-
గం గం గణేశా మూవీ ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
-
వినాయక చవితి చుట్టూ...
‘‘గం గం గణేశా’ దర్శకుడు ఉదయ్ నా వద్ద పని చేశాడు. అంకితభావం, కష్టపడే తత్వం ఉన్న అతనికి ఈ సినిమా తప్పకుండా సక్సెస్ ఇవ్వాలి’’ అని రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఆనంద్ దేవరకొండ హీరోగా, ప్రగతీ శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గం..గం..గణేశా’. ఉదయ్ శెట్టి దర్శకత్వంలో కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదలవుతోంది.ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో విజయేంద్ర ప్రసాద్, దర్శకులు వంశీ పైడిపల్లి, సాయి రాజేశ్ అతిథులుగా పాల్గొన్నారు. ‘‘గం గం గణేశా’ని థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు వంశీ కారుమంచి, కేదార్ సెలగంశెట్టి. ‘‘వినాయక చవితి చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా రూపొందించాం’’ అన్నారు ఉదయ్ శెట్టి. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘గం గం గణేశా’లో తొలిసారి ఎనర్జిటిక్ క్యారెక్టర్ చేశాను’’ అన్నారు. -
డర్టీ ఫెలో రెడీ
శాంతి చంద్ర హీరోగా, దీపికా సింగ్, ‘మిస్ ఇండియా 2022’ సిమ్రితి హీరోయిన్లుగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వం వహించిన చిత్రం ‘డర్టీ ఫెలో’. గూడూరు భద్రకాళీ సమర్పణలో జీయస్ బాబు నిర్మించిన ఈ చిత్రం ఈ 24న రిలీజ్కి రెడీ అయింది. ఈ సినిమా ట్రైలర్ని ‘బింబిసార’ మూవీ ఫేమ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘డర్టీ ఫెలో’ ట్రైలర్ బాగుంది.ఈ సినిమా విజయం సాధించి, యూనిట్కి మంచి పేరు రావాలి’’ అన్నారు. శాంతి చంద్ర, మూర్తి సాయి ఆడారి మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన చిత్రం ‘డర్టీ ఫెలో’. మా సినిమాలోని అన్ని పాటలకు మంచి స్పందన వచ్చింది. మా చిత్రంలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రామకృష్ణ .యస్, సంగీతం: డా. సతీష్ కుమార్ .పి. -
‘లవ్ మీ’ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
లవ్ మీ సినిమా స్టోరీ లీక్ చేసిన బ్యూటీ, క్లైమాక్స్ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)
-
సుహాస్ 'ప్రసన్నవదనం'మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'ఆ ఒక్కటీ అడక్కు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మృగాడితో రొమాన్స్.. బోల్డ్ సీన్లతో ట్రైలర్
'లవ్ మౌళి'గా చాలారోజుల తర్వాత ప్రేక్షకులు ముందుకు రానున్నారు నవదీప్. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అవనీంద్ర డైరెక్ట్ చేయగా.. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ పతాకాలపై సి స్పేస్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదల కానుంది. ఇందులో పంఖురి గిద్వానీ హీరోయిన్గా నటించగా. భావన సాగి, మిర్చి హేమంత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ప్రేమ అనేది లేకుండా ప్రపంచంలో మనుషులకు దూరంగా బతుకుతున్న ఒక వ్యక్తికి అనూహ్యంగా ప్రేమ దొరికితే ఎలా ఉంటుంది అనే కోణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మనుషులతో ఎలాంటి పరిచయం లేని వ్యక్తికి ప్రేమించే వ్యక్తి దొరికితే మనిషి ఎలా మారతాడు అనే విషయాన్ని కాస్త బోల్డ్గానే చెప్పినట్లు ట్రైలర్తో తెలుస్తోంది. ట్రైలర్లో అక్కడక్కడ రొమాన్స్ సీన్లు ఉన్నా.. అందులో ఏదో కంటెంట్ ఉంది అనేలా ట్రైలర్ను మేకర్స్ కట్ చేశారు. 2021లో ప్రారంభమైన ఈ సినిమా కరోనా సమయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొని ఆపై అనేక ఒడుదొడుకల నడుమ ఇటీవల ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తి అయ్యాయి. ఏప్రిల్ 19న ఈ సినిమా విడుదల కానుంది. -
'గీతాంజలి మళ్లీ వచ్చింది' మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
