-
పెత్తందారులకు మళ్లీ షాకే!
సాక్షి, అమరావతి : పెత్తందార్లకు మళ్లీ షాక్ ఇచ్చేందుకు పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలంతా సిద్ధమయ్యారు. ఇంటింటా అభివృద్ధి కొనసాగాలని.. రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నారు. మళ్లీ జగన్ వస్తేనే సంక్షేమాభివృద్ధి పథకాలు కొనసాగుతాయని బలంగా నమ్ముతున్నారు. సాధికారత కోసం ఎన్నికల మహా సంగ్రామంలో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియలో ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కి ఓట్లేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించేందుకు పేదలంతా సిద్ధమయ్యారు.గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు.. 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను గెలిపించి, వైఎస్సార్సీపీకి ప్రజలు చారిత్రక విజయాన్ని అందించారు. 2019 మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తొలి ఏడాదిలోనే 95 శాతం హామీలు అమలు చేసి ఎన్నికల మేనిఫెస్టోకు సరైన నిర్వచనం చెప్పారు. 59 నెలల్లో 99 శాతం హామీలు అమలు చేశారు. ఎలాంటి వివక్ష చూపకుండా, లంచాలకు తావులేకుండా.. అర్హతే ప్రామాణికంగా అందరికీ సంక్షేమ పథకాలు అందించారు.సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. నాన్ డీబీటీ పథకాల ద్వారా మరో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి పేదలకు మొత్తం రూ.4.49 లక్షల కోట్ల లబ్ధి చేకూరింది. వాటిని సది్వనియోగం చేసుకున్న పేదలు.. జీవనోపాధులను మెరుగుపర్చుకుని తమ కాళ్లపై తాము నిలబడగలుగుతున్నారు. రాష్ట్రంలో పేదరికం చంద్రబాబు హయాంలో 11.77 శాతం ఉంటే.. 2022–23 నాటికి అది 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం. సాధికారత కోసం పేదలంతా సిద్ధం విభజన తర్వాత 2014 ఎన్నికల్లో వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని.. ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానంటూ 650కిపైగా హామీలు ఇచ్చిన చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది. 2019 ఎన్నికల్లో వేరుపడిన ఆ పార్టీలు ఇప్పుడు మళ్లీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తూ అలవికాని హామీలు ఇచ్చాయి.ఆ హామీల అమలు సాధ్యం కాదని నిర్ధారణకు వచ్చిన బీజేపీ.. టీడీపీ కూటమి మేనిఫెస్టోను ముట్టుకోవడానికి కూడా వెనుకంజ వేసింది. సీఎం జగన్ గత ఎన్నికల తరహాలోనే అమలు చేయదగిన హామీలతోనే కేవలం రెండే రెండు పేజీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. కూటమికి ఇక్కడ సారథ్యం వహిస్తున్న చంద్రబాబు.. చెప్పిన మాటపై నిలబడడని, మోసం చేస్తారనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకు పోయింది. చెప్పిన హామీలన్నీ అమలు చేసిన సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం కుదిరింది. దీంతో సాధికారత కోసం మళ్లీ జగనే రావాలని పేదలంతా బలంగా కోరుకుంటున్నారు. భవిష్యత్తు మరింత గొప్పగా మార్చుకునేందుకు..⇒ రాష్ట్రంలో 70 శాతం ప్రజల జీవనాధారం వ్యవసాయం. సీఎం జగన్ గ్రామాల్లో ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు)లను ఏర్పాటు చేసి, విత్తు నుంచి విక్రయం దాకా రైతుల చేయిపట్టి నడిపిస్తున్నారు. రైతు భరోసా ద్వారా పెట్టుబడి సహాయం.. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు. రైతులపై ఎలాంటి భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని తెచ్చారు. పండించిన పంటల ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోతే.. ఆ సీజన్ ముగిసేలోగా పరిహారాన్ని అందించి రైతులకు దన్నుగా నిలుస్తున్నారు. తద్వారా వ్యవసాయాన్ని పండుగగా మార్చారు. ⇒ గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలు సొంత ఊళ్లోనే సులభంగా అన్ని పనులను చక్కబెట్టుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ వైద్య ఖర్చుల పరిమితిని రూ.25 లక్షలకు పెంచడం.. జగనన్న సురక్ష, విలేజ్ హెల్త్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ప్రజల ఆరోగ్యానికి సీఎం జగన్ భరోసా కల్పించారు. పునర్ వ్యవస్థీకరణ ద్వారా 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. ⇒వైఎస్సార్ చేయూత, ఆసారాతో మహిళలకు సీఎం జగన్ అండగా నిలిచారు. ఆ పథకాల ద్వారా అందించిన ఆర్థిక సాయంతో⇒‘పేదలంటే మారుమూల పల్లెల్లో, పట్టణాల్లోని మురికి వాడల్లోనే ఉండాలి.. పెత్తందారుల ఇళ్లలో పనులు చేస్తూ, వాళ్లు తినగా మిగిలింది తింటూ బతకాలి.. పిల్లలను స్కూల్ లెవల్ వరకు తెలుగు మీడియంలో మాత్రమే చదివించాలి.. ఇంగ్లిష్ మీడియంలో చదివించాలనే ఆలోచనే రాకూడదు.. టెన్త్ తర్వాత పెత్తందారుల ఫ్యాక్టరీలో ప్యాకింగ్ విభాగంలో, లోడింగ్.. అన్లోడింగ్ సెక్షన్లో, సెక్యూరిటీ గార్డులుగా పెట్టుకోమని బతిమిలాడాలి..అమరావతిలో పేదలనే వారు అసలు ఉండకూడదు.. ఎన్నో ఏళ్లుగా ఇలా కొనసాగుతోంటే ఈ సీఎం జగన్ వచ్చాక, ఆ పరిస్థితి మార్చేస్తున్నారు.. సీఎం ఇలా చేస్తే మేము చూస్తూ ఊరుకుంటామా.. కోర్టుల్లో కేసులేశాం.. లేని వివాదాలు సృష్టించాం.. భయాందోళనలు పెంచేశాం.. డబ్బు సంచులతో ఎన్ఆర్ఐలను దింపాం.. పనోళ్లను పనోళ్లుగా ఉంచకుండా పేదరికాన్ని తగ్గించేస్తే మేమంతా ఏమైపోవాలి?’ అని చంద్రబాబు ఆయన పెత్తందారుల గ్యాంగ్ ఊగిపోతోంది. ⇒ ఈనాడు రామోజీ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్ని మందులు వాడినా హిస్టీరియా తగ్గడం లేదు. రాత్రిళ్లు ఉన్నట్లుండి లేచి కూర్చుంటున్నారట. అదిగో జగన్.. జగన్.. మళ్లీ వస్తున్నాడు అంటూ కలవరిస్తున్నారట! తప్పకుండా ఆయన కల నెరవేరుతుంది. పేదరికంపై, పేదలపై, దిగువ మధ్యతరగతి వర్గాలపై విషం నింపుకున్న ఈ పెత్తందారులు ఫలానా మంచి పని చేశామని ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోలేని దుస్థితిలో నిస్సిగ్గుగా మంచి చేస్తున్న ప్రభుత్వంపై దుర్మార్గంగా నిందలు వేస్తున్నారు. దు్రష్పచారాలు చేస్తున్నారు. వీరందరి వలువలూడదీసి తరమడానికి ఓటర్లంతా సిద్ధంగా ఉన్నారు. ఊరూరా అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు బారులు తీరి కనిపిస్తున్నారు. ఆ రెండు బటన్లు ఎప్పుడెప్పుడు నొక్కుదామా అని వేచి చూస్తున్నారు. -
ఆ గట్టున సినిమా స్టార్లు.. ఈ గట్టున రియల్ స్టార్లు
ఎన్నికలు వచ్చేశాయి.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు నిలబడగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అటు బీజేపీ, జనసేనలతో జతకట్టి ప్రజల్లోకి వెళ్తోంది. ఈ సందర్భంగా ఎన్డీయే కూటమి రకరకాలవాళ్ళను ప్రచారానికి దించుతోంది.బాలయ్య బాబు వంటి సినిమా స్టార్లు ఒకవైపు ప్రచారం చేస్తుండగా ఏకంగా పవన్ కళ్యాణ్ సైతం అటు పిఠాపురంలో పోటీ చేస్తూనే వేరే నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తరఫున జబర్దస్త్ టీమ్ మొత్తం కొన్నాళ్లపాటు ప్రచారం చేయగా ఇక మెగా కాంపౌండ్లోని హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్ వంటివాళ్ళు సైతం ప్రజల్లోకి వెళ్లి కూటమికి ఓటేయాలని అడుగుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం తమ్ముడు పవన్ను పిఠాపురంలో గెలిపించాలని కోరుతూ వీడియో విడుదల చేశారు. ఇలా కూటమి వైపు మొత్తం పెద్దపెద్ద సినిమా స్టార్లు ప్రచారం చేస్తున్నారు.లబ్ధిదారులే జగన్ స్టార్ క్యాంపెయినర్లు అటు ప్రచారం అలా ఉండగా ఇటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారధ్యంలోని వైఎస్సార్సీపీ మాత్రం ప్రజలే ప్రచార సారధులుగా ముందుకు సాగుతోంది. ఓ వైపు అంతా తానై సీఎం జగన్ ప్రచారం చేస్తుండగా మరోవైపు ఆయన ప్రభుత్వంలో లబ్దిపొందినవాళ్లు ఆయన కోసం ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం హయాంలో పెన్షన్ కోసం ఇబ్బంది పడిన ఓ తాత.. అమ్మ ఒడి అందుకున్న ఓ అక్క.. జగనన్న విద్యాకానుక అందుకున్న ఒక కుర్రాడి తల్లి.. ఆసరా అనుకున్న ఓ అక్క.. ఇలా పేదలే సీఎం జగన్ తరఫున ప్రచారం చేస్తున్నారు. మీ అందరికీ మంచి జరగాలి అంటే మళ్ళీ జగన్ గెలవాలి అని ఇంటింటికి వెళ్లి చెబుతున్నారు. ఆ గట్టున సినిమా క్యాంపెయినర్లుగా ఉండగా ఈ గట్టున పేదలే స్టార్ క్యాంపెయినర్లుగా నిలబడి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చేందుకు పని చేస్తున్నారు.-సిమ్మాదిరప్పన్న. -
May 8th: ఏపీ ఎన్నికల సమాచారం
AP Political And Elections News Updates In Telugu8:18 PM, May 8th, 2024షర్మిల, సునీతలకు కడప కోర్టు మరోసారి షాక్ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రస్తావించరాదన్న కడప కోర్టు జారీ చేసిన అర్డర్ను డిస్మిస్ చేయాలంటూ సునీత వేసిన పిటిషన్ను కొట్టేసిన కోర్టుఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సునీతకడప కోర్టులోనే తేల్చుకొవాలన్న హైకోర్టుహైకోర్టు అదేశాల మేరకు విచారణ చేపట్టిన కడప కోర్టుఇరువురి వాదనలు విన్న కడప కోర్టుసునీత, షర్మిల దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసిన కడప కోర్టుతప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ సునీత, షర్మిలకు రూ.10 వేల జరిమానాజరిమానానుజిల్లా లీగల్ సెల్ కు కట్టాలన్న కడప కోర్టు2:30 PM, May 8th, 2024కుప్పంలో బాబు ఓడిపోతున్నాడు: లక్ష్మి పార్వతి సంఘ విద్రోహులు చంద్రబాబు అండ్ కొఎన్టీఆర్ వెన్నుపోటులో పురందేశ్వరి ప్రధాన పాత్ర పోషించిందినేతి బీరకాయలో నెయ్యి లాంటిది పురందేశ్వరి మంచితనంపురందేశ్వరి కూడా చంద్రబాబు లాంటి మనిషిFIRలో వైఎస్సార్ పేరును చేర్చిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడం ఏమిటి..?వీరందరినీ చంద్రబాబు ఆడిస్తున్నారురాజకీయ నీచుడు చంద్రబాబుబాబు కంటే సీఎం జగన్ అధిక పెట్టుబడులు తీసుకొచ్చారుఏపీ అభివృద్ధిలో విశాఖ కీలకంఏం మాట్లాడాలో అర్ధంకాక బాబు ఇచ్చిన స్క్రిప్ట్ మోడీ చదివాడుసీఎం జగన్ను గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారుఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలి అంటే సీఎం జగన్ అధికారంలోకి రావాలినేను రాష్ట్రం మొత్తం తిరిగానుగీతం మూర్తి ఎన్టీఆర్ వెన్నుపోటులో కీలక పాత్ర పోషించిన దుర్మార్గుడుగీతం భరత్ను ఓడించాలిగీతం అంటేనే భూ కబ్జాలుఏయూను నాశనం చెయ్యాలనే ఉద్దేశంతోనే గీతంను అభివృద్ధి చేశారు.1:50 PM, May 8th, 2024మోదీకి కుటుంబం లేదన్న వ్యక్తి చంద్రబాబు: జోగి రమేష్జోగి రమేష్ కామెంట్స్ఎన్డీఏ కూటమి కొత్త కూటమి ఏమి కాదు .2014లో ఇదే కూటమి జతకట్టింది.కలిసి పోటీ చేయడం ఎందుకు.. విడిపోవడం ఎందుకు..పవన్ వలన మేము గెలవలేదని చంద్రబాబు అన్నాడు.మోడీకి కుటుంబం లేదు అన్న వ్యక్తి బాబు.మేనిఫెస్టోలో ఒక్క పథకం కూడా చంద్రబాబు అమలు చేయలేదు.అందుకే గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు..కుట్రలతో ఇప్పుడు కూటమి ఏర్పాటు చేశారు.పొత్తులు ముక్కలవడం ఖాయం .అన్నం పెట్టే జగన్న కు ప్రజలు మద్దతుగా ఉన్నారురెండు ఓట్లు ఫ్యాన్ కే వేస్తామని ప్రజలు అంటున్నారు.మంచి చేశాడు కాబట్టే ప్రజల గుండెల్లో జగన్ ఉన్నారు 1:30 PM, May 8th, 2024టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి: తానేటి వనితటీడీపీ నేతల రౌడీయిజంపై చర్యలు తీసుకోవాలిటీడీపీ నేతల దాడులు నశించాలిప్రజాస్వామ్యం పరిరక్షించాలినేనున్న ఇంటిపై దాడి చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది?ఎవరు ఎంత రెచ్చగొట్టినా కార్యకర్తలు రెచ్చిపోవద్దుప్రజల్లో మనం ఉన్నాము సర్వేలు బాగున్నాయిప్రజలంతా కూడా జగనన్న పరిపాలనకు ముక్తులై.. మనకే ఓటేయాలని ఎదురుచూస్తున్నారుటీడీపీ కార్యకర్తలు రౌడీ రాజకీయాలు, గూండా రాజకీయాలు చేస్తున్నారుభౌతికంగా దాడులు చేసి.. మనం చేసినట్టు లైవ్లు పెట్టారు.గోపాలపురం నియోజకవర్గంలో ఒక రెడ్ బుక్ ఉందని అంటున్నారు.ఒక్కసారి కూడా ఎన్నిక కాని వారు గూండా రాజకీయాలు చేస్తున్నారురాత్రి జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసామునేనేమీ వారికి ఛాలెంజ్లు కూడా చేయలేదుమా నాయకుడు చేసిన మంచే మాట్లాడాను.జగనన్న నాకు హోం మంత్రి పదవి ఇచ్చారుజగనన్న నాకు రాజ్యాధికారం ఇచ్చారుదళితలమైన నాపై దాడులు చేస్తూ కించపరిచేలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారుఈరోజు నాపై దాడి చేశారు అధికారం లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి?నోటికి వచ్చిన వాగ్దానాలు ఇస్తున్నారు.చట్టం ఎవరికీ చుట్టం కాదు.ప్రతీ కార్యకర్త ఎలక్షన్పై దృష్టి పెట్టాలి. 12:30 PM, May 8th, 2024చంద్రబాబుపై ఎమ్మెల్సీ రుహుల్లా ఫైర్మైనార్టీల 4% రిజర్వేషన్ గురించి మోదీతో మాట్లాడే దమ్ము చంద్రబాబుకు ఉందా?.విజయవాడ పర్యటనలో మోదీతో చంద్రబాబు మైనార్టీల గురించి మాట్లాడించాలి.హజ్ యాత్రకు వెళ్లే మైనార్టీలను సీఎం జగన్ ఆర్థికంగా అందుకున్నారు.గుంటూరులో దళితులపై దేశద్రోహి కేసులు పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు.రాష్ట్రంలో ఉన్న మైనారిటీలు అందరూ ఈ విషయంపై ఆలోచించాలి.మైనారిటీలను ఓట్ల కోసం వాడుకుంది చంద్రబాబు నాయుడురాష్ట్రంలో మైనార్టీలు అంటే చంద్రబాబు, బీజేపీకి చిన్న చూపు.సీఎం జగన్ మైనార్టీలకు అభివృద్ది చేశారుమైనార్టీల ద్రోహి చంద్రబాబు నాయుడుమైనార్టీలకు ద్రోహం చేయడానికి చంద్రబాబు మోదీతో జత కట్టారు 12:00 PM, May 8th, 2024పవన్పై ముద్రగడ సంచలన కామెంట్స్పవన్ కళ్యాణ్ నిఖార్సైన కాపో కాదో లోకానికి తెలియాలినేను నిఖార్సైన కాపుని.. నా కుటుంబం కూడా స్వచ్చమైన కాపు కుటుంబంపవన్ కుటుంబం స్వచ్చమైన కాపు ఐతే చరిత్ర బయట పెట్టమనండి.మాటి మాటికీ కాపు ముసుగులో ఉండి కాపులకు సాయం చేయ్యరా అని అడుగుతున్నావ్.మా వంగా గీతా కాపు కాదా?కొందరు దుష్టుల వల్ల నా కూతురు దూరమైపోయిందిమళ్ళీ వచ్చే జన్మలోనే కలుసుకుందాం 11:30 AM, May 8th, 2024అభివృద్ధి అంటే జగనే: దేవినేని అవినాష్ప్రతీ గడపలో జగన్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారుఅభివృద్ధి లేదు అంటున్న టీడీపీ నేతలు మూడో డివిజన్లో పర్యటించాలిఐదేళల్లో జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి ఓటు వేయమని కోరుతున్నాంఈ డివిజన్ మొత్తం సీసీ రోడ్లు వేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందిటీడీపీ ఎమ్మెల్యేకు ఈ ప్రాంతం, నియోజకవర్గ అభివృద్ధిపై చిత్త శుద్ధి లేదుఅభివృద్ధి సంక్షేమం చూసి మీ బిడ్డగా ఒక్క అవకాశం ఇవ్వాలిఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఆశీర్వదించండి 11:00 AM, May 8th, 2024ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ కామెంట్స్సీఎం జగన్ ప్రభుత్వంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు.జగనన్న పథకాలపై ఈసీకి ఫిర్యాదుకు చేసి వాటిని ఆపిన దుర్మార్గుడు చంద్రబాబు.చంద్రబాబుకు పేద ప్రజల పట్ల అంత అసూయ ఎందుకు?.ప్రజలను ఇబ్బంది పెట్టడం చంద్రబాబుకు అలవాటే.గతంలో చంద్రబాబు పసుపు కుంకులకు ఎలక్షన్ సమయంలో పర్మిషన్ ఇచ్చారు.ఎలక్షన్ కోడ్ రాకముందు అందించిన సంక్షేమ పథకాలను ఎందుకు ఆపారు.ఎన్నికల కమిషనర్ ఈ విషయాన్ని పున: పరిశీలన చేయాలి.విద్యాదీవెన ఆపిన కారకులు చంద్రబాబు, జనసేన, బీజేపీదుర్మార్గపు ఆలోచనలకు కేరాఫ్ అడ్రస్ వీరి ముగ్గురే.పేద ప్రజలపై కక్ష సాధింపు చర్యలు వద్దు.సీఎం జగన్ పేద ప్రజలకు కవచంలా అండగా ఉంటారు. 10:30 AM, May 8th, 2024బాబుకు ఓటమి భయం పట్టుకుంది: మంత్రి పెద్దిరెడ్డిమంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్కుప్పంలో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందిఇందుకే పిచ్చి పట్టినట్లు బాబు మాట్లాడుతున్నారుసీఎం జగన్తో పాటు నాపై చంద్రబాబు ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారువేల కోట్లు నేను సంపాదించానని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటుచంద్రబాబు ఆరోపణలకు రుజువులు ఉన్నాయా?.ఈసారి కుప్పంలో చంద్రబాబును ప్రజలు రాజకీయంగా భూస్థాపితం చేయనున్నారు. 10:00 AM, May 8th, 2024చంద్రబాబుపై మాట మార్చిన మోదీ..నాడు చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎం మార్చుకున్నాడని మోదీ వ్యాఖ్యలునేడు చంద్రబాబుపై మోదీ ప్రశంసలు. వెన్నుపోటు, పార్టీలు మార్చడం, తిట్టినవారి చంకనెక్కడంలో బాబు నిపుణుడు.మోదీ కూడా చంద్రబాబులాగే మాట్లాడుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో మన ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించండి. చంద్రబాబు గురించి గత ఎన్నికల ముందు మోడీ గారు ఏమన్నారో గుర్తుందా? పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నాడని, వెన్నుపోట్లు, పార్టీలు మార్చడం, తిట్టినవారి చంకనెక్కడంలో చంద్రబాబు నిపుణుడని, అత్యంత అవినీతిపరుడని చెప్పారు. కానీ ఇప్పుడు అదే మోడీ గారు ఎన్డీయే గూటికి చేరిన చంద్రబాబుని ఇంతకంటే… pic.twitter.com/rSUlLqQzQB— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2024 08:45 AM, May 8th, 2024మోదీ, బాబుకు వడ్డే శోభనాద్ధీశ్వర రావు సవాల్ప్రధాని మోదీ, చంద్రబాబుకి మాజీ మంత్రి వడ్డే శోభనాద్ధీశ్వర రావు సవాల్ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయించగలరా?ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సిఫార్సు చేసింది కేంద్ర ప్రభుత్వమే కదా?.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ మద్దతు పలకలేదా?టీడీపీ లోపల మద్దతు పలుకుతూ, పైకి మాటల గాంభీర్యం ప్రకటించడం కరెక్టేనా?ఈటీవీ, అన్నదాతల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనుకూల కథనాలు ప్రసారం చేయడం వాస్తవం కాదా?ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు మోదీని ప్రశ్నించాలి, నిలదీయాలి.మోదీ విజయవాడ పర్యటనలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయించే హామీని ఇవ్వగలవా చంద్రబాబు? 07:35 AM, May 8th, 2024టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు: తానేటి వనితహోంమంత్రి తానేటి వనిత కామెంట్స్.. టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. మహిళ అని చూడకుండా దాడికి ప్రయత్నించారు. హోంమంత్రి దాడి చేయడమంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?. మాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు. 07:15 AM, May 8th, 2024తానేటి వనితపై టీడీపీ నేతల దాడి యత్నం..తూర్పుగోదావరిలో రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్నల్లజర్లలో టీడీపీ కార్యకర్తల బీభత్సంహోంమంత్రి తానేటి వనితపై దాడికి యత్నం. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది. హోంమంత్రిని సురక్షితంగా గదిలో ఉంచిన సెక్యూరిటీ. వైఎస్సార్సీపీ ప్రచార వాహనాన్ని ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణుల మూకుమ్మడి దాడి.టీడీపీ శ్రేణుల దాడిలో వైఎస్సార్సీపీ నేతలకు తీవ్ర గాయాలు. టీడీపీ శ్రేణుల దాడిలో వాహనాలు, ఫర్నీచర్ ధ్వంసంసీసీ కెమెరాలో రికార్డయిన టీడీపీ నేతల దాడి దృశ్యాలు. నల్లజర్లలో భారీగా పోలీసుల మోహరింపు. 07:00 AM, May 8th, 2024గాజువాక రోడ్షోలో సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..మరో ఆరు రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహా సంగ్రామం జగన్కు ఓటు వేస్తే పథకాల కొనసాగింపు, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాల ముగింపు, ఇదే చరిత్ర చెప్పే సత్యంప్రతి రంగంలోనూ అనూహ్యమైన మార్పులు తీసుకురాగలిగాం, బటన్ నొక్కుతూ నేరుగా లబ్ధి అందజేశాంగతంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం జరిగింది13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చడమే కాక ప్రజలకు మరింత దగ్గరయిన ప్రభుత్వం మీ బిడ్డదివిశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయడమే కాక జూన్ 4 న మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది, తర్వాత పాలన కొనసాగించేది విశాఖ నుంచే..ఈ 59 నెలల్లో మీ బిడ్డ చేసిన అభివృద్ది గమనించండి అని చెబుతున్నా, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్ధం చెప్పాడు మీ బిడ్డలంచాలకు, వివక్షకు తావులేకుండా ఇంటివద్దకే పౌరసేవలు, అన్ని పథకాలు, ఇది కాదా అభివృద్దిఉద్దానం సమస్యను గతంలో ఎవరైనా పట్టించుకున్నారా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ ప్రతి ఏడాది మొదటి స్ధానమే, మీ బిడ్డ పాలనలో ఏకంగా రూ. లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయిసస్టెయినబుల్ డెవలప్మెంట్ అంటే ఇది కాదా అని అడుగుతున్నారాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోవడానికి కూటమిగా ఏర్పడి ప్రయత్నిస్తున్నారునాడు నేడు ద్వారా స్కూల్స్, ఆసుపత్రులు రూపురేఖలు మారుతున్నాయి,ప్రధాని విమర్శలు చూస్తుంటే నాకు ఒకటనిపించింది, మోదీ గారు ఇదే చంద్రబాబు గురించి ఎన్నికల ముందు ఏమన్నారో గుర్తు తెచ్చుకోండి, వెన్నుపోట్లు, అత్యంత అవినీతిపరుడన్న నోటితోనే ఇవాళవారితో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాటమారుస్తున్నారు, రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా*బాబు, దత్తపుత్రుడు, మోదీ గారు కలిసి ఆడుతున్న ఈ డ్రామాలో రాష్ట్ర ప్రజలకు మీ హామీ ఏంటి, ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా, స్టీల్ ప్లాంట్ ప్రేవేట్ పరం చేయమని జట్టు కట్టారా అందరూ ఆలోచించండిమీ జగన్ ఆమోదం లేదు కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రేవేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేసింది, జగన్ ఒప్పుకోలేదు కాబట్టే అది జరగలేదు, ఈ ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా బాబు, దత్తపుత్రుడు బీజేపీ కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్కు ఓటేసి దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపండి 06:50 AM, May 8th, 2024నేడు ఏపీలో మోదీ ప్రచారంనేడు ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంమధ్యాహ్నం ప్రత్యేక విమానం తిరుమలకు మోదీరాజంపేట లోక్సభ పరిధిలో కలికిరిలో ఎన్నికల ప్రచారంసాయంత్రం విజయవాడలో రోడ్ షో 06:40 AM, May 8th, 2024అప్పుడూ ఇప్పుడూ 'అంతే'పేదల పొట్ట కొట్టడమే లక్ష్యంగా వికృతరూపం దాల్చిన బాబు పెత్తందారీ పోకడవారికి లబ్ధి జరిగేది ఏదైనా అడ్డుకోవడమే ఆయన లక్ష్యంఅప్పట్లో ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంగ్లిష్ మీడియం చదువులు అడ్డుకునేందుకు ఎల్లోగ్యాంగ్ చేయని ప్రయత్నంలేదు.. ఇప్పుడు ఎన్నికల కోడ్ను అడ్డంపెట్టుకుని ఎప్పటినుంచో కొనసాగుతున్న డీబీటీలకూ అడ్డంకులుతొలి నుంచీ పేదలకు మేలు జరగకుండా కోర్టులకు వెళ్లి మరీ అడ్డుకున్న బాబు బ్యాచ్తాజాగా కోడ్ పేరుతో విద్యా దీవెన, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, మహిళలకు చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాలను అడ్డుకున్న పచ్చముఠా.. ఐదేళ్లుగా కొనసాగుతున్న పథకాలపైనా కుట్రలుతెలంగాణలో ఇన్పుట్ సబ్సిడీకి ఓకే చెప్పిన ఈసీ.. ఏపీలో మాత్రం నో 06:30 AM, May 8th, 2024మీడియాతో ఏపీ సీఈవో ఎంకే మీనాప్రభుత్వం ఇచ్చే పథకాలనేవీ ఆపమని ఎన్నికల సంఘం చెప్పలేదుకొంత కాలం తర్వాత ఇవ్వమని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందిపోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మరో రోజు గడువు పొడిగింపుకొన్ని చోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగిందిఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని ఇవాళ, రేపు ఓటేసుకోవచ్చుసెక్యూర్టీకి డ్యూటీకి వెళ్లిన వారికి ఈ నెల 9వ తేదీన కూడా అవకాశంఅలాగే సొంత సెగ్మెంట్లల్లోవి ఫెసిలిటేషన్ సెంటర్లల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చువచ్చే నెల మూడో తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగించడం కష్టంఇప్పటికే సుమారు 20 రోజుల సమయం ఇచ్చాంకొన్ని ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుకొందరు ఓటుకు డబ్బులను డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారుఒంగోలులో కొందరు ఉద్యోగులు ఈ ప్రలోభాలకు లోనైనట్టు నిర్థారణకు వచ్చాంకొందరు వచ్చిన మొత్తాన్ని తిప్పి పంపారుదీనిపై విచారణ చేపడుతున్నాంతప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాంపోలింగ్ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన ఓ పోలీస్ కానిస్టేబులును సస్పెండ్ చేశాంలీడర్లకు సెక్యూర్టీగా ఉన్న సిబ్బంది.. రేపటి ప్రధాని బందోబస్తులో ఉన్న వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా వెసులుబాట్లు కల్పిస్తున్నాంపల్నాడులో హోలో గ్రామ్ ద్వారా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుపల్నాడు ఎపిసోడ్ పై విచారణ చేపడుతున్నాం -
మోసం.. వంచన.. అప్పుడూ, ఇప్పుడూ బాబు మేనిఫెస్టో అదే..
