎస్సై వేధింపులే కారణమని కుటుంబసభ్యుల ఆరోపణ మృతదేహంతో పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన డీఎస్పీలు -
వైఎస్సార్సీపీలో టీడీపీ కార్యకర్తల చేరిక
కావలి: పట్టణంలోని 40వ వార్డులో టీడీపీకి చెందిన 20 మంది కార్యకర్తలు మంగళవారం వైఎస్సార్సీపీలో చేరారు. జెండాచెట్టు వీధిలో మాజీ కౌన్సిలర్ డేగా రాము ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లా డుతూ ప్రతాప్కుమార్రెడ్డిని గెలిపిస్తేనే కావలి ప్రశాంతంగా ఉంటుందన్నారు. ఇతర ప్రాంతాల వాళ్లకు అప్పగిస్తే నాశనం చేస్తారని చెప్పారు. నియోజకవర్గాన్ని కాపాడుకోవాలన్నా, ప్రజలకు అవసరమైన అన్ని పనులు జరగాలన్నా ఎమ్మెల్యేగా రామిరెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. షేక్ ఇస్మాయిల్, షేక్ ఖాదర్బాషా, షేక్ అఫ్రోజ్, బి.హజరత్తయ్య, షేక్ సలీం, షేక్ సుల్తాన్ తదితరులు వైఎస్సార్సీపీలో చేరిన వారిలో ఉన్నారు. -
సివిల్స్లో ఉదయగిరి యువతి సత్తా
ఉదయగిరి: యూపీఎస్సీలో మండలంలోని గంగులవారి చెరువుపల్లికి చెందిన బడబాగ్ని వినీష ప్రతిభ చూపింది. మంగళవారం ఫలితాలు విడుదల చేయగా 821 ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి శ్రీనివాసులు వ్యవసాయాధికారి. తల్లి విజయభారతి గుంటూరు వ్యవసాయ కమిషనర్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వినీష ప్రాథమిక విద్యాభ్యాసం నెల్లూరులో జరిగింది. ఇంటర్మీడియట్ హైదరాబాద్లో పూర్తి చేసింది. మద్రాస్ ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివింది. అమెరికాలో ఎంఎస్సీ చేసింది. అనంతరం గ్రూప్–1 పరీక్షలు రాసి మున్సిపల్ కమిషనర్గా ఎంపికై ంది. ప్రస్తుతం విజయవాడలో పనిచేస్తోంది. తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీలో ర్యాంకు సాధించడం విశేషం. వినీష సోదరుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్. అతను కూడా సివిల్స్కు సిద్ధమవుతున్నాడు. మారుమూల గ్రామంలో జన్మించి, చదువులో రాణించి సివిల్స్లో ర్యాంకు సాధించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అండగా నిలిచాం.. ఓటుతో ఆశీర్వదించండి
మనుబోలు: ‘ఐదేళ్ల పాలనలో అన్ని విధాలుగా అండగా నిలిచాం. ఎన్నికల్లో ఓటు వేసి ఆశీర్వదించండి’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి కోరారు. మండలంలోని వడ్లపూడి, గొట్లపాళెం, లింగారెడ్డిపల్లి, రాజోలుపాడు, నాయుడుపల్లి, వీరంపల్లి తదితర గ్రామాల్లో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి ఒక వైపు, హామీలను తుంగలో తొక్కి మోసం చేసిన చంద్రబాబు ఒక వైపు ఉన్నారని, ఎవరు కావాలో ప్రజలే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. తాను వ్యవసాయ శాఖ మంత్రి అయ్యాక మిల్లర్లను దూరం పెట్టి పారదర్శకంగా వ్యవహరించడంతో ధాన్యానికి గతంలో ఎన్నడూ లేనంత ధర లభిస్తోందన్నారు. పంటలకు సకాలంలో సాగునీరు అందించడమే కాకుండా వారికి అవసరమైన వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, విత్తనాలను ఆర్బీకేల ద్వారా అందించామన్నారు. కరోనాతో ప్రజలు తల్లడిల్లిపోతున్న సమయంలో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ప్రజలను గాలికొదిలేశాడన్నారు. భయంతో బెంగళూరు, హైదరాబాద్లో తలదాచుకున్నాడన్నారు. తాను మాత్రం అన్ని రకాలుగా నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచానని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ బియ్యం, నూనె పంపిణి చేశామన్నారు. మరోసారి ప్రజలకు సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ గుండాల వజ్రమ్మ, ఎంపీటీసీ ఉన్నం లక్ష్మీనారాయణరెడ్డి, జట్టి సురేందర్రెడ్డి, బత్తల వెంకటేశ్వర్లురెడ్డి, చిట్టమూరు నరసారెడ్డి, ఈగా సురేష్, రఘురామిరెడ్డి, పెనుమల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
బౌన్సర్లతో పోలింగ్ వద్ద టీడీపీ అభ్యర్థి థామస్ హల్ చల్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ.. అలా మద్దతు ఇచ్చాడా?
ఓట్ హక్కు వినియోగించుకున్న విజయ్ సాయి రెడ్డి, దేవినేని అవినాష్
శిల్పా నా ఫ్రెండ్.. నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది..
అక్కడ ఒక్క సీటు కూడా ఓడిపోం: ప్రధాని మోదీ
సరైన భద్రత లేదు..విజయసాయిరెడ్డి అసహనం
టీడీపీ నేతల దౌర్జన్యాలు.. ఏపీలో పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం
సజ్జల రామకృష్ణారెడ్డి ఓటు వేశారు
19 ఏళ్ల రీ రిలీజ్ అవుతున్న హిట్ సినిమా.. అదేంటంటే?
పిఠాపురంలో జోరుగా పోలింగ్
తప్పక చదవండి
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి
- నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ వస్తే.. ఏమవుతుందో తెలుసా?
- నయవంచనకు చెక్ పెడదాం
- జనస్వామ్యమా! జయీభవ!!
- మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
- ఐరాస కాంక్షించే అభివృద్ధికి ఏపీయే వేదిక
- పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
Advertisement