'గీతాంజలి మళ్లీ వచ్చింది' మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
Tamannaah Latest Photos: తమన్నా బ్యూటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు (ఫోటోలు)
-
గుర్తుండే ఫ్యామిలీ స్టార్
‘‘ఇరవైఒకటేళ్ల కింద ఏప్రిల్ 5న ‘దిల్’ సినిమా నిర్మాతగా ‘దిల్ రాజు’గా మారాను. 21 ఏళ్ల తర్వాత ఇదే తేదీన మా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా రిలీజ్ అవుతోంది. మాస్, క్లాస్, యూత్, ఫ్యామిలీ అనే తేడా లేకుండా అందరికీ నచ్చే కథతో ఈ చిత్రం రూపొందింది’’ అని ‘దిల్’ రాజు అన్నారు. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ‘ఫ్యామిలీ స్టార్’ వచ్చే నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో ‘దిల్’ రాజు ఇంకా మాట్లాడుతూ – ‘‘తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీ స్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం. మీలోనూ (ప్రేక్షకులు) ఫ్యామిలీ స్టార్స్ ఉంటారు. లేకపోతే ఈ సినిమా చూశాక ఫ్యామిలీ స్టార్ అవ్వాలని కోరుకుంటారు. ‘గీత గోవిందం’ తర్వాత పరశురామ్, విజయ్ కాంబి నేషన్లో రూపొందిన ఈ చిత్రం ఈ సమ్మర్లో అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని, విజయ్ దేవరకొండను, మృణాల్ ఠాకూర్ను ప్రతి తెలుగు ప్రేక్షకుడు, ప్రతి తెలుగు కుటుంబం కొన్నేళ్ల పాటు గుర్తుంచుకుంటారు’’ అని పరశురామ్ అన్నారు. -
‘బడే మియా చోటే మియా’ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
స్నేహానికి హద్దు లేదురా!
‘‘ఏ దర్శకుడికైనా ఫస్ట్ మూవీ బర్త్ లాంటింది. నా తొలి చిత్రం ‘డాన్ శ్రీను’ ని ఇప్పటికీ మర్చిపోలేను. మనమేంటో ఇండస్ట్రీకి తెలియజేసేదే తొలి సినిమా. ‘హద్దు లేదురా’ చిత్రం ట్రైలర్ చూస్తుంటే రాజశేఖర్ తొలిసారి దర్శకత్వం వహించినట్లు అనిపించడం లేదు. ఈ మూవీ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని డైరెక్టర్ గోపీచంద్ మలినేని అన్నారు. ఆశిష్ గాంధీ, అశోక్ హీరోలుగా, వర్ష, హ్రితిక హీరోయిన్లుగా, ఎస్తేర్ అతిథి పాత్రలో నటించిన చిత్రం ‘హద్దు లేదురా’. రాజశేఖర్ రావి దర్శకత్వంలో వీరేష్ గాజుల బళ్లారి నిర్మించారు. రావి మోహన్రావు సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ ఈ నెల 21న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి గోపీచంద్ మలినేని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘‘స్నేహం నేపథ్యంలో రూపొందిన చిత్రమిది’’ అన్నారు రాజశేఖర్ రావి. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులు మా యూనిట్ని ప్రోత్సహించాలి’’ అన్నారు వీరేష్ గాజుల బళ్లారి. నటీనటులు ఆశిష్ గాంధీ, తనికెళ్ల భరణి, రాధా మనోహర్ దాస్, ఎస్తేర్ మాట్లాడారు. -
నవ్వులే నవ్వులు
‘‘ప్రేక్షకులను నవ్వించాలనే ఉద్దేశంతోనే ‘ఓం భీమ్ బుష్’ సినిమా చేశాం. రెండు వందల శాతం ఆడియన్స్ పిచ్చి పిచ్చిగా నవ్వుతారు. ప్రేక్షకుల నవ్వులతో థియేటర్స్ బద్దలైపోతాయి’’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు. శ్రీవిష్ణు, ప్రీతీ ముకుందన్ జంటగా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, అయేషా ఖాన్, ప్రియా వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, వీ సెల్యూలాయిడ్ పతాకాలపై సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘దర్శకుడు హర్ష ఈ సినిమాను హిలేరియస్గా తీశాడు. అవకాశం ఇచ్చిన యూవీ వంశీ అన్న, సునీల్గారికి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘ట్రైలర్లో ఉన్న ఎనర్జీ కంటే సినిమాలో వంద రెట్లు ఎనర్జీ ఉంది’’ అన్నారు శ్రీహర్ష. ‘‘ఈ సినిమాతో డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నాం’’ అన్నారు ప్రియదర్శి. ‘‘ఓం భీమ్ బుష్’ ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు సునీల్. -
'మార్కెట్ మహాలక్ష్మి' మూవీ ట్రైలర్ వేడుక (ఫొటోలు)
-
‘షరతులు వర్తిస్తాయి’ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక (ఫొటోలు)