2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసిన సీఎం జగన్👉: 58 నెలల్లో నవరత్నాల పథకాల ద్వారా పేదల ఖాతాల్లో నేరుగా రూ.2,66,810 కోట్లు జమ 👉: సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా నాన్ డీబీటీ రూపంలో మరో రూ.95,001 కోట్లు 👉: డీబీటీ, నాన్ డీబీటీ కలిపి రూ.3,61,811 కోట్లు.. ఏటా సగటున రూ.72,362 కోట్లు వ్యయం 👉: సీఎం రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు అండ్ గ్యాంగ్ 👉: టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో అమలుకు ఏటా రూ.1.65 లక్షల కోట్లకుపైగా అవసరం 👉: అంటే.. ఇప్పటి కంటే ఏటా రూ.92,638 కోట్లకుపైగా అదనంగా అవసరం 👉: టీడీపీ మేనిఫెస్టో అమలుకు ఐదేళ్లలో మొత్తంగా రూ.8.25 లక్షల కోట్లకుపైగా అవసరం 👉: డీబీటీ, నాన్ డీబీటీ పథకాలకు వ్యయం చేసిన దాని కంటే అదనంగా రూ.4,63,189 కోట్లు అవసరం 👉: సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తానంటూ చంద్రబాబు ప్రగల్భాలు 👉: పద్నాలుగేళ్ల బాబు పాలనలో ప్రతిఏటా రెవెన్యూ లోటేనని సాక్ష్యాలతో వివరించిన సీఎం జగన్👉: ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ పేరుతో మురళీమోహన్ వంటి బినామీలకే సంపద సృష్టించిన చంద్రబాబు 👉: 2014–19 మధ్య అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా బినామీలకు భూ సంపద సృష్టించిన వైనం 👉: ఇప్పుడు అమరావతి నిర్మాణానికి ఖజానా నుంచి ఖర్చు పెట్టి బినామీలకు సంపద సృష్టించేలా ఎత్తుగడ 👉: 2014 ఎన్నికల తరహాలోనే ఇప్పుడూ ప్రజలను మోసం చేస్తున్నారని మేనిఫెస్టోను ముట్టుకోని బీజేపీ 👉: పథకాల అమలుకు నిధులు ఎలా తెస్తారో వివరణ ఇవ్వాలంటున్న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు 👉: వివరణ ఇవ్వకపోతే తాను మోసం చేస్తున్నట్లు చంద్రబాబు అంగీకరించినట్లేనని స్పష్టీకరణసాక్షి, అమరావతి: ఎన్నికల్లో అలవికాని హామీలు ఇస్తూ అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మోసం చేసిన చరిత్ర ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈసారి విశ్వరూపం ప్రదర్శించారు. జనసేన, బీజేపీలతో జత కట్టినా ఘోర పరాజయం తప్పదనే నిర్ణయానికి వచ్చి ఉనికి చాటుకోవడం కోసం ఆచరణలో అమలుకు వీలుకాని రీతిలో హామీలతో ముంచెత్తుతూ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిన తరహాలోనే ఈసారీ ప్రజలను వంచించడానికి సిద్ధమయ్యారని గ్రహించిన బీజేపీ.. మేనిఫెస్టోను ముట్టుకోవడానికి కూడా ముందుకు రాలేదని టీడీపీ వర్గాలే చర్చించుకుంటుండటం గమనార్హం. 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్ జగన్.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశారు. గత 58 నెలల్లో నవరత్నాలు–సంక్షేమ పథకాల ద్వారా అర్హతే ప్రామాణికంగా.. ఎలాంటి వివక్ష చూపకుండా.. అవినీతికి తావు లేకుండా.. అత్యంత పారదర్శకంగా పేదల ఖాతాల్లో నేరుగా రూ.2,66,810 కోట్లను జమ చేశారు. నాన్ డీబీటీ పథకాల ద్వారా మరో రూ.95,001 కోట్లు వ్యయం చేశారు. డీబీటీ, నాన్ డీబీటీ పథకాల ద్వారా ఇప్పటిదాకా రూ.3,61,811 కోట్లు వ్యయం చేశారు. అంటే ఏడాదికి సగటున రూ.72,362 కోట్లు ఖర్చు చేశారు. సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లోకి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి డబ్బులు జమ చేస్తుంటే.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి శ్రీలంకగా మార్చేస్తున్నారని చంద్రబాబు గగ్గోలు పెడితే.. ఎల్లో మీడియా అదే పల్లవి అందుకుంది.అదనంగా రూ.4,63,189 కోట్లు ఎలా తెస్తావ్ బాబూ? టీడీపీ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్తోపాటు పేర్కొన్న ఇతర హామీల అమలుకు ఏటా రూ.1.65 లక్షల కోట్లకుపైగా అవసరమని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. అంటే.. ప్రస్తుతం సీఎం జగన్ డీబీటీ, నాన్ డీబీటీ పథకాలకు చేస్తున్న వ్యయం కంటే అదనంగా ఏటా రూ.92,638 కోట్లు అవసరం. ఐదేళ్లలో ఆ పథకాల అమలుకు మొత్తంగా రూ.8.25 లక్షల కోట్లు అవసరం. అంటే.. ప్రస్తుతం సీఎం జగన్ డీబీటీ, నాన్ డీబీటీ పథకాలకు ఐదేళ్లలో చేసిన వ్యయం కంటే అదనంగా రూ.4,63,189 కోట్లు కావాలి. ఈ డబ్బులు ఎలా తెస్తావని ప్రశి్నస్తుంటే సంపద సృష్టించి సంక్షేమ పథకాలను అమలు చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారు తప్పించి స్పష్టంగా లెక్క చెప్పలేక తప్పించుకుంటున్నారు. హైటెక్ సిటీలో, అమరావతిలో బినామీలకే సంపద సృష్టి గతంలో సంపద సృష్టించానని, ఇప్పుడూ సంపద సృష్టించి.. దాని ద్వారా వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చంద్రబాబు చెబుతోన్న మాటల్లో వీసమెత్తు నిజం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో 1995–2004 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు.. హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో మురళీమోహన్ వంటి బినామీలు, వందిమాగధులతో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేయించారు. ఆ తర్వాత హైటెక్ సిటీ పేరుతో ప్రభుత్వ ఖజానా నుంచి మౌలిక సదుపాయాలకు ఖర్చు చేసి బినామీలకు సంపద సృష్టించారు. విభజన తర్వాత 2014 ఎన్నికల్లో గెలిచి, అధికారంలోకి వచ్చాక.. విజయవాడ–గుంటూరు ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేసే చోటు గురించి బినామీలు, వందిమాగధులకు ముందుగా లీకులు ఇచ్చి ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారు. వేలాది ఎకరాల భూములు తక్కువ ధరలకే కొల్లగొట్టారు. ఆ భూ సంపదను రెట్టింపు చేయడానికి రాజధానిగా అమరావతిని చేశారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తే.. ప్రభుత్వ ఖజానా నుంచి అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసి.. బినామీలు, వందిమాగధులు కాజేసిన భూ సంపదను మరింతగా పెంచడానికి ఎత్తులు వేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రాన్ని, విభజన తర్వాత రాష్ట్రాన్ని 14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు పాలించా రు. ఆ 14 ఏళ్లు.. ప్రతి ఏటా రెవెన్యూ లోటే. ఎడాపెడా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని రుణాల ఊబిలోకి నెట్టిందీ చంద్రబాబే. 2014 నుంచి 2019 వరకు అప్పుల కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్రేట్ (సీఏజీఆర్) 21.87 శాతం. కానీ.. సీఎం జగన్ హయాంలో 2019 నుంచి 2024 వరకు చూస్తే అది 12.13 శాతం. దీన్ని బట్టి చంద్రబాబే ఎడాపెడా అప్పులు తెచ్చినట్లు స్పష్టమవుతోంది. 👉: అప్పుల మొత్తాన్ని చూసినా... చంద్రబాబు అధికారంలోకి రాక ముందు అంటే 2014 జూన్ 7 నాటికి రాష్ట్రానికి రూ.1,53,346 కోట్ల అప్పు ఉంటే.. 2019 మే 29 నాటికి అది రూ.4,12,288 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం ఆ అప్పులు రూ.7,03,471 కోట్లకు చేరాయి. 👉: సంపద సృష్టించానని చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ.. వాస్తవానికి చంద్రబాబు హయాం (2014–19)లో మూలధన వ్యయం ఏటా సగటున రూ.15,227 కోట్లు ఖర్చు చేస్తే.. సీఎం జగన్ గత ఐదేళ్లు ఏటా సగటున రూ.17,757 కోట్లు ఖర్చు చేశారు. 👉: జీడీపీలో రాష్ట్ర వాటా చంద్రబాబు హయాంలో సగటున 4.47 శాతం ఉంటే.. సీఎం జగన్ హయాంలో అది 4.83 శాతానికి పెరిగింది. కోవిడ్ లాంటి క్లిష్ట సమయాన్ని కలిపినా 4.83 శాతం మన వాటా ఉందంటే ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందన్నది స్పష్టమవుతోంది. 👉: చంద్రబాబు హయాంలో జీఎస్డీపీలో పన్నుల భారం సగటున 6.57 శాతం ఉంటే.. జగన్ హయాంలో అది 6.35 శాతమే. అంటే.. సీఎం జగన్ హయాంలోనే పన్నుల భారం తక్కువ. ఇది ఆర్బీఐ (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా), కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తేల్చిన లెక్క.అప్పుడు అమెరికా అవుతుందా? పేదరిక నిర్మూలనే ధ్యేయంగా.. అవసరమైన మేరకు తక్కువగా అప్పులు చేస్తూ.. ప్రజలపై తక్కువగా పన్నుల భారం మోపుతూ.. ఆరి్థక క్రమశిక్షణ పాటిస్తూ.. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా సీఎం జగన్ పేదల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంటే రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ చంద్రబాబు, ఎల్లో మీడియా గగ్గోలు పెట్టాయి. ఒకవేళ చంద్రబాబు అధికారంలోకి వచ్చి.. టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న పథకాలకు ఐదేళ్లలో రూ.8.25 లక్షల కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్రం అమెరికా అవుతుందా? అని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు.నిధులు ఎలా తెస్తారో చెప్పండిటీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న పథకాల అమలుకు ఏటా రూ.1.65 లక్షల కోట్లు అవసరం. ప్రస్తుతం సీఎం జగన్ డీబీటీ, నాన్ డీబీటీ పథకాలకు చేస్తున్న వ్యయం కంటే రూ.92,638 కోట్లు అదనంగా అవసరం. ఈ లెక్కన ఐదేళ్లలో ఆ పథకాల అమలుకు అదనంగా రూ.4,63,189 కోట్లు అవసరం. ఆ నిధులను ఎలా తెస్తారో చంద్రబాబు స్పష్టం చేయాలని ఆర్థిక నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే.. 2014 ఎన్నికల తరహాలోనే ఇప్పుడూ ప్రజలను మోసం చేస్తున్నానని చంద్రబాబు అంగీకరించినట్లేనని స్పష్టం చేస్తున్నారు. -
పేదలకు మంచి చేస్తుంటే వాళ్లు తట్టుకోలేక పోతున్నారు.. కూటమి గెలిస్తే పథకాలు ఆపేస్తారంట..!
-
చంద్రబాబు, పవన్కు పొలిటికల్ ట్విస్ట్.. బీజేపీ కీలక ప్రకటన!
సాక్షి, హైదరాబాద్: ఏపీలో ఎన్నికల వేళ కూటమిలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. టీడీపీ, జనసేనకు బీజేపీ ఊహించని షాకిచ్చింది. ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై బీజేపీ కట్టుబడి ఉంటుందని.. తెలుగుదేశం, జససేన నిర్ణయాలకు అనుకూలంగా ఉండలేమని బీజేపీ చెప్పకనే చెప్పేసింది.ఇక, ముస్లిం రిజర్వేషన్ల అంశంపై ఇప్పటికే డీప్ ఫేక్ వీడియోల వ్యవహారం సోషల్ మీడియా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ ముస్లిం రిజర్వేషన్లపై ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా కేంద్ర పార్టీ నిర్ణయాన్ని ఏపీ బీజేపీ మరోసారి పునర్ఘటించింది. ఈ క్రమంలో ముస్లిం రిజర్వేషన్ల రద్దుకే కట్టుబడి ఉన్నామని బీజేపీ స్పష్టం చేసింది. దీంతో.. టీడీపీ, జనసేన నిర్ణయాలకు తాము అనుకూలంగా లేమని బీజేపీ చెప్పకనే చెప్పేసింది. Truth: If BJP comes into power, we will make an end of the unconstitutional Muslim reservations. Meanwhile it's the right of SC, ST & OBC people of Telangana. We will ensure them that they get it. Therefore, We will end the Muslim Reservations.Fake Video: If BJP comes to power,… pic.twitter.com/4OxR8LP9Z9— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) April 30, 2024బాబును నమ్మని బీజేపీ ఈ ఎన్నికల్లో మళ్లీ బీజేపీతో పొత్తుకు చంద్రబాబు వెంపర్లాడినప్పటికీ, ఆ పార్టీ జాతీయ నాయకత్వం తొలుత అంగీకరించలేదు. చంద్రబాబు ఢిల్లీలోని తన ఏజెంట్లు, బీజేపీలో ఉన్న తన అనుంగులు, ఇతరత్రా పైరవీలు చేశారు. అయినా బీజేపీ పెద్దలు ఆయన్ని నమ్మలేదు. ఢిల్లీలో రాత్రింబవళ్లు పడిగాపులు గాసి, కాళ్లా వేళ్లా పడి చిట్టచివరకు పొత్తు పెట్టుకోగలిగారు. బీజేపీ పొత్తయితే పెట్టుకొంది కానీ, చంద్రబాబును ఆ పార్టీ పెద్దలు నమ్మడంలేదన్న విషయం ప్రతి సందర్భంలోనూ బయటపడుతోంది. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన గెలుపే అసాధ్యమైతే, మేనిఫెస్టో విషయంలోనూ మరోసారి అభాసుపాలు కాకూడదని బీజేపీ అధిష్ఠానం భావించింది. దీంతో ఈసారి మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి ఓ పరిశీలకుడిని మాత్రమే పంపి మమ అనిపించింది. కనీసం రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి, పార్టీ రాష్ట్ర నాయకులు కూడా హాజరుకాలేదు.అంతేకాదు.. మేనిఫెస్టోలో కనీసం ప్రధాని మోదీ ఫొటోగానీ, కమలం గుర్తు గానీ ముద్రించేందుకు బీజేపీ పెద్దలు అంగీకరించలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్షా, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఫొటోలు ముద్రించేందుకు కూడా ఒప్పుకోలేదు. అయితే, చంద్రబాబు తెలివిగా మేనిఫెస్టో కాపీలపై మోదీ, ఇతర నాయకుల ఫొటోలు లేకుండా, కమలం గుర్తును మాత్రం వేయించారు. బీజేపీ దీనికీ అంగీకరించలేదు. దాన్ని మార్చాల్సిందేనని పరిశీలకుడు సిద్ధార్థనాథ్సింగ్ పట్టుబట్టారు. దీంతో మేనిఫెస్టో ముఖచిత్రంలో అప్పటికప్పుడు మార్పులు చేశారు. -
టచ్ మీ నాట్... దూరం జరగండమ్మా
మొత్తానికి రాష్ట్రంలో టీడీపీ సారధ్యంలో ఏర్పడిన ఎన్డీయే కూటమి మనసులు కలవని బలవంతపు కాపురం అని తేలిపోయింది. తప్పనిసరి తంతు తప్ప అందులో తమకేం పెద్ద పాత్ర లేదని బీజేపీ భావిస్తోంది. అందుకే మీ పాట్లేవో మీరు పడండి... అందులో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి నాయుడుగారు అని స్పష్టంగా చెబుతోంది. వాస్తవానికి టీడీపీ.. జనసేన... బీజేపీల కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోను విడుదల చేసే కార్యక్రమానికి చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.దీనికి జాతీయ బీజేపీ నేత సిద్దార్థ నాథ్ సింగ్ సైతం ఢిల్లీ నుంచి వచ్చారు. అయితే ఆ మ్యానిఫెస్టో కాపీ మీద ఎక్కడా మోడీ ఫోటో లేదు. కేవలం చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా ఆ మ్యానిఫెస్టో కాపీని విడుదల చేసే సమయంలో వరుసగా ఈ ముగ్గురు నాయకులూ నిలబడి ఫోటోలకు.. పత్రికలకు ఫోజులిచ్చారు. అయితే ఆ సందర్భంగా ఆ కాపీని చేత్తో పట్టుకుని బాబు, పవన్ పక్కన నిలబడేందుకు సైతం సింగ్ విముఖత చూపించారు. ఎవరో వచ్చి ఆ కాపీని సింగ్కు ఇస్తుండగా అక్కర్లేదు.. అంటూ నేను దాన్ని తాకను అనేలా సంజ్ఞ చేసారు. ఆ తరువాత అయన మీడియాతో మాట్లాడుతూ ఈ మ్యానిఫెస్టో ఈ ఇద్దరిదే.. మా బీజెపికి ఏమీ సంబంధం లేదని చెప్పేసారు. అంతేకాకుండా రాష్ట్ర బిజెపి నుంచి సైతం ఈ కార్యక్రమానికి ఎవరూ.. ఆఖరుకు అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం హాజరు కాలేదు. దీంతో ఇది జస్ట్ పవన్... జనసేనల పొత్తు అని తేలిపోయింది.అసలేం జరిగింది ?గతంలో 2014 లో సైతం ఇలాగే మూడు పార్టీలు పొత్తులో ఎన్నికలకు వెళ్లాయి. అప్పుడు చంద్రబాబు దాదాపు ఆరువందల హామీలు ఇచ్చి.. ఆ తరువాత మాటతప్పి.. మ్యానిఫెస్టోను పార్టీ వెబ్సైట్ నుంచి మాయం చేసారు. ఇప్పుడు ఆ మ్యానిఫెస్టోను సీఎం వైఎస్ జగన్ బయటకు తీసి.. ఒక్కో హామీని ప్రజలకు గుర్తు చేస్తూ ఈ హామీ ఇచ్చారు. అమలు చేసారా అక్కా.. రుణమాఫీ చేసారా అన్నా.. పెన్షన్ ఇచ్చారా తాతా.. డ్వాక్రా రుణాలు మాఫీ చేసారా చెల్లి.. ఉద్యోగాలు ఇచ్చారా తమ్ముడూ.. చూడండి ఈ హామీలకు అప్పట్లో మోడీ.. పవన్ సైతం గ్యారెంటీలుగా ఉన్నారు. వాళ్ళ ఫోటోలు సైతం ఉన్నాయ్. మళ్ళీ అలాంటి వాళ్లకు ఓట్లెద్దామా అంటూ ఊరూరా ప్రచారం చేయడంతో.. చంద్రబాబు ఇచ్చే అమలుసాధ్యం కానీ హామీలవల్ల మేమెందుకు ప్రజలకు జవాబుదారీ కావాలి...? మేమెందుకు పరువుపోగొట్టుకోవాలని భావించిన బీజేపీ ఈసారి ఆ హామీల విషయంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయద్దు నాయుడుగారు.. మీరు మీరు.. ఏదోలా తగలడండి అనేసింది. అంతేకాకుండా దానిమీద మోదీ ఫోటో సైతం వేసేందుకు కేంద్రం ఒప్పుకోలేదని తెలిసింది. అందుకే ఈసారి మ్యానిఫెస్టో మీద కేవలం.. చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయ్. మరోవైపు బాబు ఇస్తున్న హామీలకు మా కేంద్రానికి, బీజేపీకి ఎలాంటి బాధ్యత లేదని వాళ్ళు తేల్చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్ల విషయంలో కూడా చంద్రబాబు తమను మోసం చేసినట్లు కేంద్రం గుర్తించింది. పీవీఎన్ మాధవ్, జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు వంటివాళ్లకు టిక్కెట్లు ఇవ్వకుండా కేవలం టీడీపీ నాయకులనే బీజెపి నేతలుగా చూపించి టిక్కెట్లు ఇచ్చుకుని అసలైన బీజెపి నేతలను మోసం చేసారని అధిష్టానం గమనించింది. అంటే ఎన్ని చేసినా.. ఎంత చేసినా కుక్కతోక వంకరే అని.. చంద్రబాబులోని మోసపూరిత గుణం మారదని స్పష్టతకు వచ్చిన కేంద్రం.. అసలు ఈ దరిద్రమే మాకువద్దు. మీ చావు మీరు చావండి. మీ ఎన్నికలు.. మ్యానిఫెస్టోలో మాకు ఏమీ సంబంధం లేదని తేల్చేసింది.:::: సిమ్మాదిరప్పన్న -
బయటపడ్డ చంద్రబాబు నిజస్వరూపం
-
టీడీపీకి రెబెల్స్ పోటు.. అయోమయంలో బాబు
-
కూటమిలో కొత్త ట్విస్ట్.. చంద్రబాబుకు షాకిచ్చిన బీజేపీ!
