-
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
టాలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. నాయక్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ స్టార్ హీరోల సరసన మెప్పించింది. ఇటీవలే రిలీజైన పృథ్వీరాజ్ సుకుమారన్ మూవీ ఆడుజీవితం(గోట్ లైఫ్) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే గతేడాది ప్రియుడు జగత్ దేశాయ్ను అమలాపాల్ పెళ్లి చేసుకుంది.ఆ తర్వాత అభిమానులకు గుడ్ న్యూస్ కూడా చెప్పింది. ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించి ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చింది. త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్న ముద్దుగుమ్మ తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. ఈ సందర్భంగా తన భర్త జగత్ దేశాయ్పై ప్రశంసలు కురిపించింది. ప్రెగ్నెన్సీ ధరించిన సమయం నుంచి తనకు అన్ని విధాలుగా అండగా నిలిచారని కొనియాడారు.అమలాపాల్ తన ఇన్స్టాలో రాస్తూ..' నాతో పాటు అర్థరాత్రి వరకు ఉంటూ.. నా ఇబ్బందులను ఒక్కొక్కటిగా తగ్గిస్తూ.. నాపై మీకున్న అచంచలమైన నమ్మకం.. మీ ఉత్తేజపరిచే మాటలు నాలో శక్తిని నింపాయి. ఈ విలువైన గర్భధారణ ప్రయాణంలో నా వెన్నంటే ఉన్నందుకు ధన్యవాదాలు. నా ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన క్షణాల్లో కూడా నాకు మద్దతుగా నిలిచారు. మీలాంటి అపురూపమైన వ్యక్తి నా జీవితంలోకి రావడం.. నిజంగా నేను ఏదో అద్భుతమైనా చేసి ఉండాలి. నా శక్తి, ప్రేమ తిరుగులేని మద్దతు ఉన్నందుకు ధన్యవాదాలు. నేను చెప్పే మాటలకంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నా' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు బ్యూటీఫుల్ కపుల్ అంటూ పోస్టులు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
హమరేశ్, ప్రార్ధన సందీప్ జంటగా నటించిన చిత్రం సత్య. ఈ చిత్రాన్ని వాలీ మోహన్దాస్ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ సినిమాను శివమ్ మీడియా బ్యానర్పై శివమల్లాల నిర్మించారు. ఈ బ్యానర్లో వచ్చిన తొలి సినిమాగా సత్య నిలిచింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఎనిమిది మంది దర్శకుల చేతుల మీదగా విడుదల చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఈ సినిమా మే 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపారు.ఈ సందర్భంగా డైరెక్టర్ కృష్ణచైతన్య మాట్లాడుతూ..'హమరేష్ చూడడానికి జీవీ ప్రకాష్ లాగా ఉన్నాడు. నిర్మాత శివ మల్లాల నాకు నా కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి తెలుసు, నన్ను జనాలకి చూపించడానికి ఫొటోస్ తీసేవారు. ఆయనకి ఈ సినిమా పెద్ద సక్సెస్ ని తీసుకుని రావాలని కోరుకుంటున్నా' అని అన్నారు. డైరెక్టర్ శశి కిరణ్ టిక్క మాట్లాడుతూ..' సత్య ట్రైలర్ చాల బాగుంది. టీం అందరికీ అల్ ది బెస్ట్, శివ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఆయనా అలానే నవ్వుతూ ఉండాలి. అలానే మంచి సక్సెస్ అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా' అని అన్నారు. చిత్ర దర్శకుడు వాలి మోహన్ దాస్ మాట్లాడుతూ.' తమిళంలో ఈ సినిమాని నేను రంగోలిగా తీశాను. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో శివ మల్లాల ద్వారా వస్తోంది. అందరూ చూసి మంచి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా' అని అన్నారు.నిర్మాత శివ మల్లాల మాట్లాడుతూ..'ఈరోజు నాకోసం ఇంత మంది వచ్చి సపోర్ట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. జస్ట్ ఈ సినిమా చూసి రివ్యూ చెప్దామని అనుకున్నా. కానీ సినిమా చూడగానే నాకు బాగా నచ్చింది. ఈరోజు జస్ట్ ట్రైలర్ లాంఛ్కే ఎనిమిది మంది డైరెక్టర్స్ వచ్చారు అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు నేను ఫోటోగ్రాఫర్గా కెరీర్ ప్రారంభించి ప్రొడ్యూసర్ వరకు వచ్చా. నా కెరీర్ ముందు నుంచి సపోర్ట్ చేసిన వాళ్లు చాలా మంది ఉన్నారు. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. మే 10న సత్య సినిమా వస్తుంది. అందరూ తప్పకుండా చూడండి' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో ఆడుగాలం మురుగదాస్, సాయిశ్రీ, అక్షయ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సుందరమూర్తి కేఎస్ సంగీతమందించారు. -
పెళ్లి చేసుకుంటా.. ఆ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్
జాతిరత్నాలు చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. ఈ మూవీతో తెలుగు ఆడియన్స్కు మరింత దగ్గరైంది. ప్రస్తుతం అల్లరి నరేశ్కు జంటగా ఆ.. ఒక్కటీ అడక్కు అనే చిత్రంలో కనిపించనుంది. మల్లి అంకం దర్శకత్వంలో ఈ సినిమాను తెరెకెక్కించారు. రాజీవ్ చిలక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా మే 3న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ సందర్భంగా చిత్రబృందం మూవీ ప్రమోషన్స్ షురూ చేసింది. తాజాగా హీరోయిన్ ఫరియా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. మూవీ విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా తాజా ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా పెళ్లి గురించే కావడంతో ఫరియా చేసిన కామెంట్స్ తెగ వైరలవుతున్నాయి.ఫరియా మాట్లాడుతూ..' పెళ్లి అనేది రెండు కుటుంబాల కలయిక. ప్రస్తుతం జరుగుతున్న పెళ్లిళ్ల విషయంలో చాలా మార్పులొచ్చాయి. లైఫ్ పార్ట్నర్ను ఎంచుకునే విషయంలో పరిస్థితులు మారిపోయాయి. ఈ సినిమాలో పెళ్లిని మ్యాట్రీమొనీ సైట్స్ ఎలా డీల్ చేస్తారో చాలా ఎంటర్టైనింగ్గా చూపించాం. ఇందులో నరేశ్ తన కామెడీతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తారు. నా పెళ్లి విషయంలో స్వతహగా కొన్ని ఆలోచనలున్నాయి. ప్రస్తుతం నా దృష్టంతా కెరీర్పైనే . నాకు 30 ఏళ్లు దాటాకే పెళ్లి గురించి ఆలోచిస్తా. అయితే నాది కచ్చితంగా ప్రేమ వివాహమే. అంతే కాదు హీరోయిన్గా మాస్ మసాలా, కామెడీ, హారర్ థ్రిల్లర్స్ చేయాలని ఉంది. ప్రస్తుతం తెలుగులో యాక్షన్ సినిమాలు చేసే హీరోయిన్స్ తక్కువగా ఉన్నారు. నాకు ఆ ఖాళీని భర్తీ చేయాలని ఉంది.' అని అన్నారు. తన పెళ్లి గురించి ఫరియా మొత్తానికి ఓ క్లారిటీ ఇచ్చేసింది. -
'ఆ ఒక్క పదం తెచ్చిన తంటా'.. వాళ్లిద్దరిపై మండిపడ్డ హీరోయిన్!