-
మధ్యతరగతి షరతులు
చైతన్యా రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. కుమారస్వామి దర్శకత్వంలో నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డా. కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో హీరో చైతన్యా రావు మాట్లాడుతూ– ‘‘షరతులు వర్తిస్తాయి’ ట్రైలర్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. దిగువ మధ్య తరగతి, మధ్యతరగతి వాళ్ల జీవితాల్లో ఉండే సంతోషాలు, బాధలు, భావోద్వేగాలతో ఈ సినిమా కథనం ఉంటుంది. ఇందులో చిరంజీవి పాత్రలో నేను, విజయశాంతి పాత్రలో భూమి శెట్టి నటించాం. ప్రేక్షకులందరూ చూడాల్సిన చిత్రం ఇది’’ అన్నారు. ‘‘ఓ మంచి పాయింట్కు కమర్షియల్ హంగులు జోడించి ఈ సినిమా తీశాం. ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన చిత్రం’’ అన్నారు కుమారస్వామి. ‘‘ఏషియన్ ఫిలిమ్స్, సురేష్ప్రోడక్షన్స్ మా సినిమాను రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పటికి 60 థియేటర్స్ కన్ఫార్మ్ అయ్యాయి’’ అన్నారు డా. కృష్ణకాంత్ చిత్తజల్లు. ‘‘కరీంనగర్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం తెలంగాణ యాస నేర్చుకున్నా’’ అన్నారు భూమి. నటుడు సంతోష్ యాదవ్ మాట్లాడారు. -
విశ్వక్ సేన్ ‘గామి’ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
సినిమా చూసి సెల్యూట్ కొడతారు
‘‘మన సైనికుల త్యాగాలని గుర్తు చేసుకుంటూ వారి ధైర్య సాహసాలని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చేసిన ప్రయత్నమే ‘ఆపరేషన్ వాలెంటైన్’. మనందరికీ దేశభక్తి ఉంటుంది.. కానీ, మా సినిమా చూశాక అది మరింత పెరుగుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు హీరో వరుణ్ తేజ్. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. మానుషీ చిల్లర్, రుహానీ శర్మ, నవదీప్ కీలక పాత్రలు పోషించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రోడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా హిందీ ట్రైలర్ను హీరో సల్మాన్ ఖాన్, తెలుగు ట్రైలర్ను హీరో రామ్చరణ్ రిలీజ్ చేశారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘మన దేశంలో సినిమా పెద్ద వినోద సాధనం. సరదాగా కాలక్షేపం చేయాలంటే అందరూ ముందు సినిమావైపు వెళ్తారు. అందుకే ప్రేక్షకులు ఖర్చు పెట్టే టిక్కెట్ డబ్బులకి న్యాయం చేయాలని ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. చాలా కొత్తగా, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చుని గూస్ బంప్స్ మూమెంట్స్ని ఎంజాయ్ చేసే చాలా సన్నివేశాలు ఈ మూవీలో ఉన్నాయి. ఈ సినిమాని చాలా గర్వంగా, గుండెల నిండా దేశభక్తితో చూసి మన సైనికులకు సెల్యూట్ కొడతారు’’ అన్నారు. ‘‘యాక్షన్, ఫన్, ఎమోషన్.. ఇలా అన్ని అంశాలున్న చిత్రమిది’’ అన్నారు శక్తి ప్రతాప్. -
ఆలోచింపజేసే సుందరం మాస్టర్
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లవుతోంది. ప్రతీసారి ఏదో కొత్తగా చేయాలని ప్రయత్నిస్తుంటాను. సుందరం మాస్టర్ పాత్రను చూస్తే మనలో ఒకరిని చూసినట్టుగానే అనిపిస్తుంది. ‘సుందరం మాస్టర్’లో కామెడీతో పాటు డ్రామా ఉంటుంది. ఇది అందర్నీ ఆలోచింపజేసే చిత్రమవుతుంది’’ అని హర్ష చెముడు అన్నారు. హాస్య నటుడిగా ప్రేక్షకులను అలరిస్తున్న హర్ష చెముడు హీరోగా నటించిన చిత్రం ‘సుందరం మాస్టర్’. కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్య శ్రీపాద హీరోయిన్. హీరో రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ని హీరో చిరంజీవి విడుదల చేసి, సినిమా విజయం సాధించాలన్నారు. ‘‘ఓ గిరిజన గ్రామంలో అందరూ స్పష్టంగా ఇంగ్లిష్ ఎలా మాట్లాడతారనే దానికి గల కారణం మా సినిమా చూస్తే తెలుస్తుంది’’ అన్నారు కల్యాణ్ సంతోష్. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు సుధీర్ కుమార్ కుర్రు. -
ప్రజా సేవలో..