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి రాజకీయం రసవత్తరంగా మారింది. కూటమిలో ఇప్పటికే పలు ట్విస్ట్లు చోటుచేసుకోగా.. తాజాగా బీజేపీ సంచలన ప్రకటన చేసింది. బీజేపీ ప్రకటనతో టీడీపీ అధినేత చంద్రబాబుకు కొత్త టెన్షన్ మొదలైంది. కాగా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గురువారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై దాదాపు గంటకు పైగా చర్చించారు. ఈ క్రమంలోనే ముస్లిం రిజర్వేషన్లపై కూడా వారిద్దరూ చర్చించారు. దీంతో, రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకమని బీజేపీ స్పష్టం చేసింది. ఇక, వీరి సమావేశం అనంతరం విలేకరులు సమావేశంలో పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. తాము ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకమని గోయల్ తేల్చి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలకు మాత్రమే తాము అనుకూలమని గోయల్ స్పష్టం చేశారు. ముస్లింలకు మాత్రం రిజర్వేషన్లు ఇచ్చేదేలేదని ప్రకటన చేశారు.అయితే, బీజేపీ ప్రకటన కారణంగా చంద్రబాబుకు కొత్త టెన్షన్ క్రియేట్ అయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ ప్రకటనతో ఏపీలో కూటమికి ముస్లిం ఓటర్లు దూరమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక, ఏపీలో వైఎస్సార్సీపీ మైనార్టీల విషయంలో సామాజిక న్యాయం పాటిస్తోంది. తాజాగా కూటమి నేతల ప్రకటనతో వైఎస్సార్సీపీ గెలుపునకు మరింత అనుకూలంగా మారే అవకాశం ఉందని వారు విశ్లేషిస్తున్నారు. -
టీడీపీకి ఓటేస్తే.. బీజేపీకి వేసినట్టే
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఉనికే లేని బీజేపీని టీడీపీ నెత్తిన పెట్టుకుని మతతత్వ రాజకీయాలకు ఊపిరిపోస్తోందని, ఏపీలో టీడీపీకి ఓటేస్తే.. బీజేపీకి వేసినట్టేనని ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్మీరా ఆందోళన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ అనైతిక పొత్తుపై స్పందించిన ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఏపీలో టీడీపీ భుజంపై గన్ పెట్టిన బీజేపీ దానిని.. ముస్లిం సమాజంపైకి గురిపెట్టిందన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ చట్టాలతో దేశంలో ముస్లింల ఉనికికే ప్రమాదం తెచ్చిన బీజేపీతో టీడీపీ జత కట్టడం ముస్లి సమాజానికి చేటు తేవడమేనన్నారు. ఉమ్మడి పౌరస్మృతి(యూనిఫామ్ సివిల్ కోడ్) చట్టాన్ని అమలు చేసి ముస్లిం షరీయ చట్టాన్ని కనుమరుగు చేస్తారన్నారు. దీని వల్ల ముస్లిం ఆస్తి పంపకాలు, నిఖా వంటి అనేక కీలక అంశాల్లో ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లింలకు వైఎస్సార్ ఇచి్చన 4 శాతం(బీసీ–ఈ)రిజర్వేషన్ను పూర్తిగా ఎత్తివేస్తామని ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్షా, మరో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రకటించారని, అదే జరిగితే ఏపీలోనూ ముస్లింల పిల్లలకు విద్య, ఉద్యోగాల్లో తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. ముస్లిం సంప్రదాయమైన హిజాబి(బుర్ఖా)ను పూర్తిగా నిషేధిస్తారని చెప్పారు. వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసి ముస్లింల అభ్యున్నతి కోసం ఉన్న వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం చేయడానికి బీజేపీ ప్రధాన అజెండాలో టీడీపీ పాలుపంచుకుంటోందని దుయ్యబట్టారు. బీజేపీ–టీడీపీ కూటమి అధికారంలోకొస్తే ముస్లింలపై దేశ ద్రోహం కేసులు పెరుగుతాయన్నారు. సీఎం జగన్ అన్ని విధాలా ముస్లింలను ఆదరించారని చెప్పారు. ఉపముఖ్యమంత్రి, మండలి డిప్యూటీ చైర్మన్, ముగ్గురికి ప్రభుత్వ సలహాదారులుగా అవకాశం ఇవ్వడంతో పాటు ఎంతోమందికి స్థానిక ప్రభుత్వాల్లో అవకాశం కల్పించారన్నారు. జగన్తోనే ముస్లిం సమాజానికి భద్రత, మేలు ఉంటాయని నాగుల్ మీరా స్పష్టం చేశారు. -
నన్ను చూడొద్దు..ఎన్డీఏను చూడండి
‘గత 58 నెలల మీ బిడ్డ పాలనలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటేనే ఓటు వేసి ఆశీర్వదించండి’. –బస్సు యాత్రలో ప్రజలకు విన్నవిస్తున్న సీఎం వైఎస్ జగన్ ‘నన్ను కాదు.. ఎన్డీఏను చూసి కూటమికి ఓటు వేయండి. కూటమిలో భాగస్వామికాని వైఎస్సార్సీపీకి రెండోసారి అవకాశం ఇవ్వడంలో అర్థం లేదు’. –ప్రజాగళం సభల్లో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నటీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మీ ఇంట్లో మంచి జరిగిందా.. లేదా? మంచి జరిగి ఉంటేనే నాకు ఓటు వేయండి: సీఎం జగన్ ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో గత 58 నెలల పాలనలో సంక్షేమాభివృద్ధి పథకాలు.. సుపరిపాలన వల్ల చేసిన మంచిని వివరిస్తున్నారు. సంస్కరణలతో విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో అగ్రభాగాన నిలపడం గురించి స్పష్టికరిస్తున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో జట్టుకట్టి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చేసిన మోసాలు, అరాచకాలను ఎండగడుతున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో వేరుపడిన చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ వాటితో కలిసి మోసం చేయడానికి వస్తున్నారని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మీ బిడ్డ పాలనలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటేనే ఓటు వేసి ఆశీర్వదించాలని వినమ్రంగా కోరుతున్న సీఎం జగన్కు జనం అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. సాక్షి, అమరావతి: ప్రజాగళం సభల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజలకు చేస్తున్న విజ్ఞప్తిని పరిశీలిస్తే.. రాష్ట్రంలో 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రజలకు చేసిందేమీ లేదని అంగీకరించినట్లు స్పష్టమవుతోంది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో పది శాతం కూడా అమలు చేయకుండా ప్రజలను వంచించారు. ఇటు ప్రజలకు.. అటు రాష్ట్రానికి చేసిన మంచేమీ లేకపోవడంతో తన పరిపాలనను చూసి ఓటు వేయాలని అడిగే నైతికతను చంద్రబాబు కోల్పోయారు. అందుకే తన పరిపాలనను చూసి కాకుండా, ఎన్డీఏకు ఓటు వేయాలని చంద్రబాబు కోరుతుండటం చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. మద్య నిషేధానికి మంగళం పాడి, రూ.2కే కిలో బియ్యాన్ని రూ.5.50కు పెంచేసి అప్పట్లో మోసం చేశారు. మొన్నటికి మొన్న.. విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో జట్టు కట్టిన చంద్రబాబు.. 650కి పైగా హామీలిచ్చి కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నేతృత్వంలో 2014 జూన్ 8న కొలువుదీరిన సర్కార్ మాటలతో మాయ చేస్తూ పాలన సాగించింది. చంద్రబాబు, మోదీ, పవన్ కల్యాణ్ ఫొటోలతో, చంద్రబాబు సంతకం చేసి మరీ ఇంటింటికీ లేఖలు పంపి ఇచ్చిన ప్రధాన హామీల్లో రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేయకుండా వంచించారు. రూ.14,205 కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా అక్క చెల్లెమ్మలను బాబు దగా చేశారు. ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతిగా నెలకు రూ.2 వేలు చొప్పున ఇస్తామని నమ్మబలికి యువతను మోసగించారు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకుండా వంచించారు. బీసీ సబ్ ప్లాన్ కింద ఏడాదికి రూ.పది వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు వ్యయం చేస్తామని చెప్పి, ఆనక మాట తప్పి బలహీన వర్గాలకు వెన్నుపోటు పొడిచారు. అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం, పక్కా ఇళ్లు కట్టిస్తామని చెప్పి ఏ ఒక్కరికీ ఇంటి స్థలం ఇవ్వకుండా వంచించారు. పవర్ లూమ్స్, చేనేత రుణాలు మాఫీ చేయకుండా మోసం చేశారు. అరకొరగా ఇచ్చే సంక్షేమ పథకాల ఫలాలు దక్కాలంటే తమకు లంచాలు ఇవ్వాల్సిందేనంటూ నాడు జన్మభూమి కమిటీలు అరాచకం సృష్టించాయి. వీటన్నింటిని గుర్తించిన జనం.. 2019 ఎన్నికల్లో కేవలం 23 శాసనసభ స్థానాలకే టీడీపీని పరిమితం చేసి చంద్రబాబుకు విశ్వసనీయ లేదని చాటి చెప్పారు. పది నెలల క్రితం రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో సూపర్ సిక్స్ పథకాలంటూ ప్రకటించిన మినీ మేనిఫోస్టును జనం పట్టించుకోకపోవడం ద్వారా చంద్రబాబుకు విశ్వసనీయత లేదని మరోమారు నిరూపించారు. వీటన్నింటి వల్ల ఇప్పుడు తనను చూసి కాకుండా, ఎన్డీఏకు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యరి్థంచడం ద్వారా తనకు విశ్వసనీయత లేదని చంద్రబాబు ఒప్పేసుకున్నట్లయిందని రాజకీయ పరిశీలకులు విశ్లేసిస్తున్నారు. విషయం లేకే బాబు విన్యాసాలు బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని భావించి, గత ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి వేరుపడిన చంద్రబాబు.. ప్రధాని నరేంద్ర మోదీని వ్యక్తిత్వహననం చేస్తూ తిట్ల పురాణం అందుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా అధికారంలోకి రావాలనే నెపంతో పవన్ కళ్యాణ్ను వేరుగా పోటీ చేయించారు. కానీ.. ఇప్పుడు ప్రజా క్షేత్రంలో వైఎస్ జగన్ను ఒంటరిగా ఎదుర్కోవడం అసాధ్యమని గ్రహించి.. ఉనికి చాటుకోవడానికి బీజేపీ, జనసేనతో చంద్రబాబు మళ్లీ జట్టుకట్టారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏకు ఓటు వేయాలని అభ్యర్థిస్తూనే.. కూటమిలో భాగస్వామికాని వైఎస్సార్సీపీని రెండోసారి గెలిపించి చాన్స్ ఇవ్వడంలో అర్థం లేదంటూ విచిత్ర విన్యాసాలకు తెరతీశారు. తాను అధికారంలో ఉన్నప్పుడు కమీషన్ల కక్కుర్తితో పోలవరం నిర్మాణ బాధ్యతల కోసం ప్రత్యేక హోదాను 2016 సెపె్టంబరు 7న కేంద్రానికి తాకట్టు పెట్టారు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరిస్తూ సంతకం చేశారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీతోనే రాష్ట్రానికి ప్రయోజనమంటూ బుకాయించారు. కమీషన్ల కోసం పోలవరంలో చంద్రబాబు విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పోలవరాన్ని కమీషన్ల కోసం ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని మోదీ అప్పట్లో మండిపడటం ఎవరూ మరచిపోలేదు.నాడు కేంద్రానికి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబే.. ఇప్పుడు 22 మంది లోక్సభ సభ్యులు ఉన్న వైఎస్సార్సీపీ ప్రత్యేక హోదాను సాధించలేక పోయిందని ఆరోపించడం రాజకీయ పరిశీలకులను విస్మయానికి గురిచేస్తోంది. విషయం లేకే చంద్రబాబు ఇలాంటి విచిత్ర విన్యాసాలకు తెరతీశారని వ్యంగోక్తులు విసురుతున్నారు. -
April 17th: ఏపీ ఎన్నికల సమాచారం
April 17th AP Elections 2024 News Political Updates.. 09:32 PM, Apr 17th, 2024 కృష్ణాజిల్లా: చంద్రబాబు, పవన్లకు షాక్ మచిలీపట్నం వారాహి విజయభేరి సభలో చంద్రబాబు పవన్లకు షాక్ సభను పట్టించుకోకుండా మద్యం షాపులకు క్యూ కట్టిన జనసేన, టీడీపీ శ్రేణులు మందేసి చిల్ అవుతున్న ఇరుపార్టీల కార్యకర్తలు చంద్రబాబు మాట్లాడుతుండగానే వెళ్లిపోతున్న పసుపు క్యాడర్ 07:24 PM, Apr 17th, 2024 కుటుంబాల్లో చిచ్చు పెట్టడంలో చంద్రబాబు దిట్ట: వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్రెడ్డి చంద్రబాబు నీచమైన ఆలోచనలు చేసే వ్యక్తి కుటుంబాల్లో చిచ్చు పెట్టడంలో చంద్రబాబు దిట్ట షర్మిల, సునీతను చంద్రబాబు ట్రాప్ చేశాడు చంద్రబాబు స్క్రిప్ట్నే వాళ్లు చదువుతున్నారు అవినాష్రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు సిట్ దర్యాప్తును సీబీఐ పరిగణనలోకి తీసుకోలేదు తనకు నచ్చిన వాళ్ల దగ్గరే సీబీఐ వాంగ్మూలం తీసుకుంది రాజశేఖర్ అనే వ్యక్తిని హత్య జరిగే ముందురోజే కాణిపాకం పంపారు చెవ్వులు వినపడని రంగన్నను ఇంటి వద్ద ఉంటారు వివేకా హత్య డ్రామా ప్లే చేసిందే సునీత, రాజశేఖర్రెడ్డి షర్మిల కడపలోనే ఎందుకు పోటీ చేస్తోంది? షర్మిలకు డబ్బులు ఇచ్చేందుకే బాబు టికెట్లు అమ్ముకుంటున్నాడు 06:23 PM, Apr 17th, 2024 మేమంతా సిద్ధం బస్సు యాత్ర రేపటి షెడ్యూల్ మేమంతా సిద్ధం - 17వ రోజు గురువారం (ఏప్రిల్ 18) షెడ్యూల్ సీఎం జగన్ ఉదయం 9 గంటలకు తేతలి రాత్రి బస నుంచి బయలుదేరుతారు. తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవి చౌక్, పేపర్ మిల్ సెంటర్ దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ST రాజపురం రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. 06:19 PM, Apr 17th, 2024 జుగుప్సాకరంగా బాలకృష్ణ వ్యాఖ్యలు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్ బాలకృష్ణ, లోకేష్, ఎల్లో మీడియా కోడ్ ఉల్లంఘనపై ఈసీకి ఫిర్యాదు చేశాం బాలకృష్ణ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయి సీఎం ఇమేజ్ని డామేజ్ చేసేలా బాలకృష్ణ మాట్లాడారు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు ఈసీకి ఫిర్యాదు చేసినా టీడీపీ నేతల తీరు మారలేదు బుద్ది లేకుండా అసభ్యకర పదజాలం వాడుతున్నారు హిందుపురం మొహం చూడని బాలకృష్ణ స్వర్ణాంధ్ర యాత్ర చేయటం సిగ్గుచేటు సీఎస్పై తప్పుడు కథనాలు రాయటం సరికాదు ఎన్నారైలు పేదల ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు ఎన్నారైల తీరును ఖండిస్తున్నాము ఎన్నారైలు రాష్ట్రంపై ప్రేమతో సేవ చేయాలి రాజకీయ ప్రయోజనాలకు సహకరించటం సరికాదు 06:11 PM, Apr 17th, 2024 ప్రశాంత్ కిశోర్ పై బెంగాల్ సీఎం మమతాబెనర్జీ కీలక వ్యాఖ్యలు చంద్రబాబు కోసం ప్రశాంత్ కిశోర్ పని చేస్తున్నారు దీనిపై నాకు స్పష్టమైన సమాచారం ఉంది బాబు, బీజేపీని గెలిపించేందుకు ప్రశాంత్ కిశోర్ పని చేస్తున్నారు ప్రస్తుతం నా కోసం ప్రశాంత్ కిశోర్ పని చేయడం లేదు ప్రశాంత్ కిశోర్ కు ఏవో సమస్యలున్నాయి ఇటీవలే చంద్రబాబును కలిసిన ప్రశాంత్ కిశోర్ బాబును కలిశాక కూటమి గెలుస్తుందంటూ ప్రశాంత్ కిశోర్ ప్రచారం మమతా వ్యాఖ్యలతో స్పష్టమైన చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ బంధం 05:18 PM, Apr 17th, 2024 సీఎం హత్యాయత్నం కేసు విచారణ.. చంద్రబాబుకు ఎందుకీ ఉలిక్కిపాటు? చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రా రెడ్డి మండిపాటు బోండా ఉమాని ఇరికించే ప్రయత్నం జరుగుతుందని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నాడు అసలు బోండా ఉమా ఈ కేసులో ఉన్నాడని మికేలా తెలుసు? అంటే సీఎం జగన్ పై దాడి చేయించింది మిరే అని అంగీకరిస్తున్నారా..? చంద్రబాబుకి ఈ కేసులో విచారణ తన వరకు వస్తుందని భయపడుతున్నాడా? సీఎం జగన్కి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఇలాంటి చర్యలకు చంద్రబాబు దిగజారుతున్నాడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి జనాదరణ లేక ఇలా తెగిస్తున్నారు మూడు పార్టీలకు ఎల్లో మీడియా తోడై తప్పుడు ప్రచారం చేస్తున్నారు రామోజీరావు మార్గదర్శి స్కాం సొమ్ము కాపాడుకునేందుకు చంద్రబాబుకి కొమ్ము కాస్తున్నాడు సీఎం జగన్కి బస్సు యాత్రలో జనం బ్రహ్మరథం పడితే చూసి ఓర్వలేకపోతున్నారు చంద్రబాబు 14 ఏళ్లు ఏం చేశాడో చెప్పుకోలేకపోవడం సిగ్గుచేటు ఎన్నికలకు ముందే టీడీపీ దివాలా తీసేసింది సీఎం జగన్పై దాడి కేసులో అసలు దొంగ చంద్రబాబు అని అర్థమవుతోంది బోండా ఉమని విచారించకుండానే చంద్రబాబు మాట్లాడుతున్నాడు దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు చంద్రబాబు మాట్లాడుతున్నాడు 05:02 PM, Apr 17th, 2024 ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికారు 2015లో ఓటుకు నోటు కేసు జరిగింది 2017లో సుప్రీం కోర్టులో కేసు వేశాను గత ఐదు నెలల్లో చిన్న చిన్న కారణాలతో కేసు వాయిదా కోరారు రేపు కేసు విచారణ జరగబోతుంది అన్ని సాక్షాలు ఉన్నా కేసు విచారణ ఆలస్యం కావడం తప్పుడు సంకేతాలు పంపుతుంది ఏడేళ్లయినా విచారణ జరగకపోతే ఇక సామాన్యులకు న్యాయం అందుతుందా? ఓటు కు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికారు తెలంగాణ ఏసిబి ఈ కేసును సరిగా విచారణ చేయడం లేదు అందుకే సీబిఐ ఈ కేసు దర్యాప్తు చేయాలి ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి ఇవి కాక మరో మూడు కేసులు పెండింగ్లో ఉన్నాయి మత్తయ్య, సెబాస్టియన్ కూడా దీనిపై సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు అలాగే మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ కూడా ఈ కేసును మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని సుప్రీం కోర్టును కోరారు ఈ కేసులో సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది ఇన్ని కేసులున్నా, చంద్రబాబు సిగ్గు లజ్జా లేకుండా బుకయిస్తున్నారు ఏడేళ్లయినా చిన్న కారణాలతో సాగదీస్తున్నారు రెడ్ హ్యాండెడ్గా ఆడియో, వీడియోలో దొరికినా దొరలా తిరుగుతున్నారు నోట్ల కట్టలతో దొరికిన వ్యక్తి తెలంగాణ సీఎం అయ్యారు నోట్లు పంపిన వ్యక్తి సీఎం కావాలని తిరుగుతున్నారు అన్ని సాక్ష్యాలు ఉన్నా కేసు ఆలస్యం అయితోంది ముద్దాయి ఎవరో అందరికీ తెలిసినా దర్జాగా తిరుగుతున్నారు ఇకనైనా న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగేలా సంకేతాలు ఉండాలి ఓటుకి నోటుకు సంబంధించి ఐదు కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి. అయిదు కోట్లకి బేరం కుదుర్చుకుని, యాభై లక్షలు రేవంత్ ఇస్తూ పట్టుబడ్డారు కేసీఆర్ ప్రభుత్వం ఇన్నాళ్లు ఈ కేసులో ఆలస్యం చేసింది ఇప్పుడు మాత్రం కేసు బదిలీ అడుగుతున్నారు రాజకీయ స్వార్థంతో కేసు గురించి పట్టించుకోలేదు 03:57 PM, Apr 17th, 2024 రేపటి నుంచే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం రేపు ఉదయం 9 గంటలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల రేపు నాలుగో విడత లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు ఎన్నికలు రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ, 25 నామినేషన్లకు చివరి తేదీ 26న నామినేషన్ల పరిశీలన, 29న విత్డ్రాకు గడువు, మే 13న పోలింగ్ 02:52 PM, Apr 17th, 2024 అమరావతి : జనసేన అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన పవన్ తొలి బీఫాంను నాదెండ్ల మనోహర్ కు అందజేసిన పవన్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన పవన్ పాలకొండ అభ్యర్థి జయకృష్ణ గైర్హాజరు ఈ ఎన్నికలు అత్యంత కీలకమన్న పవన్ క్షేత్రస్థాయిలో ప్రతిఒక్కరు పర్యటనలు, ప్రచారం చేయాలని విజ్ఞప్తులు బీజేపీ, టీడీపీ నేతలు కలిసి రావడం లేదన్న అభ్యర్థులు ఎలాగైనా కలుపుకుని ముందుకెళ్లాలని సూచన 02:47 PM, Apr 17th, 2024 కుప్పంలో ఈనెల 19న చంద్రబాబు నామినేషన్ చంద్రబాబు తరపున నామినేషన్ వేయనున్న భువనేశ్వరి 19న మ.12.33 గంటలకు చంద్రబాబు తరపున నామినేషన్ 02:45 PM, Apr 17th, 2024 బాలకృష్ణ పై మండిపడ్డ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నా పై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలి నేను మద్యం, ఇసుక వ్యాపారం చేస్తున్నట్టు దమ్ముంటే బాలకృష్ణ నిరూపించాలి బాలకృష్ణ ఇసుకవ్యాపారం చేస్తున్నారని నేనూ ఆరోపిస్తా ప్రజల ఆశీస్సులతో నాలుగోసారి గెలుస్తా: బాలనాగిరెడ్డి 02:40 PM, Apr 17th, 2024 మళ్లీ జగనే ఏపీ నెక్ట్స్ సీఎం : హీరో విశాల్ ప్రజల కోసం పనిచేసే వ్యక్తి జగన్ వేల కిలో మీటర్ల పాదయాత్రతో ప్రజల కష్టాలను దగ్గరగా చూశారు విద్య విషయంలో ఏపీ సూపర్ విద్యార్థులకు మంచి ప్లాట్ఫామ్ ఇస్తున్నారు: హీరో విశాల్ 02:36 PM, Apr 17th, 2024 రాజమండ్రిలో ఎల్లుండి ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వరి నామినేషన్ ఎల్లుండి మధ్యాహ్నం 1:30 గంటలకు నామినేషన్ వేయనున్న పురంధేశ్వరి 02:35 PM, Apr 17th, 2024 సీఎం జగన్ పై దాడి ఘటనలో బోండా ఉమ పాత్ర ఉండొచ్చు కేశినేని నాని విజయవాడ : బోండా ఉమ ఒక రౌడీ షీటర్ విజయవాడలో బోండా ఉమ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు బోండా ఉమ కాళకేయుడు, కీచకుడు: కేశినేని నాని 02:32 PM, Apr 17th, 2024 రేపు మంగళగిరిలో నారా లోకేష్ నామినేషన్ అమరావతి: కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న నారా లోకేష్ రేపు ఉదయం 9 గంటలకు శ్రీసీతారాముల ఆలయం నుంచి ర్యాలీ భారీగా జనసమీకరణ చేయాలని పార్టీ నేతలకు విజ్ఞప్తి మంగళగిరి కాకపోతే చుట్టు పక్కల నుంచి తీసుకురావాలని పార్టీ అధిష్టానం సూచనలు 02:30 PM, Apr 17th, 2024 ఢిల్లీ: రేపు సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తు సీబిఐకి అప్పగించాలని పిటిషన్ పిటిషన్లు దాఖలు చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత విచారణలో వాయిదా కోరిన చంద్రబాబు న్యాయవాది సిద్దార్థ లుత్రా విచారణ జరపనున్న జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి ధర్మాసనం 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన బాబు ఈ వ్యవహారాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తెలంగాణ ఏసీబీ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రలోభ పెట్టిన చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన ఆడియో బయటపెట్టిన ఏసీబీ "మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదేనని నిర్ధారించిన ఫోరెన్సిక్ 01:00 PM, Apr 17th, 2024 అనపర్తి సీటుకు టీడీపీ ఎసరు ? బీజేపీ కోటలో ఉన్న సీటును మార్చేందుకు టీడీపీ ప్రయత్నాలు మాజీ సైనిక ఉద్యోగికి ఇచ్చిన సీటును మార్చవద్దని అధిష్టానానికి ఫిర్యాదులు అనపర్తి సీటును మార్చే ప్రయత్నాలను ఆపాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఫిర్యాదు చేసిన మాజీ సైనిక ఉద్యోగ సంఘాలు ఎక్స్ సర్వీస్ మెన్ ఎమ్మెస్ఆర్కే.