ఇటీవల డార్లింగ్ అనే పదంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. టాలీవుడ్ నటుడు ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేశ్ మధ్య ట్వీట్ వార్ కొనసాగిన సంగతి తెలిసిందే. పరిచయం లేని మహిళలను డార్లింగ్ అని పిలిస్తే వేధింపులకు కిందకు వస్తుందని నభా పోస్ట్ చేసింది. ప్రియదర్శి సైతం లైట్ తీస్కో డార్లింగ్ అంటూ రిప్లై కూడా ఇచ్చారు. తాజాగా వీరిద్దర మధ్య జరిగిన ఇంటరాక్షన్లో మరో హీరోయిన్ ఎంటరైంది. అదేంటో ఓ లుక్కేద్దాం. ప్రియదర్శి, నటి నభానటేశ్ గొడవలోకి నటి రీతూవర్మ ఎంట్రీ ఇచ్చింది. నా కామెంట్స్ సెక్షన్లో మీ పంచాయతీ ఏంటి? అని ఆమె ఇద్దరిని ప్రశ్నించింది. అసలేం జరిగిందంటే.. ఇటీవల కొద్ది రోజుల క్రితం హీరోయిన్ రీతూవర్మ ఓ ఫొటోషూట్కు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేశారు. ఆ పోటోలు చూసిన ప్రియదర్శి స్పందించారు. 'వావ్ రీతూ డార్లింగ్.. ఎంత అందంగా ఉన్నావో. నీ అందానికి ముగ్ధుడనయ్యా. మాటలు రావడం లేదు' అని కామెంట్ చేశారు. అయితే ఇది చూసిన నభా నటేశ్ మళ్లీ స్పందించింది. ఇతను మళ్లీ మొదలుపెట్టాడు.. ఆడవాళ్ల కామెంట్ సెక్షన్పై ఉన్నట్టుండి ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రతి ఒక్కరనీ డార్లింగ్ అని పిలవడమేంటని అసహనం వ్యక్తం చేసింది. నేను ఎవరినైనా డార్లింగ్ అని పిలిస్తే నీకేంటని ప్రియదర్శి బదులిచ్చారు. తాజా సంభాషణపై రీతూవర్మ కూడా రియాక్ట్ కావాల్సి వచ్చింది. నా కామెంట్ సెక్షన్లో మీ ఇద్దరి గొడవ ఏంటని నిలదీసింది. ప్రస్తుతం వీరి గొడవ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మొత్తానికి నెటిజన్స్కు ఫుల్ ఎంటర్టైనింగ్ ఉన్నప్పటికీ ఇందతా సినిమా ప్రమోషన్స్ కోసమేనని చర్చించుకుంటున్నారు. View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) Ahaa! Do not cross the line! Chuskundham.. https://t.co/8mwOpLC0di — Nabha Natesh (@NabhaNatesh) April 17, 2024 -
Ketika Sharma: టాలీవుడ్ హీరోయిన్ కేతిక శర్మ స్టన్నింగ్ లుక్స్.. ఫోటోలు
-
‘టెనెంట్’ సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
లేటు వయసులో బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. కానీ ఓ ట్విస్ట్!
బాలీవుడ్ భామ, టాలీవుడ్ హీరోయిన్ ఆర్తి చాబ్రియా ఇటీవల బేబీ బంప్తో ఉన్న ఫోటోలు నెట్టింట వైరలయ్యాయి. త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనుందని వార్తలొచ్చాయి. కానీ తాజాగా ఆర్తి చాబ్రియా ఫ్యాన్స్కు గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పటికే తాను బిడ్డకు జన్మనిచ్చి నెల రోజులు పూర్తయిందని రాసుకొచ్చింది. ఇదొక అద్భుతమై, కష్టమైన ప్రయాణమని రాసుకొచ్చింది. మార్చి 4వ తేదీన మగబిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించింది. తన బిడ్డకు యువన్ అని పేరు కూడా పెట్టినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా..2019లో విశారద్ బీదాస్సీని పెళ్లాడింది. అయితే యువన్ పుట్టకముందే తనకు గర్భస్రావం అయిందని ఛాబ్రియా వెల్లడించింది. గతంలో తనకు గర్భస్రావం జరిగిందని.. అందుకే తన ప్రెగ్నెన్సీ గురించి ముందుగా మాట్లాడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. 41 ఏళ్ల వయసులో డెలివరీ కావడం అంటే.. 20 లేదా 30 ఏళ్లలో ఉన్నంత సులభం కాదని నటి చెప్పుకొచ్చింది. అయితే ఇది నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిందని.. కానీ ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరని అన్నారు. కేవలం బిడ్డను కనాలని మహిళలపై ఒత్తిడి తెస్తున్నారని ఆర్తి అన్నారు. చివరికీ నేను ఆశలు వదులుకున్న టైంలో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్గా వచ్చిందని.. దీంతో నేను, నా భర్త చాలా ఆనందంగా ఫీలయ్యామని తెలిపింది. ఆర్తి తన ఇన్స్టాలో రాస్తూ..' ఈ ఫోటో మిమ్మల్ని మోసం చేయదు. ఎందుకంటే ఈ ప్రయాణం అంత సులభం కాదు. తల్లి కావాలనుకుంటున్న మహిళలకు.. ఆ కోరిక తీరనప్పుడు పడే బాధ, కష్టాలు నాకు తెలుసు. ఎందుకంటే నేను చాలా కష్టాలు పడ్డాను. నేను ఎప్పుడు నవ్వుతూ, అందంగా కనిపించగలను కాబట్టి ఇది చాలా సులభమని నేను ఎప్పుడూ అనుకోను. కానీ చివరికి ఆ దేవుడు నా పట్ల దయతో ఉన్నాడు. మన కోరుకున్న దానికోసం ఒత్తిడికి దూరంగా ఉంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మనకు అంతా మంచే జరుగుతుంది.' అని రాసుకొచ్చింది. కాగా.. ఆర్తి చాబ్రియా బాలీవుడ్లో ఆవారా పాగల్ దీవానా, షూటౌట్ ఎట్ లోఖండ్వాలా, తుమ్సే అచ్చా కౌన్ హై, షాదీ నంబర్ 1 వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. చాబ్రియా చివరిసారిగా 2013లో విడుదలైన పంజాబీ చిత్రం వ్యాహ్ 70 కిమీలో కనిపించింది. అప్పటి నుంచి ఆమె పెద్దగా సినిమాల్లో నటించలేదు. టాలీవుడ్లో మధుర క్షణం, ఒకరికి ఒకరు, ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి సినిమాలు చేసింది. చింతకాయల రవి మూవీలో ఐటం సాంగ్లో మెరిసింది. తెలుగులో చివరగా గోపి గోడ మీద పిల్లి చిత్రంలో నటించింది. View this post on Instagram A post shared by Aarti Chabria (@aartichabria) -
ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎక్కడో తెలుసా?