నంద కిశోర్, రోజా హీరో హీరోయిన్లుగా దుర్గా దేవ్ నాయుడు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ప్రవీణ్ ఐపీఎస్’. ‘ఇక ప్రజా సేవలో..’ అనేది ట్యాగ్లైన్. ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో ఈ సినిమా ట్రైలర్ను దర్శకుడు సి. ఉమామహేశ్వరరావు, నిర్మాత వివేక్ కూచిభొట్ల రిలీజ్ చేశారు. ‘‘విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ప్రవీణ్గారిలా వెండితెరపై కనిపించేందుకు ప్రయత్నం చేశాను’’ అన్నారు నంద కిశోర్. ‘‘ఇది నా తొలి చిత్రం’’ అన్నారు దుర్గా దేవ్. -
ఆ రెంటినీ నమ్ముకున్నవారు ఫెయిల్ కాలేదు
హీరో అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ముఖ్య గమనిక’. ఇందులో లావణ్య హీరోయిన్. సినిమాటోగ్రాఫర్ వేణు మురళీధర్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రాజశేఖర్, సాయికృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ– ‘‘ఏ పరిశ్రమలోనైనా ఓర్పు, కష్టం.. ఈ రెండింటినీ నమ్ముకున్న వారు ఫెయిల్ కాలేదు. హీరో కావాలన్న విరాన్ కల ఈ సినిమాతో నిజం అవుతోంది. అల్లు అర్జున్గారితో పాటుగా కథలు వినేవాడు విరాన్. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యాక, సక్సెస్ మీట్కు తాను వస్తానన్నట్లుగా అల్లు అర్జున్ నాకు చెప్పారు. ‘ముఖ్య గమనిక’ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఓర్పుగా ఉంటే ఏదో రోజు సక్సెస్ అవుతాం అనడానికి బన్నీ వాసు అన్న ఓ ఉదాహరణ. హీరోగా నాకు చాన్స్ ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు విరాన్. ‘‘ఈ కథ అనుకున్నప్పుడే హీరోగా విరాన్ను అనుకున్నాను’’ అన్నారు వేణు మురళీధర్. ‘‘మా సినిమాకు అందరూ సపోర్ట్ చేయాలి’’ అన్నారు రాజశేఖర్, సాయికృష్ణ. -
నేను విన్నాను...
‘‘నా బిడ్డకు పుట్టుకతోనే చెవుడు ఉందన్నా.. చెవుడు వల్ల మాటలు కూడా రావు. ఏదో మిషన్ పెడితే వినపడి మాటలు వస్తాయని డాక్టర్లు చెప్పినారు.. అన్నా.. మాకంత స్తోమత లేదు (ఓ పాత్రధారి). మన రాష్ట్రానికి ఉన్న బడ్జెట్కి ఒక మనిషి మీద నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం.. ఐ డోంట్ థింక్.. ఇట్స్ రైట్ సార్ (మరో పాత్రధారి)... నువ్వు చెప్పింది కరెక్ట్నే అయ్యా.. నాకు అర్థమైంది. కానీ మనం చేయలేమనే మాట ఈ పాపకు అర్థమయ్యేలా చెప్పు (మమ్ముట్టి) అనే సీన్తో మొదలైంది ‘యాత్ర 2’ సినిమా టీజర్. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితులు, పేదల కోసం వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘యాత్ర 2’. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాద యాత్ర ఆధారంగా రూపొందిన ‘యాత్ర’కు సీక్వెల్గా ‘యాత్ర 2’ వస్తోంది. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్ముట్టి, వైఎస్ జగన్ పాత్రలో జీవా నటించారు. మహి. వి. రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. జగన్ రెడ్డి కడపోడు సార్.. శత్రువుపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాకా.. వాళ్లు నాశనమైపోతారు అని తెలిసినా.. శత్రువుకి తలవంచరు సార్ (శుభలేక సుధాకర్) ఎన్నికలైపోయాక జనాల్ని మోసం చేసి నా క్రెడిబిలిటీని పోగొట్టుకోలేనన్నా.. ఈ క్రెడిబిలిటీ లేని రోజు.. మా నాయనా లేడు.. నేనూ లేను, నేను విన్నాను... నేనున్నాను (జీవా) అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. -
పల్లెటూరి ప్రేమకథ
వినాయక్ దేశాయ్, అపర్ణా దేవి జంటగా దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించిన చిత్రం ‘రాధా మాధవం’. గోనాల్ వెంకటేశ్ నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్ను హీరో శ్రీకాంత్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘రాధా మాధవం’ ట్రైలర్ చూస్తే అందమైన ప్రేమకథా చిత్రమని తెలుస్తోంది. ట్రైలర్ చాలా బాగుంది.. సినిమా పెద్ద హిట్టవ్వాలి’’ అన్నారు. ‘‘అందమైన పల్లెటూరి ప్రేమకథా చిత్రం ‘రాధా మాధవం’. మా సినిమా సెన్సార్ పనులు జరుపుకుంటోంది’’ అన్నారు దాసరి ఇస్సాకు. ‘‘ఈ నెలలోనే మా సినిమా రిలీజ్ అవుతుంది.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు గోనాల్ వెంకటేశ్. ‘‘పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమకథతో సహజత్వం ఉట్టి పడేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దాసరి ఇస్సాకు. మా చిత్రం ట్రైలర్ను విడుదల చేసిన శ్రీకాంత్గారికి థ్యాంక్స్’’ అన్నారు వినాయక్ దేశాయ్.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
కమల్ హాసన్ ఇండియన్-2.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!
AP: ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అంతరాయం కలిగిస్తే ఆసుపత్రులపై చర్యలు
మమత సర్కారుకు షాక్.. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (22-05-2024)
Vishal Marriage: పెళ్లెప్పుడు? విశాల్ సమాధానమిదే! ఇంక చేసుకున్నట్లే!
హీరామండి సిరీస్లో అదరగొట్టిన అందాల ముద్దుగుమ్మలు (ఫోటోలు)
ఆస్పత్రికి షారూఖ్ ఖాన్.. అసలేం జరిగిందంటే?
తీన్మార్మల్లన్నపై కేటీఆర్ సంచలన కామెంట్స్
IPL 2024 Eliminator: ఐదో వికెట్ డౌన్.. పాటిదార్ ఔట్
హారర్ థ్రిల్లర్తో వస్తోన్న ఆదాశర్మ.. చాలా ఏళ్లకు తెలుగులో!
తప్పక చదవండి
- జీతాలపై ప్రభావం.. ఎయిర్ఇండియా ఉద్యోగుల ఆందోళన!
- విడాకుల రూమర్స్.. ఈ ప్రపంచం గురించి పట్టించుకోనంటున్న నటుడు
- ఒకపుడు జర్నలిస్టు, అంబానీని మించిన ఇంద్రభవనంలో : అత్యంత అందమైన రాణి
- ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసీ సీరియస్
- ఈవెంట్లో ప్రియాంక చోప్రా.. వందల కోట్ల విలువైన నెక్లెస్తో!
- T20: బంగ్లాకు షాకిచ్చిన పసికూన.. మినీ టీమిండియా అంటూ..
- చనుగొండ్లలో చిరుత పిల్లల సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు
- ఇజ్రాయెల్ హెచ్చరిక.. రాయబారులు వెనక్కి రండి
- నేమ్ప్లేట్ మార్చేసిన సూపర్ మామ్ సానియా మీర్జా ఫోటోలు వైరల్
- Kalki 2898: 12 సెకన్లు.. రూ.3 కోట్లు, రాజమౌళిని ఫాలో అవుతున్న ‘కల్కి’టీమ్!
Advertisement