-
అలాంటి పాటలంటే నాకు ఇష్టం లేదు.. కానీ: సుకుమార్
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో పుష్ప-2: ది రూల్ మరో వంద రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్పకు సీక్వెల్గా వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, ఫస్ట్ సింగిల్కు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. రిలీజైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్ సొంతం చేసుకుంది.అయితే వీరిద్దరి కాంబోలో 20 ఏళ్ల క్రితం వచ్చిన ఆర్య సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. కేవలం రూ.4 కోట్లతో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ 20 ఏళ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో డైరెక్టర్ సుకుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అసలు తన సినిమాలో ఐటమ్ సాంగ్ పెట్టడం తనకిష్టం లేదని అన్నారు. ఐటమ్ సాంగ్స్ తనకు నచ్చవని సరదాగా కామెంట్స్ చేశారు.సుకుమార్ మాట్లాడుతూ.. 'ఐటమ్ సాంగ్ నాకిష్టం లేదు. అ అంటే అమలాపురం లిరిక్ నాకు నచ్చింది. అది రాసేటప్పుడు టైం లేదు. వేటూరి దగ్గరకు పంపించాను. 'అల్లుగారి పిల్లగాడా' అంటే ఏంటి? అతను నా హీరో ఆర్య.. అల్లుగారి అబ్బాయి కాదు' అని చెప్పా. ఆర్య వచ్చి హీరోయిన్ను వెతుక్కోవాలి కానీ.. అరవింద్ గారి అబ్బాయి అంటే ఈజీగా హీరోయిన్ను పటగొట్టేస్తాడు . ఆర్యకు బైక్ కూడా లేదు.. చాలా పూర్. కేవలం సైకిల్ మాత్రమే ఉంది అంటూ నవ్వారు. నాకిష్టం లేకపోయినా నేను చేసే ప్రతి సినిమాలోనూ ఐటం సాంగ్ వచ్చేసింది. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది. ఐటమ్ సాంగ్ ఉంటే సినిమాను ఇంత దూరం తీసుకెళ్తుందా?.. ఇంత వైబ్ వస్తుందా? అనే మూడ్లోకి వచ్చేశాను. కానీ దిల్ రాజు ఏమో ఒక్క ఐటెం సాంగ్ కూడా లేకుండా కళాత్మకంగా సినిమాలు చేస్తున్నారు' అని అన్నారు. -
ఆ మాట అనగానే నాకు కోపం వచ్చేసింది: అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అను మెహతా, శివబాలాజీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆర్య. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. మే 7, 2004లో థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం రిలీజై ఇప్పటికీ 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా చిత్రయూనిట్ 20 ఏళ్ల సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ వేడుకలో సుకుమార్, అల్లు అరవింద్, దిల్రాజు లాంటి ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆర్య రిలీజ్ తర్వాత ఆ విషయంలో తనకు కోపం వచ్చిందని తెలిపారు.అల్లు అర్జున్ మాట్లాడుతూ..'సినిమా రిలీజయ్యాక ఆ రోజుల్లో 70 డేస్ కాదు.. 100 డేస్ ఆడితేనే సక్సెస్. రిలీజ్ రోజు నేను, సుకుమార్ థియేటర్కు వెళ్లి చూస్తే అప్పటికీ 40 శాతమే ఉంది. థియేటర్స్ మెల్ల మెల్లగా ఫిల్ అవుతున్నాయి. మాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. తీరా ఆ రోజు రిపోర్ట్ చూస్తే మాత్రం 10 వీక్స్ మాత్రమే అన్నారు. అప్పుడు నాకు ఏంటి ఇది 100 డేస్ సినిమా కాదా? అనిపించింది. కానీ నాకు మాత్రం ఆ ఫీలింగ్ లేదు.. సాయంత్రం కల్లా ఫుల్ అవుతుంది అన్నా. కచ్చితంగా రైజ్ అవుద్ది అని చెప్పా. ఇలాంటి సినిమాకు 70 రోజులంటేనే సక్సెస్ అయినట్లు అని చాలామంది అన్నారు. కానీ ఆ మాట అనగానే నాకు, సుకుమార్కు కోపమొచ్చేసింది. అలా ఒకరోజు అయిపోగానే నాన్న ఓ మాట అన్నారు. ఏంటి మొహం అలా పెట్టుకున్నావ్.. పదివారాలు అంటే పెద్ద సక్సెస్ తెలుసా? అని అన్నారు. ఏంటి 10 వీక్స్?..125 డేస్ షీల్డ్ తీసుకోకపోతే నా పేరు మార్చుకుంటా అని చెప్పా. ఆ తర్వాత మెగాస్టార్ చేతుల మీదుగా షీల్డ్ తీసుకున్నా. అది నా పిచ్చి అనుకోండి. ఇంకేమైనా అనుకోండి. థ్యాంక్ యూ' అని అన్నారు. #TFNReels: Icon Star @alluarjun reminisces about his confidence in the #Arya movie result!🔥Watch Full Speech here - https://t.co/MwPKCcVoVm#20YearsForArya #AlluArjun #TeluguFilmNagar pic.twitter.com/C7bOUWk3Wl— Telugu FilmNagar (@telugufilmnagar) May 8, 2024 -