బహు భాషా నటిగా, హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ రాశీఖన్నా. ఈ ఢిల్లీ భామ గ్లామరస్ పాత్రల్లో మెప్పించింది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది. టాలీవుడ్తో పాటు తమిళంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల బాలీవుడ్ యోధ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం సబర్మతి రిపోర్ట్, అరణ్మై-4 చిత్రాల్లో కనిపించనుంది. తెలుగులో చివరిసారిగా నాగ చైతన్య సరసన థ్యాంక్ యూ చిత్రంలో నటించింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్లో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కొత్త ఇంటిలో పూజలు నిర్వహిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అయితే గతంలోనే హైదరాబాద్లో రెండు ఇళ్లు కొన్న రాశి.. ప్రస్తుతం మూడో ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రాశి ఖన్నా నూతన గృహా ప్రవేశానికి సంబంధించిన పిక్స్ ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ వేడుకలో సన్నిహితులు, స్నేహితులను మాత్రమే పాల్గొన్నారు. కాగా.. రాశి నటించిన'యోధ' మార్చి 15న థియేటర్లలో విడుదలైంది. Raashii Khanna has recently purchased a new house in Hyderabad 🤩 House warming #RaashiiKhanna pic.twitter.com/e5BLW8OmrP — Raashi khanna Lovers (@Raashi_lovers) April 5, 2024 -
' నాలుగు రోజులు పట్టిందట'.. మెగా కోడలి స్టన్నింగ్ వీడియో వైరల్!
మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇటీవలే వేకేషన్ నుంచి తిరిగొచ్చింది. వరుణ్ తేజ్తో పెళ్లి తర్వాత తొలిసారి ట్రిప్కు వెళ్లిన లావణ్య ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంది. లావణ్య పెళ్లి తర్వాత ఆమె నటించిన మిస్ ఫర్ఫెక్ట్ వెబ్ సిరీస్తో ప్రేక్షకులను అలరించింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే లావణ్య.. తాజాగా షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. జిమ్లో తన వర్కవుట్స్కు సంబంధించిన వీడియోను లావణ్య ఇన్స్టాలో షేర్ చేసింది. అత్యంత కఠినమైన సాధన చేస్తూ కనిపించింది. ఈ వీడియోను చూసిన పలువురు లావణ్య సూపర్బ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లావణ్య తన ఇన్స్టాలో రాస్తూ..'నాలుగు నెలల తర్వాత జిమ్కు వచ్చా. మునుపటిలా మళ్లీ సాధన చేయడానికి నాలుగు రోజులు పట్టింది. నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఇప్పుడైతే మొత్తానికి మళ్లీ నా దారిలోకి వచ్చా' అంటూ రాసుకొచ్చింది. కాగా.. దాదాపు ఏడేళ్ల క్రితం లావణ్య త్రిపాఠి, సందీప్ కిషన్, జాకీష్రాఫ్ ప్రధాన పాత్రల్లో 'మాయావన్' చిత్రం 'ప్రాజెక్ట్ z' రిలీజ్ కానుంది. ఈ సినిమా ఏప్రిల్ 6న థియేటర్లలో సందడి చేయనుంది. 2017లో తమిళంలో విడుదలైన ఏడేళ్ల తర్వాత ఇప్పుడు తెలుగులో విడుదల చేయడం ఏంటి అని సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) -
పెళ్లి వార్తలపై స్పందించిన టాలీవుడ్ హీరోయిన్.. ఏకంగా ఐదుసార్లు!
టాలీవుడ్ హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గీతాంజలి. హారర్ థ్రిల్లర్గా వచ్చిన బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్గా గీతాంజలి మళ్లీ వచ్చింది అనే టైటిల్తో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రీలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన అంజలి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన పెళ్లిపై వస్తున్న రూమర్స్పై స్పందించింది. పెళ్లి రూమర్స్పై అంజలి స్పందిస్తూ.. ' ఇప్పటికే నాకు తెలియకుండా నాలుగుసార్లు పెళ్లి చేశారు. మళ్లీ ఐదోసారి కూడా చేస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నేను కూడా చూశా. ఏకంగా పెళ్లి చేసుకుని వేరే ఇంట్లో ఉంటున్నట్లు రాశారు. వాళ్లకు తెలియని ఏంటంటే.. నేను అవుట్ డోర్ షూటింగ్స్లోనే ఎక్కువగా ఉంటున్నా. ఆ వార్తలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అవన్నీ ఫేక్ న్యూస్. కానీ నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటా.. అది ఇప్పుడైతే కాదు. దానికి ఇంకా టైముంది' అని చెప్పుకొచ్చింది. కాగా.. గీతాంజలి మళ్లీ ఏప్రిల్ 11న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. గీతాంజలి.. విశ్వన్ సేన్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలోనూ కనిపించనుంది. అంతే కాకుండా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఆ తర్వాత నవీన్ పొలిశెట్టితో ఓ చిత్రం నటించనుంది. వీటితో పాటు మరో 6 సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. -
'వారికి దూరంగా ఉండటమే మంచిది'.. మంగళవారం బ్యూటీ పోస్ట్ వైరల్!
ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్లోనూ అడుగుపెట్టి యూత్లో క్రేజ్ దక్కించుకున్న బ్యూటీ పాయల్ రాజ్పుత్. గతేడాది మంగళవారం సినిమాతో బాక్సాఫీస్ను షేక్ చేసింది. అజయ్ భూపతి డైరెక్షన్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. అయితే పాయల్ టాలీవుడ్లో అంతకుముందు ఆర్డీఎక్స్ లవ్’, వెంకీమామ, డిస్కోరాజా, తీస్ మార్ఖాన్, జిన్నా చిత్రాల్లో కనిపించింది. మంగళవారం మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న పాయల్ తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. అదేంటో మీరు చూసేయండి. పాయల్ తన ఇన్స్టాలో రాస్తూ.. 'ఎవరైతే మిమ్మల్ని కిందకు లాగేందుకు యత్నిస్తారో అలాంటివారికి దూరంగా ఉండండి. అలాగే పరిష్కారం సాధ్యం కానీ సమస్యలకు దూరంగా వెళ్లండి. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారిని దూరం పెట్టండి. మీకు ఏదైతే హానికరంగా భావిస్తారో వాటన్నింటికీ దూరంగా ఉండటమే మంచిది. అంతే కాదు ఆరోగ్యానికి మంచిది కూడా' అంటూ తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
అలాంటి సినిమాలు చూడను.. కానీ: హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్
దక్షిణాదిలో కథానాయకిగా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి ఆండ్రియా. కేవలం నటిగా మాత్రమే కాకుండా ఒక గాయనీ, గీత రచయిత, డబ్బింగ్ ఆర్టిస్ట్గా రాణిస్తున్నారు. డబ్బింగ్ కళాకారిణిగా కెరీర్ను ప్రారంభించిన ఆండ్రియా ఇప్పుడు హీరోయిన్గా కూడా రాణిస్తున్నారు. ఒకవైపు సింగర్గా రాణిస్తూన్నారు. అదే విధంగా హీరోయిన్గానే నటిస్తానని స్టాండ్ తీసుకోలేదు. పాత్రలో సత్తా ఉంటే విలనిజాన్ని పండించడానికై నా, క్యారెక్టర్ ఆర్టిస్టుగానైనా నటించడానికి రెడీ అంటోంది. అలా వడచైన్నె చిత్రంలో తన భర్తను చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకునే పాత్రలో మెప్పించారు. మరోపక్క సంగీత కచేరీలతో బిజీగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. ఆండ్రియా తాజాగా నటించిన కా చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని శుక్రవారం తెరపైకి రానుంది. ఇది యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా రూపొందించారు. ఈ సందర్బంగా ఆండ్రియా ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను హారర్, వయలెన్స్ ఉన్న కథా చిత్రాలను చూడనని.. అలాంటి చిత్రాలు తనకు నచ్చవని చెప్పారు. అయితే అలాంటి కథా చిత్రాల్లో నటిస్తానని మాత్రం చెప్పారు. చూడడం వేరు.. నటించడం వేరు అనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. కాగా మిష్కిన్ దర్శకత్వంలో కథానాయకిగా నటించిన మరో హారర్, ధ్రిల్లర్ కథా చిత్రం పిశాచి- 2 నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. -
Family Star Trailer HD Stills: విజయ్ చెంప చెళ్లుమనిపించిన మృణాల్.. ట్రైలర్ అదిరిపోయింది (ఫోటోలు)
-
ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా.. తెలుగులో ఆ ఒక్క సినిమా మాత్రమే!
నివేద్యం సినిమాతో మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ భామ. ఈ భామ తన అందంతో మలయాళంలో తనదైన స్థానాన్ని సంపాదించుకుంది. మలయాళంతో పాటు కన్నడ,తమిళం చిత్రాల్లో నటించింది. సినిమాల్లో సక్సెస్ సాధించిన భామ.. తెలుగులో కేవలం ఒకే ఒక్క సినిమా మాత్రమే చేసింది. టాలీవుడ్ హీరో తనీశ్ నటించిన మంచివాడు అనే చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు లక్ష్మి నారాయణ దర్శకత్వం వహించారు. తెలుగులో పెద్దగా ఛాన్సులు రాకపోయినప్పటికీ తమిళం, కన్నడ, మలయాళంలో చాలా సినిమాల్లో నటించింది. అయితే పెళ్లయ్యాక నటనకు కాస్త దూరంగా ఉన్న భామ.. గతంలో భర్తతో విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఇలాంటి వాటిపై ఆమె కనీసం స్పందించలేదు. 2018లో చివరిసారిగా ఖిలాఫత్ అనే మలయాళ చిత్రంలో నటించిన భామ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ అలరిస్తోంది. తాజాగా భామ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Bhamaa (@bhamaa) -
'నేను అందంగా లేనని తెలుసు'.. సమంత షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది యశోద మూవీతో మెప్పించిన సామ్ మయోసైటిస్ వ్యాధి బారిన పడి ఆ తర్వాత కోలుకుంది. ఇప్పుడిప్పుడే తన మళ్లీ రీస్టార్ట్ అవుతోంది. టాలీవుడ్ హీరో నాగచైతన్యను పెళ్లాడిన ముద్దుగుమ్మ ఆ తర్వాత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సమంత ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇండియా టుడే కాన్క్లేవ్ -2024లో పాల్గొన్న సామ్ తాను అందంగా.. ఇతర అమ్మాయిల్లాగా కూడా కనిపించడం కూడా లేదని వెల్లడించింది. అంతే కాకుండా పుష్ప చిత్రంలో ఐటమ్ సాంగ్ చేయడంపై సమంత మాట్లాడింది. సమంత మాట్లాడుతూ... 'రాజీ (ఫ్యామిలీ మ్యాన్-2) చేయడం లాంటిదే ఇలాంటి నిర్ణయం. మీ చుట్టూ మంచి వ్యక్తులు లేకపోతే.. మన అభిప్రాయాలను గౌరవించుకోవడం మంచి విషయంగా భావిస్తున్నా. మరో వైపు నేను తప్పులు చేయాలి.. వాటి నుంచి నేర్చుకోవాలి. అలాగే నా గట్స్ను పెంచుకోవాలి. పుష్ప చిత్రంలో ఊ అంటావా.. అనే సాంగ్ చేయాలనే నిర్ణయం నాదే. నేను ఒక నటిగా ఆ కోణాన్ని అన్వేషించాల్సి సమయం వచ్చిందని' తెలిపింది. ఆ తర్వాత తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతూ.. 'నా జీవితంలో ఎప్పుడూ చాలా అసౌకర్యంగా ఉంటా. ఆ విషయంలో నాపై నాకు పూర్తి నమ్మకంగా లేను. నేను అందంగా లేను అనే భావన ఉంది. అంతే కాదు ఇతర అమ్మాయిల్లాగా కూడా కనిపించను" అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత సెక్సీ అనే పదం తనకు సెట్ కాదని తెలిపింది. కాగా.. సమంత చివరిసారిగా ఖుషి చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్తో కలిసి స్పై సిరీస్ సిటాడెల్ ఇండియన్ వర్షన్లో కనిపించనుంది. -
ఆమె మాటలకు షాకయ్యా.. అంతా ఆ రోజు రాత్రే: నటి మాజీ భర్త షాకింగ్ కామెంట్స్