రాజు కు ఇచ్చిన సీటును మారిస్తే దేశవ్యాప్తంగా మాజీ సైనిక ఉద్యోగులను అవమానించినట్లు అవుతుందని ఫిర్యాదులు 12:00 PM, Apr 17th, 2024 రాయచోటి లో టీడీపీకి భారీ షాక్. మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ ఇందాదుల్లాతో సహ పలు కీలక నాయకులు మైనారిటీ నాయకుడు హబీబుల్లా ఖాన్ ఆధ్వర్యంలో టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిక. కొత్తగా వైఎస్సార్సీపీలోలో చేరిన నాయకులకు ఖండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంఎల్ఏ రమేష్ కుమార్ రెడ్డిలు. సీఎం జగన్ పాలన నచ్చింది, ఎంతగానో ఆకట్టుకుంది, జగన్ వెంట నడవాలని పార్టీ లో చేరామంటున్న నూతన నేతలు. 11:00 AM, Apr 17th, 2024 రాష్ట్రాన్ని దోచుకున్న ఘనత చంద్రబాబుది: పెద్దిరెడ్డి పుంగనూరు నియోజకవర్గం లో కొనసాగుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం. పులిచర్ల మండలంలో నేడు 12 పంచాయతీల్లో మంత్రి పర్యటన. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపిగా మిథున్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన మంత్రి. పుంగనూరు నియోజకవర్గం లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశాం: పెద్దిరెడ్డి ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంది. గండికోట నుండి నీరు ఇచ్చేందుకు సీఎం వైఎస్ జగన్ మనకు ఇక్కడ మూడు ప్రాజెక్టులు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్లి ఆ ప్రాజెక్టులను అడ్డుకున్నారు. త్వరలో ఆ పనులు పూర్తి చేసి, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందిస్తాం గతంలో ఎన్నడూ లేని విధంగా పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి చేయగలిగాం. మన నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ సాధించే విధంగా మనమంతా కృషి చేయాలి. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఎన్నికల హామీలు అన్ని పూర్తి చేశారు. చంద్రబాబు 2014లో 100 పేజీల మేనిఫెస్టో, 600 హామీలు ఇచ్చారు. అందులో ఏ ఒక్కటి కూడా చంద్రబాబు అమలు చేయలేదు. ఐదేళ్లు తాత్కాలిక రాజధాని నిర్మాణం అని సొంత అజెండాతో చంద్రబాబు పనిచేశారు. కరోనాతో రెండేళ్లు పోయినా హామీలు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ది. నేడు సూపర్ సిక్స్, మీ భవిష్యత్తు కు నా గ్యారంటీ అంటూ మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు సిద్దమయ్యాడు. సంక్షేమ పథకాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అవుందన్న చంద్రబాబు హామీలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎన్నికలు కోసం చంద్రబాబు అమలు చేయడం వీలుకాని హామీలు అన్ని ఇస్తున్నారు. కేవలం పేదరికాన్ని కొలమానంగా తీసుకుని పథకాలు అందించిన గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు వారికి కావాల్సిన వారికి మాత్రమే పథకాలు, లబ్ది అందించేవారు. సిఎం వైఎస్ జగన్ ఆలోచన వలన ప్రతి ఇంటికి నేడు నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పాఠశాల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తున్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా 25 లక్షల వరకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మిథున్ రెడ్డి ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా. వైఎస్ జగన్ లాంటి గొప్ప ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదు. మన కోసం శ్రమించే వైఎస్ జగన్ను మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలి 10:20 AM, Apr 17th, 2024 దేవినేని నెహ్రు పేదల కోసం పనిచేశారు: దేవినేని అవినాష్ దశాబ్దాలుగా దేవినేని నెహ్రూతో సన్నిహితంగా ఉండే నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది నెహ్రూ జీవితాంతం పేద ప్రజల కోసం పని చేశారు ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చి వైఎస్సార్తో కలిసి ప్రజాసేవ చేశారు నెహ్రూ చేసిన మంచిపనులు చిరస్థాయిగా నిలిచిపోయాయి కొండ ప్రాంతాల ప్రజలు నెహ్రును ఎప్పటికీ మరిచిపోయారు నెహ్రూ ఆశయ సాధన కోసం, రాబోయే రోజుల్లో మరింత కష్టపడి పనిచేస్తాం చనిపోయి ఏడేళ్లయినా నెహ్రూ మీద అభిమానం అందరికి అలాగే ఉంది నెహ్రూ అభిమానులకు నెహ్రూ కుటుంబంగా ఎల్లప్పుడు అండగా ఉంటాం 09:40 AM, Apr 17th, 2024 రేపటి నుంచి నామినేషన్ల పర్వం షురూ.. రేపటి నుంచే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభం రేపు నాలుగో విడత లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ షురూ రేపు ఉదయం 9 గంటలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఏపీ , తెలంగాణ సహ పది రాష్ట్రాలలో 96 ఎంపీ సీట్లకు నాలుగో విడత లో ఎన్నికలు ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం మే 13న పోలింగ్ 08:30 AM, Apr 17th, 2024 కూటమిలో ఇంకా కొలిక్కిరాని సీట్ల పంచాయితీ.. కూటమి సీట్లపై ఇప్పటికీ అయోమయంలో చంద్రబాబు రఘురామకృష్ణరాజు కోసం రకరకాల విన్యాసాలు నర్సాపురం ఎంపీ లేదా ఉండి అసెంబ్లీ స్థానాల్లో ఒకటి ఇవ్వాలని ప్రయత్నాలు నర్సాపురం నుంచి బీజేపీని తప్పించడానికి ప్రత్యామ్నాయాలు ఏలూరు ఎంపీ అభ్యర్థిని మారుస్తారనే ప్రచారం దెందులూరు, అనపర్తి, మాడుగల స్థానాలపైనా లీకులు మరికొన్ని స్థానాల్లోనూ మార్పు తథ్యమని హడావుడి నామినేషన్ల పర్వం మొదలవుతున్నా ఇంకా రాని స్పష్టత 07:20 AM, Apr 17th, 2024 రొయ్యకు మీసం.. బాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయ్: సీఎం జగన్ చంద్రబాబుకు పది మంది సేనానులు.. మీ గురి ఎవరిపై?.. భీమవరం మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ప్రజలకు అందుతున్న పథకాలు, వ్యవస్థలపై బాణాలా? నేను ఒక్కడినే కానీ ఒంటరిని కాదు.. నాకు తోడుగా పేదల సైన్యం రాష్ట్రమంతటా కోట్ల హృదయాలు జగన్ను కోరుకుంటున్నాయి రొయ్యకు మీసం.. బాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయ్ బాబుకు – అభివృద్ధికి ఏం సంబంధం? అంతా సెల్ఫ్ డబ్బా.. సింగపూర్ కట్టాడా? మైక్రోసాఫ్ట్ తెచ్చాడా? బుల్లెట్ ట్రైను తెచ్చాడా? కొత్త పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు తెచ్చాడా? జిల్లాకో హైటెక్ సిటీ కనిపించిందా? బాబు రిపోర్ట్ అంతా బోగస్.. మన ప్రోగ్రెస్ రిపోర్ట్ మీరే చూడండి కొంగ జపం ఎందుకని నిలదీస్తే నాపై శాపనార్థాలు.. కోపంతో ఊగిపోతున్నారు దత్తపుత్రుడు కార్లు, భార్యల మాదిరిగా నియోజకవర్గాలనూ మారుస్తున్నాడు నిన్ను మిగతా వాళ్లూ అనుసరిస్తే అక్కచెల్లెమ్మల బతుకులు ఏం కావాలి? 07:00 AM, Apr 17th, 2024 ఏపీలో ఫ్యాను గాలి ప్రచండం.. ఏ ఊళ్లో ఏ నోట విన్నా ఈ మాటే జాతీయ మీడియా, పొలిటికల్ కన్సల్టెన్సీ సర్వేలదీ అదే మాట రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులదీ ఆ మాటే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైఎస్సార్సీపీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ బస్సు యాత్రలో జగన్కు అడుగడుగునా నీరాజనాలు పలుకుతుండటమే తార్కాణం జనసేన, బీజేపీతో జత కలిసిన టీడీపీకి మరోసారి ఘోర పరాభవం ఖాయం సీఎం జగన్పై నమ్మకమే వైఎస్సార్సీపీ చారిత్రక విజయానికి బాట చంద్రబాబు మోసకారి కావడం వల్లే ఘోర ఓటమి బాటలో కూటమి 06:50 AM, Apr 17th, 2024 ఓ భూం.. భూమి స్వాహా! భూ‘దండు’ పాళ్యం బ్యాచ్–3 కర్త, కర్మ, క్రియ చంద్రబాబే.. అమరావతి భూ దోపిడీలో చినబాబూ సూత్రధారే తెరవెనుక పాత్రధారులుగా బాబు అండ్ కో బినామీ పేర్లతో పేదల భూములపై పచ్చదండు దాడి రాజధాని లీక్స్తో రూ.2 లక్షల కోట్ల భూ దురాక్రమణ నారాయణ, లింగమనేని, సుజనా, ప్రత్తిపాటి, ధూళిపాళ్ల దోపిడీ లీలలు.. కొమ్మాలపాటి, కోడెల,పయ్యావుల, మురళీ మోహన్ల భూ దందా 06:45 AM, Apr 17th, 2024 అవినీతిలో మేటి పత్తిపాటి.. సీసీఐలో పత్తి కొనుగోలు పేరిట రూ.650 కోట్లు హాంఫట్ మాజీ మంత్రి ప్రత్తిపాటి అక్రమాల చిట్టా యడవల్లిలో దళితుల భూముల కాజేతకు కుట్ర రేషన్ బియ్యం మాఫియా కింగ్గానూ పేరు తక్కువ ధరకు అగ్రిగోల్డ్ భూముల స్వాదీనం భార్య వెంకాయమ్మ పేరుతో రిజిస్ట్రేషన్ 06:40 AM, Apr 17th, 2024 పవన్ కళ్యాణ్ తడి గుడ్డతో గొంతు కొస్తారని తెలిసిపోయింది: వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ నగరాల సామాజిక వర్గానికి చెందిన ప్రజలంతా నాకు కూటమిలో సీటు వస్తుందని అనుకున్నారు డిల్లీ నుండి ఊడిపడిన సుజనా చౌదరి ఎప్పుడూ వార్డు మెంబర్గా కూడా పోటీ చేయలేదు అవకాశాలు, కేసులను బట్టి సుజనా పార్టీ మారిపోయాడు బ్యాంకులను కొల్లగొట్టిన సుజనా చౌదరి కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిలబడ్డారు సుజానాకు పశ్చిమ సీటు ఇచ్చారు ఇప్పుడు నేను సామాన్యుడైన అసిఫ్ వైపు నిలబడాలా.. సుజనా వంటి కార్పొరేట్ శక్తి వైపు నిలబడాలా? టీడీపీ, జనసేన బ్రోకర్లు నా ఇంటికి వచ్చినపుడు నేను తిరస్కరించాను నగరాల ఆత్మ గౌరవం కోసం నేను సుజనాను వ్యతిరేకించాను సీఎం జగన్ నగరాలకు మేయర్, దుర్గగుడి చైర్మన్, శ్రీశైలం లో 50సెంట్ల భూమి ఇచ్చారు బీసీలకు గుర్తింపు ఇచ్చారు, నగరాల కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అనేక పదవులు, గౌరవం, గుర్తింపు ఇచ్చిన సీఎం జగన్ వైపు ఉండాలా.. రాత్రికిరాత్రి సుజనా ను దింపిన కూటమి వైపు ఉండాలా పవన్ కళ్యాణ్ తడి గుడ్డతో గొంతు కొస్తారని తెలిసిపోయింది టీడీపీలో ఆ సామాజిక వర్గానికి తప్ప ఎవరికీ అవకాశం ఉండదని తెలిసింది వైఎస్సార్సీపీలో చేరిన నాలుగు రోజులకే సీఎం జగన్ నన్ను బస్సు యాత్రలో పలకరించి బస్సులోనికి రమ్మన్నారు అభ్యర్థులతో పాటు నన్ను కూడా బస్సు పైకి ఎక్కించారు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆసిఫ్ని గెలిపించాలి లేని గ్లాసు గుర్తు కోసం జనసేన నాయకులు తాపత్రయ పడుతున్నారు సుజనా లోకల్ కాదు.. నేను లోకల్, ఆసిఫ్ లోకల్ సుజనా పేద ప్రజల మనిషి కాదు.. ప్రైవేట్ జెట్లలో తిరిగే వ్యక్తి 06:40 AM, Apr 17th, 2024 సీఎం జగన్ అంటే ప్రజలకు ఒక నమ్మకం: వంగా గీతా రాజకీయ నాయకులంటే గౌరవం పోయింది..ప్రభుత్వాలంటే నమ్మకం పోయింది. సంక్షేమ పధకాలు రాజకీయ నాయకులు...అధికారుల చట్రంలో ఉండేవి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పేదల కోసం సచివాలయం,వాలంటీర్ వ్యవస్ధను తీసుకువచ్చింది ఒక్క సిఎం జగనే కుల మతాలు..పార్టీలు చూడకుండా శాచురేషన్ పద్దతిలో అర్హులకు సంక్షేమ పధకాలు అందించారు. మళ్ళీ వచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్ సిపిదే పిఠాపురంలో కూడా గెలుపు వైఎస్సార్సీపీదే -
పురందేశ్వరికి కొత్త ట్విస్ట్.. రూట్ మార్చిన జీవీఎల్!
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమిలో కొత్త ట్విస్ట్లు చోటుచేసుకుంటున్నాయి. టికెట్ దక్కని కొందరు నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. తమకు టికెట్ దక్కించుకునేందుకు వీలున్న మార్గాలన్నింటినీ వెతుకుతూ పార్టీలకు షాకిస్తున్నారు. తాజాగా ఆ లిస్ట్లోకి బీజేపీ ఎంపీ, సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు కూడా చేరారు. కాగా, విశాఖ పార్లమెంట్ స్థానం విషయంలో జీవీఎల్ పట్టువిడవటం లేదు. ఎలాగైనా విశాఖ నుంచి పోటీ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే, ఇప్పటికే విశాఖ సీటును టీడీపీ నేత భరత్కు ఇచ్చినప్పటికీ జీవీఎల్ మాత్రం ఇంకా ఆశలు వదులుకోలేదు. ఈ క్రమంలో తనకే టికెట్ దక్కేలా లాబీయింగ్కు దిగారు. తాజాగా, ఉత్తరాది నేతలో జీవీఎల్ మంతనాలు ప్రారంభించారు. అలాగే, ఉత్తరాది వ్యాపారులతో కూడా జీవీఎల్ సమావేశమయ్యారు. జీవీఎల్.. రూట్ మార్చి ఉత్తరాది నేతలతో చర్చించి బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. విశాఖ సీటు తనకే దక్కేలా వ్యూహరచన చేస్తున్నారు. మరోవైపు.. జీవీఎల్కు మద్దతుగా జన జాగరణ సమితి నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలో జీవీఎల్కు మద్దతుగా బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లి జేపీ నడ్డాను కూడా కలవడంతో విషయం మరోసారి చర్చకు వచ్చింది. ఇదిలా ఉండగా.. ప్రచారంలో భాగంగా జీవీఎల్ షాకిలిస్తున్నారు. టీడీపీ నేత భరత్ ప్రచారానికి జీవీఎల్ దూరంగా ఉంటున్నారనే చర్చ నడుస్తోంది. టీడీపీ కార్యక్రమాలకు కూడా జీవీఎల్ వెళ్లడం లేదు. అంతేకాకుండా పురంధేశ్వరి, చంద్రబాబు తీరుపై జీవీఎల్ గుర్రుగా ఉన్నట్టు సమాచారం. -
పొత్తు చిత్తే! బీజేపీ, జనసేన శ్రేణులు టీడీపీ సభలకు దూరం
► చంద్రబాబు కాళ్లబేరం.. బీజేపీ నేతలతో తిట్లు తిని పవన్ కళ్యాణ్లు కుదుర్చుకున్న పొత్తు కింది స్థాయిలో ఎక్కడా పొసగడం లేదు. వైఎస్ జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేక కలిసిన మూడు పార్టీలకు జనంలోనే కాదు ఆయా పార్టీల్లోనూ నిరాదరణే ఎదురవుతోంది. ఆ పార్టీల అగ్ర నేతల హడావుడే తప్ప, కింది స్థాయిలో ఎక్కడా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కలిసి పని చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ► సీట్లు దక్కని నేతలు తమ నియోజకవర్గాల్లో కూటమి తరఫున పని చేసేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు. చంద్రబాబు సభలు పెట్టినా, వారు ఆ ఛాయలక్కూడా వెళ్లడం లేదు. ఆయన విశాఖలో ఎన్నికల ప్రచారం నిర్వహించినా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి దూరంగా ఉన్నారు. తెనాలిలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన సభకు అక్కడి టీడీపీ ఇన్చార్జి, మాజీ మంత్రి ఆలపాటి రాజా డుమ్మా కొట్టారు. ►చంద్రబాబు సభల్లో చాలా చోట్ల బీజేపీ,జనసేన నాయకులను వేదికపైకి రానివ్వడం లేదు. ఆ పార్టీల అభ్యర్థులు ఉన్నచోట మొక్కుబడిగా పిలుస్తున్నా మిగిలిన నియోజకవర్గాల్లో వారిని దరిదాపుల్లోకి సైతం రానీయడం లేదు.టీడీపీ అభ్యర్థులున్న చోట్ల బీజేపీ, జనసేన నాయకులను పట్టించుకోవడంలేదు. ►అనంతపురం జిల్లాలో బాలకృష్ణ చేపట్టిన యాత్రలో జనసేన, బీజేపీ జాడే కనిపించడం లేదు. మరోవైపు చంద్రబాబు ఒక్కడే నిర్వహిస్తున్న సభలతోపాటు పవన్ కళ్యాణ్, పురందేశ్వరి కలిసి నిర్వహిస్తున్న కూటమి సభలు కూడా అట్టర్ఫ్లాప్ అవుతున్నాయి. ఆ సభలకు జనం రావడం గగనమవుతోంది. దీంతో చంద్రబాబు ఒక్కడే వచ్చింనా, కూటమిగా వచ్చింనా ప్రయోజనం మాత్రం శూన్యమేనని ఇట్టే తెలుస్తోంది. ►నాయకులే కలవనప్పుడు ఇక ఆ పారీ్టల మధ్య ఓట్ల బదిలీ ఎలా జరుగుతుందన్నది విశ్లేషకులు ప్రశ్న. సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఓట్ల బదిలీ జరిగే అవకాశాలు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. పేరుకు మాత్రమే ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ.. నేతలు, కార్యకర్తల మధ్య ఏ దశలోనూ పొసగడం లేదు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నా, టీడీపీ పూర్తిగా సహకరించడం లేదు. అక్కడ టీడీపీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ.. క్యాడర్ ఎవరూ జనసేనకు సహకరించకుండా కట్టడి చేసి తానొక్కడే పవన్ కళ్యాణ్ వద్దకు వెళుతూ ఆయన కోసం పని చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. కింది స్థాయిలో టీడీపీ క్యాడర్ కూడా జనసేన పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉంది. తమ సీటును తాడూ బొంగరం లేని పార్టీ ఎగరేసుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీటును అన్యాయంగా జనసేనకు వదిలేసి సిగ్గు లేకుండా తిరుగుతున్నారని ఇటీవల వర్మను ఒక గ్రామంలో టీడీపీ కార్యకర్తలు నిలదీసి వెళ్లగొట్టారు. కోనసీమ జిల్లాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు పి.గన్నవరం, అమలాపురంలో సంయుక్తంగా నిర్వహించిన సభలకు జనం రాలేదు. రావులపాలెంలో నిర్వహించిన సభకు 3 వేల మంది కూడా రాలేదు. కూటమి తొలి సభే తుస్సు: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి 28న జరిగిన కూటమి తొలి సభే తుస్సుమంది. ఆ సభకు 6 లక్షల మంది జనం వస్తారని హంగామా చేసినా, వచ్చింది వేలల్లోనే. కార్యకర్తల కోసం కేటాయించిన గ్యాలరీల్లో సభ ప్రారంభం నుంచి చివరి వరకు సగం పైగా ఖాళీగానే ఉండిపోయాయి. ఈ నెల 5న నరసాపురం, పాలకొల్లులో చంద్రబాబు నిర్వహించిన కూటమి సభలు పేలవంగా జరిగాయి. పాలకొల్లు సభలో చంద్రబాబు జనసేన రాష్ట్ర నేత బన్నీ వాసును ప్రచార రథం ఎక్కనీయక పోవడంతో ఆయన అలిగి వెళ్లిపోయారు. తణుకులో బాబు, పవన్ల నిలదీత ఈ నెల 10వ తేదీన తణుకులో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను జనసేన పార్టీల నేతలు అడ్డుకుని నిలదీశారు. ఆశించిన స్థాయిలో జనం రాకపోగా, నిలదీతతో ఇద్దరు నేతలు ఖంగుతిన్నారు. తనకు ప్రకటించిన సీటును టీడీపీకి వదిలేశారని ఆగ్రహంతో ఉన్న జనసేన ఇన్ఛార్జి ఇన్చార్జి విడివాడ రామచంద్రరావు సభకు గైర్హాజరవ్వగా ఆయన అనుచరులు సభా వేదిక వద్దకు చేరుకుని ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. అక్కడే టీడీపీ, జనసేన కార్యకర్తలు తోపులాటకు దిగారు. గుంటూరు జిల్లా తాడికొండలో చంద్రబాబు నిర్వహిచిన సభలో జనసేన నాయకులను ప్రచార వాహనంపైకి ఎక్కంచి బీజేపీ నేతలను పక్కకు తోసివేశారు. తెనాలిలో పవన్కళ్యాణ్ సభకు అక్కడి టీడీపీ ఇన్ఛార్జి, మాజీ మంత్రి ఆలపాటి రాజా డుమ్మా కొట్టి నాదెండ్ల మనోహర్ కోసం తాను పని చేసేది లేదని చెప్పకనే చెప్పారు. ప్రధాని మోడీ వచ్చింన సభే విఫలం గత నెల 17వ తేదీన చిలకలూరిపేటలో ప్రధాని మోడీ హాజరైన కూటమి సభ విఫలమవడం పొత్తు పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. ఎంత ప్రయత్నించినా జనం అనుకున్న స్థాయిలో రాకపోగా సభను నిర్వహించడంలో టీడీపీ నేతలు విఫలమవడంతో అడుగడుగునా అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో మోడీ.. టీడీపీ నేతలపై అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 6న చంద్రబాబు క్రోసూరు, సత్తెనపల్లిలో చేపట్టిన ప్రజాగళం సభల్లో జనసేన, బీజేపీ నేతలు కనిపించలేదు. సత్తెనపల్లి సభ జనం లేక అట్టర్ఫ్లాప్ అయ్యింది. టీడీపీ తీరుపై జనసేన, బీజేపీ నేతల ఆగ్రహం బాపట్ల జిల్లాలో ఇప్పటి వరకు మూడు ప్రజాగళం సభలు జరగ్గా ఒక్కటీ విజయవంతం కాలేదు. బాపట్ల, వేమూరు, రేపల్లెలో జరిగిన సభలకు జనం కరువయ్యారు. ఆ సభలకు జనసేన, బీజేపీ నేతలు ఒకరిద్దరిని ప్రచార వాహనంపైకి పిలవడమే తప్ప కార్యకర్తలు ఎక్కడా కనిపించ లేదు. టీడీపీ తమకు సభల గురించి చెప్పడం లేదని, అస్సలు తమను పట్టించు కోవడంలేదని జనసేన, బీజేపీ నేతలు వాపోతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో గత నెల 31న జరిగిన చంద్రబాబు సభలో పెట్టిన ఫ్లెక్సీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేరు లేకపోవడంతో ఆ పార్టీ నేతలు గొడవకు దిగారు. అంతటా అదే తీరు ► ఉమ్మడి విశాఖ జిల్లా గాజువాకలో ఈ నెల 14న చంద్రబాబు నిర్వహించిన సభకు బీజేపీ నేతలు హాజరు కాలేదు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్రరెడ్డి సహా జిల్లా నాయకులెవ్వరూ హాజరవకపోడం చర్చనీయాంశమైంది. కూటమి పార్టీల నాయకుల జాడ కూడా కనిపించలేదు. చంద్రబాబు పర్యటనకు పెందుర్తి సీటు దక్కని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి దూరంగా ఉన్నారు. చివర్లో చంద్రబాబు ఆయన్ను పిలిపించుకుని మాట్లాడినా బండారు శాంతించలేదు. ►తూర్పుగోదావరి జిల్లాలో కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో చంద్రబాబు సభలు ఆశించిన స్థాయిలో జరగలేదని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. కొవ్వూరులో జరిగిన సభలో కూటమి నాయకులు కనిపించలేదు. గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో జరిగిన సభకు బీజేపీ, జనసేన నేతలు వెళ్లలేదు. ఈ నెల 10వ తేదీన నిడదవోలులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరైన సభకు జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ను ప్రచార వాహనంపైకి పిలిచి ఆ సీటును త్యాగం చేసిన టీడీపీ నేత బూరుగుపల్లి శేషారావును మాత్రం పట్టించుకోలేదు. దీంతో శేషారావు అనుచరులు గొడవకు దిగారు. ►నెల్లూరు జిల్లా కావలిలో గత నెల 29న చంద్రబాబు.. బీజేపీ, జనసేనలతో కలిసి నిర్వహించిన బహిరంగ సభ జనం లేక వెలవెలబోయింది. జనం లేకపోవడంతో మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన సభ నాలుగు గంటలు ఆలస్యంగా జరిగింది. అప్పటి వరకు చంద్రబాబు బస్సులోనే ఉండిపోయారు. ఈ నెల 29న ఉదయగిరిలో జరిగిన సభకు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు గైర్హాజరాయ్యారు. ►కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గత నెల 31న చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సభకు టీడీపీ అభ్యర్థి జయ నాగేశ్వరరెడ్డి.. బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు ఎవ్వరినీ ఆహ్వనించ లేదు. కర్నూలులోనూ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్.. కూటమి పార్టీలను పట్టించుకోకుండా ఒంటరిగానే ప్రచారం నిర్వహిస్తున్నారు. ►ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూటమి సమావేశాలు తూతూ మంత్రంగా సాగుతున్నాయి. స్వయంగా చంద్రబాబు, బాలకృష్ణ ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నా.. బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎక్కడా కనిపించడం లేదు. గత నెల 28న చంద్రబాబు రాప్తాడులో నిర్వహించిన సభలో బీజేపీ ఊసే లేదు. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం సభలోనూ బీజేపీ వాళ్లు ఎవరూ లేరు. తమకు ఆహ్వనం లేదని స్థానిక జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేసి, సభకు దూరంగా ఉన్నారు. -
బాబు రాసిన పచ్చ స్క్రిప్ట్.. ఫాలో అవుతున్న పురంధేశ్వరి!