Allu Arjun HD Photos: ‘ఆర్య 20 ఇయర్స్ సెలబ్రేషన్స్’లో అల్లు అర్జున్ (ఫొటోలు)
-
Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
ఇండియన్ సినిమాలో 'పుష్ప: ది రైజ్' చెరిగిపోని ముద్ర వేసింది. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2021లో విడుదలైంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ టాలీవుడ్కు పరిచయం అయ్యాడు. పుష్పలో SP భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో అదరగొట్టేశాడు. ఈ సినిమాకు ముందే మలయాళ ఇండస్ట్రీలో ఆయనొక స్టార్ యాక్టర్గా ఉన్నారు. పుష్పతో ఫహాద్ ఫాజిల్ రేంజ్ పాన్ ఇండియా స్థాయిలో చేరుకుంది. అయితే ఈ సినిమా వల్ల తనకు పెద్దగా ఒరిగిందేమి లేదని ఒక ఇంటర్వ్యూలో ఓపెన్గానే చెప్పేశాడు.ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫహాద్ ఫాజిల్కు ఒక ప్రశ్న ఎదురైంది. పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా నటుడిగా మారారని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి కదా.. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఆశ్చర్యానికి గురి చేసేలా ఉంది.'పుష్ప సినిమా నా కెరీర్కు పెద్దగా ఉపయోగపడలేదు. ఆ చిత్రం వల్ల నేను ఎలాంటి లాభాన్ని పొందలేదు. ఇదే విషయం సుకుమార్ సార్కు కూడా చెప్పాను. ఇందులో నేను దాచడం లేదు. అబద్దం చెప్పడం లేదు. ఆ సినిమా తర్వాత నేను ఎక్కువగా మలయాళ సినిమాల్లోనే నటించాను. అయితే, మలయాళం భాష తెలియని వారు కూడా నా సినిమాలు చూస్తున్నారు. అదొక్కటే నాలో సంతోషాన్ని నింపింది. నేను ఏ ప్రాంతాన్ని, ఎవరినీ అగౌరపరచడం లేదు. అలాంటి ఉద్దేశం కూడా నాకు లేదు.' అని ఆయన అన్నారు. ఏదేమైనా పాన్ ఇండియా రేంజ్లో తనను పుష్ప చేర్చలేదని ఫహాద్ఫాజిల్ పేర్కొన్నాడు. -
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన తొలి సినిమా ఆర్య. 2004లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం..ఊహించని విజయం సాధించింది. అటు సుకుమార్, ఇటు బన్నీ ఇద్దరి సీనీ జీవితాన్ని మార్చేసింది. ఈ సినిమా విడుదలై నేటికి(మే 7) సరిగ్గా 20 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా బన్నీ ఫ్యాన్స్ ఆర్య సినిమాను గుర్తు చేసుకుంటూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అల్లు అర్జున్ కూడా ఆర్య షూటింగ్ రోజులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ‘ఆర్యకు 20 ఏళ్లు. ఇది సినిమా మాత్రమే కాదు.. నా జీవితాన్ని మార్చేసిన క్షణమది. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. స్వీట్ మెమొరీస్’ అంటూ ఆర్య సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ని ఎక్స్ (ట్విటర్) వేదికగా షేర్ చేసుకున్నాడు.20 ఏళ్ల సెలబ్రేషన్స్ఆర్య సినిమా విడుదలై నేటికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్ర యూనిట్ రీ యూనియన్ ప్లాన్ చేసింది. హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో జరగనున్న ఈ వేడుకకి అల్లు అర్జున్, సుకుమార్, దిల్ రాజుతో పాటు ఆర్య టీమ్ అంతా హాజరుకానుంది. ప్రస్తుతం బన్నీ.. పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. బన్నీ- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న నాలుగో సినిమా ఇది. రష్మిక మందన్నా హీరోయిన్. ఫహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆగస్ట్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 20 years of Arya. It’s not just a movie … it’s a moment in time that changed the course of my life . Gratitude forever . pic.twitter.com/DIYyWIP7ig— Allu Arjun (@alluarjun) May 7, 2024Sweet Memories 🖤 #20yearsofArya pic.twitter.com/wp9cXaMeTB— Allu Arjun (@alluarjun) May 7, 2024 -
వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
నేషనల్ అవార్డ్ విన్నర్ 'అల్లు అర్జున్' అంటే పేరు కాదు ఒక బ్రాండ్ అనేలా తనను తాను మలుచుకున్నాడు. 'గంగోత్రి'తో ఇండస్ట్రీలో ఆయన ఎంట్రీ సులువుగానే జరిగిపోయింది. కానీ, 'ఆర్య' నుంచి తన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఐకాన్ స్టార్గా ఎదిగాడు. బాక్సాఫీసు దగ్గర వసూళ్ల పరంగానే కాకుండా... పురస్కారాల్లోనూ తగ్గేదేలే అని చాటి చెప్పాడు. 'గంగోత్రి'లో అందర్నీ నటనతో కట్టిపడేసిన బన్ని.. తర్వాత వచ్చిన 'ఆర్య'తో తన మార్క్ను చూపించాడు. ఆర్య సినిమా బన్నీకి మాత్రమే కాదో ఎందరో జీవితాలను మార్చేసింది. ఆ సినిమాతో మొదలైన సుకుమార్- బన్నీ ప్రయాణం.. పుష్ప చిత్రం ద్వారా నేషనల్ అవార్డు వరకు చేరింది. అందుకే ఆర్య సినిమా వారందరికీ చాలా ప్రత్యేకం. సరిగ్గా నేటికి ఆర్య విడుదలై 20 సంవత్సరాలు అయింది.అల్లు అర్జున్ హీరోగా నటించిన రెండవ సినిమానే ఆర్య. సుకుమార్కు ఇదే మొదటి సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా 7 మే 2004లో విడుదలైంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఇందులో బన్నీకి జోడిగా అనురాధ మెహతా నటించింది. మొదటి ఆటతోనే 'ఫీల్ మై లవ్' అంటూ 'ఆర్య'తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు అల్లు అర్జున్. ఆర్య సినిమా తర్వాత బన్నికి కేవలం తెలుగులోనే కాదు, పొరుగు ఇండస్ట్రీల్లోనూ భారీగా క్రేజ్ వచ్చింది. ఇక్కడ అల్లు అర్జున్ను మనం ప్రేమగా బన్నీ అని పిలుచుకుంటే.. మలయాళం ప్రేక్షకులకు మల్లు అర్జున్ అయిపోయాడు. ఈ సినిమాతో అల్లు అర్జున్ కెరియరే మారిపోయింది. తనలోని డ్యాన్స్,నటన, స్టైల్ ఇలా అన్నీ తెరపై చూపించాడు. దీంతో ఒక్కసారిగా ఆయనకు చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు.ఆర్యతో మారిపోయిన జీవితాలుసుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్య చిత్రం నేటితో 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఎందరో జీవితాలని మార్చింది. నటుడిగా అల్లు అర్జున్, దర్శకుడిగా సుకుమార్, నిర్మాతగా దిల్రాజుకి, సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్కి, డీఓపీగా రత్నవేలుకి, డిస్ట్రిబ్యూటర్గా బన్ని వాసుకి ఇలా చాలామందికి ఆర్య మంచి గుర్తింపునిచ్చింది. వారందరి కెరీర్లో ఒక మైలురాయిగా ఆర్య నిలిచిపోయింది. ఇలా ఎందరికో బ్రేక్ ఇచ్చిన ఆర్యను గుర్తు చేసుకుంటూ ఒక ఈవెంట్ను ప్లాన్ చేయాలని దిల్ రాజు ఉన్నారట. దీని నుంచి అధికారక ప్రకటన రాలేదు.అల్లు అర్జున్ రియాక్షన్ఆర్యకు 20 సంవత్సరాలు. ఇది సినిమా మాత్రమే కాదు.. నా జీవిత గమనాన్ని మార్చిన ఒక క్షణం. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. అని తెలిపాడు 20 years of Arya. It’s not just a movie … it’s a moment in time that changed the course of my life . Gratitude forever . pic.twitter.com/DIYyWIP7ig— Allu Arjun (@alluarjun) May 7, 2024 -
Pushpa2 The Rule : ‘పుష్ప2’ మూవీ స్టిల్స్
-
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కుమార్తెకు అరుదైన గౌరవం!
టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్, తబితా సుకుమార్ దంపతుల కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డిని ఉత్తమబాల నటిగా దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన గాంధీ తాత చెట్టు చిత్రంలో ఉత్తమనటనకు ఈ అవార్డును అందజేశారు. ఢీల్లిలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును ఆమెకు అందజేశారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్లో గ్రేడ్-8 అభ్యసిస్తున్న సుకృతి వేణి బండ్రెడ్డి నటించిన ఈ చిత్రం గతంలో కూడా పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శించారు.ఈ చిత్రంలో సుకృతి నటనకు ప్రశంసలతో పాటు పలు అవార్డులను గెలుచుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇండియన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ తొలి సినిమా బాలనటిగా సుకృతి వేణికి అవార్డులు వరించాయి. 11వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా.. న్యూఢిల్లి ఫిల్మ్ ఫెస్టివల్లో జూరీ బెస్ట్ ఫిలింగా.. ఉత్త ప్రాంతీయ చిత్రంగా అవార్డులు అందుకుంది. జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్తో పాటు 8వ ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ జ్యూరీ ఫిలింగా గాంధీ తాత చెట్టు అవార్డులు అందుకోవడం విశేషం.ఇవి కాకుండా పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ నుండి ఈ చిత్రానికి ఆహ్వానాలు అందుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశంగా తెరకెక్కిన ఈ సందేశాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్తో పాటు గోపీ టాకీస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, శేష సింధు రావులు నిర్మాతలుగా వ్యవహరించారు. పద్మావతి మల్లాది దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి తబితా సుకుమార్ సమర్పకురాలిగా వ్యవహరించారు. -
Pushpa 2: పుష్ప..పుష్ప.. పుష్ప.. ఫుల్ సాంగ్ వచ్చేసింది
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న క్షణం రానే వచ్చేసింది. పుష్ప-2 మూవీ నుంచి 'నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే' అంటూ సాగే ఫస్ట్ సింగిల్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్ పుష్ప-2 చిత్రంపై అంచనాలు మరింత పెంచేశాయి. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.గతనెల బన్నీ బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదల చేసిన మేకర్స్.. మరో అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. పుష్ప-2 ఫస్ట్ సింగిల్ను ఏకంగా ఆరుభాషల్లో రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి అల్లు అర్జున్ స్పెషల్ పోస్టర్ను సైతం మేకర్స్ పంచుకున్నారు. సరికొత్త లుక్లో బన్నీ కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.కాగా.. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప సూపర్ హిట్గా నిలిచిన సంగతె తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్గా పుష్ప-2ను తీసుకొస్తున్నారు. ఈ మూవీ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో జగపతిబాబు, మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. -
పుష్ప-2 ఫస్ట్ సింగిల్.. రిలీజ్ టైమ్ ఇదే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2 మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. పుష్ప పార్ట్-1కు సీక్వెల్గా సుకుమార్ డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా పుష్ప-2 మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ను రిలీజ్ డేట్ అండ్ టైమ్ను ప్రకటించారు మేకర్స్.మే 1వ తేదీన ఫస్ట్ సింగిల్ను రిలీజ్ చేయనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో రిలీజ్ చేయన్నట్లు ప్రకటించారు. ఏకంగా ఆరు భాషల్లో ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్ ప్రత్యేక పోస్టర్ను షేర్ చేస్తూ ట్విటర్లో పోస్ట్ చేసింది.కాగా.. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. ఫాహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎర్రచందన సిండికేట్ నేపథ్యంలో వచ్చిన పుష్ప బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలుకొట్టిన సంగతి తెలిసిందే. దీంతో పుష్ప-2పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. S̶e̶n̶s̶a̶t̶i̶o̶n̶a̶l̶ s̶u̶r̶p̶r̶i̶s̶e̶Sensational song ✅🔥🔥#Pushpa2FirstSingle out tomorrow at 5.04 PM in Telugu, Hindi, Tamil, Kannada, Malayalam & Bengali.#PushpaPushpa chant all the way 💥💥A Rockstar @ThisIsDSP Musical 🎵#Pushpa2TheRule Grand release worldwide on… pic.twitter.com/3fuyv9GFlA— Mythri Movie Makers (@MythriOfficial) April 30, 2024 -
పుష్ప 2 నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప 2 నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. పుష్ప పుష్ప అంటూ సాగిపోయే ఈ సాంగ్ ప్రోమోను బుధవారం (ఏప్రిల్ 24) రిలీజ్ చేశారు. కొద్దిరోజుల క్రితమే బన్నీ పుట్టినరోజు సందర్భంగా టీజర్ను రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ఫ్యాన్స్కు మరో సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయిపోయారు. పుష్ప పుష్ప అంటూ సాగిపోయే పూర్తి పాటను కార్మికుల దినోత్సవం సందర్భంగా మే 1న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. పుష్ప చిత్రానికి సీక్వెల్గా వస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది. పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానున్న ఈ చిత్రం బన్నీ మార్కెట్ స్థాయిని పెంచేలా ఉంది. ఈ సినిమా సుమారు రూ.1000 కోట్లకు పైగానే వసూలు చేస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే బాలీవుడ్ థియేట్రికల్ హక్కులు రూ. 200 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. నార్త్లో ఇంతటి భారీ మొత్తానికి అమ్ముడుపోయిన తొలి సినిమాగా పుష్ప రికార్డ్ క్రియేట్ చేసింది.పుష్ప ది రైజ్ చిత్రంతో నేషనల్ అవార్డు అందుకున్న బన్నీ.. తగ్గేదే లే అంటూ ప్రపంచవ్యాప్తంగా తన బ్రాండ్ను విస్తరిస్తున్నాడు. అందుకు తగ్గట్లుగానే రెండో భాగాన్ని తెరకెక్కించారు మేకర్స్ . ఈ చిత్రం కోసం సుమారు రూ.400 కోట్ల బడ్జెట్ను మైత్రీ మూవీ మేకర్స్ వారు పెట్టినట్లు సమాచారం. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రధాన బలమని చెప్పవచ్చు. -
బాలీవుడ్లో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసిన 'పుష్ప'
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప : ది రూల్’ బాలీవుడ్లో ప్రారంభమైంది. సినిమా విడుదలకు ముందే అక్కడ రికార్డ్ బద్దల కొడుతుంది. ఇండియన్ సినిమా మార్కెట్ను షేక్ చేస్తూ ఈ సినిమా రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. పార్ట్-1 సూపర్ హిట్ కావడంతో సీక్వెల్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో పుష్పగాడి టార్గెట్ గ్లోబల్ మార్కెట్పై కూడా పడింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప : ది రూల్’ సినిమా థియేట్రికల్ హక్కులను రూ.200 కోట్ల రూపాయలకు ప్రముఖ బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ థడానీ కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇది బాలీవుడ్లో ఆల్ టైమ్ రికార్డ్ డీల్ అని చెప్పవచ్చు. నాన్ హిందీ సినిమాను బాలీవుడ్లో అంత భారీ దక్కించుకోడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. పుష్ప సినిమా కోసం ఓటీటీలో కూడా గట్టిపోటీ ఉంది. ఎలాగైనా ఈ సినిమాను దక్కించుకోవాలని నెట్ఫ్లిక్స్ రూ.250 కోట్ల వరకు కోట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే డిజిటల్ హక్కుల్లో కూడా పుష్పనే టాప్ అవుతుంది. గతంలో ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీ రైట్స్ కోసం రూ. 170 కోట్లు పెట్టారు. దేశవ్యాప్తంగా పుష్ప చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో మార్కెట్ స్థాయి కూడా అదే రేంజ్లో పెరిగిందని చెప్పవచ్చు. సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. -
జిమ్లో పుష్ప డైరెక్టర్ భార్య.. పెద్ద సాహసమే!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పుష్ప-2 ది రూల్ మూవీతో బిజీగా ఉన్నారు. ఇటీవల బన్నీ బర్త్ డే సందర్భంగా ఆడియన్స్కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప-2 టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే పలు రికార్డులు కొల్లగొట్టింది. దాదాపు 138 గంటల పాటు యూట్యూబ్లో నంబర్వన్ ప్లేస్లో ట్రెండ్ అయింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ట్విటర్ ద్వారా పంచుకుంది. అయితే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత గురించి చాలామందికి తెలియదు. ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటున్నారు. సినిమాలతో పాటు ఎక్కడికెళ్లినా ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఆమె జిమ్లో కసరత్తులు చేస్తున్న వీడియోలను తన ఇన్స్టాలో షేర్ చేసింది. జిమ్లో కసరత్తులు చేస్తూ తబిత కనిపించారు. ఆమె వర్కవుట్స్ సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. పుష్ప-2 ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) -
పుష్ప టీజర్: ఆ సీన్ కోసం అల్లు అర్జున్ ఎంత కష్టపడ్డారో తెలిస్తే..
ఇకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా పుష్ప:ది రూల్ సినిమా టీజర్ విడుదలైంది. యూట్యూబ్లో పుష్ప గాడి సునామీ కొనసాగుతుంది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైరూ అంటూ పార్ట్-1 లో పిచ్చెక్కించిన బన్నీ తాజాగా విడుదలైన తన చీరకట్టుతో దుమ్మురేపాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఫహద్ ఫాజిల్, సునీల్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తిరుపతిలో ఏటా ఘనంగా జరిగే గంగమ్మ జాతర నేపథ్యంలో పుష్ప టీజర్ సాగింది. ఆ వీడియోలో ఊచకోత తర్వాత బన్నీ తన చీర కొంగు నడుముకు చుట్టుకున్నట్లు చూపించారు. డైలాగ్ లేకుండా దేవీ శ్రీ బీజీఎమ్తో తెరకెక్కిన ఈ సీన్.. టన్నుల కొద్ది జోష్ అల్లు అర్జున్ ఫ్యాన్స్లో కనిపించింది. టీజర్ను చూసిన అందరూ ఈ సీన్కు ఫిదా అవుతున్నారు. అయితే ఈ సీన్ అంత ఈజీగా రాలేదని తెలుస్తోంది. ఐదు క్షణాల సీన్ కోసం బన్నీ పడిన కష్టం గురించి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆ ఒక్క షాట్ కోసం బన్నీ ఏకంగా 51 టేకులు తీసుకున్నాడట. ఆ చీర కొంగు కట్టే విధానం స్క్రీన్పై బాగా రావాలని ఆయన పట్టు పట్టారట. ఇదే విషయాన్ని సౌండ్ డిజైనర్ రసూల్ చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న బన్నీ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. సినిమా కోసం తమ హీరో ఎంత డెడికేట్గా పనిచేస్తారో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ అంటూ కామెంట్లు చేస్తున్నారు. పుష్ప:ది రూల్ టీజర్ ఇప్పటి వరకు 40 మిలియన్ల వ్యూస్ దక్కించుకుని యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది. ఆగష్టు 15న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
సమంతను మేనేజ్ చేయడం కష్టం.. ఆ సినిమాలో వద్దనుకున్నా కానీ.. : సుకుమార్
సమంత నటన గురించి తెలుగు ప్రేక్షకులను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేరు. ఎలాంటి పాత్రలోనైనా ఆమె ఒదిగిపోతుంది. యాక్షన్, రొమాన్స్, కామెడీ పాత్ర ఏదైనా..వన్స్ సామ్ చేతికి వచ్చిదంటే..ఇక అందులో వేరే హీరోయిన్ని ఊహించుకోలేం. సామ్లోని మరో కోణాన్ని బయటకు తీసిన సినిమా ఏదైనా ఉంటే అది రంగస్థలం అనే చెప్పాలి. అంతకు ముందు సమంత అలాంటి పాత్రను పోషించలేదు. అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా తనదైన నటనతో ఆకట్టుకుంది. రామ్ చరణ్ పాత్రతో పాటు సామ్ పాత్ర కూడా అందరికి గుర్తిండిపోతుంది. అయితే ఆ పాత్రకు మొదట సమంతను అనుకోలేదట దర్శకుడు సుకుమార్. చివరి నిమిషంలో ఆమెను తీసుకున్నాడట. కానీ షూటింగ్ సమయంలో సామ్ నటన చూసి సుక్కు ఆశ్చర్యపోయాడట. ఆ పాత్రకు సమంత తప్ప ఇంకెవరు న్యాయం చేయలేకపోయేవారని ఆయన అన్నారు. ఇటీవల ఓ ఇంటర్యూలో ఆ చిత్రానికి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ‘రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ అద్భుతంగా నటించాడు. ఆ పాత్రను ఆయనను దృష్టిలో పెట్టుకొనే రాసుకున్నాడు. కానీ సమంత పోషించిన లక్ష్మీ పాత్రను మాత్రం ఆమె కోసం రాయలేదు. ఒక కొత్త అమ్మాయిని పెట్టుకోవాలనుకున్నాం. సినిమాలో హీరో హీరోయిన్లు ఇద్దరు స్టార్స్ అయితే నేను సెట్లో మేనేజ్ చేయలేనేమో అనుకున్నా. కానీ సినిమా స్క్రిప్ట్ ప్రకారం మంచి ఆర్టిస్ట్, తెలుగు వచ్చిన హీరోయిన్ కావాలి. సమంత అయితే పల్లెటూరి అమ్మాయి పాత్రకు సరిపోతుందని భావించి ఆమెను తీసుకున్నాం. షూటింగ్ సమయంలో ఆమె నటన చూసి నేనే ఆశ్చర్యపోయాను. ప్రతి సీన్లోనూ ఆమె పలికించిన హావభావాలు అద్భుతం. నేను సినిమాలు తీసినంత కాలం సమంతతో చేస్తూనే ఉంటా’ అని సుకుమార్ సమంతను పొగడ్తలో ముంచేశాడు. -
Pushpa 2 Teaser Photos: చీర కట్టులో పుష్ప రాజ్ విశ్వరూపం
-
Pushpa 2: The Rule Teaser: పుష్ప టీజర్ అప్డేట్.. గూస్బంప్స్ ఖాయమేనా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2. సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్ -1 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్గా ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. ఇటీవలే వైజాగ్లో పుష్ప-2 షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అంతే కాకుండా యాగంటి క్షేత్రంలోనూ రష్మిక మందన్నాపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే కావడంతో టీజర్ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ పుష్ప-2 టీజర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. తాజాగా టీజర్ టైమింగ్ను రివీల్ చేశారు మేకర్స్. బన్నీ బర్త్ డే రోజున 11:07 నిమిషాలకు టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా గూస్ బంప్స్ గ్యారంటీడ్ అంటూ పోస్ట్ చేశారు. దీంతో పుష్ప అభిమానులు వెయిటింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. #Pushpa2TheRule teaser tomorrow at 11:07AM. pic.twitter.com/utmMi2Hdyu — Allu Arjun (@alluarjun) April 7, 2024 𝐓𝐎𝐌𝐎𝐑𝐑𝐎𝐖 is the day ❤️🔥 𝟏𝟏.𝟎𝟕 𝐀𝐌 is the time ❤️🔥#Pushpa2TheRuleTeaser will mark the entry of #PushpaRaj that will create ripples across the box office💥💥 𝗚𝗢𝗢𝗦𝗘𝗕𝗨𝗠𝗣𝗦 𝗚𝗨𝗔𝗥𝗔𝗡𝗧𝗘𝗘𝗗 🔥#PushpaMassJaathara #Pushpa2TheRule pic.twitter.com/kMTYEgx8GB — Pushpa (@PushpaMovie) April 7, 2024 -
అల్లు అర్జున్ పుష్ప-2.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2. సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్ -1 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్గా ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. ఇటీవలే వైజాగ్లో పుష్ప-2 షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అంతే కాకుండా యాగంటి క్షేత్రంలోనూ రష్మిక మందన్నాపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. దీంతో బన్నీ ఫ్యాన్స్ పుష్ప-2 అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ క్రేజీ అప్డేట్తో వచ్చారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే కావడంతో టీజర్ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప-2 టీజర్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇటీవలే అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని పుష్ప స్టైల్లో దుబాయ్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించారు. ఈ ఘనత దక్కించుకున్న తొలి దక్షిణాది నటుడిగా బన్నీ నిలిచారు. #Pushpa2TheRule Teaser out on April 8th, 2024!!! pic.twitter.com/ivTN2CJZBh — Allu Arjun (@alluarjun) April 2, 2024 Let the #PushpaMassJaathara begin 💥 𝗧𝗛𝗘 𝗠𝗢𝗦𝗧 𝗔𝗪𝗔𝗜𝗧𝗘𝗗 #Pushpa2TheRuleTeaser out on April 8th ❤️🔥❤️🔥 He is coming with double the fire 🔥🔥#Pushpa2TheRule Grand Release Worldwide on 15th AUG 2024. Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil… pic.twitter.com/gCPRAxqoPh — Pushpa (@PushpaMovie) April 2, 2024 -
పుష్ప-2 క్రేజీ అప్డేట్.. టీజర్ రిలీజ్ డేట్ లీక్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాలో నటిస్తున్నారు. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే వైజాగ్తో పాటు యాగంటిలో పుష్ప-2 షెడ్యూల్ జరిగింది. దీంతో పుష్ప-2 అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్ పుష్ప-2 అప్డేట్ గురించి ప్రశ్నించాడు. చాలా మంది ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఎక్స్క్యూటివ్ ప్రొడ్యూసర్ శరత్ని సోషల్ మీడియా వేదికగా ఆరా తీశారు. వారికి ట్వీట్కు స్పందించిన శరత్ పుష్ప టీజర్ అప్ డేట్ ఇచ్చాడు. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్ 8న టీజర్ వస్తుందని కామెంట్ చేశాడు. ఇది చూసిన బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Teaser untundi birthday ki…Fix — Sarath Chandra Naidu (@imsarathchandra) March 29, 2024 -
అల్లు అర్జున్ పుష్ప మూవీ.. ఆ స్టైల్ కాపీ కొట్టేశారా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప బాక్సాఫీస్ను షేక్ చేసింది. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం పలు రికార్డులు కొల్లగొట్టింది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. శ్రీవల్లిగా టాలీవుడ్ను అభిమానులను అలరించింది. ఎర్రచందనం సిండికేట్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాతో అల్లు అర్జున్ను ఓ రేంజ్ స్థాయికి తీసుకెళ్లింది. అంతే కాకుండా ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ కూడా అందుకున్నారు. అయితే ఈ సినిమాలో పుష్పరాజ్ మేనరిజానికి సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా భుజం కాస్తా పైకి ఎత్తి బన్నీ నటించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటికీ ఆ స్టైల్కు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఏది ఏమైనా ఈ చిత్రంలో అల్లు అర్జున్ డైలాగ్స్, వాకింగ్ స్టైల్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకున్నాయి. పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే అనే డైలాగ్ అభిమానులను ఓ ఊపు ఊపేసింది. పుష్ప సినిమాలో ముఖ్యంగా అల్లు అర్జున్ నడక ఎప్పటికీ మర్చిపోలేరు. అయితే అచ్చం అల్లు అర్జున్ లాగే ఆ వాకింగ్ స్టైల్ను టాలీవుడ్ హీరో చేసి చూపించారు. కాకపోతే ఇప్పుడు కాదండోయ్. దాదాపు 22 ఏళ్ల క్రితమే శ్రీహరి అలాంటి మేనరిజంతో మెప్పించారు. ఇది చూసిన టాలీవుడ్ ఫ్యాన్స్ షాకవుతున్నారు. 2002లో వచ్చిన పృథ్వీ నారాయణ అనే చిత్రంలో సేమ్ బన్నీ వాకింగ్ స్టైల్తో అదరగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ శ్రీహరి అద్భుతంగా చేశారంటూ కామెంట్స్ చేశారు. మరికొందరేమో పుష్ప మేనరిజం కాపీ కొట్టారా? అంటూ డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం బన్నీ పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. pushpa walking style appatlone srihari gaaru 👌❤️ pic.twitter.com/4PJj9Y1Z1Z — celluloidpanda (@celluloidpanda) March 25, 2024 -
రామ్ చరణ్ కొత్త సినిమా దర్శకుడు ఎవరు?
-
హిట్ కాంబినేషన్ రిపీట్
హిట్ మూవీ ‘రంగస్థలం’ (2018) తర్వాత హీరో రామ్చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుంది. సోమవారం ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. రామ్చరణ్ కెరీర్లోని ఈ 17వ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణను మొదలు పెట్టి, వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ చేయాలన్నది చిత్రబృందం ప్లాన్ అని సమాచారం. -
ఫ్యాన్స్కు చెర్రీ హోలీ ట్రీట్.. ఆ స్టార్ డైరెక్టర్తో మరో సినిమా!