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటి లక్ష్మి పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు హీరోయిన్గా దక్షిణాది సినిమాల్లో మెప్పించింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించింది. ఆమె హీరోయిన్గా నటించిన పలు చిత్రాలు సూపర్ హిట్గా నిలిచాయి. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ తనదైన నటనతో మెప్పించారు. అయితే ఆమె నటనతో పాటు తన వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె మాజీ భర్త, తమిళ నటుడు మోహన్ శర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. లక్ష్మి, మోహన్ శర్మ జంటగా చాలా సినిమాల్లో నటించారు. ఆ తర్వాత వీరి పరిచయం ప్రేమగా మారి.. 1975లో వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లయిన ఐదేళ్లకే భేదాభిప్రాయాలు రావడంతో 1980లోనే విడిపోయారు. తాజా ఇంటర్వ్యూలో లక్ష్మి తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లి చేసుకుంటే జీవితాంతం కుక్కలా నీ వెంటే ఉంటానని తనతో చెప్పిందని మోహన్ శర్మ వెల్లడించారు. మోహన్ శర్మ మాట్లాడుతూ.. 'ఓసారి నేను, లక్ష్మి షాప్కు వెళ్లాం. అక్కడ ఒక సెంట్ కొనాలని చెప్పా. అప్పట్లో దాని ధర రూ.500. జీవితంలోకి ఆహ్వానిస్తే.. నీ కుక్కలా ఉంటానని లక్ష్మి నన్ను అడిగింది. ఆ మాటలకు నేను షాకయ్యా. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. తొలిసారి ఓ అమ్మాయి తన ప్రేమను వ్యక్తం చేసింది. ఆ సమయంలో లక్ష్మి మాటలను సీరియస్గా తీసుకున్నా. ఆ తర్వాత కాల్ చేసి తన రూమ్కు రమ్మని పిలిచింది. నేను వెంటనే హోటల్కు వెళ్లా. మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని అడిగింది. ప్రస్తుతం కెరీర్పై దృష్టి పెడుతున్నానని.. పెళ్లి గురించి ఆలోచనే లేదని చెప్పా. కానీ.. పెళ్లి చేసుకోవాలని లక్ష్మి అడిగాక నేను ఆమె నుదుటన కుంకుమ పెట్టా. తాను గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చా. ఆ రాత్రే మేం భార్యభర్తలం అయ్యాం. ఆ తర్వాత మేం చెన్నైకి వచ్చి లాయర్ ద్వారా మా పెళ్లి విషయాన్ని మీడియాకు తెలియజేశాం' అని చెప్పారు. పెళ్లి తర్వాత మాకు కలిసే అవకాశం చాలా తక్కువగా ఉండేదని మోహన్ శర్మ తెలిపారు. అయితే లక్ష్మి చాలా తప్పులు చేశారని.. వాటన్నింటి గురించి తాను ఇప్పుడు చెప్పలేనని అన్నారు. ఆమె తన జీవితంలోకి మరో వ్యక్తిని రానిచ్చారని ఆరోపించారు. కూతురు ఐశ్వర్య, లక్ష్మి మధ్య తరచూ గొడవలు కూడా అయ్యేవని ఆయన వెల్లడించారు. కాగా.. 1980లో మోహన్తో విడాకులు తీసుకున్న లక్ష్మి.. ఆ తర్వాత దర్శకుడు శివచంద్రన్ను పెళ్లి చేసుకున్నారు. -
సముద్రం తీరంలో తేజస్వీ ప్రకాశ్ చిల్.. హెబ్బా పటేల్ స్మైలీ లుక్స్..!
మెక్సికోలో చిల్ అవుతోన్న తేజస్వీ ప్రకాశ్.. మంచుకొండల్లో భూమిక చావ్లా చిల్.. లైట్ బ్లూ డ్రెస్లో హెబ్బా పటేల్ స్మైలీ లుక్స్.. పింక్ డ్రెస్లో రీతూ చౌదరి హోయలు.. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Tejasswi Prakash (@tejasswiprakash) -
అమిత్ షాను కలిసిన టాలీవుడ్ డైరెక్టర్..!
హనుమాన్ మూవీ బ్లాక్బస్టర్ హిట్ కొచ్చిన ప్రశాంత్ వర్మ తాజాగా కేంద్ర హోమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. హనుమాన్ హీరో తేజ సజ్జాతో కలిసి ఆయనకు ఆంజనేయస్వామి విగ్రహాన్ని బహుకరించారు. హనుమాన్ సినిమాకు ప్రోత్సాహం అందించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. కాగా.. ఇవాళ సికింద్రాబాద్లో జరిగిన భాజపా సోషల్ వారియర్స్ సమావేశానికి అమిత్ షా హాజరయ్యారు. సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసిన హనుమాన్ సూపర్ హిట్గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలోనూ సందడి చేయనుంది. థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించారు. View this post on Instagram A post shared by Prasanth Varma (@prasanthvarmaofficial) -
రాత్రి పది తర్వాత అలా చేయడం ఇష్టముండదు: తాప్సీ కామెంట్స్ వైరల్
టాలీవుడ్లో ఝుమ్మంది నాదం సినిమాతో ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ తాప్సీ. ఇటీవల తాను పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలొచ్చాయి. కానీ వాటిన్నింటిని కొట్టిపారేసింది. ఈ భామకు టాలీవుడ్లో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్కు మకాం మార్చింది. హిందీలో సినిమాలు చేస్తూ అలరిస్తోంది. అయితే ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే తాప్సీ తన పర్సనల్ విషయాలను మాత్రం సీక్రెట్గానే మెయింటెన్ చేస్తోంది. కానీ ఇండస్ట్రీలో జరిగే ఈవెంట్స్, పార్టీల్లో కూడా పెద్దగా కనిపించదు. ఇటీవల జామ్నగర్లో జరిగిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సైతం హాజరు కాలేదు. మీరేందుకు పార్చీలకు వెళ్లరంటూ ఆమెను ప్రశ్నించగా ఆసక్తికర సమాధానాలిచ్చింది. రాత్రి 10 గంటల తర్వాత పార్టీలు చేసుకోవడం తనకు ఇష్టముండదని వెల్లడించింది. తాప్సీ మాట్లాడుతూ..'పెద్ద స్టార్స్కి మెసేజ్లు పంపమని కొందరు చెప్పారు. అలా అయితేనే నన్ను పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానిస్తారు. కానీ నేను అలా చేయలేను. ఎందుకంటే పొద్దున్నే నిద్ర లేస్తా. అందుకే త్వరగా పడుకోవాలి. నాకు సిగరెట్, మందు తాగే అలవాటు లేదు. పార్టీలకు వెళ్లి ఏం చేయాలో నాకు తెలియదు' అని అన్నారు. అంతే కాకుండా.. 'నాకు పరిచయం లేని వ్యక్తులతో పార్టీ చేసుకునే ఉద్దేశం లేదు. వారితో ఏమి మాట్లాడాలనేది నాకు తెలియదు. పార్టీలకు రాకపోతే ఏం పనికి రారని అర్థం కాదు. ఇలా పార్టీలు చేసుకుంటే బాలీవుడ్లో ముందుకెళ్లడం చాలా సులభం. అంతే కాకుండా రాత్రి 10 గంటల తర్వాత పార్టీ చేసుకోవడం నాకు భారంగా అనిపిస్తుంది. నేను కేవలం ఇప్పటివరకు నా కష్టంతోనే ఇక్కడి వరకు వచ్చాను' అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. తాప్సీ, మథాయుస్ బ్రో అనే వ్యక్తితో డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. -
పెళ్లైన వ్యక్తితో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. వేదిక ఫిక్స్!