నమ్మినోళ్లను నట్టేటముంచడం. అధికారులపై అభాండాలు వేయడం. ఈసీకి ఫిర్యాదులు చేయడం.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వర్క్ స్టైల్ ఇది. ఆమె తీరుతో కమలానికి.. ఇమేజ్ కంటే డ్యామేజే ఎక్కువ అవుతోంది. మరిది చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టునే.. వదిన ఫాలో అవుతున్నారు. గుడ్డిగా అర్ధంపర్థంలేని ఆరోపణలు చేస్తూ పలుచనవుతున్నారు. చిన్నమ్మను ఓడిస్తామంటున్నారు రాజమండ్రివాసులు. ఒకసారి విశాఖ.. మరోసారి బాపట్ల.. ఇప్పుడేమో రాజమండ్రి. ఏ ఒక్కచోటా స్థిరంగా పోటీ చేయకుండా ఎప్పటికప్పుడు నియోజకవర్గాలు మారే నేతల్లో పురందేశ్వరి ముందుంటారు. ఆమెకొక సొంతనియోజకవర్గమే లేదు. స్థిరమైన పార్టీ కూడా లేదు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ఇలా అన్ని పార్టీల్లో చక్కర్లుకొట్టారు. ఇక, పురందేశ్వరి మెడకు రోజుకో వివాదం చుట్టుకుంటోంది. ఆమె వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రచారంలోనూ ఆమె పలుచన అవుతున్నారు. రాజమండ్రిలో అభివృద్ధే జరగలేదంటూ పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై స్థానికులు మండిపడుతున్నారు. పురందేశ్వరిని పొలిటికల్ టూరిస్టుగా అభివర్ణిస్తున్నారు రాజమండ్రి వాసులు. మడ అడవులే లేని రాజమండ్రి పార్లమెంటరీ ప్రాంతంలో జగనన్న కాలనీలు నిర్మించేందుకు అధిక డబ్బు చెల్లించి భూసేకరణ చేశారంటూ ఆరోపిచడం ఆమె అమాయకత్వానికి నిదర్శనమంటున్నారు. ఎన్టీఆర్ బిడ్డగా తనను అందరూ ఆదరిస్తారని, తాను అందరి మనిషినని చెప్పుకుంటున్నారు పురందేశ్వరి. అయితే అన్నగారి బిడ్డ.. టీడీపీలో ఎందుకు లేరో చెప్పాలన్నది ఎన్డీఆర్ అభిమానుల ప్రశ్న. రాజమండ్రి గురించి పురందేశ్వరికి కనీస అవగాహన కూడా లేదన్నారు ఎంపీ మార్గాని భరత్. టీడీపీ పెద్దలిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ టైమ్ పాస్ చేస్తున్నారని సెటైర్లు సంధించారు. ఆమె బీజేపీలో ఉన్నారా? లేక టీడీపీలో ఉన్నారా? అంటూ ప్రశ్నించారు. నిజానికి పురందేశ్వరి తాను ఏపీ బీజేపీ అధ్యక్షురాలినన్న సంగతే మర్చిపోయారు. కేవలం బాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. సొంతపార్టీ లీడర్లపై కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ.. ఏపీ బీజేపీ ప్రయోజనాలను గాలికొదిలేశారు. అంతేకాదు చిన్నమ్మకు మరో రికార్డు కూడా ఉంది. ఆమె పోటీచేసిన ఏ నియోజకవర్గంలోనూ గెలిచినా, ఓడినా అభివృద్ధి మాత్రం అస్సలు పట్టించుకోరు. -
April 10th: ఏపీ ఎన్నికల సమాచారం
April 10th AP Elections 2024 News Political Updates 10:25 AM, April 10th 2024 వైఎస్సార్సీపీలోకి పోతిన మహేష్ వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు జనసేన నేత పోతిన మహేష్, మాజీ ఎమ్మెల్యేలు పాములు రాజేశ్వరి, రమేష్ రెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, పోతిన మహేష్ వైఎస్సార్సీపీలో చేరిక. వీరి ముగ్గురికి పార్టీ జెండా కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. పోతిన మహేష్ ఇటీవలే జనసేన అధినేత పవన్ కల్యాణ్పై తీవ్రమైన ఆరోపణలు 10:10 AM, April 10th 2024 జనసేన, టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి చేరికలు.. పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీలోకి చేరికలు.. నరసాపురం మండలం చామకూరి పాలెం గ్రామంలో ప్రజా ఆశీర్వాద ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు జనసేన, తెలుగుదేశం పార్టీ నుండి సుమారు వందమంది వైఎస్సార్సీపీలో చేరిక పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ చీఫ్ ముదునూరి ప్రసాదరాజు 9:51 AM, April 10th 2024 టీడీపీకి మరో సీటు అమ్మేసిన పవన్ కల్యాణ్ పాలకొండలోనూ టీడీపీ అభ్యర్థే నిమ్మక జయకృష్ణను జనసేన అభ్యర్థిగా ప్రకటించిన పవన్ కల్యాణ్ వారం కిందటే టీడీపీ నుండి జనసేనలో చేరిన జయకృష్ణ జనసేన కోసం పనిచేసిన గిరిజనులను ముంచేసిన పవన్ కల్యాణ్ అవనిగడ్డ, పాలకొండ రెండు సీట్లు టీడీపీ అభ్యర్థులకే ఇచ్చిన పవన్ కల్యాణ్ మొత్తం 21 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన పవన్ కల్యాణ్ చంద్రబాబు పంపిన మనుసులకే సీట్లిచ్చిన పవన్ కల్యాణ్ భీమవరం, అవనిగడ్డ, పాలకొండ, రైల్వే కోడూరు, అనకాపల్లి, పి గన్నవరం, పోలవరం సీట్లు చంద్రబాబు మనుషులకే కేటాయింపు వైసీపీ నుండి వెళ్లినవారికి విశాఖ సౌత్, తిరుపతి, పెందుర్తి, మచిలీపట్నం ఎంపీ సీట్లు కేటాయింపు నాదెండ్ల మనోహర్ ఆశీస్సులు ఉన్నవారికి తాడేపల్లిగూడెం,యలమంచిలి, నెల్లిమర్ల, నిడదవోలు, రాజోలు, నరసాపురం, కాకినాడ రూరల్ సీట్లు కేటాయింపు జనసేన పార్టీ అభ్యర్థుల జాబితాలో బీసీలకు తీరని ద్రోహం చేసిన పవన్ కల్యాణ్ జనసేన ను వరుసగా వీడుతున్న బీసీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ చౌదరి కోసం బీసీ నేతలకు హ్యాండ్ ఇచ్చిన పవన్ కల్యాణ్ జనసేన జెండా మోసిన వారిని నిండా ముంచేసిన పవన్ కల్యాణ్ పక్క పార్టీ నేతల ప్యాకేజీ ముందు అభాసుపాలైన జనసేన విధేయత 9:31 AM, April 10th 2024 మహిళా కానిస్టేబుల్పై టీడీపీ నేత దాడి.. కేసు బుచ్చెయ్యపేట మండలంలోని మంగళాపురంలో విధి నిర్వహణలో ఉన్న సచివాలయ మహిళా పోలీస్ కానిస్టేబుల్పై దాడిచేసిన టీడీపీ నాయకురాలు మాజీ ఎంపీటీసీ సభ్యురాలు అల్లంకి ఉమాదేవిపై బుచ్చెయ్యపేట పోలీసులు కేసు నమోదు ఈ నెల 6న పింఛన్ నగదు తీసుకునేందుకు సచివాలయానికి వెళ్లిన టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యురాలు ఉమాదేవి పింఛన్ నగదు తన వద్దకు వచ్చి ఇవ్వాలని మహిళా పోలీస్ జంపా మహాలక్ష్మితో గొడవ విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీస్పై పరుష పదజాలంతో తిడుతూ, ఆమె మెడపై గోర్లతో గాట్లు పెట్టి మెడలో ఉన్న చైన్ను లాగి తెంచేసిన వైనం అక్కడే విధి నిర్వహణలో ఉన్న తోటి సచివాలయ సిబ్బంది వీడియో తీస్తుండగా ఫోన్ లాక్కుని నేలకేసి కొట్టి, తమ ఊరిలో ఎలా ఉద్యోగం చేస్తారో? చూస్తానంటూ బెదిరింపులు ఉమాదేవిపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత మహిళా పోలీస్ మహాలక్ష్మి బుచ్చెయ్యపేట పోలీస్లకు ఫిర్యాదు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు బుచ్చెయ్యపేట పోలీసులు వెల్లడి 9:20 AM, April 10th 2024 షర్మిలకు షాకిచ్చిన సామాన్యుడు. సీఎం జగన్కు ఎందుకు ఓటెయ్యాలో చెప్పిన సామాన్యుడు. షర్మిల, కాంగ్రెస్కు ట్విస్ట్ ఇచ్చిన వ్యక్తి. ప్రతిపక్షాలు కుట్రలు చేసినా సీఎంగా మళ్లీ జగనే ఉండాలని ఆకాంక్షించాడు. జనం గుండెల్లో గుడి కొట్టుకోవడం ఇదే.. వైఎస్ జగన్ గారికి, వైఎస్సార్ సీపీకి ప్రజలు మళ్లీ ఎందుకు ఓటేయాలో వారే చెబుతున్నారు వినండి.. ఈ యువకుడే కాదు.. రాష్ట్రంలోని ఎవరినీ అడిగినా ఇలాగే చెప్తారు.. ప్రతిపక్షాల కుట్రలు ప్రజల దగ్గర సాగవు. pic.twitter.com/r1poaJ0ZnH — Vijayasai Reddy V (@VSReddy_MP) April 9, 2024 9:00 AM, April 10th 2024 కూటమి కార్యకర్తల తన్నులాట.. రాజమండ్రిలో పురంధేశ్వరి సమక్షంలో ఆత్మీయ సమావేశం ప్రేమ, అనురాగం, ఆప్యాయతలతో తన్నుకుని బ్యానర్లు చించివేత తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతల మధ్య బాహాబాహీ. రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ప్రేమ, అనురాగం, ఆప్యాయతలతో తన్నుకుని బ్యానర్లు చించుకున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు. తిలకించండి. pic.twitter.com/v79dbCahn9 — Vijayasai Reddy V (@VSReddy_MP) April 9, 2024 8:45 AM, April 10th 2024 సీఎం రమేష్, అయ్యన్నకు ఈసీ నోటీసులు.. సీఎం రమేష్, అయ్యన్నపాత్రుడికి ఎన్నికల కమిషన్ నోటీసులు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఇద్దరు నేతలు సంజాయిషీ ఇవ్వాలని కోరిన రిటర్నింగ్ అధికారి. ఈనెల ఆరో తేదీన నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో చీర, రూ.2 వేలు పంచిన సీఎం రమేష్, అయ్యన్నపాత్రుడు. డబ్బులు పంపిణీ చేస్తున్న సమయంలో ప్రశ్నించిన ఫ్లైయింగ్ స్క్వాడ్పై చిందులేసిన సీఎం రమేష్. అదే సందర్భంలో చీఫ్ సెక్రటరీపై అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై సంజాయిషీ కోరిన రిటర్నింగ్ అధికారి జైరాం. 8:15 AM, April 10th 2024 మేమంతా సిద్ధం డే 12.. షెడ్యూల్ ఇలా.. ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం దగ్గర నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్ర. సాయంత్రం 4 గంటలకు అయ్యప్ప నగర్, పిడుగురాళ్ల దగ్గర బహిరంగ సభ ధూళిపాళ్ల వద్ద రాత్రి బస చేయనున్న సీఎం జగన్ Memantha Siddham Yatra, Day -12. ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం దగ్గర నుంచి ప్రారంభం సాయంత్రం 4 గంటలకు అయ్యప్ప నగర్, పిడుగురాళ్ల దగ్గర బహిరంగ సభ ధూళిపాళ్ల వద్ద రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/YjhvEpKLEX — YSR Congress Party (@YSRCParty) April 10, 2024 7:45 AM, April 10th 2024 పాలకొండ అభ్యర్థిని ప్రకటించిన పవన్.. పాలకొండ జనసేన అభ్యర్ధిగా నిమ్మక జయకృష్ణ ఇటీవల టీడీపీ నుంచి జనసేనలో చేరిన నిమ్మక జయకృష్ణ జనసేన నుంచి విశాఖ సౌత్ అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్ 7:15 AM, April 10th 2024 పురందేశ్వరికి షాకిచ్చిన టీడీపీ నేతలు రాజమహేంద్రవరంలో పురందేశ్వరికి నిరసన సెగ మిత్రపక్షాల సమన్వయ కమిటీ సమావేశంలో టీడీపీ నేతల ఆందోళన ఫ్లెక్సీలో టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరి ఫొటో లేదని ఆగ్రహం ఫ్లెక్సీ చించి రోడ్డుపై బైఠాయింపు.. స్తంభించిన ట్రాఫిక్ పురందేశ్వరి మౌనంపై బీజేపీ నేతల ఆగ్రహం ∙ ఇప్పటికే సోము వీర్రాజు వర్గం దూరం నూజివీడులో టీడీపీ అభ్యర్థి పార్థసారథికి గుబులు రెబల్ అభ్యర్థి ముద్దరబోయినకు జై కొట్టిన తెలుగుదేశం శ్రేణులు ఉండి ఎమ్మెల్యే రామరాజు కంటతడి సీటు వదులుకునేందుకు సిద్ధంగా లేనని స్పష్టీకరణ 7:00 AM, April 10th 2024 పవన్కు షాకిస్తున్న జనసైనికులు.. చంద్రబాబు చట్రంలో చిక్కుకున్న జనసేన అధినేత పవన్ పార్టీకి భవిష్యత్తు లేకుండా చేస్తున్న చంద్రబాబు గెలవని స్థానాలు జనసేనకు కట్టబెట్టిన టీడీపీ అధినేత.. ఇచ్చిన స్థానాల్లోనూ తన మనుషులే ఉండేలా కుట్రలు అన్నింటికీ తల ఊపుతున్న పవన్ పవన్పై అసంతృప్తితో జనసేన నేతలు, అభిమానులు పార్టీకి భవిష్యత్తు లేదని నిర్ధారణ.. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేతలు పార్టీకి పట్టున్న ఉభయ గోదావరి జిల్లాల్లోనే పలువురు బయటకు వీరిలో అనేక మంది గత ఎన్నికల్లో పోటీ చేసి, గట్టి పోటీ ఇచ్చిన వారే 6:45 AM, April 10th 2024 బీసీ నేతలకు పవన్ కల్యాణ్ వెన్నుపోటు జనసేనలో బీసీ నేతలకు నో టిక్కెట్ అర్థబలం ఉన్న నేతల కోసం బలహీన వర్గాల నేతలకు పవన్ హ్యాండ్ పవన్ మోసం చేయడంతో పార్టీని వీడుతున్న బీసీ నేతలు క్రిష్ణా జిల్లాలో ఒకేరోజు ఇద్దరు బీసీ నేతలు జనసేనకి గుడ్ బాయ్ విజయవాడ పశ్చిమ ఇన్ ఛార్జ్ పోతిన మహేష్ రాజీనామా కైకలూరు జనసేన ఇన్ ఛార్జ్ బీవీ రావు రాజీనామా నగరాలు, యాదవ సామాజికవర్గాల నేతలు కావడంతో సీటివ్వని పవన్ కల్యాణ్ సుజనా చౌదరి కోసం నగరాల నేత పోతిన మహేష్ కి హ్యాండ్ ఇచ్చిన పవన్ కామినేని శ్రీనివాస్ చౌదరి కోసం యాదవ నేత బీవీరావుకి హ్యాండ్ ఇచ్చిన పవన్ మరోవైపు గోదావరి జిల్లాల్లోనూ వరుసగా బీసీ నేతలు రాజీనామా ఇప్పటికే శెట్టిబలిజ నేతలు పితాని బాలక్రిష్ణ, మాజీ మేయర్ సరోజ లు రాజీనామా ఉభయగోదావరి జిల్లాల్లో ఒక్క శెట్టిబలిజ, గౌడ వర్గ నేతలకు సీటివ్వని జనసేన గుంటూరులో నాదెండ్ల మనోహర్ కోసం బీసీ నేతలకు హ్యాండ్ ఇచ్చిన పవన్ 6:30 AM, April 10th 2024 చంద్రబాబు, రఘురామరాజుకి బీజేపీ ఝలక్ సీట్ల మార్పునకు అంగీకరించని బీజేపీ బీజేపీ ప్రకటించిన జాబితాలో మార్పులకు ససేమిరా నర్సాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ కే మద్దతు అధికారికంగా ప్రకటించిన బిజెపి ఏపీ ఇన్ ఛార్జ్ సిద్దార్థనాథ్ సింగ్ నర్సాపురం, ఏలూరు ఎంపీ సీట్లు మార్చాలని చంద్రబాబు ప్రతిపాదన చంద్రబాబు ప్రతిపాదనకు ససేమిరా అన్న బిజెపి రఘురామకృష్ణం రాజుకి నర్సాపురం సీటుపై ఆశలు గల్లంతు మోదీ నియమించిన శ్రీనివాస వర్మను మార్చేది లేదన్న సిద్ధార్థనాథ్ సింగ్ ఎమ్మెల్యే సీట్ల మార్పుపైనా క్లారిటీ ఇవ్వని బిజెపి అనపర్తి, జమ్మలమడుగు, తంబళ్లపల్లి సీట్ల మార్పు ప్రతిపాదనపై సందిగ్ధత -
కూటమిలో క్రోధాగ్ని నిరసనల భగభగలు
సాక్షి, రాజమహేంద్రవరం/నూజివీడు/కాళ్ల: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో కుమ్ములాటల పర్వం కొనసాగుతోంది. తెలుగు సంవత్సరాది వేళా నిరసనల సెగ చల్లారలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి స్వపక్ష శ్రేణుల్లోనే విభేదాల అగ్గి రాజేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలోని ద్వారకామాయి ఫంక్షన్ హాలులో సోమవారం రాత్రి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సమన్వయ సమావేశం రసాభాసగా మారింది. రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన తరువాత తొలిసారి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పురందేశ్వరి పాల్గొన్నారు. సభా వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, పురందేశ్వరి, కూటమి రాజానగరం నియోజకవర్గ అభ్యర్థి, జనసేన నేత బత్తుల బలరామకృష్ణ ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీనిలో టీడీపీ రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి ఫొటో లేకపోవడంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ కోసం సీటు త్యాగం చేసిన నేత ఫొటో ఎందుకు పెట్టలేదని పురందేశ్వరిని నిలదీస్తూ ఆ ఫ్లెక్సీని చించి పారేశారు. ఫ్లెక్సీలో ఉన్న మోదీ ఫొటోనూ చించివేస్తున్నా వారిని వారించేందుకు పురందేశ్వరి కనీసం యత్నించకపోగా, చిరునవ్వులు చిందిస్తూ అలాగే వేదికపై కూర్చోవడం విమర్శలకు దారి తీసింది. ఆమె తీరుపై బీజేపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ శ్రేణుల నిరసనల నేపథ్యంలో ఫంక్షన్ హాలు నుంచి ఆమె మెల్లగా జారుకున్నారు. సాధారణంగా పార్టీ అగ్రనేతల ఫొటోలు, ఫ్లెక్సీలను ఎవరైనా చించితే నాయకులు, కార్యకర్తలు సహించలేరు. కానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వైఖరి ఇందుకు భిన్నంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ► పశ్చిమగోదావరి జిల్లా ఉండి సీటు మార్చే యోచనలో టీడీపీ అధిష్టానం ఉండటంతో ఎమ్మెల్యే మంతెన రామరాజు భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. కాళ్ల మండలం పెదఅమిరం నిర్మలాదేవి ఫంక్షన్ హాలులో మంగళవారం నిర్వహించిన టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. సమావేశంలో టీడీపీ నాయకులు స్పందిస్తూ.. ఉండి అభ్యర్థిని మారిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజీనామాలకూ వెనుకాడబోమని స్పష్టం చేశారు. సమావేశానికి పార్టీ పరిశీలకుడిగా వచ్చిన ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు సమక్షంలోనే వారు ఈ విషయాన్ని తేల్చిచెప్పడం గమనార్హం. ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ.. తన సీటును వదులుకోవడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. ఏ తప్పూ చేయకుండా త్యాగానికి సిద్ధం కావాలనడం న్యాయం కాదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్నీ విధిగా చేయడం తన తప్పా అని ప్రశ్నించారు. కార్యకర్తల నిర్ణయమే తనకు శిరో«దార్యమని, వేరే వ్యక్తికి సీటు కేటాయిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పార్టీ నేతల అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళతానని గన్ని వీరాంజనేయులు చెప్పారు. తొలి నుంచీ పురందేశ్వరికి చుక్కెదురు వాస్తవానికి ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన పురందేశ్వరికి మొదటి నుంచీ ఇక్కడ చుక్కెదురవుతూనే ఉంది. రాజమహేంద్రవరం వచ్చిన వెంటనే ఆమె స్థానిక బీజేపీ నాయకులను కలుపుకొని వెళ్లాల్సింది పోయి.. వేరుకుంపటి పెట్టారు. పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును పూర్తిగా పక్కన పెట్టారు. ఈ పరిణామం సోము వర్గంతోపాటు పార్టీ శ్రేణులను దూరం చేసింది. దీంతో సభలు, సమావేశాల్లో ఆమెకు నిరసనల సెగ ఎదురవుతూనే ఉంది. అనపర్తి ఎమ్మెల్యే టికెట్ను తొలుత టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కేటాయించి.. పొత్తు అనంతరం బీజేపీకి ఇవ్వడంపైనా టీడీపీ వర్గాల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. అక్కడ ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి, స్థానిక బీజేపీ నాయకులను వ్యతిరేకిస్తూ రామకృష్ణారెడ్డి స్వతంత్రంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినా పురందేశ్వరి పెదవి విప్పకపోవడంపై ఆమె టీడీపీకి లాభం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఫ్లెక్సీలో ప్రధాని మోదీ ఫొటో చించుతున్నా స్పందించకపోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోందని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. -
కూటమిని వీడని గందరగోళం
సాక్షి, అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమైతే కట్టాయి కానీ, ఆ మూడూ ఒక్కటిగా లేవు. పట్టుమని పది సీట్లు గెలుస్తామన్న నమ్మకం వాటికే లేదు. ఒంటరిగా పోటీ చేసే బలం ఒక్క పారీ్టకీ లేదు. అసలు ప్రజలకి ఆ పార్టీలపై నమ్మకమే లేదు. అయినా లేని బలాన్ని ఊహించుకుని ఎంత హడావుడి చేస్తున్నా ఆ కూటమిలో ఉన్న డొల్లతనం ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంది. నానా ప్రయాసలు పడి సీట్ల సర్దుబాటు చేసుకున్నా, అతి కష్టం మీద 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా మూడు పార్టీల్లో గందరగోళం కొనసాగుతూనే ఉంది. తమదే సీటు అని అభ్యర్థులు ధైర్యంగా ముందుకెళ్లే పరిస్థితి ఒక్క చోటా లేదు. అందుకు తగ్గట్టుగానే జాబితాలు ప్రకటించాక పలు స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. ఇంకా మారుస్తున్నా్నరు. సుమారు 50 నియోజకవర్గాల్లో తిరుగుబాట్లు, అసంతృప్తుల ఆందోళనలతో ఏ రోజున ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. సీట్లు ఖరారైనా అదే తుది నిర్ణయం కాదని టీడీపీ అధినేత చంద్రబాబే చెప్పారు. మరికొన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో అభ్యర్థులను మార్చడానికి చంద్రబాబు కసరత్తు కూడా చేస్తున్నారు. 20కి పైగా ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చడానికి చంద్రబాబు చర్చలు జరుపుతుండడంతోపాటు ఆ నియోజకవర్గాల్లోని నేతలకు సంకేతాలు కూడా ఇచ్చారు. కీలకమైన రెండు, మూడు ఎంపీ స్థానాలపైనా తర్జనభర్జన పడుతున్నారు. బీజేపీ, జనసేన సీట్లు కూడా ఒకటి, రెండు మారే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో కూటమిలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చాలామంది అభ్యర్థులు అసలు ప్రచారం చేసుకోవాలా వద్దా అన్న మీమాంసలో పడిపోయారు. నర్సాపురం ఎంపీ సీటుపై ఊహాగానాలు ప్రధానంగా నర్సాపురం ఎంపీ స్థానంపై వస్తున్న రకరకాల ఊహాగానాలు కూటమిలో అయోమయాన్ని సృష్టించాయి. ఈ సీటును బీజేపీకి కేటాయించి, శ్రీనివాసవర్మను అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఇక్కడి నుంచి పోటీ చేయడానికి విశ్వప్రయత్నాలు చేసి విఫలమైన రఘురామకృష్ణరాజు ఇప్పటికీ ఆ సీటు తనదేని అంటున్నారు. బీజేపీ శ్రీనివాసవర్మను మార్చి రఘురామకు ఆ సీటు ఇస్తుందని కొద్దిరోజులు ప్రచారం జరిగింది. అయితే, రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరడంతో అది జరిగే పని కాదని తేలిపోయింది. బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్సింగ్ నర్సాపురంలో తమ అభ్యర్థిని మార్చే అవకాశమే లేదని సోమవారం తేల్చి చెప్పేశారు. అయినా దీనిపై టీడీపీ నాయకులు ఇంకా రగడ సృష్టిస్తూనే ఉన్నారు. నర్సాపురం లోక్సభ స్థానాన్ని బీజేపీ నుంచి వెనక్కి తీసుకొని, ఏలూరు లోక్సభ స్థానం కేటాయిస్తారని, అప్పుడు రఘురామకృష్ణరాజు నర్సాపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఏలూరు బీజేపీ సీటు ఆశించిన తపన ఫౌండేషన్కు చెందిన గారపాటి చౌదరి అక్కడ ప్రచారం చేసుకుంటున్నారు. ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్పై స్థానికంగా వస్తున్న వ్యతిరేకతతో ఆయన్ని మారుస్తారనే ప్రచారమూ దీనికి తోడైంది. మరోవైపు రఘురామకృష్ణరాజుకు ఉండి అసెంబ్లీ సీటు ఇవ్వకూడదంటూ అక్కడ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఆయనకిస్తే తిరుగుబాటు చేస్తామని కూడా హెచ్చరించాయి. దీంతో నర్సాపురం, ఏలూరు లోక్సభ స్థానాల్లో కూటమి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పాతపట్నం, శ్రీకాకుళంలో మార్పు తప్పదా? పాతపట్నం, శ్రీకాకుళం సీట్లలో కూడా మార్పు తథ్యమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ రెండు స్థానాలకు అభ్యర్థులుగా ప్రకటించిన మామిడి గోవిందరావు, గొండు శంకర్పై కేడర్ నుంచి వ్యతిరేకత రావడంతో చంద్రబాబు మనసు మార్చుకున్నానని తెలుస్తోంది. పాతపట్నం సీటును మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణకి ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. శ్రీకాకుళం సీటుకు గుండా లక్ష్మీదేవి పేరును పరిశీలిస్తున్నారు. దీంతో ఇప్పటికే టికెట్లు వచ్చాయని అన్ని ఏర్పాట్లతో ప్రచారం చేసుకుంటున్న నేతలు ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటున్నారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి సీటుపైనా ప్రతిష్టంభన కొనసాగుతోంది. పొత్తులో బీజేపీకి వెళ్లిన ఈ సీటును తిరిగి టీడీపీకి ఇస్తారనే సమాచారంతో బీజేపీ స్థానిక నేతల్లో అయోమయం ఏర్పడింది. జనసేనకు కేటాయించిన యలమంచిలి, నర్సాపురం స్థానాల్లోనూ అభ్యర్థులు మారతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరికొన్ని స్థానాలపైనా జరుగుతున్న రకరకాల ప్రచారాలు మరింత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. -
బీజేపీకి పురందేశ్వరి వెన్నుపోటు!
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో మిత్రపక్షమైన బీజేపీపట్ల తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న తీరు.. ఇందుకు తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వ్యవహారశైలితో కమలనాథులు తీవ్రంగా రగిలిపోతున్నారు. చంద్రబాబు తమ పార్టీని ఇష్టానుసారం ఆడిస్తున్నా ఆమె ఏమాత్రం పట్టించుకోకుండా లోలోపల టీడీపీకి వత్తాసు పలికేలా ప్రేక్షకపాత్ర వహిస్తూ బీజేపీకి వెన్నుపోటు పొడిచేలా వ్యవహరిస్తున్నారని వారు మండిపడుతున్నారు. 2014లోనూ టీడీపీ అధినేత పొత్తు ధర్మాన్ని విస్మరించి తమ పార్టీ పోటీచేసిన పలు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను నిలబెట్టి దొంగదెబ్బ తీశారని వారు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు తన వదినతో కలిసి ఇలాంటి డ్రామానే ఆడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందుకు బలం చేకూర్చేలా వారు అనపర్తి నియోజకవర్గాన్ని ఉదహరిస్తున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఆ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించినప్పటికీ అక్కడ బీజేపీ, టీడీపీ అభ్యర్థులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించుకుంటున్నారు. పొత్తులో బీజేపీకి కేటాయించిన ఆ స్థానంలో చంద్రబాబు రాజకీయ డ్రామాలు అడుతుంటే, ఆ నియోజకవర్గం ఉన్న రాజమండ్రి లోకసభ స్థానం నుంచి బీజేపీ తరఫున పురందేశ్వరి పోటీచేస్తూ కూడా అక్కడి పరిణామాలపై కిమ్మనకుండా ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఇది బీజేపీని వెన్నుపోటు పొడవడమేనని వారు స్పష్టంచేస్తున్నారు. పురందేశ్వరి ప్రేక్షకపాత్ర.. ఇక ఈ సీట్ల విషయంలో చంద్రబాబు ఆడుతున్న డ్రామాలను బీజేపీ రాష్ట్ర పార్టీ అ«ధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి ఏమాత్రం పట్టించుకోవడంలేదని కమలనాథుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. నిజానికి.. పురందేశ్వరి రాజమండ్రి లోక్సభ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. అనపర్తిలో బీజేపీ అభ్యర్థి కన్నా చంద్రబాబు తొలుత ప్రకటించిన టీడీపీ అభ్యర్ధి పోటీలో ఉంటే పురందేశ్వరికి అక్కడ ఎక్కువ ఓట్లు పడతాయని చెప్పి టీడీపీ నాయకత్వం ఆమెను ఒప్పించిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో బీజేపీకి, పారీ్టనే నమ్ముకున్న నాయకులకు టీడీపీవల్ల అన్యాయం జరుగుతున్నా ఆమె మౌనంగా ఉంటున్నారని వారంటున్నారు. అవసరమైతే, బీజేపీ ఆ స్థానాన్ని వదులుకునేందుకు కూడా పురందేశ్వరి సిద్ధంగా ఉన్నట్లు ఆ పారీ్టలో ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. అప్పట్లో మోదీపై బాబు విమర్శలను ఖండించడంవల్లే.. వాస్తవానికి.. 2019 ఎన్నికలకు ముందు బీజేపీని, ప్రధాని మోదీని చంద్రబాబు టార్గెట్ చేసి వ్యక్తిగత విమర్శలు చేశారు. వీటిని అప్పట్లో ప్రస్తుత అనపర్తి బీజేపీ అభ్యర్థి ఎం. శివరామకృష్ణంరాజు ఖండించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడీయన అభ్యర్థిగా కొనసాగితే టీడీపీ ఓట్లు బదలాయించడం కష్టమని కొత్త ప్రచారం మొదలుపెట్టినట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అప్పట్లో మోదీపై చంద్రబాబు చేసిన విమర్శలను వదిలేసి వాటిని ఖండించినందుకు శివరామకృష్ణంరాజును బలిపశువును చేయాలని టీడీపీ ప్రయతి్నస్తోందని.. కానీ, పురందేశ్వరి టీడీపీ కుట్రను ఏమాత్రం అడ్డుకోకపోవడం ద్వారా బీజేపీకి వెన్నుపోటు పొడవడాన్ని కమలం శ్రేణులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. 2014లో మాదిరిగానే ఇప్పుడూ వెన్నుపోటు మరోవైపు.. చంద్రబాబు–పురందేశ్వరి తమ రాజకీయ డ్రామాను రక్తికట్టించేందుకు శివరామకృష్ణంరాజు బలమైన అభ్యర్థి కాదని ఇంకో కొత్త ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో ఇలాంటి ప్రచారాలే చేసి చంద్రబాబు బీజేపీకి వెన్నుపోటు పోడిచారని.. ఇప్పుడు పురందేశ్వరి ఆయనకు తోడైందని వారంటున్నారు. అప్పట్లో బీజేపీకి ఐదు లోక్సభ, 15 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు ముందు చెప్పి ఆ తర్వాత నాలుగు లోక్సభ 14 అసెంబ్లీ స్థానాలకు పరిమితం చేశారు. ఆ అసెంబ్లీ స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వారు బలమైన వారు కాదంటూ సంతనూతలపాడు, గుంతకల్లు, కడప అసెంబ్లీ స్థానాల్లో చంద్రబాబు పోటీగా టీడీపీ వారికి సైతం బి–ఫారాలిచ్చారు. ఆ తరహాలోనే చంద్రబాబు ఇప్పుడు కూడా బీజేపీకి వెన్నుపోటు పొడిచే ప్రయత్నంలో పురందేశ్వరి భాగస్వామ్యం కావడంపట్ల కమల దళంలో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాబు–పురందేశ్వరి కలిసి నాటకం బీజేపీతో పొత్తు కుదరక ముందే గత ఫిబ్రవరి 24న చంద్రబాబు 94 అసెంబ్లీ స్థానాలకు ప్రకటించిన టీడీపీ అభ్యర్థుల జాబితాలో అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును ప్రకటించారు. ఆ తర్వాత మార్చిలో పొత్తులు ఖరారయ్యాక టీడీపీ ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించింది. దీంతో బీజేపీ జాతీయ నాయకత్వం అక్కడ బీజేపీ అభ్యర్థిగా ఎం. శివరామకృష్ణంరాజు పేరును ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ పొత్తు ధర్మానికి తూట్లు పొడుస్తున్నారు. రెండ్రోజుల క్రితం చంద్రబాబు నిర్వహించిన రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ప్రధాన నాయకుల సమావేశానికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కూడా పిలిచారని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశం తర్వాత కూడా అనపర్తి టీడీపీ అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి పోటీచేస్తున్నట్లు టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తుండడంపై బీజేపీ వర్గాలు మండిపడుతున్నాయి. పురందేశ్వరి ఈ పరిణామాలను అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంతో చంద్రబాబు–పురందేశ్వరి ఇద్దరూ కలిసే ఈ డ్రామాను ఆడుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. -
మొదటి ఆటే ఆఖరాట.. బాబు అతి తెలివి ఢిల్లీకి అర్థమైందా?