ప్రస్తుత గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఇటీవలే ఆర్సీ16 పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. అంతలోనే మరో క్రేజీ డైరెక్టర్తో గ్లోబల్ స్టార్ జతకట్టారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్తో కలిసి పని చేయనున్నారు. హోలీ సందర్భంగా ఈ విషయాన్ని పంచుకున్నారు.ఈ మూవీ వర్కింగ్ టైటిల్ ఆర్సీ17 పేరుతో మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. కాగా.. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన రంగస్థలం బ్లాక్బస్టర్గా నిలిచింది. దీంతో మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్తో పుష్ప-2 సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. Mighty forces reunite for an earth-shattering magnum opus 🔥❤🔥 Global Star @AlwaysRamCharan X The Maverick Director @aryasukku X Rockstar @ThisisDSP X @MythriOfficial X @SukumarWritings = #Raring2Conquer 🐎#RC17 is all set to add new colours to the Indian Cinema ❤🔥 pic.twitter.com/ISRZaumDng — Mythri Movie Makers (@MythriOfficial) March 25, 2024 -
విజయ్ దేవరకొండకు హ్యాండిచ్చిన సుకుమార్?
పుష్ప సినిమాతో సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. ఆ చిత్రం సౌత్ కంటే నార్త్ ఆడియెన్స్నే ఎక్కువగా ఆకట్టుకుంది. సుకుమార్ మేకింగ్పై బాలీవుడ్ ప్రశంసలు కురిపించింది. ఇక ఇప్పుడు గ్లోబల్ ఆడియన్స్ను మెప్పించేలా పుష్ప 2ను తీర్చిదిద్దుతున్నాడు కుమార్. ఆలస్యమైనా సరే.. పుష్ప 2తో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మూవీ తర్వాత సుకుమార్ రామ్ చరణ్తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. (చదవండి: నేను చనిపోవాలట.. వారికేం వస్తుందో మరి!: బుల్లితెర నటి) వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ (2018) బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇక అప్పుడు అంతకు మించిపోయే హిట్ స్టోరీని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ నెల 27న రామ్చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వెల్లడి కానుందని తెలిసింది. వాస్తవానికి పుష్ప తర్వాత సుకుమార్.. విజయ్ దేవరకొండతో సినిమా చేయాల్సింది. పుష్ప రిలీజ్కు ముందే అధికారిక ప్రకటన కూడా చేశారు. కొన్నాళ్ల తర్వాత ఆ చిత్రం ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా టీమ్ స్పందిస్తూ..కచ్చితంగా సినిమా ఉంటుందని పేర్కొంది. కానీ ఇంతవరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రం దారుణ పరాజయాన్ని మూటగట్టుకోవడంతో సుకుమార్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆ చిత్రం హిట్ అయితే విజయ్ పాన్ ఇండియా స్టార్ అయ్యేవాడని.. అప్పుడు సినిమా తీస్తే అదే రేంజ్లో విజయం సాధించొచ్చని సుక్కు భావించాడట. కానీ లైగర్ ఫ్లాప్ చూసి.. వెనుకడుగు వేశాడు. వెంటనే పుష్ప 2ని సెట్స్పైకి తీసుకెళ్లాడు. ఈ మూవీ తర్వాత అయినా విజయ్ సినిమా ఉంటుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు రామ్చరణ్ మూవీ తెరపైకి వచ్చింది. దీంతో ఇక విజయ్తో సినిమా లేనట్లే అని ఇండస్ట్రీ పెద్దలు అంచనా వేస్తున్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)
దాక్షాయణి బర్త్ డే.. పుష్ప మేకర్స్ స్పెషల్ అప్డేట్!
దేవర బర్త్ డే ట్రీట్.. అప్డేట్ అదిరిపోయింది!
‘బీజేపీకి ఓటేస్తే నేను జైలుకే’.. కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్ రైతు వ్యతిరేక చర్యలు.. రాష్ట్రవ్యాప్త నిరసనకు కేసీఆర్ పిలుపు
మాజీ గవర్నర్ కమలా బెనివాల్ కన్నుమూత
ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్.. సాధారణ తీర్పు కాదన్న అమిత్ షా
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
తప్పక చదవండి
- కాకిస్నూరు.. ఓటింగ్లో సూపర్..
- వెల్లివిరిసిన మహిళా చైతన్యం
- ఎయిరిండియా–విస్తారా విలీన ప్రక్రియలో పురోగతి
- సైన్స్, టెక్నాలజీలో మహిళా గ్రాడ్యుయేట్లు పెరగాలి
- రాజ్యాంగ పరిరక్షణే ప్రధానం: కేజ్రీవాల్
- USCIS: హెచ్1–బీ వీసాదారులకు తీపికబురు
- Amit Shah: కేజ్రీవాల్కు స్పెషల్ ట్రీట్మెంట్ !
- USA Presidential Elections 2024: బైడెన్, ట్రంప్ రె‘ఢీ’
- గ్లోబల్ వార్మింగ్పై ఫైటర్.. ది మమ్మోత్
- Lok Sabha Election 2024: డ్రమ్స్.. ధూం ధాం
Advertisement