మరికొద్ది గంటల్లో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి పీటలెక్కనుంది. తీన్మార్, ఒంగోలు గిత్త, బ్రూస్లీ సినిమాలతో మెప్పించిన కృతి కర్బందా తన ప్రియుడితో ఏడడుగులు వేయనుంది. ఇప్పటికే పెళ్లి తేదీని ప్రకటించిన భామ.. మంగళవారం మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టనుంది. రెండేళ్లుగా తన ప్రియుడు పుల్కిత్ సామ్రాట్తో డేటింగ్లో ఉన్న ముద్దుగుమ్మ వాలైంటైన్స్ డే సందర్భంగా పెళ్లి గురించి హింట్ ఇచ్చింది. వీరి గ్రాండ్ వెడ్డింగ్ హర్యానాలోని మానేసర్లో జరగనుంది. ఐటీసీ గ్రాండ్ భారత్లో వీరి వివాహానికి వేదికగా నిలవనుంది. వీరి ఇరువురి కుటుంబాలు ఢిల్లీకి చెందినవారు కావడంతో అనువుగా ఉండేందుకు మానేసర్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కృతి, పుల్కిత్ జంటగా 'వీరే కి వెడ్డింగ్', 'తైష్', 'పాగల్పంటి' చిత్రాలలో కనిపించారు. కాగా.. పుల్కిత్కి గతంలోనే శ్వేతా రోహిరా అనే అమ్మాయితో వివాహమైంది. ఈ జంట 2015లోనే విడిపోయారు. కాగా.. బోణి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి కర్బందా. ఆ తర్వాత అలా మొదలైంది, తీన్మార్, ఒంగోలు గిత్త, బ్రూస్లీ సినిమాలతో మెప్పించింది. అంతే కాకుండా బాలీవుడ్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ముద్దుగుమ్మ చివరిసారిగా 14 ఫేరే చిత్రంలో కనిపించింది. తాజాగా కృతి నటించిన రిస్కీ రోమియో చిత్రం మే నెలలో విడుదల కానుంది. కాగా.. పుల్కిత్ ఇటీవలే ఫుక్రే-3 చిత్రంలో కనిపించారు. View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) -
ఆ డెరెక్టర్పై మిల్కీ బ్యూటీ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న భామ.. కొత్త ఏడాదిలో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తోంది. గతంలో ఓటీటీలో రిలీజైన ఓదెల రైల్వేస్టేషన్ సూపర్ హిట్గా నిలిచింది. దీంతో మేకర్స్ సీక్వెల్గా ఓదెల-2 తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నా కీలక పాత్రలో కనిపించనుంది. మహాశివరాత్రి సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ డైరెక్టర్ సంపత్ నంది చేసిన ట్వీట్పై స్పందించింది. ఇలాంటి వ్యక్తిని తన 19 ఏళ్ల కెరీర్లో ఎప్పుడు చూడలేదంటూ ప్రశంసలు కురిపించింది. టీమ్లోని ప్రతి ఒక్కరి ప్రతిభను గుర్తించి మెచ్చుకోవడం ఆయనకే చెల్లిందన్నారు. ఇటీవల రిలీజైన తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్కు విశేష స్పందన రావడంపై డైరెక్టర్ సంపత్ నంది ట్విటర్ వేదికగా కాస్ట్యూమ్ డిజైనర్ నుంచి తమన్నా పర్సనల్ స్టాఫ్ను సైతం మెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే అతనిపై తమన్నా ప్రశంసలు కురిపించింది. కాగా.. సంపత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గతంలో సంపత్ నంది డైరెక్షన్లో తెరకెక్కించిన రచ్చ బెంగాల్ టైగర్, సీటీమార్ చిత్రాల్లో తమన్నా హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. Thankyou for your kind words @IamSampathNandi , it means a lot✨ I have always strongly believed that filmmaking is a collaborative effort. Even if it begins with one person’s vision, it’s the fusion of each team member’s perspective that matters and Sampath truly understands… https://t.co/SVcRFRMt6O — Tamannaah Bhatia (@tamannaahspeaks) March 10, 2024 -
'ఆ తెలుగు హీరో నా మొదటి క్రష్'.. యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల..!