కూటమి సినిమా అట్టర్ ప్లాప్ అయిందా.. మొదటి ఆటతోనే సినిమాను థియేటర్ల నుంచి ఎత్తేసారా? మొదటి ఆటే ఆఖరాట అయ్యిందా.. చూస్తుంటే అలాగే ఉంది. కాస్త లేటుగా అయినా పాము విషాన్నే కక్కుతుంది తప్ప పాలను కాదు.. తుమ్మ చెట్టుకు ముళ్ళే వస్తాయి తప్ప పూలు రావు.. అలాగే ఎంతగా మారిపోయాను అని చెప్పి.. కాళ్లావేళ్లా పడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నా అవకాశం వచ్చినపుడు మాత్రం చంద్రబాబు తన అసలు రూపాన్ని బయటకు తీస్తూనే ఉంటారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్పి ఢిల్లీతో పొత్తు పెట్టుకున్నా ఆయన అంతరంగంలో ఏముందన్నది గుర్తించలేని అమాయకులు బీజేపీలో ఎవరూ లేరు. కానీ, మనిషి మారాడేమో అనుకున్నా లేదు.. ఎందుకు మారతాడు.. ఒరిజినల్ అలాగే ఉంటుంది. అది అవసరం వచ్చినప్పుడల్లా బయటపడుతుంది. దీంతో చంద్రబాబు తత్వాన్ని మరోమారు అర్థం చేసుకున్న బీజేపీ పెద్దలు ఇంకోసారి ఆయనతో వేదిక పంచుకునేది లేదని తీర్మానించుకున్నట్లు తెలుస్తోంది. మొన్నామధ్య చిలకలూరిపేటలో జరిగిన ఉమ్మడి వేదిక మీద మోదీ.. చంద్రబాబు.. పవన్ ముగ్గురూ మాట్లాడారు. ఆ తరువాత సీట్ల పంపిణీ జరిగింది. అక్కడే చంద్రబాబు తీరు మరోమారు బీజేపీ పెద్దలకు అర్థమైంది. ఎక్కడెక్కడో ఉన్న టీడీపీ వాళ్ళను బీజేపీలో చేర్చి తన వదిన అయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ద్వారా టిక్కెట్లు ఇప్పించుకున్న చంద్రబాబు తీరును చూసి ఢిల్లీ బీజేపీ పెద్దలకు మైండ్ బ్లాక్ అయ్యిందట. మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్లకు టిక్కెట్లు లేకుండా ఎంతసేపూ సీఎం రమేష్, సుజనా చౌదరి.. ఇలాంటి వాళ్ళు తప్ప వేరేవాళ్లు అభ్యర్థులే లేరా?. అంతా తన చంచాలేనా.. మొదటి నుంచి బీజేపీలో ఉన్న వాళ్ళు ఎవరూ అభ్యర్థులు కాలేక పోయారా? అంటూ రాష్ట్ర పాతకాపులైన బీజేపీ నాయకులు చేసిన ఫిర్యాదు చూశాక అర్థమైంది. పీవీఎన్ మాధవ్.. వీర్రాజు వంటి వాళ్లకు ఎక్కడా టిక్కెట్లు లేకుండా చంద్రబాబు తన బంధువు పురంధేశ్వరి ద్వారా చక్రం తిప్పి బీజేపీని తన గుప్పిట్లో పెట్టుకుని ఎలా కథ నడిపింది బీజేపీకి అర్థమైంది. దీంతో, ఇక చాలు ఆయనతో అంటకాగింది చాలు.. కూటమి తరఫున ఇంకో ఉమ్మడి సభ వద్దే వద్దు అని తీర్మానించారని తెలుస్తోంది. దీంతో మోదీ, అమిత్ షా వచ్చినా ఇక చంద్రబాబుతో సంబంధం లేకుండా కేవలం బీజేపీ వాళ్ళతో సభ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్.. చంద్రబాబు సైతం ఉమ్మడిగా కాకుండా ఎవరికీ వారే సభలు.. రోడ్డు షోలు నిర్వహిస్తూ ప్రచారం చేస్తున్నారు తప్ప ఎక్కడా కలిసి వెళ్లడం లేదు. - సిమ్మాదిరప్పన్న. -
April 4th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Political News And Election News April 4th Telugu Updates 9:49 PM, April 4th 2024 జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది.. సీఎం జగన్ ట్వీట్ నా అవ్వాతాతలు, వితంతువు అక్కచెల్లెమ్మలు, దివ్యాంగులకి చెప్తున్నా.. కొంచెం ఓపిక పట్టండి జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది నా మొట్టమొదటి సంతకం ప్రతి ఇంటికీ సేవలు అందించే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేందుకే పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నా అవ్వాతాతలు, వితంతువు అక్కచెల్లెమ్మలు, దివ్యాంగులకి చెప్తున్నా.. కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం ప్రతి ఇంటికీ సేవలు అందించే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేందుకే పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.#MemanthaSiddham#VoteForFan pic.twitter.com/ewqX04uLG4 — YS Jagan Mohan Reddy (@ysjagan) April 4, 2024 8:30 PM, April 4th 2024 చంద్రబాబుకి ఎన్నికల సంఘం నోటీసులు మార్చి 31న ఎమ్మిగనూరు సభలో చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశం చంద్రబాబు ఎన్నికల కోడ్ నియమావళిని ఉల్లంఘించారని ఫిర్యాదు 48 గంటల్లోగా అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలని ఆదేశం 6:05 PM, April 4th 2024 ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోయారు: సీఎం జగన్ పేదలను గెలిపించాలని మనం యుద్దం చేయబోతున్నాం నా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకే 50 శాతం పదవులు ఇచ్చాం పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని కోర్టులకు వెళ్లారు 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోయారు తన మనిషి నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారు తలుపు తట్టి పథకాలు అందిస్తుంటే బాబు జీర్ణించుకోలేకపోయారు పేదలకు తోడుగా నిలబడేందుకు మీరంతా సిద్ధమా? పెన్షన్ల కోసం వెళ్లి 31 మంది అవ్వతాతలు ప్రాణాలు విడిచారు 31 మంది ప్రాణాలు తీసిన చంద్రబాబు ఏమనాలి? 31 మంది ప్రాణాలు తీసిన చంద్రబాబును హంతకుడు అందామా? జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి ఏపీ పేద వర్గాల ప్రజలంతా నా వాళ్లు చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు చంద్రబాబు పేరు చేప్తే గుర్తుకొచ్చేది.. మోసాలు, కుట్రలు చిన్న పిల్లలు మేనమామ అని పిలుస్తుంటే గర్వంగా ఉంది జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థపైనే 5:16 PM, April 4th 2024 నాకు, నీకు ఉన్న తేడా ఇదీ చంద్రబాబు.. సీఎం జగన్ ట్వీట్ జగన్ ఒక టిప్పర్ డ్రైవర్కి సీటిచ్చాడని చంద్రబాబు అవహేళన చేశాడు అంతటితో ఆగలేదు, వేలిముద్రగాడంటూ వీరాంజనేయులుని అవమానించాడు నువ్వు కోట్లకి కోట్లు డబ్బులు ఉన్న పెత్తందారులకి టికెట్లు ఇచ్చావు చంద్రబాబు నేను ఒక పేదవాడికి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం చేస్తున్నా నాకు, నీకు ఉన్న తేడా ఇదీ చంద్రబాబు 4:43 PM, April 4th 2024 రైల్వేకోడూరు జనసేన అభ్యర్థి మార్పు రైల్వేకోడూరు నుంచి మరో పచ్చ చొక్క నేతకు జనసేన టికెట్ అరవ శ్రీధర్ బరిలో ఉంటారని ప్రకటించిన జనసేన ఇటీవలే యనమల భాస్కర్ రావును జనసేన అభ్యర్దిగా ప్రకటించిన జనసేన ప్రచారంలోకి దిగకముందే టికెట్ మార్పు ప్రస్తుతం ముక్కావారిపల్లె సర్పంచ్ గా కొనసాగుతున్న నూతన అభ్యర్ది అరవ శ్రీధర్ మూడు రోజుల క్రితమే జనసేనలో చేరిన శ్రీధర్ 3:45 PM, April 4th 2024 సీఎం వైఎస్ జగన్ని ప్రజలు దేవుడిగా చూస్తున్నారు: మంత్రి రోజా వడమాలపేట మండలంలోని కల్లూరులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రోజా ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాకు భరోసా కల్పిస్తున్నాయని ప్రజలు అంటున్నారు రాష్ట్రంలో చంద్రబాబు అండ్ కో.. ముసలి వారికి ఇబ్బందులకు గురిచేస్తున్నారు చంద్రబాబుకి ప్రజలు బుద్దిచెప్పే రోజు దగ్గర్లోనే ఉంది నగరిలో ప్రతిపక్షాలు నన్ను ఎదుర్కోలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారు ప్యాకేజీ స్టార్ పవన్ కల్యాణ్ ఇచ్చిన సీట్లులో కూడా అభ్యర్థులు లేక టీడీపీ అభ్యర్థులకే ఇచ్చారు 2:15 PM, April 4th 2024 చంద్రబాబు నిర్వాకం.. వాలంటీర్ల రాజీనామా నంద్యాలలో 29 మంది వాలంటీర్లు రాజీనామా. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ తమపై కక్ష సాధింపు చర్యలు సిగ్గుచేటు అంటూ వాలంటీర్లు సీరియస్ నంద్యాల పట్టణంలోని ఆరో వార్డులో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా. తమ రాజీనామా పత్రాలను సచివాలయ ఇంచార్జ్కు సమర్పించిన వాలంటీర్లు. 2:00 PM, April 4th 2024 ఎల్లో మీడియాకు కళ్ళు మూసుకుపోయాయి: కొడాలి నాని ఫైర్ దుర్మార్గుడైన చంద్రబాబు నక్కజిత్తుల ఆలోచనల వల్లే వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వలేకపోతున్నారు తన చీప్ పబ్లిసిటీ కోసం రాష్ట్రంలోని పేదవర్గాల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు రోడ్డు పాలు చేశాడు కూటమి పార్టీల నేతలకు, పచ్చ మీడియా పెద్దలకే గౌరవ మర్యాదలు ఆత్మగౌరవం ఉంటుందా? పేదలకు ఉండదా? క్యూలైన్లో నిలబడి పెన్షన్ తీసుకునే రోజులను వృద్ధులు మర్చిపోయి చాలా రోజులైంది ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కోసం కార్యాలయాలకు వెళ్లి గంటలకొద్ది నిలబడటమనేది వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆత్మగౌరవ సమస్య ప్రభుత్వం బాధ్యతగా ఇళ్ల వద్దకే వెళ్లి ఇవ్వడంతో హక్కుగా లబ్ధిదారులు ఇప్పటివరకు అందుకుంటున్నారు పేదవాళ్లు కోరుకునే ఆత్మగౌరవం దెబ్బతినకుండా మూడో కంటికి తెలియకుండా ప్రతీ కుటుంబానికి ప్రభుత్వ సాయం అందిస్తున్నాం చంద్రబాబు స్వార్థానికి రాష్ట్రంలోని లక్షలాదిమంది వృద్దులు, వికలాంగులు, వితంతువులు కష్టపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో వందలాది చోట్లకు వెళుతున్నాం మా పార్టీ కార్యకర్తలు, అభిమానులు నాకు శిరస్సుపై నుంచి క్షీరాభిషేకాలు చేస్తానంటే వద్దని వారించాను నేను వద్దన్నా నాపై అభిమానంతో ఒకటి రెండు చోట్ల నా కాళ్లు కడిగారు చంద్రబాబు, పవన్, లోకేష్ వాళ్ల డప్పులు వాళ్లే కొట్టుకొంటున్నారు వాళ్ల దండలు వారే తెచ్చుకుంటున్నట్లు వారి తమ్ముళ్లను వాళ్లే పోగేసుకునేలా కార్యక్రమాలు నేను చేయడం లేదు ఎల్లో మీడియాకు కళ్ళు మూసుకుపోయాయి చంద్రబాబును సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి ఎంతకైనా దిగజారతారు ఎన్నికల ప్రచారంలో చెంబుడు నీళ్లు కాళ్లపై పొయ్యడం పెద్ద విషయమా? నన్ను అల్లరి చేయడానికి ఏమీ లేక తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. 1:30 PM, April 4th 2024 రాజ్యసభతోనే వైనాట్ 175 ప్రారంభమైంది: వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభలో ఇప్పుడు టీడీపీని ఆచూకీ లేకుండా చేశాం. రాజ్యసభతోనే వైనాట్ 175 ప్రారంభమైంది. ముఖ్యమంత్రిగా మళ్లీ సీఎం జగన్ గెలవడం ఖాయం. నాడు లోక్సభలో ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేశాను. రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం ముందు నడిచాను. సీఎం జగన్ ఆశీస్సులతో మళ్లీ రాజ్యసభకు ఎన్నిక కావడం ఆనందంగా ఉంది. రాజ్యసభలో 11కు 11 సీట్లు వైఎస్సార్సీపీనే గెలిచింది. ఈ సంఖ్యాబలం వల్ల రాష్ట్ర అభివృద్ధికి మరింత మేలు జరుగుతుంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలు సాధిస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు 12:40 PM, April 4th 2024 చంద్రబాబుది శవ రాజకీయం: వెల్లంపల్లి శ్రీనివాస్ మైసూర్ బోండాకు వాంబే కాలనీలో ఓటు అడిగే అర్హత లేదు. పచ్చి తాగుబోతుకి ప్రజలు ఎందుకు ఓటు వేయాలి. ఉమాని సెంట్రల్ ప్రజలు విస్మరించారు. ఆయన సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండడు. సెంటర్లో 25వేల మెజార్టీతో వైఎస్సార్సీపీ జెండా ఎగురుతుంది. ఎవరైనా చనిపోతే చంద్రబాబు ఆనందపడతాడు. వాలంటరీ వ్యవస్థ ఉసురు తగిలి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కొట్టుకుపోతుంది. మేధావులు అని చెప్పుకునే దద్దమ్మలు దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. నిమ్మగడ్డ రమేష్ ఒకసారి వాంబే కాలనీ వచ్చి పేదల పరిస్థితి చూడు. చంద్రబాబు మాట విని నిమ్మగడ్డ రమేష్ ప్రజల ఉసురు పోసుకున్నాడు. ఎండలో వృద్ధులు పెన్షన్ తీసుకుని ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు సంతోషిస్తున్నాడు. ఎలక్షన్ అయిన తర్వాత కట్టగట్టి వీరందరినీ బయటికి తరిమికొట్టాలి వాలంటరీ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు. వాలంటరీ వ్యవస్థ గురించి పవన్ దుర్మార్గంగా మాట్లాడాడు. పవన్ లాంటి వెదవల్ని ప్రజలు నమ్మరు. దివ్యాంగులకు వృద్ధులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. శవ రాజకీయాలు చేసేది చంద్రబాబు. నందమూరి హరికృష్ణ చనిపోతే డెడ్ బాడీ దగ్గర కేటీఆర్తో శవరాజకీయాలు చేసింది చంద్రబాబు కాదా? వెన్నుపోటు, దుర్మార్గ రాజకీయాలు చేసేది చంద్రబాబే. 12:15 PM, April 4th 2024 అవనిగడ్డ జనసేన అభ్యర్ధిగా మండలి బుద్ధప్రసాద్ చంద్రబాబు చెప్పిన వారికే జనసేనలో సీట్లు అవనిగడ్డ జనసేన అభ్యర్ధిగా మండలి బుద్ధప్రసాద్ బుద్ధప్రసాద్ను అభ్యర్థిగా ప్రకటించిన పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం జనసేనలో చేరిన బుద్ధప్రసాద్ జనసేనలో మొదటి నుంచి కష్టపడిన వారికి హ్యాండిచ్చిన పవన్ సర్వేల పేరుతో ఊరించి ఆశపెట్టి జనసేన పార్టీ శ్రేణులను దారుణంగా మోసం చేసిన పవన్ ఉమ్మడి కృష్ణాజిల్లాలో జనసేనకు కేవలం దక్కింది రెండు స్థానాలే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులు ఇద్దరూ బయటి పార్టీల నుంచి వచ్చిన వారికే సీటిచ్చిన పవన్ ఉమ్మడి కృష్ణాజిల్లాలో 16 నియోజకవర్గాల్లో ఒక్క చోట కూడా జనసేనలో కష్టపడిన వారికి దక్కని అవకాశం పవన్ తీరుపై మండిపడుతున్న జనసేన శ్రేణులు 11:50 AM, April 4th 2024 పేదలను ఇబ్బందిపెడుతున్న వ్యక్తి చంద్రబాబు: కేశినేని నాని తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కేడర్ అంతా విజయోత్సాహంతో ఉంది అవినాష్ విజయానికి ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలి రిటైనింగ్ వాల్ వలన ఎన్నో కుటుంబాలు మానసిక భద్రత పొందుతున్నాయు సీఎం జగన్ను ఒప్పించి వేగవంతంగా రిటైనింగ్ వాల్ అవినాష్ పూర్తి చేశాడు నియోజకవర్గంలో 650 కోట్ల అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్ సొంతం పెన్షన్దారులను ఇబ్బంది పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు పేదలకు, సామాన్యులకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇస్తుంటే చంద్రబాబు హేళనగా మాట్లాడుతున్నారు 2024 ఎన్నికలు అయిపోతే సొంత రాష్ట్రం తెలంగాణకి చంద్రబాబు పారిపోతాడు శవ రాజకీయాలకి చంద్రబాబు పెట్టింది పేరు కుట్ర రాజకీయాలు, నీచ రాజకీయాలకి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు 11:30 AM, April 4th 2024 వైఎస్సార్సీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధం: దేవినేని అవినాష్ పలు డివిజన్లకి చెందిన జోనల్ కార్యాలయాన్ని నేడు ప్రారంభించాం రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తాం. జిల్లా వ్యాప్తంగా భారీ మెజార్టీలతో సీట్లు గెలవబోతున్నాం ఇక్కడ ప్రజలు పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు సీఎం జగన్ అందిస్తున్న పథకాలు, చేసిన అభివృద్ధితో ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్తున్నాం ప్రజలు మమ్మలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు 11:00 AM, April 4th 2024 వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ నేతలు.. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఈ సందర్బంగా పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలు. 2019లో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీచేసిన విష్టువర్ధన్ రెడ్డి. ఈ సందర్భంగా సీఎం జగన్ కామెంట్స్.. ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను. అందరినీ కలిసే పరిస్ధితి కష్టం అనేది దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నాను. ఎన్నికల ప్రచారం మధ్యలో ఉన్నాం కాబట్టి, వెళ్లాల్సిన రూటు ఇంకా చాలా ఉంది. ప్రతి ఒక్కరినీ కలవలేకోయాం అని బాధపడవద్దు అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ ఇదే నా రిక్వెస్ట్ అని ప్రస్తావిస్తూ.. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు, పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆరో తేదీన కావలిలో ‘కావలి సిద్ధం’ సభ కూడా మీ దగ్గరే జరుగుతుంది. మీ అందరినీ అప్పుడు వీలైనంతవరకు ఆ రోజు కలిపించమని విష్టుకు చెబుతున్నాను. ఎంతమందిని వీలైతే అంతమందిని కలిపిస్తాడు ధన్యవాదాలు. 10:30 AM, April 4th 2024 అనంత టీడీపీలో అసమ్మతి.. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉద్రిక్తత టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్న అసమ్మతి నేతలు టిక్కెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి దగ్గుపాటి ప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్న ప్రభాకర్ చౌదరి వర్గీయులు టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ గోబ్యాక్ అంటూ నినాదాలు ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట టీడీపీ రెండు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు 10:00 AM, April 4th 2024 పేదల పక్షపాతి సీఎం జగన్: నల్లగట్ల స్వామిదాస్ సీఎం జగన్ను ఓడించేందుకు కూటమి కుట్రలు చేస్తోంది. కూటమి కలలన్నీ కల్లలు అయిపోతాయి. రాష్ట్రంలో టీడీపీ భవిష్యత్తు అంధకారమై పోతుంది.. సజావుగా సాగుతున్న పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి కూటమి కుట్రలు చేసింది. వికలాంగులకు, వితంతువులకు, వృద్ధులకు వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదనే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసింది. భారతదేశంలోనే వాలంటీర్ వ్యవస్థ ఒక ఆదర్శం. దుర్మార్గమైన చర్యతో సంక్షేమ పాలనను ఆపేందుకే ప్రయత్నం. పేదల పక్షపాతి పార్టీ సీఎం జగన్. అందుకే ఒక టిప్పర్ డ్రైవర్, మరో ఉపాధి హామీ కూలి వంటి పేదలకు స్థానం కల్పించారు. పెట్టుబడుల పార్టీ, పెత్తందారుల పార్టీ, ధనవంతుల పార్టీలు కూటమిలో ఉన్నాయి. ప్రత్యేక హోదా, విభజన హామీలు, తెలంగాణ నుంచి రావాల్సిన వాటా ఇవ్వలేని బీజేపీ ఏ విధంగా రాష్ట్రంలో ఓట్లు అడుగుతారు. రాష్ట్ర ప్రజలందరూ సీఎం జగన్ను తిరిగి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. తిరువూరు నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో జగనన్నకు కానుకగా ఇస్తాం. 09:25 AM, April 4th 2024 నేడు రఘురామ కీలక మీటింగ్ భీమవరంలో ఈరోజు రఘురామకృష్ణరాజు కీలక మీటింగ్ సన్నిహితులు, అభిమానులతో అంతర్గత ఆత్మీయ సమావేశం రఘురామకృష్ణరాజు రేపు టీడీపీలో చేరతారంటూ ప్రచారం ఇన్ని రోజులు చంద్రబాబు కోసం కష్టపడ్డారు కాబట్టి చంద్రబాబు టికెట్ ఇవ్వాలని డిమాండ్ ఇప్పటికే చంద్రబాబు నుంచి అందిన గ్రీన్ సిగ్నల్ చంద్రబాబు పాలకొల్లు టూర్లో తెలుగుదేశం గూటికి చేరే ఛాన్స్ ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటున్న అనుచరులు 09:00 AM, April 4th 2024 వన్స్ మోర్ సీఎం జగన్.. బస్సు యాత్ర దారిపొడవునా అందరి నోటా ఇదే మాట సీఎం జగన్కు నీరాజనం.. రోడ్డుపైకి తరలి వచ్చిన గ్రామాలకు గ్రామాలు మేలు చేసిన జననేతకే తమ ఓటు అని స్పష్టీకరణ ఏం చూసి చంద్రబాబుకు ఓటేయాలని నిలదీత ఎన్ని జెండాలు జత కట్టినా వారు చిత్తే.. తామంతా అన్ని విధాలా ఆదుకున్న ఈ ప్రభుత్వం వెంటే.. ఎలుగెత్తి చాటిన చిత్తూరు, తిరుపతి జిల్లాల ప్రజానీకం బస్సు యాత్ర దారిపొడవునా అందరి నోటా ఇదే మాట 08:40 AM, April 4th 2024 పవన్పై ముద్రగడ ఫైర్ పవన్ కల్యాణ్పై మండిపడ్డ ముద్రగడ పద్మనాభం కార్యకర్తలను పవన్ దగ్గరకు కూడా రానివ్వరు రోజుకు మూడు షిఫ్ట్ల్లో బౌన్సర్లు పనిచేస్తున్నారు చుట్టూ బౌన్సర్లు పెట్టుకున్న పవన్ కల్యాణ్ ఔ బ్లేడ్ బ్యాచ్ అంటూ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం పిరికితనం, చేతకానితనంతోనే పవన్ వ్యాఖ్యలు 08:20 AM, April 4th 2024 నేడు ముగ్గురు వైఎస్సార్సీపీ ఎంపీల ప్రమాణ స్వీకారం.. నేడు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి వీరితో ప్రమాణస్వీకారం చేయించనున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజ్యసభలో 11కు పెరిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ(97), కాంగ్రెస్(29), టీఎంసీ (13) తర్వాత స్థానం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే 08:00 AM, April 4th 2024 ఇట్లుంటది బాబు.. టిప్పర్ డ్రైవర్ దెబ్బ అంటే.. ఇట్లుంటది బాబు.. టిప్పర్ డ్రైవర్ దెబ్బ!#ChandrababuInsultsDrivers#YSJaganAgain#VoteForFan pic.twitter.com/H2OMYTdMyM — YSR Congress Party (@YSRCParty) April 3, 2024 07:45 AM, April 4th 2024 నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా.. గురవరాజుపల్లె ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభం చిన్న సింగమల వద్ద 11 గంటలకు లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లతో సీఎం ముఖాముఖి నాయుడుపేట సమీపంలోని జాతీయ రహదారి పక్కన బహిరంగ సభ చింతరెడ్డిపాలెం సమీపంలో రాత్రి బస 07:00 AM, April 4th 2024 టీడీపీలో నిరసన జ్వాలలు.. చంద్రబాబుపై సీనియర్ల తిరుగుబాటు సీట్ల కేటాయింపులో విఫలమయ్యారని ఆవేదన బీసీ సాకుతో ఏలూరు సీటు యనమల అల్లుడికి ఇవ్వడంపై మాగంటి బాబు ఆగ్రహం నమ్మించి మోసం చేశారంటున్న కిమిడి నాగార్జున, బండారు సత్యనారాయణమూర్తి అనపర్తి బరిలో ఇండిపెండెంట్గా నల్లమిల్లి!.. కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రచారంలో వర్గపోరు ఆదోని, ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు, నంద్యాల, డోన్ టీడీపీ ఇన్చార్జ్లకు దక్కని టికెట్లు మంత్రాలయం, కోడుమూరు, ఆదోనిలో చల్లారని నిరసన జ్వాలలు 06:50 AM, April 4th 2024 తన స్టార్ క్యాంపెయినర్లకు సీఎం వైఎస్ జగన్ పిలుపు మన ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి తమకి జరిగిన మంచిని మరో 100 మందికి చెప్పి ప్రతి ఓటు కూడా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కి చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్లీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా జాగ్రత్తపడాల్సిన సమయమొచ్చింది! మన ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి. తమకి జరిగిన మంచిని మరో 100 మందికి చెప్పి ప్రతి ఓటు కూడా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కి చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్లీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా జాగ్రత్తపడాల్సిన… pic.twitter.com/jzfwuV10Ke — YS Jagan Mohan Reddy (@ysjagan) April 3, 2024 06:40 AM, April 4th 2024 జగన్ పాలనలోనే ప్రజలకు న్యాయం: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బౌన్సర్లతో పవన్ ప్రజలను భయపెడుతున్నాడు పేద ప్రజల మనసు ఎరిగిన వైఎస్ జగన్ పాలనతోనే వారికి న్యాయం జరుగుతుంది రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుంది చంద్రబాబు కాపులను అణగదొక్కాలని చూస్తే సీఎం జగన్ అక్కున చేర్చుకున్నారు ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పొత్తు ఏర్పరచుకుని కుటిల రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు ఎన్ని దుర్మార్గపు రాజకీయాలు చేసినా, ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా సీఎం జగన్ చరిష్మా ముందు ఓడిపోక తప్పదు పవన్ కాపుల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టేశాడు నన్ను ఎవరు ముట్టుకోకూడదు అంటూ బౌన్సర్లతో జనాలను కొట్టించే నాయకులు రాజకీయాలకు దూరంగా ఉండాలి. 06:30 AM, April 4th 2024 కడప జిల్లా రాజంపేట టీడీపీలో చల్లారని అసమ్మతి సెగలు అయోమయంలో బత్యాల చెంగల్రాయుడి రాజకీయ భవితవ్యం టికెట్ల కేటాయింపుపై పునరాలోచన చేయాలని బత్యాల డిమాండ్ బత్యాల డిమాండ్ ను పట్టించుకోని టీడీపీ హైకమాండ్ పార్టీ మారేందుకు సిద్ధమైన బత్యాల చెంగల్రాయుడు ఇప్పటికే వైసీపీ నుంచి బత్యాలకు ఆఫర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్కు వెళ్లే ఆలోచన ఇండిపెండెంట్గా పోటీ చేయాలంటున్న బత్యాల అనుచరులు -
ఎల్లో మీడియా పైత్యం.. అధికారుల బదిలీలపై చెత్త రాతలు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న ఫలితం కనిపిస్తున్నట్లుగా ఉంది. ఆయన తాను కోరుకున్నట్లుగానే ఎన్నికల కమిషన్ను ప్రభావితం చేయగలుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏపీలో తొమ్మిది మంది ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేయడం వెనుక ఏమి జరిగిందా అన్నదానిపై విశ్లేషణలు వస్తున్నాయి. కచ్చితంగా టీడీపీ కూటమి కేంద్రంలోని బీజేపీ ద్వారా ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి ఇంతమందిని బదిలీ చేయించారన్న భావన ప్రజలలో కలుగుతోంది. ఎందుకంటే వీరిలో కొందరు అధికారులు కొద్ది కాలం క్రితమే బదిలీ అయినా, వారిని అక్కడ ఉండకుండా ఎన్నికల విధులు లేకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. ప్రత్యేకించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన స్కీములు బాగా అమలు చేసిన అధికారులపైన, ఆయా చోట్ల టీడీపీ చేసిన అరాచకాలను అడ్డుకున్న పోలీసు అధికారులపైన టీడీపీ, ఈనాడు తదితర ఎల్లో మీడియా కక్ష కట్టి వారు బదిలీ అయ్యేలా చేసినట్లు కనిపిస్తుంది. ఏపీలో వైఎస్ జగన్ను ఒంటరిగా ఎదుర్కోవడం అసాధ్యం అన్న భావనకు వచ్చిన చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పలురకాలుగా ప్రేమ లేఖలు రాయడం, ఆ తర్వాత ప్రలోభాలకు గురి చేయడం ద్వారా ఆయనను తనదారిలోకి తెచ్చుకున్నారు. అయినా అది జగన్ను ఓడించడానికి సరిపోవడం లేదని అనుకుని బీజేపీవైపు చూశారు. బీజేపీ పొత్తులోకి వస్తే వారివల్ల కలిసి వచ్చే ఓట్ల గురించి కాకుండా, కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ద్వారా కేసుల బెడద లేకుండా చూసుకోవడం, ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు జరగకుండా జాగ్రత్తపడడం, వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం వంటి ప్రయోజనాలను ఆశించి పొత్తులోకి వెళ్లాలని ఆయన కోరుకున్నారు. దాని కోసం ఆయన ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల కాళ్లావేళ్ల పడి, ఆత్మగౌరవాన్ని వదలుకుని ఎలాగైతేనేం బీజేపీ పెద్దల మనసును ఆకట్టుకోగలిగారు. ఆ తర్వాత ప్రధాని మోదీ కూడా ఏపీలో కూటమి సభలో పాల్గొనేలా చేయగలిగారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో తమ మనుషులు, ఇతర పార్టీలలో ఉన్న కోవర్టులతో ఆపరేషన్ ఆరంభించారు. తొలుత ఎన్నికలను నెల రోజుల పాటు ఆలస్యం చేయడంలో సఫలం అయ్యారన్న అభిప్రాయం కలిగింది. 2019లో తొలిదశలో ఏప్రిల్ పదకుండో తేదీకి ఎన్నికలు పూర్తి అయిపోతే, ఈసారి ఎన్నికలు నాలుగోదశకు వెళ్లడం, మే పదమూడు వరకు అంటే నెల రోజులు ఆలస్యం కావడం చూస్తే ఇది కూటమి పనే అన్న సందేహం వస్తోంది. ఆ తర్వాత వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీసే విధంగా వారితో ఈ రెండు నెలలు ప్రజలకు సేవలందించకుండా టీడీపీ కూటమి అడ్డుకోగలిగింది. వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితర టీడీపీ నేతలకు ఉన్న వ్యతిరేకత అందరికి తెలిసిందే. వారు గతంలో వలంటీర్ల పట్ల ఎంత నీచంగా మాట్లాడింది అందరికి గుర్తు ఉంది. కాకపోతే ఇప్పుడు రివర్స్ అయి తమ మెడకే చుట్టుకోవడంతో మాట మార్చి వలంటీర్లను కొనసాగిస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు చెబుతున్నప్పటికీ జనం ఎవరూ నమ్మడం లేదు. దానికి తోడు వలంటీర్ల వ్యవహారంలో తమకు సంబంధం లేదని టీడీపీ ఆఫీస్ నుంచి ఒకటికి పదిసార్లు ప్రజలకు మెస్సేజీలు వెళుతున్నాయి. దానిని బట్టే వారు ఎంత కంగారు పడుతున్నది అర్ధం చేసుకోవచ్చు. ఎన్నికల కమిషన్ కూడా వలంటీర్ల వ్యవస్థపై వాస్తవాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా ఆదేశాలు ఇవ్వడం కూడా తప్పే అని చెప్పాలి. చంద్రబాబుకు వివిధ పార్టీలలో కోవర్టులు ఉన్నారన్నది బహిరంగ రహస్యం. 2019 ఓటమి పాలయ్యాక చంద్రబాబు వెంటనే ప్లేట్ ఫిరాయించి బీజేపీకి జై కొట్టే పని పెట్టుకున్నారు. ఏకంగా నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపిచారు. అయినా ఆ పార్టీ పెద్దలకు చంద్రబాబుపై నమ్మకం కుదరలేదు. ఆ తరుణంలో ఈడీ, ఐటీ దాడులు చేయడం, చంద్రబాబు పీఎస్ వద్ద రెండువేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని సిబిటిడి ప్రకటించడం జరిగింది. దాంతో మరింతగా బీజేపీకి లొంగిపోయి ప్రధాని మోదీని పొగడడం ఆరంభించారు. తత్ఫలితంగా తనపై కేసులు ముందుకు వెళ్లకుండా చేసుకోగలిగారు. 2019 ఎన్నికలకు ముందు మోదీని, సీబీఐ, ఐటి, ఈడి వంటి వాటిని చంద్రబాబు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవారు. ఎన్నికల తర్వాత గప్ చుప్ అవడమే కాకుండా బీజేపీ వారి ప్రాపకం కోసం నానా పాట్లు పడ్డారు. అందుకోసం పవన్ను ప్రయోగించారు. ఆయనను బీజేపీ చివాట్లు పెట్టింది. అయినా వదలకుండా ఎలాగైతే బీజేపీతో టీడీపీకి పొత్తు కుదిర్చారు. ఆ తర్వాత చంద్రబాబు మళ్లీ యధా ప్రకారం తన కుట్రలకు శ్రీకారం చుట్టారు. సీఎం జగన్ ప్రభుత్వాన్ని మూడు పార్టీల కూటమి ఓడించలేదన్న అభిప్రాయానికి వచ్చి, ఎన్నికల కమిషన్ ను కూడా తన ఆయుధంగా వాడుకోవాలని ఆలోచించి ఉండవచ్చని అంటున్నారు. ఇందుకోసం బీజేపీలో చేరిన టీడీపీ మాజీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటివారిని ప్రయోగించారు. వారితో పాటు మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పావుగా మార్చుకుని కధ ఆరంభించారు. ఆయనతో హైకోర్టులో కేసులు వేయించడం, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు పంపించడం, మరోవైపు బీజేపీలో ఉన్న తన మనుషుల ద్వారా ఎక్కడ ఎవరికి చెప్పించాలో చెప్పించి ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెస్తున్నట్లు జనం నమ్ముతున్నారు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ పైన చంద్రబాబు 2019లో ఎలాంటి విమర్శలు చేసింది అందరూ చూశారు. అప్పటి సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది కార్యాలయానికి వెళ్లి ఆయన రచ్చరచ్చ చేశారు. అప్పట్లో ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుపై పలు ఆరోపణలు రావడంతో ఎన్నికల సంఘం ఆయనను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. ఆయనతో పాటు మరో ఇద్దరు ఎస్పిలను బదిలీ చేసింది. ఆ చర్యను తీవ్రంగా తప్పు పడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘాన్ని దుయ్యబట్టారు. అంతేకాక ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లారు. అయినా ఫలితం దక్కకపోవడంతో వెంకటేశ్వరరావును బదిలీ చేయక తప్పలేదు. అసలు తొలుత కమిషన్ చెప్పినవారిని బదిలీ చేయడానికే ఆయన ఇష్టపడలేదు. దాంతో కమిషన్ సీరియస్ అయింది. ఇన్ని చేసినప్పుడు ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలకు ఎన్నికల కమిషన్లో నియంత కనిపించారు. మోదీనే కమిషన్ను నడిపిస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తే దానికి విశేష ప్రాధాన్యత ఇస్తూ ప్రచారం చేసేవారు. ఇప్పుడు మాత్రం ఎన్నికల కమిషన్ బదిలీలు చేస్తే అది గొప్ప విషయంగా ప్రొజెక్టు చేస్తున్నారు. దీనిని బట్టే తెలుగుదేశంతో పాటు, ఈనాడు, జ్యోతి వంటి మీడియా సంస్థలు ఎంత నీచంగా మారాయన్నది తెలిసిపోతుంది. ఈనాడులో అయితే పేజీల కొద్ది కధనాలు ఇచ్చి తన శాడిజాన్ని ప్రదర్శించింది. ఎన్నికల సంఘం చేసిన బదిలీలను వార్తగా ఇవ్వడం తప్పు కాదు. కానీ, బదిలీ అయినవారిపై విషం కక్కుతూ ఎన్నికలతో సంబంధం లేని అనేక విషయాలను వక్రీకరిస్తూ తన పైత్యాన్ని అంతటిని ఈనాడు మీడియా ప్రదర్శించి వికృతానందం పొందింది. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ సభలో మైక్ పనిచేయకపోతే దానికి కొందరు పోలీసు అధికారులను బాధ్యుల్ని చేస్తూ, కేంద్రం వారిపై చర్య తీసుకోబోతోందని ఈనాడు ప్రచారం చేసింది. అది జరగలేదు. ఇప్పుడు తొమ్మిది మందిని బదిలీ చేస్తే శరభ శరభ అంటూ పూనకం వచ్చినట్లు రాస్తూ అధికారులను అవమానించింది. వారంతా ఇంగితం మర్చారని, అధికార వైఎస్సార్సీపీకి బంట్లుగా మారారని, తెలుగుదేశం బాకా పత్రికగా మారిన ఈనాడు ఆరోపించింది. విపక్షాలు చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకునే కమిషన్ తన అధికారాలను వినియోగించి ఈ చర్య తీసుకుందని ఆ పత్రిక పేర్కొంది. అంటే దీని అర్ధం ఏమిటి? ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ చేసుకోకుండా, విపక్షాల ఆరోపణలను ఆధారంగా చేసుకుని చర్య తీసుకున్నట్లే కదా!. ఇలా చర్య తీసుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే కారణమని ఎవరైనా అంటే కాదనే పరిస్థితి కనిపించడం లేదు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. తిరుపతి కలెక్టర్ గా నియమితులైన లక్ష్మీ షా జనవరి 31 న జాయిన్ అయ్యారు. ఈనాడు దృష్టిలో ఆయన చేసిన తప్పు ఏమిటంటే టీటీడీ చైర్మన్ గా ఉన్న కరుణాకరరెడ్డిని కలవడమే. అంతకు మించి ఆయన చేసిన తప్పు ఏమీ లేదనే కదా!. విపక్షాలతో పాటు ఈనాడు వారు కోరుకున్నట్లు చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై కేసు పెట్టలేదట. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకుండానే, రెండు నెలల వ్యవధిలోనే ఆయనను బదిలీ చేశారంటే ఏదో ఒత్తిడి లేదని ఎలా అనుకోగలుగుతాం?. లక్ష్మీ షా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను సఫలం చేయడంలో కీలక పాత్ర పోషించినవారిలో ఒకరు. ఆ ద్వేషంతో కూడా టీడీపీ కూటమి ఆరోపణలు చేసి ఉండవచ్చు. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై ఈనాడు ఎన్ని అసత్యాలు రాసిందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రధాని మోదీ సభ విఫలం అవడానికి కారణం తెలుగుదేశం పార్టీ అయితే, దానినంతటిని ఎస్పీపై నెట్టివేసింది. వైఎస్సార్సీపీవారు అరాచకాలు సృష్టించారట. తెలుగుదేశం వారు అసలు ఏమీ చేయలేదట. ఎంత దారుణంగా రాసిందో చూడండి. ప్రధాని మోదీ సభలో మైక్ లు పనిచేయకపోవడం వల్లే ఎస్పీని బదిలీ చేశామని అదే కారణమని ఎన్నికల కమిషన్ చెప్పనే లేదు కదా!. పోనీ ఫలానా కారణమని కమిషన్ తెలిపిందా?. కానీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా మాత్రం తమ పైత్యం అంతటిని కలిపి విషం చిమ్మాయి. కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు మాజీ మంత్రి పేర్ని నాని చెప్పినట్లు వింటున్నారట. ఇలా ఈనాడు పత్రిక తనకు తోచినవన్నీ రాసేసి అధికార యంత్రంగాన్ని భయపెట్టడానికి యత్నించింది. అధికారులు తప్పులు చేస్తే చర్యలు తీసుకోవద్దని ఎవరూ చెప్పరు. కానీ, విపక్షాలు పాలించే రాష్ట్రాలలోనే ఇలా చేస్తుంటే కచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపైనే విమర్శలు వస్తాయి. పశ్చిమబెంగాల్లో డీజీపీని మార్చిన వైనం విమర్శలకు దారి తీసింది. బీజేపీ పాలిత రాష్ట్రాలలో కొందరు హోం శాఖ కార్యదర్శులను మార్చినట్లు ఎన్నికల సంఘం ప్రకటించినా, వారంతా ముఖ్యమంత్రుల కార్యాలయంతో పాటు మరోచోట పనిచేస్తున్నారని వెల్లడించింది. అంటే వారిపై ఎలాంటి అభియోగాలు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ తెలపలేదు. ఏపీలో కొందరు అధికారులను బదిలీ చేయగానే వారిపై తెలుగుదేశం మీడియా నానా చెత్త అంతా రాశాయంటే ఇదంతా బ్లాక్ మెయిలింగ్ టాక్టీస్ అని తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. అధికారులు ఎవరైనా నిష్ఫక్షపాతంగా ఉంటే వారిని చెడగొట్టే లక్ష్యంతోనే టీడీపీ మీడియా ఇలా రాస్తోంది. అదే తాము కోరుకున్న అధికారి లేదా తమకు భయపడే అధికారి విశాఖలో ఉండి ఉంటే,తమకు సంబంధించిన మార్గదర్శి చిట్స్ సంస్థ అక్రమంగా రవాణా చేస్తున్న 51 లక్షల నగదును పట్టుకునే వారు కాదు కదా అన్నది ఈనాడు వారి ఉద్దేశం కావచ్చు. రామోజీరావు, రాధాకృష్ణల పిచ్చి కాకపోతే అధికారులే ఓట్లు వేయించే పరిస్థితి ఉంటే చంద్రబాబు ఎప్పటికి ఓడిపోయేవారు కాదు కదా! ముఖ్యమంత్రి జగన్ నమ్ముకుంది జనాన్ని కానీ.. అధికార యంత్రాంగాన్ని కాదన్న సంగతి ఆయన చేస్తున్న బస్ యాత్రలను బట్టే తెలుస్తుంది. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
April 2nd: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Political News And Election News April 2nd Telugu Updates 8:39 PM, April 2nd 2024 నెల్లూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా పేదలంతా ఉన్నారు: కనుమూరి రవి చంద్రారెడ్డి చంద్రబాబు 100 తలలు ఉన్న రాక్షసుడు వాలంటీర్ల ద్వారా పెన్షన్ అందకుండా చేసి అవ్వా, తాతల ఉసురుతో పాటు కిడ్నీ బాధితుల ఉసురు కూడా చంద్రబాబు పోసుకుంటున్నాడు రాష్ట్రంలో 65 లక్షల పెన్షన్ దారుల ఓట్లు పోయాయని చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు భయం పట్టుకుంది పొరపాటున చంద్రబాబు నాయుడుకు ఓట్లు వేస్తే జన్మభూమి కమిటీలను తీసుకొస్తాడు 8:00 PM, April 2nd 2024 పార్వతీపురం మన్యం జిల్లా: సంక్షేమం గ్రామాల్లో ఉండాలంటే మళ్లీ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలి: వైవీ సుబ్బారెడ్డి పార్వతీపురం లో మేమంతా సిద్ధం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మీ ప్రాంతాల్లో ప్రజాదరణ కలిగిన నాయకులను అభ్యర్థలను ఎంపిక చేయడం జరిగింది. నేటి వరకు గడిచిన వైఎస్సార్సీపీ పాలన ప్రతి ప్రాంతంలో ప్రజలు సంక్షేమ పథకాలతో ఎంతో సంతోషంగా ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా ఇంతే సంక్షేమం గ్రామంల్లో ఉండాలి అంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి వైఎస్సార్సీపీ శ్రేణులు గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేయ్యాలి మన ప్రభుత్వంలో ప్రతి పేదవాడికీ నాణ్యత గల విద్యా, వైద్యం అందించడం జరిగింది దివంగత వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి ఐదు లక్షల వరకు ఆరోగ్యానికి భరోసా కల్పించారు మరి ఆయన తనయుడు సీఎం జగన్ 25 లక్షల రూపాయలు వరకు ఉచిత వైద్యం కోసం పథకాన్ని నిర్వహించారు. గడిచిన 58 నెలలుగా మన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 1540 కోట్ల రూపాయలను పార్వతీపురం నియోజకవర్గంలో 1 లక్ష 54 వేల మంది లబ్ధిదారులకు అందజేయడం జరిగింది ఒక్క పార్వతీపురంలో 45 వేల మంది అవ్వ,తాతలు ఫించన్ లబ్ధిదారులు ఉన్నారు 5:50 PM, April 2nd 2024 పేదల పక్షాన ఉన్న మనకు గొప్ప గెలుపు రాబోతోంది: మదనపల్లె మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ చంద్రబాబు జిత్తులమారి, పొత్తుల మారి అధికారం కోసం చంద్రబాబు పసుపుపతిగా మారాడు మోసాలే అలవాటుగా అబద్ధాలే పునాదులుగా చేసుకున్న వ్యక్తి బాబు 2014లో పసుపుపతిగా మూడు పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్నాడు రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? పొదుపు సంఘాలకు రుణాలు మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? ఆడబిడ్డ పుడితే రూ. 25వేల డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా? ఇంటింటికి ఉద్యోగం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా? రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తాడంట ఇది 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన ముఖ్యమైన హామీల్లో ఒకటి ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు మరి మదనపల్లెలో ఏమైనా హైటెక్ సిటీ కనబడుతుందా? ఆయన మ్యానిఫెస్టో చూస్తే ఇంకా ఇటువంటివి 650కి పైగా హామీలు కనిపిస్తాయి ముఖ్యమైన హామీల పరిస్థితి ఇది అయితే, మరి మ్యానిఫెస్టో సంగతి దేవుడెరుగు ఎన్నికలు అయిపోగానే మ్యానిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తారు ఇంటింటి అభివృద్ధిని, ప్రతీ ఊరు అభివృద్ధిని, సామాజిక వర్గాల అభ్యున్నతిని, అక్క చెల్లెమ్మల సాధికారితను, అవ్వా తాతల సంక్షేమాన్ని, మన పిల్లల భవిష్యత్తును కాపాడుకునేందుకు, కొనసాగించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతున్నాను. ప్రతీ గ్రామానికి మంచి చేశాం చేసిన మంచిని ప్రతీ గడపకు వివరించి 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు గెలించేందుకు, డబుల్ సెంచరీ కొట్టేందుకు, రెండు వందలకు రెండొందల కొట్టేందుకు మీరంతా సిద్ధమేనా 2019లో దేవుడు, మీరు ఇచ్చిన చారిత్రక తీర్పు తర్వాత మ్యానిఫెస్టోలో ఇచ్చి న ప్రతీ హామీని నెరవేర్చాం మ్యానిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చిన ప్రభుత్వం.. నెరవేర్చిన తర్వాత ఓటు అడగటానికి అడుగులు వేస్తా ఉన్నా ప్రభుత్వం. విశ్వసనీయతకు ఇది అర్థం అని చెబుతూ అడుగులు వేశాం ఈ 58 నెలల పాలనలో.. ఐదేళ్లు మన ప్రభుత్వం మంచి పాలన అందించిన తర్వాత మీ ముందు నిలబడి ఇది మంచి చేశామని సగర్వంగా, సవినయంగా చెప్పగలగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ గ్రామంలో అయినా కూడా నా దగ్గర నుంచి మన పార్టీ కార్యకర్తలు కానీ, మన నాయకులు కానీ, మన అభిమానులు కానీ, మన వాలంటీర్లు కానీ ప్రతీ ఇంటికి వెళ్లి గడిచిన ఈ 58 నెలల్లో ఇంటింటికి మీకు మంచి జరిగి ఉంటే మీ జగన్కు మీ బిడ్డకు, మన ప్రభుత్వానికి, మన వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఓటు వేయమని అడుగుతున్నారంటే దానికి కారణం మంచి చేశాం కాబట్టేనని సగర్వంగా చెప్పగలుగుతున్నాను ఇవాళ ఎన్నికలు వస్తున్నాయంటే ప్రతిపక్షంలో ఉన్నవారంతా విడివిడిగా రాలేకపోతున్నారు.. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చేయలేకపోతున్నారు అధికారం కోసం గుంపులుగా, తోడేళ్లుగా జెండాలు జత కట్టి అబద్ధాలతో వస్తా ఉన్నారు. జెండాలు జత కట్టడమే వారి పని.. జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ పని అని సగర్వంగా చెప్పగలుగుతున్నాను 5:30 PM, April 2nd 2024 కాకినాడ: చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి ప్రజా క్షేత్రంలో ఉండి ప్రజా వ్యతిరేఖ కార్యక్రమాలు చేసే చంద్రబాబును ప్రజలు బహిష్కరించాలి చంద్రబాబువి కుట్ర,కుతంత్ర రాజకీయాలు పేదలకు ఇళ్ళ స్ధలాలు ఇవ్వకుండా గతంలో అడ్డంకులు సృష్టించాడు ఇవాళ వాలంటీర్ల ద్వారా అవ్వ తాతలకు ఫించన్ అందకుండా చేశాడు 5:00 PM, April 2nd 2024 విశాఖ: వైజాగ్ ఎంపీ సీటుపై కూటమిలో కుంపటి బీజేపికి కేటాయించాలని కమలంలో ఊపందుకున్న డిమాండ్ వివిధ మోర్చాల ఆధ్వర్యంలో కీలక సమావేశం గతంలో గెలిచిన సీటును పొత్తుల పేరుతో వదలడం బీజేపీకి నష్టం చేయడమేనంటున్న నేతలు పొత్తులో భాగంగా టీడీపీకి వెళ్ళిన వైజాగ్ ఎంపీ టిక్కెట్ టిడిపి ఎంపీ అభ్యర్థిగా ప్రచారం ప్రారంభించిన బాలయ్య చిన్నల్లుడు భరత్ టీడీపీకి సీటు కేటాయిస్తే ఓటింగ్కు దూరం అవుతామని తేల్చేసిన నార్త్ ఇండియన్ సంఘాలు అనపర్తి, నర్సాపురం వంటి చోట మార్పులు జరుగుతున్నప్పుడు వైజాగ్ ఎందుకు మార్చరని డిమాండ్ 4:40 PM, April 2nd 2024 తాడేపల్లి : వాలంటీర్ల వ్యవస్థను ధ్వంసం చేసేలాగ చంద్రబాబు వ్యవహరిస్తున్నారు: మంత్రి మేరుగ నాగార్జున పెన్షన్లను పంపిణీ చేయకుండా వృద్దులు, వికలాంగులను తీవ్రంగా ఇబ్బందులు పెట్టారు పేదలకు సహాయం చేయనీయకుండా చేశారు బీసీలు జడ్జీలుగా పనికిరారని విమర్శలు చేశారు ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని చంద్రబాబు అన్నారు టిప్పర్ డ్రైవర్లకు సీటు ఇవ్వటం ఏంటని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు చంద్రబాబుకు డ్రైవర్లంటే ఎందుకు అంత కక్ష? ఇంత బరితెగింపు రాజకీయాల్లో ఎప్పుడూ చూడలేదు చంద్రబాబు, ఆయన కూటమికి డ్రైవర్లు తగిన బుద్ది చెప్తారు పెన్షన్లను ఆపటానికి చంద్రబాబే కారణం కరోనా సమయంలో చంద్రబాబు హైదరాబాదు పారిపోయారు కానీ వాలంటీర్లే దగ్గరుండి పేదలకు సేవలు చేశారు అలాంటి వారిని మెచ్చుకోకపోగా కక్ష సాధించటమేంటి? ఇలాంటి చంద్రబాబుకు ఎవరు ఓటేస్తారు? చంద్రబాబు బతుకు చెడ జగన్ ని బడుగు, బలహీన వర్గాలు అండగా నిలుస్తాయి పవన్ కళ్యాణ్ మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు 4:30 PM, April 2nd 2024 కుప్పం(చిత్తూరు జిల్లా): వాలంటీర్లపై నిందలు వేస్తూ, వేధిస్తున్నారు : ఎంపీ రెడ్డప్ప కుప్పం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎంపీ రెడ్డప్ప ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ వ్యవస్థను సీఎం జగన్ తీసుకొచ్చారు వాలంటీర్లు ఉసురు తగిలి తెలుగుదేశం పార్టీ కొట్టుకు పోవడం ఖాయం మేము ఉన్నా లేకపోయినా, వాలంటీర్లే రాష్ట్ర భవిష్యత్తు వృద్ధులకు, పేద ప్రజలకు చేదోడు వాదోడుగా వాలంటీర్లు వాలంటీర్ల నుండి పెన్షన్ ఇవ్వకుండా చేసింది చంద్రబాబు చంద్రబాబు ఓడిపోతాడనీ సర్వేల్లో తేలిపోయింది మే 13 న జరిగే ఎన్నికల్లో భరత్ అఖండ మెజారిటీతో విజయం సాధించడం ఖాయం కుప్పంలో జరిగే గంగమ్మ జాతరకు చంద్రబాబు ఎప్పుడైనా వచ్చారా? మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డిని గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ మాకు పోటీ కాదు 4:00 PM, April 2nd 2024 ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు మండలం రోలుపడి గ్రామ వాలంటీర్లు 18 మంది రాజీనామా ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన వాలంటీర్లు రాజీనామా పత్రాలను ఎంపీడీవో కార్యాలయంలో అందజేసిన వాలంటీర్లు 2:55 PM, April 2nd 2024 ఢిల్లీ: ఏపీ లోక్సభ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ అధిష్టానం ఐదు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ కడప లోక్సభ నుంచి షర్మిల పోటీ కాకినాడ నుంచి పల్లంరాజు రాజమండ్రి నుంచి గిడుగు రుద్దరాజు బాపట్ల నుంచి జేడీ శీలం కర్నూల్ నుంచి రామ్ పుల్లయ్య యాదవ్ కర్నూల్ నుంచి రామ్ పుల్లయ్య యాదవ్ వీటితో పాటు 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ 1:50 PM, April 2nd 2024 ఎన్నికల కోసం అబ్జర్వర్ల నియామకం ఏపీలో ఎన్నికల నిర్వహణ కోసం అబ్జర్వర్లను నియమించిన సీఈసీ. జనరల్ స్పెషల్ అబ్జర్వర్గా రిటైర్డ్ ఐఏఎస్ రాంమోహన్ మిశ్రా. పోలీసు స్పెషల్ అబ్జర్వర్గా రిటైర్డ్ ఐపీఎస్ దీపక్ మిశ్రా. 1:35 PM, April 2nd 2024 అవనిగడ్డ జనసేనలో కుంపట్లు అవనిగడ్డ సీట్ బుద్ధ ప్రసాద్కు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న శ్రీనివాస్ వర్గీయులు జనసేన పిల్లల పార్టీ అన్న బుద్ధప్రసాద్కి సీట్ ఎలా ఇస్తారంటున్న ఆ పార్టీ నేతలు ఇవాళ అవనిగడ్డలో జనసేన నేత విక్కుర్తి శ్రీనివాస్ ఆత్మీయ సమావేశం చివరి నిమిషంలో తన సీట్ మార్చారంటున్న శ్రీనివాస్ డబ్బులకు సీట్లు అమ్ముకున్నారని ఆరోపించిన బుద్ధప్రసాద్కి సీట్ ఇస్తారా? జనసేనలో చేర్చుకుని మరీ సీట్ ఇవ్వాల్సిన అవసరం ఏముందంటున్న నేతలు 1:15 PM, April 2nd 2024 అవ్వాతాతల దెబ్బకు బాబు అబ్బా అంటాడు: కొండా రాజీవ్ చంద్రబాబు హాయంలో పెన్షన్ డబ్బుల కోసం ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎటువంటి కష్టం లేకుండా పెన్షన్ అందించారు. సీఎం జగన్ను ఎదుర్కోలేక బాబు అండ్ బ్యాచ్ పేదలపై కక్ష తీర్చుకుంటున్నారు. నిమ్మగడ్డ రమేష్తో బాబు శిఖండి ఆట ఆడుతున్నాడు. వాలంటీర్లను చూస్తే బాబుకి వెన్నులో వణుకు పుడుతుంది. చంద్రబాబు బుద్ది ఏమిటో ప్రజలకు అర్థమవుతుంది. పెన్షన్ రాకుండా ఆపిన బాబు.. ఇప్పుడు సకాలంలో పెన్షన్ ఇవ్వాలని దొంగ ఏడుపు నటిస్తున్నాడు. చంద్రబాబుకి దమ్ముంటే ఎన్నికల సంగ్రామంలో తేల్చుకోవాలి. వచ్చే ఎన్నికల్లో అవ్వా తాతలు కొట్టే దెబ్బ.. చంద్రబాబు అబ్బా అంటాడు. 12:50 PM, April 2nd 2024 చంద్రబాబు షాడో నిమ్మగడ్డ రమేష్: ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు షాడో. చంద్రబాబు పెన్షనర్ల ఉసురు పోసుకుంటున్నాడు. ఒకటో తేదీన పెన్షన్ ఠంచనుగా వస్తుందని వారంతా ఆనందంగా ఉండేవారు. పెన్షన్ అందకుండా చేసినందుకు ప్రజలు చంద్రబాబుని ఛీ కొడుతున్నారు. ఎన్నికల కమిషన్ను అడ్డుపెట్టుకొని చంద్రబాబు నీచ రాజకీయం చేస్తున్నాడు. చంద్రబాబు 67 లక్షల మంది పెన్షనర్ల ఉసురు తగిలి పోతాడు. చంద్రబాబు, పవన్, లోకేష్లకు డిపాజిట్లు కూడా రావు. నేను ఇంకా మాట్లాడితే బూతులు వస్తాయి. 12:30 PM, April 2nd 2024 పోటీకి కాంగ్రెస్ సీనియర్ల వెనకడుగు.. ఏపీ కాంగ్రెస్లో కొత్త ట్విస్ట్.. ఎన్నికల్లో పోటీకి సీనియర్ల వెనకడుగు ఏపీ ఎన్నికల బరిలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ సీనియర్ల విముఖత పోటీ చేయనంటున్న రఘువీరారెడ్డి, కేవీపీ బలవంతంగా పల్లం రాజు, గిడుగు రుద్ర రాజులను బరిలోకి దింపుతున్న అధిష్టానం కనీసం డిపాజిట్ రాకపోతే పార్టీలో పరువు పోతుందని ఆవేదన ఓడిపోయే దానికి మమ్మల్ని ఎందుకు బలి చేస్తారంటున్న సీనియర్లు మమ్మల్ని పోటీ నుంచి తప్పించాలని హై కమాండ్ పెద్దలను వేడుకుంటున్న సీనియర్లు 12:00 PM, April 2nd 2024 జనసేనకు ఫ్రీ సింబల్గా గ్లాసు గుర్తు కేటాయింపు.. ఫ్రీ సింబల్గా గాజు గ్లాసు గుర్తు. గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్ కేవలం రిజిస్టర్డ్ పార్టీగానే జనసేన గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, గుర్తింపులేని పార్టీల జాబితాను విడుదల చేసిన ఎన్నికల కమిషన్. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం ఏపీ సీఈవో గెజిట్ నోటిఫికేషన్లు విడుదల. గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల జాబితాలో వైఎస్సార్సీపీ, టీడీపీ. రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో జనసేన. వైఎస్సార్సీపీకి ఫ్యాన్ గుర్తు, టీడీపీకి సైకిల్ గుర్తులను ప్రకటించిన ఈసీ. ఫ్రీ సింబల్స్ జాబితాలో గ్లాసు గుర్తు. 11:15 AM, April 2nd 2024 పేదల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది: వెల్లంపల్లి ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి సీఎం జగన్ను గెలిపిస్తారు. ఇంటికి వచ్చే పెన్షన్ని దుర్మార్గుడు చంద్రబాబు అడ్డుకున్నాడు. చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, వైఎస్ షర్మిల, పవన్ కళ్యాణ్ పేద ప్రజల మీద కక్ష కట్టారు. సుమారు 65 లక్షల మంది పెన్షన్లను ఎల్లో టీమ్ నిలిపివేశారు. పెన్షన్దారులు చంద్రబాబు అండ్ టీమ్కి బుద్ధి చెప్పేందుకు సిద్ధం. వాలంటరీ వ్యవస్థ లేకపోతే ఇంటి వద్దకు పెన్షన్ ఏ విధంగా పంపిస్తారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా చేపట్టావా?. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెన్షన్లన్నీ ఎత్తివేసి టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి ఇస్తారంట. ఇలాంటి దుర్మార్గులకి ఓటు ఎందుకు వేయాలి. జన్మభూమి కమిటీలు పెట్టి టీడీపీ సానుభూతిపరులకే పెన్షన్లు ఇస్తారు. కులమతాలకు అతీతంగా సీఎం జగన్ పథకాలు అందిస్తున్నారు. బుద్దా వెంకన్న, పోతిన మహేష్, వర్ల రామయ్యకు కూడా మేము సంక్షేమ పథకాలు అందించాం. టీడీపీ అధికారంలోకి రావడం కలగా మిగిలిపోతుంది నారా లోకేష్ ప్రజల పట్ల దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో నారా లోకేష్తో పనిలేదు. జనసేన కార్యకర్తలను, నాయకులను పవన్ మభ్యపెడుతున్నాడు. పవన్ మాటలకు పొంతనే ఉండదు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక సొంతిల్లు అయినా ఏర్పాటు చేసుకో. పవన్ గతంలో పాచిపోయిన లడ్డులు అని మోదీ కాళ్లు పట్టుకున్నాడు. మీ కన్న తల్లిని తిట్టిన వారితో నువ్వు పొత్తు పెట్టుకుని పల్లకీ మోస్తున్నావ్. వీటికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. పవన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరు. పేదల ఉసురు చంద్రబాబుకి కచ్చితంగా తగులుతుంది. 10:40 AM, April 2nd 2024 వైఎస్సార్సీపీలో చేరిన బీజేపీ, టీడీపీ నేతలు చీకటిమునిపల్లె స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో చేరికలు. వైఎస్సార్సీపీలో చేరిన బీజేపీ సీరియర్ నేత, రాజంపేట జిల్లా మాజీ అధ్యక్షుడు, ఆప్నా స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి. వైఎస్సార్సీపీలో చేరిన మదనపల్లె టీడీపీ మైనార్టీ నేత మొబసిర్ అహ్మద్. కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నేత ఎం.గంగాధర్. 10:15 AM, April 2nd 2024 చంద్రబాబుకు ప్రజలు బుద్ధిచెబుతారు: అల్లు భానుమతి వాలంటీర్లు ఎవరో బయట వారు కాదు. మన కుటుంబం నుంచి వచ్చిన వారే వాలంటీర్. వాలంటీర్ల సేవలను అడ్డుకుంటున్న చంద్రబాబుకి ప్రజలు బుద్ది చెబుతారు. ఉత్తరాంధ్ర నుంచి కూటమి అభ్యర్థుల్లో చాలా మంది నాన్ లోకల్స్ ఉన్నారు. ఉత్తరాంధ్రలో వైసీపీ స్థానిక నేతలకు అవకాశం కల్పించింది. బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. 9:30 AM, April 2nd 2024 టీడీపీ నేతలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: దేవినేని అవినాష్ సీఎం జగన్ ఐదేళ్ల పాలనను ప్రతీ ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. అమ్మఒడి, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాలు అందుకున్నాం అని ప్రతీ ఒక్కరూ అంటున్నారు మళ్లీ మా ఓటు జగన్కే అని ప్రజలు అనటం సంతోషాన్నిచ్చింది టీడీపీ నేతలు చేసిన కుట్ర వల్లే నేటికీ అవ్వతాతలకు పెన్షన్ అందలేదు టీడీపీ అధికారంలోకి వస్తే స్థానిక నేతల కనుసన్నలలోనే పథకాలు ఇస్తామని లోకేష్ అనటం బాధాకరం కుల మతాలకు అతీతంగా పథకాలు అమలు చేశాం. టీడీపీ నేతలు చెప్పే అసత్య ప్రచారం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏనాడూ ప్రజల కష్టాలు తీర్చిన దాఖలా లేదు సీఎం జగన్ సహకారంతో రూ.650కోట్లతో తూర్పు నియోజకవర్గం అభివృద్ధి జరిగింది కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు సేవ చేసింది వైఎస్సార్సీపీ నాయకులు, వాలంటీర్లు మాత్రమే 8:30 AM, April 2nd 2024 మనం చెప్పిన వాళ్లకే పథకాలివ్వాలి: నారా లోకేష్ అధికారం లేకున్నా లోకేష్ బెదిరింపులు. వాలంటీర్లు మనం చెప్పినట్టు పనిచేయాలని బెదిరింపులు. మనం చెప్పిన వాళ్లకే పథకాలు ఇవ్వాలని కామెంట్స్ .@JaiTDP అధికారంలోకి వచ్చాక వాలంటీర్లు మనం చెప్పినట్టు పనిచేయాలి. మనం చెప్పిన వాళ్ళకే పథకాలు ఇవ్వాలి అంటున్న లోకేష్.#TDPAgainstVolunteers #EndOfTDP pic.twitter.com/kRy3qhftdx — YSR Congress Party (@YSRCParty) April 1, 2024 8:00 AM, April 2nd 2024 పచ్చ బ్యాచ్పై వాలంటీర్ల ఆగ్రహం.. చంద్రబాబు బ్యాచ్ కుట్రలపై వాలంటీర్ల మనోవేదన మూకుమ్మడి రాజీనామాలకు దిగుతున్న వాలంటీర్లు నిన్న మచిలీపట్నం, తాడిపత్రిలో పెద్ద ఎత్తున రాజీనామాలు మచిలీపట్నంలోనే ఏకంగా 1227 మంది రాజీనామా తమను సేవా కార్యక్రమాలకు దూరంగా ఉంచటంపై ఆగ్రహం పెన్షన్ల కోసం వృద్దులు, వికలాంగులు ఫోన్లు చేస్తున్నాంటూ ఆవేదన 7:00 AM, April 2nd 2024 21 కాదు.. 11.. పేరు జనసేనది.. పోటీ టీడీపీనే.. పేరే జనసేనది.. పోటీచేసేది టీడీపీనే అంటున్న జనసేన శ్రేణులు ఇవి చంద్రబాబు–పవన్కళ్యాణ్ కుమ్మక్కు డ్రామాలంటూ మండిపాటు జనసేనకిచ్చిన మెజారిటీ సీట్లలో గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన వారే ఇప్పుడు జనసేన అభ్యర్థులుగా బరిలో.. వీరు కూడా సీటు కేటాయింపు తర్వాత జనసేనలోకి చేరిక తాజాగా.. అవనిగడ్డ, పాలకొండ టీడీపీ నేతలు అలా జనసేనలో చేరి ఇలా టికెట్లు కైవసం గత ఎన్నికల్లో పోటీచేసిన.. లేదా గత ఐదేళ్లలో పార్టీకి పనిచేసిన వారికి దక్కింది సగం సీట్లే అంటున్న నేతలు బీజేపీకి కేటాయించిన పది సీట్ల పరిస్థితి కూడా ఇంతేనంటూ కమలదళంలో చర్చ 6:50 AM, April 2nd 2024 తిరుగుబాటుతో తత్తరపాటు.. అవ్వాతాతలకు పింఛన్లపై ఆటంకాలు బాబు బృందం నిర్వాకమే పింఛన్ల పంపిణీపై వలంటీర్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 1న ఈసీకి అచ్చెన్న ఫిర్యాదు 4 నెలలుగా సుప్రీం, ఢిల్లీ హైకోర్టు, రాష్ట్ర హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్లు.. ఫిబ్రవరి 23, 25న ఈసీకి సైతం ఫిర్యాదు నిమ్మగడ్డ – బాబు బంధం స్థానిక ఎన్నికల్లోనే బట్టబయలు బాబు బృందం ఫిర్యాదులతోనే ఇంటి వద్ద పింఛన్లకు ఈసీ బ్రేక్ సీఎం జగన్ ప్రభుత్వానికి ఆపాదిస్తూ ‘ఈనాడు’ రోత కథనాలు గతంలో విమర్శించిన సచివాలయాల ఉద్యోగులతోనే పింఛన్లు పంచాలంటూ డిమాండ్ లబ్ధిదారుల ఇళ్ల వివరాలకు వారూ ఎవరో ఒకరిపై ఆధారపడాల్సిందేగా? ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్న అధికారులపై అభాండాలు 6:40 AM, April 2nd 2024 టీడీపీ నేతలను నిలదీస్తున్న ప్రజలు నూజివీడులో టీడీపీ అభ్యర్ధి కొలుసు పార్ధసారథికి షాకిచ్చిన నూజివీడు ప్రజలు నూజివీడు 10వ వార్డులో ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్న పార్ధసారథి మొఘల్ చెరువు ప్రాంతం ప్రజలకు ఇళ్లపట్టాలిస్తానన్న పార్ధసారథి కోర్టులో ఉన్న చెరువులో ఇళ్లపట్టాలు ఎట్లా ఇస్తారో సమాధానం చెప్పాలని నిలదీసిన స్థానికులు టీడీపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఇస్తామన్న పార్ధసారథి అదే విషయం బాండ్ రాసివ్వాలని కోరిన వృద్ధురాలు వృద్ధురాలి ప్రశ్నలకు ఖంగుతిన్న పార్థసారథి , టీడీపీ నేతలు మొఘల్ చెరువు ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పలేక అక్కడ్నుంచి జారుకున్న పార్థసారథి, టీడీపీ నేతలు 6:30 AM, April 2nd 2024 చంద్రబాబుది నోరా లేకా.. తాటిమట్టా?: పేర్ని నాని వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తా అని చంద్రబాబు ఇప్పుడు అంటున్నారు ఐదారు నెలల క్రితం వాలంటీర్ వ్యవస్థను తీసేస్తాం అని చంద్రబాబు అనలేదా? పెన్షర్లకు డబ్బులు ఇవ్వకుండా ఆపింది ఎవరు? వాలంటీర్లపై అసత్య ప్రచారాలు చేశారు ప్రభుత్వ కార్యక్రమాల నిలుపుదల చేసింది చంద్రబాబు కాదా? నిమ్మగడ్డ రమేష్కు ఎవరితో సంబంధాలు ఉన్నాయో తెలియదు ఎన్టీఆర్ను కూలదోసింది ప్రజలకు తెలియదా? చంద్రబాబు చరిత్ర అందరికీ తెలుసు ఎవరు దిగివచ్చినా పెన్షన్లు ఆపడం వారితరం కాదు -
కూటమిలో వేరు కుంపట్లు
సాక్షి, పుట్టపర్తి: జెండాలు జత కట్టాయి.. నేతలు కూటమిగా ఏర్పడ్డారు.. సీట్లు పంచుకున్నారు.. అభ్యర్థులను ఖరారుచేశారు.. కానీ, అసలైనది అయిన సహకారం వీరి మధ్య కరువైంది. ప్రధానంగా మిత్రపక్షాల నుంచి టీడీపీకి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇదే అదనుగా బీజేపీకి చెక్ పెట్టాలని టీడీపీ నేతలు స్కెచ్ వేస్తున్నారు. మరోవైపు.. తమకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని జనసేన కార్యకర్తలూ అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయా పార్టీల పెద్దలు కలుసుకునేందుకు మాత్రమే కూటమి వేదికగా మారినట్లు స్పష్టమవుతుండగా క్షేత్రస్థాయిలో మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కూటమిలో టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్లు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగేందుకు ఎవరికి వారు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. శ్రీసత్యసాయి జిల్లాలోని హిందూపురం పార్లమెంటు సీటుతో పాటు ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, రాప్తాడులో వేరు కుంపట్లు ఉంటాయని చెబుతున్నారు. మూడు పార్టీల నాయకుల మధ్య సఖ్యత లేకపోవడంతో ఎవరికి వారుగా పోటీచేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాప్తాడు నుంచి వరదాపురం సూరి? బీజేపీ తరఫున ధర్మవరం టికెట్ ఆశించిన వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ)కి కూడా నిరాశే ఎదురైంది. బీజేపీ అధిష్టానం ధర్మవరం టికెట్ను వై. సత్యకుమార్కు ఖరారు చేసింది. దీని వెనుక పరిటాల శ్రీరామ్ హస్తం ఉందని భావిస్తున్న సూరి తనకు టికెట్ రాకుండా టీడీపీ అధిష్టానం వద్ద అడ్డుపుల్లలు వేసిన పరిటాల కుటుంబ సభ్యులను ఓడించేందుకు ఆయన కంకణం కట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి.. పరిటాల సునీతను ఓడించేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ‘స్వతంత్రం’గా పరిపూర్ణానందస్వామి.. హిందూపురం ఎంపీగా బీజేపీ తరఫున పోటీచేస్తానని రెండు నెలలుగా పరిపూర్ణానందస్వామి ప్రచారం చేసుకున్నారు. అయితే, కూటమిలో భాగంగా టీడీపీ నేత బీకే పార్థసారథికి ఆ ఎంపీ టికెట్ ఖరారుచేశారు. కానీ, పరిపూర్ణానందస్వామి తగ్గే పరిస్థితి కనిపించడంలేదు. తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని.. కార్యకర్తలు అందరూ సహకరించాలని ఆయన కోరుతున్నారు. టీడీపీ–జనసేన తనను మోసం చేశాయని ఆయన మండిపడుతున్నారు. ప్రచారానికి శ్రీరామ్ దూరం? ధర్మవరం టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ తరఫున ప్రచారం చేసేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. రాప్తాడులో పరిటాల సునీత గెలుపు కోసం బిజీబిజీగా గడపాల్సి ఉందని.. ఇతర పార్టీ నేతల గెలుపు కోసం తానెందుకు సమయం వృథా చేసుకోవాలని తన అనుచరుల వద్ద శ్రీరామ్ చర్చించినట్లు సమాచారం. అలాగే.. జనసేన నేత చిలకం మధుసూదన్రెడ్డి కూడా సత్యకుమార్కు మద్దతిచ్చే పరిస్థితి కనిపించలేదు. కదిరిలో అంటీముట్టనట్లుగా విష్ణు.. ఇక కూటమి నిర్ణయాలు తనను నిరాశపరిచాయని కదిరి బీజేపీ నేత విష్ణువర్థన్రెడ్డి తన అనుచరుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. రానున్న ఎన్నికల్లో కదిరిలో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేయకపోవచ్చని సమాచారం. కర్ణాటక రాజధాని బెంగళూరు వెళ్లి.. అక్కడ బీజేపీ పార్లమెంటు అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఆయన ప్లాన్ చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. పుట్టపర్తిలో టీడీపీకి సహాయ నిరాకరణ.. కలిసి పోటీచేయాలన్న లక్ష్యంతో టీడీపీ–బీజేపీ –జనసేన కూటమిగా ఏర్పడినా.. పుట్టపర్తిలో మాత్రం ఆ దిశగా ఆయా నాయకులు ముందుకెళ్లడంలేదు. అక్కడ జనసేన నాయకుల అడ్రస్లేదు. బీజేపీ నేతలు ఎక్కడ ఉన్నారో కనిపించని పరిస్థితి. కేవలం టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రచారం చేస్తున్నారు. అనంతపురం నుంచి ఉద్యోగం మాదిరిగా ఉదయం వచ్చి సాయంత్రం వెళ్తున్నట్లు ‘తమ్ముళ్లు’ చెబుతున్నారు.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
శ్రీనగర్లో భారీ బందోబస్తు మధ్య మొదలైన పోలింగ్!
ఏపీ ఎన్నికల పోలింగ్ వేళ సీఎం జగన్ సందేశం
నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ వస్తే.. ఏమవుతుందో తెలుసా?
హాలీవుడ్ కింగ్ ఆఫ్ కల్ట్ రోజర్ కన్నుమూత
Daily Horoscope: ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి
ఏపీలో కాసేపట్లో ప్రారంభం కానున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్
నారావారిపల్లెలో టీడీపీ శ్రేణుల దౌర్జన్యకాండ
Watch Live: ఏపీ ఎన్నికల లైవ్ అప్ డేట్స్
నయవంచనకు చెక్ పెడదాం
Lok sabha elections 2024: ప్రారంభమైన నాలుగో విడత పోలింగ్
తప్పక చదవండి
- నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ వస్తే.. ఏమవుతుందో తెలుసా?
- నయవంచనకు చెక్ పెడదాం
- ఈసీ ద్వంద్వ వైఖరి
- జనస్వామ్యమా! జయీభవ!!
- మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
- వైఎస్ విజయమ్మ పేరుతో టీడీపీ తప్పుడు లేఖ
- ఐరాస కాంక్షించే అభివృద్ధికి ఏపీయే వేదిక
- పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
Advertisement