2019లో విడుదలైన 'మల్లేశం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ, తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఆ తర్వాత పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'తో మరింత ఫేమస్ అయింది. గతేడాది సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతల చిత్రంలోనూ అనన్య ఓ పాత్రలో అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం అనన్య ప్రధాన పాత్రలో వస్తోన్న హారర్ మూవీ తంత్ర. ఇందులో ధనుశ్ రఘుముద్రి హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనన్య తన కెరీర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది. అంతే కాదు టాలీవుడ్ యంగ్ హీరో అంటే క్రష్ అని ఓపెన్ అయింది ముద్దుగుమ్మ. ఆ వివరాలేంటో చూద్దాం. (ఇది చదవండి: అనన్య నాగళ్ల కొత్త మూవీ.. సాంగ్ రిలీజ్ చేసిన మంగళవారం బ్యూటీ!) అనన్య మాట్లాడుతూ.. 'తనకు కాబోయేవాడు నిజాయితీగా ఉంటే చాలు. అలాంటి వాడైతే ఓకే. సరైన వ్యక్తి కోసం వెతుకుతున్నా. ఇండస్ట్రీ వాళ్లయితే కొంచెం కష్టం. ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావొచ్చు. సినిమా వాళ్లకు ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఇండస్ట్రీలో నా ఫస్ట్ క్రష్ నాగశౌర్య. నా చిన్నప్పుడు అల్లు అర్జున్, మహేశ్ బాబు, ప్రభాస్ను అంటే చాలా ఇష్టం. వాళ్ల సినిమాలు చూస్తూ పెరిగా. నాకు ఇంతవరకు ఎవరు ప్రపోజ్ చేయలేదు. ఇండస్ట్రీ వాళ్లను చూస్తే కమిట్ అయి ఉంటారని అనుకుంటారు. కానీ నేను మాత్రం కమిటేడ్ కాదు. అంతేకాదు నాకు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురవ్వలేదు ' అని అన్నారు. -
ప్రియుడిని పెళ్లాడనున్న టాలీవుడ్ హీరోయిన్.. డేట్ ఫిక్స్
ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసినా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. టాలీవుడ్లో ఇటీవల యంగ్ ఆశిష్ రెడ్డి,పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సైతం తన ప్రియుడిని పెళ్లాడింది. అంతే కాకుండా ఈ నెలలోనే మరో హీరోయిన్ కృతి కర్బందా సైతం వివాహాహబంధంలోకి అడుగుపెట్టనుంది. తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్ ఈ నెలలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఈనెల 12 తన ప్రియుడితో ఏడడుగులు నడవనుంది. ఇంతకీ ఎవరా ఆ హీరోయిన్?.. పూర్తి వివరాలేంటో చూద్దాం. బాలీవుడ్ భామ మీరా చోప్రా తెలుగువారికి కూడా సుపరిచితమే. 1920: లండన్ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ . ఆ తర్వాత 'గ్యాంగ్ ఆఫ్ గోస్ట్స్', 'సెక్షన్ 375'లో సినిమాల్లో కనిపించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు సోదరి అయిన మీరా చోప్రా టాలీవుడ్లో పవన్ కల్యాణ్ సినిమా ‘బంగారం’తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వాన,గ్రీకువీరుడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. కానీ సౌత్ ఇండియాలో ఆమె ఎక్కువగా తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. ఆమె చివరిగా 2019లో సెక్షన్ 375 చిత్రం ద్వారా మెప్పించింది. సుమారు నాలుగేళ్ల తర్వాత ఆమె మళ్లీ సఫేద్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. గతంలోనే ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్నట్లు మీరా చోప్రా ప్రకటించింది. గతేడాది క్రిస్మస్ సందర్భంగా తన ప్రియుడు రక్షిత్తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. తాజాగా ఈనెల 12 గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా ఈ జంట ఒక్కటవ్వనుంది. వీరి పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. రాజస్థాన్లోని జైపూర్లో అత్యంతం వైభవంగా వీరి పెళ్లి జరగనుంది. ఇప్పటికే మీరా ఫ్యామిలీ ఏర్పాట్లలో బిజీగా మారిపోయింది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
టాలీవుడ్ హీరోయిన్కు సీఎం కుమారుడు ఖరీదైన గిఫ్ట్.. వైరలవుతోన్న ట్వీట్!
హీరోయిన్ నివేదా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళం తన అందం, అభినయంతో ప్రేక్షకులనున ఆకట్టుకుంటుంది. ‘మెంటల్ మదిలో’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె చిత్రలహరి, అలా వైకుంటపురంలో సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు పొందింది. చేసింది కొన్ని సినిమాలే అయినా సౌత్లో మంచి క్రేజ్ను సంపాదించుకుంది. గతేడాది యంగ్ విశ్వక్ సేన్ సరసన దాస్ కా ధమ్కీ చిత్రంలో హీరోయిన్గా అలరించిన భామ.. ఇప్పుడు బాలీవుడ్లోనూ నటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో నటన, మోడలింగ్లో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. కొన్నాళ్ల ముందు కారు రేసింగ్ నేర్చుకుంది. అప్పట్లో రేసు ట్రాక్ మీద కారులో ఉన్న ఫొటోలు వైరలయ్యాయి. అంతేకాదు ఇటీవలే మధురైలో జరిగిన బ్యాడ్మింటర్ ఛాంపియన్షిప్ పోటీలోని మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో కప్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తనపై వస్తున్న వార్తలన్ని అవాస్తమని కొట్టిపారేసింది. మీరు ఏదైనా రాసేముందు దయచేసి నిజాలు ఏంటో తెలుసుకోవాలని సూచించింది. ఇలాంటి వాటితో తమ కుటుంబం ఒత్తిడిలో ఉందని.. అనవసరంగా ఒక అమ్మాయి జీవితంపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని కోరింది. ఈ మేరకు తన ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేసింది. నివేదా పేతురాజ్ తన ట్వీట్లో రాస్తూ..'నా కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని ఇటీవల తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయినప్పటికీ నేను మౌనంగా ఉన్నా. ఎందుకంటే దీని గురించి మాట్లాడే బుద్దిలేని కొందరు వ్యక్తులు ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేసే ముందు వారు అందుకున్న సమాచారాన్ని ధృవీకరించడానికి కొంతైనా మానవత్వంతో ఉంటారని భావించా. వాటి వల్ల కొన్ని రోజులుగా నేను, మా కుటుంబం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాం. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి.' అంటూ విజ్ఞప్తి చేసింది. ఆ తర్వాత రాస్తూ.. 'నేను చాలా గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చా. 16 ఏళ్ల వయసు నుంచే ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నా. నా కుటుంబం ఇప్పటికీ దుబాయ్లోనే నివసిస్తోంది. మేము దాదాపు 20 ఏళ్లకు పైగా దుబాయ్లో ఉన్నాం. సినీ పరిశ్రమలో కూడా నాకు అవకాశాలు ఇప్పించమని నేను ఏ నిర్మాతను, దర్శకుడిని, హీరోను అడగలేదు. ఇప్పటికీ 20కి పైగా సినిమాలు చేశా. నేను ఎప్పుడూ డబ్బు కోసం అత్యాశ పడలేదని' రాసుకొచ్చింది. నా గురించి ఇప్పటివరకు మాట్లాడిన సమాచారం ఏదీ నిజం కాదు. మేము 2002 నుంచి దుబాయ్లో అద్దె ఇంట్లో నివసిస్తున్నాం. అలాగే 2013 నుంచి రేసింగ్ అంటే నా అభిరుచి. నిజానికి చెన్నైలో రేసులను నిర్వహించడం గురించి నాకు తెలియదు. నేను చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నా. జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్న తర్వాత మానసికంగా పరిణీతి సాధించా. అంతేకాదు.. మీ కుటుంబంలోని ఇతర స్త్రీలు కోరుకున్నట్లే గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నా. జర్నలిజంలో కొంత మానవత్వం మిగిలి ఉందని.. ఇకపై నా పరువు తీసేలా వ్యవహరించని ఇప్పటికీ విశ్వసిస్తున్నందున చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడం లేదు. ఒక కుటుంబం ప్రతిష్టను కించపరిచేలా మాట్లాడేముందు.. మీరు అందుకున్న సమాచారాన్ని ధృవీకరించుకోవాలని కోరుతున్నా. అలాగే మా కుటుంబాన్ని ఇకపై ఎలాంటి బాధలకు గురిచేయవద్దని మీడియా మిత్రులకు అభ్యర్థిస్తున్నా. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.' అంటూ రాసుకొచ్చింది. అసలేం జరిగిందంటే.. కాగా.. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ నివేదా పేతురాజ్కు 50 కోట్ల రూపాయల విలువైన ఇంటిని బహుమతిగా ఇచ్చారని సోషల్ మీడియాలో విపరీతమైన రూమర్స్ వచ్చాయి. ఆమె కోసం ఉదయనిధి స్టాలిన్ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నాడంటూ ఆరోపించారు. ఇదే విషయమై తమిళ సినీ ఇండస్ట్రీకి ఓ యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషయం తెలుసుకున్న నివేదా పేతురాజ్ ఘాటుగా స్పందించింది. అవన్నీ అవాస్తవాలేనంటూ ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. Lately there has been false news circulating about money being lavishly spent on me. I kept quiet because I thought people who are speaking about this will have some humanity to verify the information they receive before mindlessly spoiling a girl’s life. My family and I have… — Nivetha Pethuraj (@Nivetha_Tweets) March 5, 2024 -
'నా ఫస్ట్ క్రష్ ఆ స్టార్ క్రికెటర్'.. మనసులో మాట చెప్పేసిన జయసుధ!
జయసుధ.. ఈ పేరు తెలుగువారికి పరిచయం అక్కర్లేదు. అంతలా తెలుగు సినీ ప్రియుల గుండెల్లో తన పేరును లిఖించుకుంది. ఆనాటి స్టార్స్ ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు లాంటి దిగ్గజాల సరసన తనదైన నటనతో మెప్పించింది. తెలుగు, తమిళ తదితర భాషల్లో హీరోయిన్గా చాలా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత సహాయ నటిగా ఎన్నో సినిమాలు చేసింది. ఇప్పటికీ వెండితెరపై అభిమానులను అలరిస్తోంది. గతేడాది విజయ్ నటించిన చిత్రం వారీసు(వారసుడు)లో తల్లి పాత్రలో మెరిసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జయసుధ తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన బాల్యంలో చెన్నైలో చెపాక్ స్టేడియం(ఇప్పటి చిదంబరం స్టేడియం) దగ్గర్లోనే తమ నివాసముండేదని జయసుధ తెలిపింది. మా ఇంటికి.. గ్రౌండ్కు మధ్య ఒక రోడ్డు మాత్రమే ఉండేదని వివరించింది. అక్కడే ఉన్న హిందూ స్కూల్లో చాలామంది సినిమా, క్రికెట్ ప్రముఖులు కూడా చదువుకున్నారు. తనకు చిన్న వయసులో అక్కడే చాలా క్రికెట్ మ్యాచులు జరుగుతుండేవని పేర్కొంది. నేను చాలాసార్లు స్టేడియంలోకి వెళ్లి మ్యాచులు చూసేవాళ్లమని చెప్పుకొచ్చింది. ఆ రోజుల్లో తనకు ఆ సమయంలో పాకిస్థాన్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ అంటే క్రష్ ఏర్పడిందని ఆమె తెలిపింది. అప్పట్లో అందరికంటే అతను హ్యాండ్సమ్గా ఉండేవారని జయసుధ తెలిపింది. అంతే కాకుండా ఆయనను చాలామంది ఇష్టపడేవారని వెల్లడించింది. తాజా ఇంటర్వ్యూలో జయసుధ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. జయసుధ మాట్లాడుతూ.. 'ఫస్ట్ నేను క్రికెటర్ అవ్వాలని అనుకున్నా. సెకండ్ ఆప్షన్ సినిమా. ఇక మూడోది టీచర్ అవ్వాలని అనుకునేదాన్ని. కానీ ఈ క్యారెక్టర్ అన్ని సినిమాల్లో చేశాను. లక్కీగా 12 ఏళ్లకే మొదటి సినిమా చేశా. అప్పట్లో మంజుల గారు చాలా ఫేమస్. ఆమెకు నేనంటే చాలా ఇష్టం. ఆమె చేయలేని సినిమాలకు నన్ను పరిచయం చేసేవారు. అలా శోభన్ బాబుతో మొదటి సినిమా చేశా. నా అసలు పేరు సుజాత. అప్పటికే మలయాళంలో ఆ పేరుతో మరో హీరోయిన్ ఉండేది. గుహనాథన్ అనే ఒక తమిళ రైటర్ జయసుధ అనే పేరును సూచించారు. నాకు మొదటి నుంచి సినిమా చేసే లక్షణాలు లేవు. నాకు క్రికెట్ అంటే పిచ్చి. షూటింగ్లో ఉన్నప్పుడు కామెంటరీ వినేందుకు సిగ్నల్ కోసం అలా వెళ్లిపోయేదాన్ని. క్రికెట్లో నా ఫేవరేట్ సునీల్ గవాస్కర్, ఏక్నాథ్ సోల్కర్ అని ఒకాయన ఉండేవారు. సినిమాల వాళ్లకు క్రికెటర్స్ మీద క్రష్ ఉంటుంది. అలాగే ఆ రోజుల్లో టీనేజర్గా ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ నా క్రష్. అతను చాలా హ్యాండ్సమ్గా ఉండేవారు. నేనే కాదు.. చాలామంది ఆయన్ను చూసేందుకే మ్యాచులకు వచ్చేవారు. ' అంటూ తన మనసులోని మాటను బయటకు చెప్పేసింది.
Pagination
OTT: ఈ శుక్రవారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలివే!
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
జాక్వెలిన్ ఫెర్నాండేజ్తో పేపర్ బాయ్, అరి దర్శకుడు?
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
భారత్లో 10 లక్షలు దాటిన ఉబర్ డ్రైవర్ల సంఖ్య
శ్రీరామనవమి, హనుమాన్ జయంతి మనం చేయలేదా?: రేవంత్
విరాట్ కోహ్లి సింగిల్ హ్యాండ్ సిక్స్.. వీడియో వైరల్
'మాత్రు' సినిమా పోస్టర్ లాంచ్ చేసిన విజయేంద్ర ప్రసాద్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (09-05-2024)
హీరోయిన్తో స్టార్ క్రికెటర్ డ్యాన్స్.. నువ్వు ఆల్రౌండరయ్యా సామీ! (ఫోటోలు)
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై ప్రొ.వసుంధర సంచలన వ్యాఖ్యలు
జమైకా నుంచి దుబాయ్ విమానం వెనక్కి.. కారణం ఇదే
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం శ్రీలంక జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. సుప్రీంలో అఫిడవిట్ దాఖలు
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement