-
YS Raja Reddy: ప్రజల గుండెలలో పెద్దాయన
పులివెందుల : పులివెందుల చరిత్రలో పెద్దాయనది ఒక ప్రత్యేకత. పేదలకు.. తమ కుటుంబాన్ని నమ్ముకున్న వారికి అండగా నిలిచే వారు. కరవు పరిస్థితుల్లోనూ ప్రజలకు అండగా నిలిచిన నాయకుడు దివంగత వైఎస్.రాజారెడ్డి. 1925 సంవత్సరంలో వెంకటరెడ్డి, మంగమ్మ దంపతులకు వైఎస్.రాజారెడ్డి జన్మించారు. క్రమశిక్షణ గల కార్యకర్తలను తీర్చిదిద్దడంలోనూ, కుమారులు, కుమార్తెలను ఉన్నత స్థానంలో నిలపడంలో ఆయన పాత్ర ఎనలేనిది.పులివెందుల గ్రామ సర్పంచ్గారాజకీయాల్లోకి రాక మునుపు నుంచి పులివెందులలో వైఎస్.రాజారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎలాంటి సమస్యనైనా ఆయన దగ్గరికి వెళితే పరిష్కారమవుతుందని ప్రజల నమ్మకం. ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన రాజారెడ్డి పులివెందుల సర్పంచుగా తన ప్రజాప్రస్థానం ప్రారంభించారు. 1988 నుండి 1995 వరకు ఆయన పులివెందుల సర్పంచ్గా పనిచేశారు. ఆ సమయంలోనే పులివెందులలో వీధి దీపాలు, రోడ్లు, విద్యా సంస్థలను ఏర్పాటు చేయడంతోపాటు మంచినీటి చెరువులను తవ్వించారు. ఒకవైపు అభివృద్ధి పనులు చేపడుతూనే ఆ ప్రాంత ప్రజల కష్ట సుఖాలు తెలుసుకునేవారు. అప్పట్లో నీటి సమస్య తీవ్రరూపం దాల్చినప్పుడు ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి సమస్య పరిష్కరించారు. గ్రామ సమస్యలపై పోరాడుతూనే మరో వైపు తన ఆశయాల సాధనకు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తన సుపుత్రులలో ఇద్దరిని ప్రజలకు అంకితం చేశారు. రాష్ట్ర ప్రజలకు నేడు జనరంజక పాలన అందడానికి, పేదల పట్టెడు అన్నం, గూడు, బట్టలు కట్టడమే కాకుండా రైతులను అన్ని విధాలా ఆదుకున్న పెద్దాయన కుమారుడు దివంగత వై.ఎస్.రాజశేఖర్రెడ్డి కృషి ఉంది. నేటికీ అక్కడక్కడా పెద్దాయన పేరుతో సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి. పులివెందులలో ప్రత్యేకంగా ఆయన పేరుతో కాలనీలు వెలిశాయి.ప్రజల మనస్సులో ప్రత్యేక స్థానంపులివెందుల ప్రాంత ప్రజల మనస్సులో వైఎస్.రాజారెడ్డి ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. ఆయన బ్రతికున్న కాలంలో ఈ ప్రాంత ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడిన పెద్దాయన. ప్రజలు తమకు ఏ కష్టం వచ్చినా పులివెందుల పెద్దాయనగా పిలవబడే వైఎస్.రాజారెడ్డి ఇంటి వద్దకు వెళ్లి మొరపెట్టుకునేవారు. అంతేగాక ఆయన తనయుడు దివంగత మహా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రాజకీయ అభివృద్ధికి వైఎస్.రాజారెడ్డి ఎంతో తోడ్పాటునందించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో తలమునకలై ఉండగా.. పెద్దాయన పులివెందుల ప్రాంతంలో ప్రజల సమస్యలు, రాజకీయాలను అన్నీ తానై చూసుకొనేవాడు. వైఎస్ రాజారెడ్డి తనయుడు వైఎస్ఆర్ను ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన తపించేవాడు.విద్యా ప్రదాతగాదివంగత వైఎస్.రాజారెడ్డి పులివెందుల పేదల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తూనే పులివెందులలో పేద విద్యార్థుల కోసం డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు నెలకొల్పాడు. ప్రజలకు సేవ చేయడంలో ఆయన ఎంతో తృప్తి పొందేవాడు. వైఎస్.రాజారెడ్డి, వైఎస్సార్లు చూపిన బాటలోనే వైఎస్.జగన్మోహన్రెడ్డి, వైఎస్.అవినాష్రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు నడుస్తున్నారని చెప్పవచ్చు. ఏది ఏమైనా పులివెందుల ప్రాంత ప్రజలు ఈనాటికీ పెద్దాయనను మర్చిపోలేకపోతున్నారు.నివాళులర్పించనున్న వైఎస్ కుటుంబసభ్యులునేడు దివంగత వైఎస్.రాజారెడ్డి 26వ వర్ధంతి సందర్భంగా గురువారం పులివెందుల డిగ్రీ కళాశాల రోడ్డులోని వైఎస్సార్ సమాధుల తోటలో వైఎస్ జయమ్మ, రాజారెడ్డి సమాధుల వద్ద వైఎస్సార్ కుటుంబీకులు నివాళులర్పించనున్నారు. అనంతరం వైఎస్.రాజారెడ్డి పార్కులోని ఆయన విగ్రహం వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం జీసెస్ చారిటీస్లో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఇందుకోసం స్థానికంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
మేము కొనసాగించిన YSR గారి ఆదర్శవంతమైన పథకాలు..!
-
ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్
-
షర్మిల అలవోకగా అబద్దం చెప్పారు: ఏఏజీ పొన్నవోలు
సాక్షి, విజయవాడ: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ లబ్ధి కోసం తనపై అసత్య ఆరోపణలు చేశారన్నారు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. షర్మిల పచ్చి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ఆమె మాట్లాడారని విమర్శించారు. ఈ మేరకు తనపై షర్మిల చేసిన ఆరోపణలపై పొన్నవోలు స్పందిస్తూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు వల్లే వైఎస్సానాడే వైఎస్సార్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చారని గుర్తు చేశారు. వైఎస్సార్పై ఆరోపణలు చేస్తూ శంకర్రావు హైకోర్టుకు లేఖ రాశారని ప్రస్తావించారు. దీనిపై హైకోర్టు విచారణకు ఆదేశించిందని తెలిపారు. టీడీపీ నేతల ఎర్రన్నాయుడు ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారని పేర్కొన్నారు. 2011 ఆగస్టు 17న వైఎస్ రాజశేఖర్రెడ్డి, జగన్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చారని తెలిపారు. వైఎస్సార్ను ఆనాడే ముద్దాయిని చేసింది నిజం కాదా.. అని ప్రశ్నించారు. వైఎస్సార్పై కేసులు పెడుతుంటే చూడలేక..‘మహానుభావుడైన వైఎస్సార్ మీద ఆరోపణలు చేస్తుంటే. అన్యాయంగా కేసులలో ఇరికిస్తుంటే అన్యాయమని భావించాను. అందుకే కేసులు వేశాను. అంతేగానీ నాతో ఎవరూ కేసులు వేయించలేదు. ఆ సంగతి తెలుసుకొని షర్మిల మాట్లాడాలి. 2011 డిసెంబరులో నేను కేసు వేసే నాటికి కనీసం జగన్ను చూడనేలేదు. వైఎస్ఆర్ మీద కాంగ్రెస్ కేసు పెట్టటం భరించలేక నేను కేసు వేశాను. అప్పటి జీవోలకు, జగన్కు ఏం సంబంధం ఉంది?చదవండి: FactCheck: ఉన్మత్త రాతల రామోజీకి పూనకాలు లోడింగ్!వాస్తవాలు తెలుసుకోవాలి..వైఎస్సార్ను అన్యాయంగా కేసులో ఇరికించారనే బాధతో నేను బయటకు వచ్చాను. ఆయన మీద కేసు పెట్టటం అన్యాయమని నేను వాదించాను. వేరే 14 మందిని బాధ్యలుగా చేయాలని మాత్రమే కేసు వేశాను. ఆ కాపీలను పంపిస్తా, షర్మిల చదువుకుంటే వాస్తవాలు తెలుస్తాయి. ఆమె చెప్పినట్టు నేనే వైఎస్సార్ మీద కేసు వేస్తే ఏ శిక్షకైనా సిద్ధమే. సీబీఐ, కాంగ్రెస్ కలిసే వైఎస్ఆర్ను ఇరికించారు. ఇది నేను నిరూపించటానికి సిద్ధం. వైఎస్సార్ను వేధించిన వారికి ఎదురొడ్డి నేను పోరాటం చేశా. అలాంటి నన్ను అభినందించాల్సిందిపోయి నాపై ఆరోపణలు చేయటం ఏంటి?.నాకు ఇచ్చే గౌరవం ఇదేనా..షర్మిల అలవోకగా అబద్దాలు చెబుతున్నారు. చంద్రబాబు మాట్లాడిన మాటలు, భాషనే షర్మిల మాట్లాడారు. మీ రాజకీయాలు ఎలాగైనా చేసుకోండి, కానీ నాపేరు ప్రస్తావించవద్దు. ఈ దుర్మార్గపు క్రీడలో తనను లాగడం దారుణం. మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా? మీ రాజకీయ యుద్ధం కోసం నన్ను లాగడమేంటి?’ అంటూ ఏఏజీ పొన్నవోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తండ్రీ కొడుకుల దెబ్బ.. చంద్రబాబు అబ్బా
తనకు ఎదురేలేదని విర్రవీగిన ఆయనకు పెద్దాయన గట్టిదెబ్బే కొట్టారు. దారుణ ఓటమి రుచిచూపించారు. అయితే, అలాంటి వ్యక్తి ఆకస్మిక మరణంతో మళ్లీ తెరమీదికి వచ్చిన ఆయన.. ప్రజలను బురిడీ కొట్టించి మళ్లీ గద్దెనెక్కారు. నమ్మి ఓట్లేసిన పాపానికి నరకం చూపించారు. ఆయన చేతిలో దారుణంగా మోసపోయిన జనం.. తమను అక్కున చేర్చుకున్న పెద్దాయన కుమారుడికి పట్టం కట్టారు. ఆ పెద్దాయన, ఆయన కుమారుడు మరెవరో కాదు దివంగత నేత వైఎస్సార్, ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి. సాక్షి ప్రతినిధి, అనంతపురం: వైఎస్ రాజశేఖర రెడ్డి చేతిలో 2004,2009లో ఘోర పరాభవం మూటగట్టుకున్న చంద్రబాబును.. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి కూడా మట్టి కరిపించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బాబుకు చుక్కలు చూపించారు. గతంలో జరిగిన నాలుగు ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 14 నియోజకవర్గాలున్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైఎస్ కుటుంబ విశ్వసనీయతకే జనం పట్టం కట్టినట్లు తెలిసిపోతుంది. మాట ఇస్తే దాన్ని నెరవేర్చే వరకూ వెనకడుగు వేయని తత్వం, తమ అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకుంటారన్న నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుపోవడంతోనే ఇది సాధ్యమైంది. తమకు జిల్లా కంచుకోట అని బాకాలు ఊదే టీడీపీ నాయకుల మాటలను జనం నమ్మడం లేదు. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో.. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర తనదనీ, మూడు దఫాలు ముఖ్యమంత్రి అయ్యానని చెప్పుకునే చంద్రబాబు.. తండ్రీతనయుల చేతిలో దారుణంగా ఓడిపోవడం చరిత్రలో ఒక విచిత్రం. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేతగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లాలో సంపూర్ణ ఆధిపత్యం సాధించారు. టీడీపీని పరాభవం బాట పట్టించారు. జిల్లా ప్రజల సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి శ్రీకారం చుట్టడం, తన హయాంలోనే ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేయడంతోనే ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. 2019లో సునామీ సృష్టించిన జగన్ ఉమ్మడి అనంతపురం జిల్లావ్యాప్తంగా 2019లో రాజకీయ పెను తుఫాను సంభవించిందంటే ఆశ్చర్యం కలగకమానదు. ఆ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టించింది. ఫ్యాను ధాటికి సైకిల్ గల్లంతైంది. జనహితమే లక్ష్యంగా బరిలోకి దిగిన జగన్ సైన్యం టీడీపీ అభ్యర్థులను మట్టి కరిపించింది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు దఫాలు బాబును కోలుకోలేని దెబ్బతీయగా.. 2019లో జగన్ ఏకంగా చంద్రబాబును రాజకీయంగా వెంటిలేటర్పై పడుకోబెట్టినంత పనిచేశారు. ఇక అప్పట్లో గెలిచిన ఇద్దరు టీడీపీ అభ్యర్థులు కూడా అత్తెసరు మెజారీ్టతో గట్టెక్కడం గమనార్హం. పాతకథ పునరావృతమే..! 2019 ఫలితాలు ఈ ఎన్నికల్లోనూ పునరావృతమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో పారీ్టకి పనిచేసిన వారిని కాదని డబ్బున్న వారికి టికెట్లు ఇవ్వడంతో టీడీపీలో అసమ్మతి జ్వాలలు రగులుతూనే ఉన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. టీడీపీ కేడర్ కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంది. అభ్యర్థుల ఎంపిక తమ పారీ్టకి గుదిబండలా తయారైందని నాయకులు వాపోతున్నారు. ముఖ్యంగా మొన్నటిదాకా తీవ్రంగా విమర్శించిన గుమ్మనూరు జయరామ్కు చంద్రబాబు టికెట్ ఇవ్వడంతో కేవలం డబ్బు కోసమే సీటు కేటాయించారన్న విమర్శలు ఆ పార్టీ నేతల నుంచే వెల్లువెత్తుతున్నాయి. కళ్యాణదుర్గం, అనంతపురం, పుట్టపర్తి వంటి నియోజకవర్గాల్లోనూ డబ్బున్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడంతో ద్వితీయ శ్రేణి నాయకులు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ టీడీపీకి భంగపాటు తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
నాన్నకు ప్రేమతో..!
-
Yellow Babu : ప్రకృతి కూడా పసుపు పార్టీ సరుకేనా?
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు రాజకీయ పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికులు. కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి బి.ఆర్.ఎస్., బిజెపి ల నుండి పలువురు నేతలను కాంగ్రెస్ లో చేర్చుకుని పార్టీ కండువాలు కప్పుతున్నారు. ఇలా చేస్తే ప్రకృతి ఊరుకోదని.. తీవ్ర పరిణామాలు తప్పవని గతంలో రేవంత్ రెడ్డి ఓ ఎల్లో మీడియా అధినేతతో కలిసి స్టూడియోలో కూర్చుని సిద్ధాంతీకరించారు. మరి ఇపుడు రేవంత్ రెడ్డి ఇలా BRS పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటే ప్రకృతి చూస్తూ ఊరుకుంటుందా? ప్రమాదం ఏమీ ఉండదా? అని పొలిటికల్ ఎన్విరాన్ మెంటలిస్టులు ప్రశ్నిస్తున్నారు. పొరుగు పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటే ప్రకృతి చూస్తూ ఊరుకోదట. టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవాలని అనుకోవడం వల్లనే దివంగత వై.ఎస్.ఆర్. పై ప్రకృతి ప్రకోపించిందట. దాని కారణంగానే ఆయన మరణించారని ప్రస్తుత తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లో మీడియా లో ఇంటర్వ్యూలో అభిప్రాయ పడ్డారు. ఇలా అభిప్రాయ పడ్డ రేవంత్ రెడ్డి.. ఏబీఎన్ రాధాకృష్ణ ఇద్దరూ కూడా చాలా చాలా మేధవులు. కాకపోతే ఇద్దరికీ కొద్ది పాటి సంస్కారం కూడా లేకుండా పోయిందంటున్నారు రాజకీయ పండితులు. దివంగత వై.ఎస్.ఆర్. హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. చనిపోయిన వారి గురించి ఎవ్వరూ కూడా హేళనగా మాట్లాడరు. కానీ ఈ ఇద్దరూ కూడా వై.ఎస్.ఆర్. మరణానికి ఆయన టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవాలనుకోవడమే కారణమన్నట్లు.. అందుకే ప్రకృతి ఆయన్ను శిక్షించింది అన్నట్లు తీర్మానించారు. రాజకీయాల్లో రేవంత్ రెడ్డికి అత్యంత ఇష్టమైన గురువు చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడు 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? 23 మంది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి కేసులు పెడతామని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి టిడిపిలో చేర్చుకున్నారు. మరి ఈ ఘటనపై ప్రకృతికి కోపం ఎందుకు రాలేదట? వై.ఎస్.ఆర్. టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలను చేర్చుకుందామా వద్దా అని ఆలోచన చేస్తేనే పగ బట్టేసిన ప్రకృతి చంద్రబాబు నిస్సిగ్గుగా 23 మందిని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకోవడమే కాకుండా అందులో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చినా ప్రకృతి ఎందుకు ఊరుకున్నట్లు? కొంపదీసి ప్రకృతి కూడా ఎల్లో బ్యాచ్ లో చేరిపోయిందా? ఎల్లో మీడియా తరహాలో టిడిపి అధినేత ఏం చేసినా ప్రకృతి చూస్తూ ఊరుకుంటుందా? చంద్రబాబుకి రాజకీయ ప్రత్యర్ధి అయిన వై.ఎస్. ఆర్. తనను ఆశ్రయించిన వారిని తన పార్టీలో చేర్చుకోవాలని అనుకుంటేనే ప్రకృతికి కోపం వస్తుందా? అన్నది రేవంత్ రెడ్డితో పాటు..రాధాకృష్ణకూడా సమాధానం చెప్పాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇదే చంద్రబాబు పురమాయిస్తే ఇదే రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఇంటికి కరెన్సీ కట్టలతో వెళ్లి బేరసారాలాడారు. మరి ఆ ఘటన పట్ల ప్రకృతికి అభ్యంతరాలేవీ ఉండవా? చంద్రబాబు వారి అనుచరులు ఎలా వ్యవహరించినా ప్రకృతి చూసి పరవశించిపోతుందా? అన్నది కూడా రేవంత్ రెడ్డి, రాధాకృష్ణలు వివరించాలి. ఈ ఒక్క విషయమే కాదు..చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు పీకలదాకా అప్పులు చేసి రాష్ట్ర ఖజానా దివాళా తీయించి గద్దె దిగేటపుడు 100కోట్లు మాత్రమే మిగిల్చి పోయారు. అపుడు ఏపీ అద్బుతంగా ఉందని భజన చేసింది ఎల్లో మీడియా. బాబుతో పోలిస్తే చాలా తక్కువగా అప్పులు చేసిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మాత్రం రాష్ట్రాన్ని దివాళా తీయించేస్తున్నారంటూ గగ్గోలు పెట్టే రాతలు రాసింది. మనోడు చేస్తే సంసారం..ఎదుటి వారు చేస్తే వ్యభిచారం అన్నట్లు ఎల్లో మీడియా పైత్యపు రాతలు.. ఆ భావజాలంతో ఉండే వారి పైత్యపు కూతలు కొత్త కాదు. సరే చంద్రబాబు నాయుడి ప్రకృతికి చుట్టం కాబట్టి ఆయన 23 మంది ఎమ్మెల్యేలను అడ్డగోలుగా రాజ్యాంగ విరుద్ధంగా టిడిపిలో చేర్చుకున్నా ప్రకృతి ఏమీ అనలేదు. కానీ ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం ప్రకృతి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఆయన్ని అభిమానించే వారు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే బి.ఆర్.ఎస్. నుంచి ఇద్దరు ఎంపీలను ఒక ఎమ్మెల్యేనీ రేవంత్ రెడ్డి పార్టీ చేర్చుకుని కండువాలు కప్పింది. మరో మాజీ మంత్రి మల్లారెడ్డిని డి.కె.శివకుమార్ దగ్గరకు పంపి బేరాలాడించింది. ప్రకృతి ఏపీలోనే కాదు కర్నాటకపైనా నిఘా పెడుతుంది మరి. అందుకే అందరూ జాగ్రత్తగా ఉంటే మంచిదంటున్నారు విజ్ఞులు. - సి.ఎన్.ఎస్.యాజులు, సీనియర్ జర్నలిస్ట్ -
కాపులంతా కొలికపూడిని వ్యతిరేకించాలి: ఆకుల శ్రీనివాస్
సాక్షి, ఎన్టీఆర్: కాపులను తాకట్టు పెట్టే వ్యక్తి పవన్ కల్యాణ్ అని అన్నారు ఏపీ కాపు నాయకులు ఆకుల శ్రీనివాస్. వంగవీటి రంగా అనే వ్యక్తి కొలికపూడి శ్రీనివాస్కు తెలుసా అని ప్రశ్నించారు. కాపులంతా కొలికపూడిని వ్యతిరేకించాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాగా, తిరువూరులో వైస్సార్సీపీ కాపుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, వైఎస్సార్సీపీ కాపు నేత ఆకుల శ్రీనివాస్, తిరువూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్ధి నల్లగట్ల స్వామిదాస్, తిరువూరు వైఎస్సార్సీపీ కాపు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ..‘వంగవీటి రంగా చనిపోయిన తర్వాత కాపులకు దివంగత మహానేత వైఎస్సార్ అండగా నిలిచారు. వైఎస్సార్పై టీడీపీ అభ్యర్థి కొలికపూడి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. వంగవీటి రంగా అనే వ్యక్తి కొలికపూడికి తెలుసా?. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రంగా శిష్యుడిని అని చెప్పుకుంటున్నాడు. కొలికపూడిని కాపులంతా వ్యతిరేకించాలి. తిరువూరులో స్థానికుడైన నల్లగుట్ల స్వామిదాస్కు కాపులంతా అండగా ఉండాలి. కూటమిలో భాగంగా 24 సీట్ల నుంచి 21 సీట్లకు పోటీకి అభ్యర్థులను తగ్గించుకుని పవన్ దిగజారిపోయాడు. కాపులను తాకట్టు పెట్టే వ్యక్తి పవన్. కాపులకు కాపు కాసే వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్’ అని చెప్పుకొచ్చారు. -
కేసులు పెడితే వెళ్లి YSR కాళ్ళు పట్టుకున్నాడు.. ఈ 420 అధికారం కోసం ఎవడి బూట్లు అయిన నాకుతాడు..
-
తండ్రి ఆశయం...తనయుడి సాకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కడప జిల్లా, నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా, ప్రకాశం జిల్లా, కర్నూలు జిల్లాలలోని నల్లమల అడవులలో వ్యాపించి ఉన్న కొండల వరుసను వెలుగొండలు అంటారు. ఈ కొండల శ్రేణిలో మధ్య ఖాళీ స్థలంలో వున్న సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల అనే మూడు గ్రామాల దగ్గర గోడలలాగ ఆనకట్టలు కట్టి సుమారు 20 కి.మీ. పొడవైన సహజమైన ‘నల్లమల సాగర్’ రిజర్వాయర్ నిర్మించి, కృష్ణా నదిలో 43.5 టీఎమ్సీ వరద నీటిని కొల్లంవాగు సమీపంలోని శ్రీశైలం రిజర్వాయర్ నుండి తరలించి నల్లమల సాగర్ రిజర్వాయర్లో నిల్వ చేయాలని ప్రతిపాదించారు. తొలుత ఈ ప్రాజెక్టును ‘వెలిగొండ ప్రాజెక్టు’ అని పిలిచారు. జలయజ్ఞంలో భాగంగా 2004 అక్టోబరు 27న మార్కాపురానికి 15 కి.మీ. దూరంలో గొట్టిపడియ దగ్గర నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా‘‘ వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసి ఈ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించారు. ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని కొత్తూరు నుంచి నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం ప్రాజెక్ట్ ఎగువ భాగంలోని ‘కొల్లం వాగు’ వరకు రెండు టన్నెల్స్ తవ్వకం పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జల వనరుల శాఖ చేపట్టింది. 1994 డీపీఆర్పై ఆధారపడిన మొదటి దశ ప్రతిపాదనలో 10.7 టీఎమ్సీ నీటిని 45 రోజులలో 7 మీటర్ల వ్యాసం, 85 క్యుమెక్స్ సామర్థ్యం గల సొరంగం కాలువ ద్వారా తరలించాలని తలపెట్టారు. రెండవ దశ పనులలో భాగంగా 9.2 మీటర్ల వ్యాసం, 243 క్యుమెక్స్ సామర్థ్యం గల రెండవ సొరంగ కాలువ జతచేయబడటం వలన 30 రోజుల వరద నీటితోనే జలాశయం నిండే అవకాశం ఏర్పడింది. మార్కాపురం, యర్రగొండ పాలెంల నుంచి పలు సార్లు శాసనసభ్యునిగా గెలిచి ప్రకాశం జిల్లాతో పాటు మరికొన్ని కరువు ప్రాంతాలకు సాగు నీరు, త్రాగునీరు అందించడానికి పోరాటం చేసిన పూల సుబ్బయ్య పేరు మీద ఈ ప్రాజెక్టుకు ‘పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు’ అనే పేరు పెట్టారు. వైఎస్సార్ వెలిగొండ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. పనులను పరుగులెత్తించారు. 2020లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తన తండ్రి ప్రారంభించిన ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి కంకణం కట్టుకొని పూర్తి చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్ట్ తీవ్ర నిర్లక్ష్యానికి గురికావడమే కాక, కొండంత అవినీతి జరిగింది. వెలిగొండ మొదటి సొరంగంలో ఈపీపీ పద్ధతిలో అప్పగించిన పనులను ఆలస్యంగా చేస్తు న్నారనే నెపంతో 2018 ఆగస్టులో 3.6 కి.మీ. పనులను ఎల్ఎస్ (లంప్సమ్ ఓపెన్) విధానంలో కొత్త కాంట్రాక్టరుకు అప్పగించడం వలన రూ. 49.49 కోట్లు దుర్వినియోగం కాగా, వైఎసార్సీపీ ప్రభుత్వం నిర్వహించిన రివర్స్ టెండరింగ్ వలన ప్రభుత్వ ఖజానాకు రూ. 61.67 కోట్లు మిగిలిందని కాగ్ నివేదిక పేర్కొంది. ఐదేళ్ల చంద్రబాబు నాయుడు పాలనలో 6.686 కి.మీ (మొదటి సొరంగం 4.331 కి.మీ. రెండవ సొరంగం 2.355 కి.మీ.) తవ్వకం పని మాత్రమే జరిగింది. కాగా వైఎస్సార్, జగన్ల పాలనా కాలంలో 31 కిలోమీటర్ల దూరం తవ్వకం జరగడం గమనార్హం. టీడీపీ ప్రభుత్వం అంచనా వ్యయాన్ని పెంచి కొత్త కాంట్రాక్టరుకు పనులు అప్పగించినా కాంట్రాకరుకు లబ్ధి, ఖజా నాపై భారం పడిందే కానీ పని వేగం మాత్రం పెరగలేదనేది కాదనలేని సత్యం. ఈ ప్రాజెక్టు వల్ల ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంతో పాటు, నెల్లూరు, కడప జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. నల్లమల సాగర్ నుంచి ఐదు కాలువల ద్వారా నీటిని నెల్లూరు జిల్లా ఉదయగిరి, కడప జిల్లా బద్వేల్, ప్రకాశం జిల్లాలో కరవు ప్రాంతా లకు మొత్తం 30 మండలాలలోని 15.25 లక్షల మందికి తాగునీరు, 4,49,000 ఎకరాలకు సాగు నీరు అందించాలన్న స్వర్గీయ డా‘‘ వైఎస్ఆర్ లక్ష్యం నెరవేరుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రకాశం జిల్లా లోని 23 మండలాలకు చెందిన 3.36 లక్షల ఎకరాలకూ, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలకు చెందిన 84 వేల ఎకరాలకూ, కడప జిల్లా లోని రెండు మండలాలకు చెందిన 29 వేల ఎకరాలకూ ఆయకట్టుకు సాగు నీరు, 30 మండ లాల్లోని కరువు పీడిత ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు స్వచ్చమైన త్రాగునీటి సౌకర్యం లభిస్తుంది. తండ్రి ఆశయాలను సాకారం చేసిన తన యునిగా, కరవు ప్రాంతాలకు నీరు అందించిన భగీరథునిగా జగన్ ప్రజల మన్ననలు పొందేందుకు మార్చి 5వ తేదీన పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్ను జాతికి అంకితం చేయడం మలి అడుగుగా భావించాలి. లింగమనేని శివరామ ప్రసాద్ వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు మొబైల్: 79813 20543 -
850 ఎకరాల స్కాం.. చంద్రబాబుకు హైకోర్టు షాక్!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు హయాంలో ఓ సంస్థకు అక్రమంగా కేటాయించిన 850 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి సుధీర్ఘ కాలం తర్వాత తీర్పు వచ్చింది. 2004లో నాటి ఆపద్ధర్మ చంద్రబాబు ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులను తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. ఆ కేటాయింపులను రద్దు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. వివరాల్లోకి వెళితే.. 2003లో బిల్లీ రావు అనే వ్యక్తి హైదరాబాద్, చుట్టుపక్కల క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి పేరుతో ఐఎంజీ భారత్ అనే సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థకు 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉండగానే 850 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా కారుచవకగా కేటాయించారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయి చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. నాటి చంద్రబాబు ప్రభుత్వం చేసిన అక్రమ భూ కేటాయింపులను గుర్తించిన వైఎస్సార్ ప్రభుత్వం 2006లో ఈ భూ కేటాయింపులను రద్దు చేసింది. దీంతో బిల్లీ రావు ఈ రద్దును సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లారు. అప్పటి నుంచి దీనిపై సుదీర్ఘ విచారణ కొనసాగగా తాజాగా చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ కూడిన తెలంగాణ హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. వైఎస్సార్ ప్రభుత్వం భూ కేటాయింపులను రద్దు చేయడాన్ని సమర్థిస్తూ బిల్లీ రావు పిటిషన్ను కొట్టేసింది. ఏకపక్షంగా భూ కేటాయింపులు చేసిన నాటి చంద్రబాబు ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. -
ఇది దేవుడి స్క్రిప్ట్..నాన్న మొదలుపెడితే..నేను పూర్తి చేశా
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు నాన్నగారు వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తే ఆయన కుమారుడిగా ఒక్కొక్కటి దాదాపు 18 కి.మీ. పైగా ఉన్న రెండు టన్నెళ్లను పూర్తి చేసి జాతికి అంకితం చేయడం నిజంగా దేవుడు రాసిన స్క్రిప్టే అనేందుకు ఇంతకన్నా నిదర్శనం ఏముంది? వెలిగొండ మొదటి సొరంగాన్ని 2021 జనవరి 13న మన ప్రభుత్వమే పూర్తి చేయగా రెండో సొరంగం పనులను కొద్ది రోజుల క్రితమే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేస్తున్నాం. దశాబ్దాల స్వప్నాన్ని నెరవేరుస్తూ ఆ టన్నెల్లో ప్రయాణించే అదృష్టాన్ని కల్పించిన దేవుడికి సదా రుణపడి ఉంటా. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, ఒంగోలు: మూడు జిల్లాల్లో ఫ్లోరైడ్, కరువు పీడిత ప్రాంత ప్రజల కష్టాలను తీర్చే గొప్ప ప్రాజెక్టు వెలిగొండ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో 30 మండలాలకు తాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యంగా జంట టన్నెళ్లతో శరవేగంగా పూర్తి చేసిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్ ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు–ఎగువ చెర్లోపల్లి వద్ద బుధవారం ప్రారంభించారు. దివంగత వైఎస్సార్ హయాంలో చేపట్టిన 37.6 కి.మీ పొడవైన వెలిగొండ రెండు టన్నెళ్లలో చంద్రబాబు అధికారంలో ఉండగా 6.6 కి.మీ. పనులు మాత్రమే చేయగా మిగతావి 31 కి.మీ మేర పనులు వైఎస్సార్, సీఎం జగన్ పాలనలోనే జరగడం గమనార్హం. గిద్దలూరు నియోజకవర్గానికి ప్రయోజనం చేకూరుస్తూ 13,500 ఎకరాలకు సాగునీటిని అందించే రెండు ఎత్తిపోతల పథకాలకు కూడా సీఎం జగన్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఏమన్నారంటే.. మళ్లీ మనం రాగానే నీళ్లు నింపుతాం.. ప్రకాశం జిల్లాలోని 23 మండలాలు, నెల్లూరు జిల్లాలో ఐదు, కడప జిల్లాలో రెండు మండలాలు కలిపి మొత్తం 30 మండలాల్లో 15.25 లక్షల మందికి తాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీటి సమస్యకు పరిష్కారం చూపిస్తూ వెలిగొండ రెండు సొరంగాలు వేగంగా పూర్తయ్యాయి. దీంతో వచ్చే ఖరీఫ్లో శ్రీశైలం నుంచి నల్లమలసాగర్కు నీళ్లు తీసుకొచ్చి నింపుతున్న దృశ్యం జూలై–ఆగస్టులో ఆవిష్కృతమవుతుందని సంతోషంగా చెబుతున్నా. దాదాపు 3 వేల క్యూసెక్కులతో మొదటి టన్నెల్ను పూర్తి చేశాం. 8,500 క్యూసెక్కుల క్యారీయింగ్ కెపాసిటీతో రెండో టన్నెల్ పూర్తయింది. అంటే శ్రీశైలంలో మట్టం 840 అడుగులు దాటిన వెంటనే రోజుకో టీఎంసీని ఈ రెండు సొరంగాల ద్వారా నల్లమల సాగర్కు తీసుకురాగలిగే గొప్ప పరిస్థితి ఈ రోజుతో వచ్చింది. జూలై–ఆగస్టులో నీళ్లు నింపే సమయానికి మరో రూ.1,200 కోట్లు ఖర్చు చేసి ఎల్ఏ, ఆర్అండ్ఆర్ కూడా పూర్తి చేస్తాం. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఘట్టమైన రెండు టన్నెళ్లు ఇప్పటికే పూర్తయ్యాయి. రిజర్వాయర్ కూడా పూర్తయిపోయింది. ఇక మిగిలినవి పెద్దగా ఏమీ లేవు. మళ్లీ మనం అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన రెండు మూడు నెలల్లోనే ఎల్ఏ, ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి పూర్తిగా నీళ్లు నింపుతాం. దుర్భిక్ష ప్రాంతానికి మేలు చేయని బాబు.. ఈ ప్రాజెక్టు వల్ల ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలన్నింటికీ మంచి జరుగుతుందని తెలిసినా, యర్రగొండపాలెం, దర్శి, గిద్దలూరు, కనిగిరి, ఉదయగిరి, ఆత్మకూరు, బద్వేలు నియోజకవర్గాలకు మేలు జరుగుతుందని తెలిసినా బాబు హయాంలో టన్నెళ్లు పూర్తి చేయకుండా పనులు నత్తనడకన సాగాయి. ఇందులో ఒక్కొక్కటి 18.8 కి.మీ. పొడవుతో 37.6 కి.మీ పొడవైన 2 టన్నెళ్లున్నాయి. దివంగత వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఉరుకులు పరుగులతో సింహభాగం పనులు చేయగా 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో 6.6 కి.మీ. మాత్రమే టన్నెళ్ల పనులు జరిగాయి. ఆ తర్వాత మీ బిడ్డ సీఎం అయ్యాక జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తూ 2 టన్నెళ్లను వడివడిగా పూర్తి చేసి వెలిగొండను సాకారం చేశాడని చెప్పేందుకు గర్విస్తున్నా. రెండు ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన గిద్దలూరు నియోజకవర్గానికి మేలు చేసే 2 ఎత్తిపోతల పథకాలకు వెలిగొండ టన్నెళ్ల పైలాన్ సమీపంలో సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అర్ధవీడు మండలం పాపినేనిపల్లి, వెలగలపాయ ఎత్తిపోతల పథకాలకు భూమి పూజ నిర్వహించారు. రెండు ఎత్తిపోతల పథకాలకు రూ.53 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల చేశారు. దీని ద్వారా 13,500 ఎకరాలకు సాగునీరు అందనుంది. టన్నెల్లో కలియదిరిగి... పైలాన్ను ఆవిష్కరించి నిర్మాణం పూర్తి చేసుకున్న వెలిగొండ టన్నెళ్ల వద్దకు మధ్యాహ్నం 11.30 గంటలకు హెలికాప్టర్ ద్వారా చేరుకున్న సీఎం జగన్ జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించి వెలిగొండ నిర్మాణంలో భాగస్వాములైన అధికారులతో ఫొటోలు దిగి పేరుపేరునా అభినందించారు. వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి జంట సొరంగాల పైలాన్ వద్దకు సీఎంను తోడ్కొని వెళ్లారు. జంట సొరంగాల పైలాన్ను ఆవిష్కరించిన సీఎం జగన్ వెలిగొండ వ్యూ పాయింట్ వద్దకు వెళ్లి టన్నెళ్లను వీక్షించారు. అనంతరం రెండో టన్నెల్ లోపలకు వెళ్లి కలియదిరిగి పరిశీలించారు. మెగా ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్ ఉమామహేశ్వరరెడ్డి, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, ప్రాజెక్టు మేనేజర్ రాంబాబు టన్నెళ్ల పనులు, సాంకేతిక అంశాలను తెలియచేశారు. అనంతరం వెలిగొండ సావనీర్ను సీఎం ఆవిష్కరించారు. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ప్రిన్స్పల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, ప్రకాశం జిల్లా సీఈ ఆర్ మురళీనాథ్రెడ్డి తదితరులు ఈ సందర్భంగా శ్రీవెంకటేశ్వరస్వామి ప్రతిమను జ్ఞాపికగా సీఎం జగన్కు అందించగా పాదరక్షలను విడిచిపెట్టి భక్తి భావంతో స్వీకరించారు. అంతకుముందు హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, ఒంగోలు పార్లమెంట్ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కరరెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి మేరుగు నాగార్జున, మంత్రి ఆదిమూలపు సురేష్, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండపాలెం సమన్వయకర్త తాటిపర్తి చంద్రశేఖర్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. సీఎం వెంట హెలికాప్టర్లో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వచ్చారు. -
చంద్రబాబు కోసం సొంత చెల్లిలా పని చేశా కానీ నన్ను దారుణంగా... YSR గారు నన్ను మెచుకున్నారు
-
రామోజీకి వణుకు.. అసలు కథ ముందుంది?
వృద్ధాప్యంలో ఉన్న ఈనాడు మీడియా యజమాని రామోజీరావుకు పెద్ద సవాలే ఎదురవుతోంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించకపోతే తమకు పుట్టగతులు ఉండవని ఆయన భయపడుతున్నారనిపిస్తోంది. తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన ఇష్టారాజ్యంగా నడిపారు. వ్యాపారాన్ని అడ్డుపెట్టుకుని మీడియా రాజ్యాన్ని సృష్టించారు. ఆ మీడియాను అడ్డం పెట్టుకుని వ్యాపారంలో తనకు ఎదురులేదన్నట్లుగా ప్రవర్తించారు. కానీ, సీఎం జగన్ రూపంలో తనకు ఇంత ప్రతిఘటన ఎదురవుతుందని ఆయన ఊహించలేకపోయారు. తన మార్గదర్శి సంస్థలో జరిగిన పలు అక్రమాలు, అవినీతిని, నల్లధనం తదితర విషయాలన్నిటినీ ఏపీ సీఐడీ బహిర్గతం చేసింది. దాంతో సీఎం జగన్పై కక్ష కట్టిన రామోజీ ఇప్పుడు తన మీడియాను పూర్తి స్థాయిలో టీడీపీ కరపత్రంగా, బాకాగా మార్చేశారు. ఈసారి ముఖ్యమంత్రి జగన్ పోటీ పడుతున్నది చంద్రబాబు కాదని, రామోజీరావు అని అంతా భావించే దశకు వెళ్లారు. ప్రతీ ఒక్కరికి ఏదో ఒక రోజు వస్తుందని, ఎవరో ఒకరు తగులుతారని అంటారు. అలాగే రామోజీ సంస్థలలోని ఆర్దిక అరాచకాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కనిపెట్టింది. తత్ఫలితంగా ఆయన ప్రతిష్ట మసకబాసింది. దాంతో ఆయనకు సీఎం జగన్పై ఎక్కడ లేని ద్వేషం ఏర్పడింది. నిజానికి సీఎం జగన్పై రామోజీరావుకు ఉన్న పగ ఈనాటిది కాదు. ముఖ్యమంత్రి తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి టైమ్ నుంచే రామోజీ బొడ్డుకు సున్నం రాసుకున్నట్లు వ్యవహరించేవారు. దానికి కారణం అంతవరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తనను రాజగురువుగా భావించి, నిత్యం సంప్రదింపులు చేస్తూ ఆయనను సంతృప్తిపరుస్తుండేవారు. 1989-1994 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, అప్పుడు వచ్చిన ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డిలతో మరీ ఈ స్థాయిలో గొడవపడేవారు కారు. వారు కూడా చూసి చూడనట్లు పోతుండేవారు. రామోజీ మీడియాకు వారు కొంత భయపడేవారు. 1994లో ఎన్.టి.రామారావు అంత మెజార్టీతో అధికారంలోకి వస్తారని రామోజీ ఊహించలేదు. అయినా ఎన్టీఆర్ భారీ ఆధిక్యతతో అదికారంలోకి రావడంతో కొద్దికాలం సర్దిపెట్టుకున్నారు. కానీ, ఆ తర్వాత పరిణామాలలో ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతిని సాకుగా చూపుతూ ఆయనను దారుణంగా చిత్రీకరిస్తూ వ్యంగ్య కార్టూన్లు వేయించేవారు. చంద్రబాబుకు కొమ్ముకాసి ఎన్టీఆర్ను దించడంలో రామోజీ తనదైన పాత్రను పోషించారు. అప్పటి నుంచి తానే షాడో ముఖ్యమంత్రి అన్నట్లు సంతోషపడుతుండేవారు. ఆయనకు ప్రభుత్వపరంగా ఏది కావాలన్నా ఎదురులేని పరిస్థితి సృష్టించుకున్నారు. ఆ పరిస్థితిలో చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీని ఓడించి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చారు. ఎందువల్లో వైఎస్ పట్ల మొదటి నుంచి అంత సానుకూలంగా ఉండేవారు కాదు. అయినా వైఎస్సార్ పెద్దగా పట్టించుకోకుండా, తన పని తాను చేసుకుపోయేవారు. కాకపోతే ఆ రెండు పత్రికలు అంటూ విమర్శలు చేసేవారు. వాటికి పోటీగా కాంగ్రెస్కు కూడా ఒక పత్రిక ఉండాలని, ఒక టీవీ ఉండాలని తలపోశారు. అందుకు అనుగుణంగా ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి మీడియాను ఏర్పాటు చేశారు. అది రామోజీకి పుండుమీద కారం చల్లినట్లయింది. తన మీడియాకే పోటీకి వస్తారా అన్న అహంభావంతో వైఎస్ ప్రభుత్వంపై చెలరేగడం ఆరంభించారు. చివరికి సీఎంగా ఉన్న వైఎస్సార్పై ఒక సంపాదకీయం రాస్తూ ‘ఉల్టా చోర్, కొత్వాల్ కో డాంటే’ అంటూ హెడింగ్ పెట్టి వైఎస్ను ఘోరంగా అవమానించారు. అదే తరుణంలో రామోజీ మార్గదర్శి ఫైనాన్షియర్స్తో జరుగుతున్న అక్రమ డిపాజిట్ల సేకరణపై అప్పట్లో ఎంపీగా ఉన్న ఉండవల్లి అరుణకుమార్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో రివర్స్ కథ మొదలైంది. రామోజీ అంతవరకు తాను ఏమీ తప్పు చేయడం లేదన్నట్లుగా ప్రజల దృష్టిలో పడుతూ, మరోవైపు అక్రమంగా డిపాజట్ల సేకరణకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని బహిర్గతం చేయడంలో ఉండవల్లి సఫలం అయ్యారు. అయితే, తీసుకున్న డిపాజిట్లను రామోజీ సకాలంగా చెల్లిస్తున్నారుగా అన్న ప్రచారం జరిగేది. కానీ, అసలు డిపాజిట్లు సేకరించడమే అక్రమమని, నేరమని ఆర్బీఐ ప్రకటించడంతో రామోజీ తన టీవీ చానళ్లు కొన్నిటిని విక్రయించి సుమారు 2600 కోట్ల రూపాయల డిపాజిట్లను తిరిగి చెల్లించవలసి వచ్చింది. అది ఆయనకు మరింత ఆగ్రహం తెప్పించింది. 2009లో రాజశేఖరరెడ్డి అనూహ్యంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడంతో ఈ కేసుకు బ్రేక్ పడింది. ఆయన తర్వాత వచ్చిన రోశయ్య, కిరణ్ కుమార్రెడ్డిలు రామోజీతో రాజీపడిపోయారు. అంతలో రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్తో రామోజీ స్నేహం చేస్తూ, కాదు.. కాదు... భజన చేస్తూ.. తన ఆస్తులవైపు, తన సంస్థల లావాదేవీల వైపు రాకుండా చూసుకోగలిగారు. అదే సమయంలో విభజిత ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అవడంతో ఆయనకు ఎదురులేకుండా పోయింది. చంద్రబాబును భుజాన వేసుకుని వైఎస్ కుమారుడు జగన్మోహన్రెడ్డి యువకుడు అన్న ఆలోచన కూడా లేకుండా దాడి ఆరంభించారు. సోనియాగాంధీ, చంద్రబాబులకు రామోజీ తోడై సీబీఐ పెట్టిన అక్రమ కేసులపై తన మీడియా ద్వారా విపరీత వ్యతిరేక ప్రచారం చేసేవారు. అయినా.. జగన్మోహన్రెడ్డి మాత్రం వీరిని పట్టించుకునేవారుకారు. 2014 ఎన్నికలలో రామోజీ మీడియా చేసిన అబద్దపు ప్రచారం కొంత పనిచేసింది. కారణం ఏమైనా జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాలేకపోయారు. అయినా ఆయన పట్టువదలకుండా రాజకీయాలు నడిపారు. అది ఈనాడుకు నచ్చలేదు. జగన్మోహన్రెడ్డిని దెబ్బతీశాం కదా అనుకుంటే మళ్లీ కెరటంలా లేస్తున్నారని గమనించారు. 2019 ఎన్నికల ముందు కూడా జగన్మోహన్రెడ్డిపై దారుణమైన కథనాలు అల్లారు. కానీ, జనం నమ్మలేదు. రామోజీ రాతలను ఖాతరు చేయకుండా ప్రజలు ముఖ్యమంత్రిగా జగన్కు పట్టం కట్టారు. అప్పటి నుంచి మళ్లీ రామోజీలో అసూయ పెరిగింది. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయనపై దాడి ఆరంభించారు. కొంతకాలం ఓపికగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేచి చూసింది. అయినా రామోజీ తన వైఖరిని మార్చుకోకుండా, ఈనాడు మీడియాను టీడీపీ ప్రచార బాకాగా వాడడం ఆరంభించారు. అంతవరకు అయితే ఫర్వాలేదు. సీఎం జగన్పై ఉన్నవి, లేనివి కలిపి పచ్చి అబద్దాలు రాయడం ఆరంభించారు. ఈ దశలో మార్గదర్శి చిట్స్లో జరిగిన అక్రమాలు, అక్రమ డిపాజిట్ల వసూలు కొనసాగించడం సీఐడీ దృష్టికి వెళ్లి, వారు రంగంలో దిగారు. దాంతో ఒక్కసారిగా రామోజీ బిత్తరపోయారు. తాను ఎవరికి దొరకనని, ఎవరూ తన జోలికి రావడానికి సాహసం చేయరని అనుకునే రామోజీరావుకు ముఖ్యమంత్రి జగన్ రూపంలో సవాల్ ఎదురైంది. మార్గదర్శి చిట్స్లో సభ్యుల చేరిక మొదలు, చిట్టీలు పాడుకున్నవారికి సకాలంలో చెల్లించకపోవడం, డిపాజిట్ల అక్రమ సేకరణ, నల్లధనం చలామణి మొదలైనవాటిని ఏపీ సీఐడీ కనిపెట్టడంతో రామోజీకి సినిమా మొదలైంది. చివరికి ఆయన సీఐడీ అధికారుల విచారణను ఎదుర్కున్నారు. అప్పటికీ న్యాయ వ్యవస్థలో తనకు ఉన్న పట్టుతో ఈ కేసులన్నీ వేగంగా సాగకుండా అడ్డుపడుతున్నారు. ఏపీ కేసులకు కూడా తెలంగాణ హైకోర్టులో స్టేలు తెచ్చుకుని తప్పించుకోచూస్తున్నారు. మార్గదర్శి చిట్స్లో సుమారు 800కోట్ల నల్లధనం లావాదేవీలు జరిగాయని సీఐడీ గుర్తించింది. చిట్స్ నిర్వహణలో నిబంధనలు పాటించడం లేదని అధికారులు గుర్తించడంతో ఏపీలో సంస్థ బ్రాంచ్లలో వ్యాపారం స్తంభించడం ఆరంభమైంది. టర్నోవర్పై దాని ప్రభావం పడింది. తాజాగా సాక్షిలో వచ్చిన కథనం ప్రకారం చిట్స్రూపేణా కాని, అక్రమ డిపాజిట్ల రశీదుల రూపేణా కాని సుమారు 4800 కోట్ల రూపాయల మేర బకాయిలు పడ్డారని అధికారులు అంచనా వేసినట్లు రావడం సంచలనాత్మకంగా మారింది. రామోజీ మరీ రెచ్చిపోయి, బరితెగించి వైఎస్ ప్రభుత్వంపై ఎందుకు ఇంత నీచంగా వార్తలు రాస్తున్నారు అని ఆలోచించేవారికి ఇప్పుడు సమాధానం దొరికినట్లయింది. తన వ్యాపార లావాదేవీల అరాచకాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం బహిర్గతం చేసిందన్న కోపం ఒకవైపు, మళ్లీ వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తే, తన ఆట కట్టినట్లే అవుతుందన్న భయం మరోవైపు రామోజీ బృందాన్ని వేటాడుతున్నాయి. దాంతో ఈనాడు మీడియాను పణంగా పెట్టి ముఖ్యమంత్రి జగన్పై విపరీతమైన ధోరణిలో విష ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు అదికారంలోకి వస్తే ఈ కేసులేవీ ముందుకు సాగవు అన్న భావన. అందుకే ఈ ఎన్నికలు చంద్రబాబుకన్నా, రామోజీకే అతి పెద్ద సవాలుగా మారాయనిపిస్తుంది. అంతే తప్ప తనపై వచ్చిన కథనాలకు సమాధానం ఇవ్వడానికి, మార్గదర్శిలో జరిగిన అవకతవకలకు సంజాయిషీ ఇవ్వడానికి బదులు సీఎం జగన్ ప్రభుత్వంపై దాడి చేయడాన్ని ఆయన మార్గంగా ఎంచుకున్నారు. నిజానికి జర్నలిజంలో ఒక సూత్రం ఉంది. తన సొంత వ్యాపార ప్రయోజనాలకోసం మీడియాను అడ్డు పెట్టుకోరాదు. ఆ పరిస్థితిని మనం ఆశించలేకపోయినా, ఒక రాజకీయ పార్టీని అనైతికంగా భుజాన వేసుకుని రామోజీ తన మీడియాను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై పచ్చి అబద్దాలు రాస్తూ సైకోయిజాన్ని ప్రదర్శిస్తూ సైతాన్ మాదిరి ప్రవర్తిస్తున్నారన్న విమర్శలను ఎదుర్కుంటున్నారు. అయినా ఈ విమర్శలన్నిటి కన్నా తన సంస్థపై వచ్చిన కేసులను కప్పిపుచ్చుకోవడానికి గాను ఆయన తన మీడియాను ఫణంగా పెట్టి మరీ దుష్ప్రచారం సాగిస్తున్నారని చెప్పాలి. అందుకే టీడీపీ గెలుపు చంద్రబాబుకన్నా, రామోజీకే ఎక్కువ అవసరంగా మారింది. అయినా ఆయన ఆశలు నెరవేరే సూచనలు కన్పించడం లేదు! -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
ఉత్తరాంధ్రపై ఉత్తమాటలెందుకు?
సాక్షి ప్రతినిధి, విజయనగరం : నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, 14 ఏళ్ల ముఖ్యమంత్రి పదవీకాలం ఉన్నా చంద్రబాబు ఏనాడూ ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టలేదు. ఇప్పుడున్న ప్రాజెక్టుల్లో అధిక శాతం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞం ఫలాలే. ఆయన అకాల మరణం తర్వాత మూడో దఫా అధికారం చేపట్టిన చంద్రబాబు.. ఆ ప్రాజెక్టుల పూర్తిపై చిత్తశుద్ధి చూపించలేదు. మొక్కుబడిగా నిధులు కేటాయించడమే తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడి పనులు అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. తన తండ్రి ఆశయాల మేరకు జలయజ్ఞం పూర్తిచేయాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే వీటిపై దృష్టి సారించారు. అయితే, కరోనాతో రెండేళ్లు వృధా అయ్యాయి. ఇక భూసేకరణలో ఇబ్బందులు, న్యాయవివాదాలు తలెత్తినా వాటన్నింటినీ అధిగమిస్తూ ప్రాజెక్టులను పూర్తిచేయాలనే లక్ష్యంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వీటన్నింటినీ విస్మరించి ‘ఈనాడు’లో రామోజీరావు ఎప్పటిలాగే విషంకక్కారు. ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులు ఈ దుస్థితిలో చిక్కుకుపోవడానికి చంద్రబాబు నిర్లక్ష్య పాలనే కారణమన్న విషయాన్ని మరుగునపరచడానికి ఆయన నానాపాట్లు పడ్డారు. ‘ఉత్తరాంధ్రంటే ఉత్తదనుకుంటివా?’ శీర్షికతో శుక్రవారం అవాస్తవాలను వండివార్చారు. ఇష్టారాజ్యంగా దగాకోరు రాతలు రాశారు. కానీ, వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రాజెక్టుల వారీగా ఈనాడు క్షుద్ర రాతలపై ‘ఫ్యాక్ట్చెక్’ ఏమిటంటే.. మడ్డువలస విజయనగరం జిల్లా వంగర మండలం మడ్డువలస వద్ద సువర్ణముఖి నదిపై నిర్మించిన ప్రాజెక్టు ప్యాకేజీ–1 పనులను డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే రూ.130.60 కోట్ల వ్యయంతో పూర్తిచేయించారు. తద్వారా 24,877 ఎకరాల మేర భూములు సస్యశ్యామలంగా మారాయి. మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో ప్యాకేజీ పనుల కోసం రూ.26.90 కోట్లను మంజూరు చేశారు. ఇందుకు అవసరమైన భూసేకరణ పనులు జరుగుతున్నాయి. వంశధార శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్టు పనుల పూర్తికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ. 2,407.79 కోట్లను మంజూరు చేసింది. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తయ్యాయి. రానున్న జూన్కల్లా పూర్తిచేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వంశధార ప్రాజెక్టు రెండో దశ పనుల కోసం 2004 నుంచి 2019 వరకూ అంటే 15 ఏళ్లలో రూ.1,614.82 కోట్లు ఖర్చుచేయగా, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019 నుంచి నేటివరకూ అంటే నాలుగేళ్ల 10 నెలల కాలంలో రూ.400.40 కోట్లు ఖర్చుచేసింది. అయినప్పటికీ ఒడిశా అభ్యంతరాలతో నేరడి బ్యారేజీ నిర్మాణంలో జాప్యం తప్పట్లేదు. ప్రాజెక్టును సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో గొట్టా బ్యారేజీ కుడికాలువపై ఎత్తిపోతల పథకం నిర్మించి హిరమండలం రిజర్వాయరులో 12 టీఎంసీల వరకూ నీటిని నింపాలనే భగీరథ ప్రయత్నానికి ప్రభుత్వం నడుంబిగించింది. 2022 సెప్టెంబర్ 14న రూ.176.35 కోట్ల నిధులను మంజూరుచేసింది. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయి. వచ్చే అక్టోబరు నాటికి ఇవి పూర్తికానున్నాయి. మహేంద్రతనయ శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రేగులపాడు వద్ద మహేంద్రతనయ నదిపై ఆఫ్షోర్ ప్రాజెక్టు నిర్మాణానికి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నాంది పలికారు. తర్వాత వచ్చిన చంద్రబాబు దీన్ని పూర్తిచేయడంపై చిత్తశుద్ధి చూపించలేదు. విపరీతమైన జాప్యంతో ఆ పనులను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రద్దుచేసి, సవరించిన అంచనాలతో రూ.852.45 కోట్లతో 2022 సెప్టెంబరు 14న పరిపాలన ఆమోదాన్ని ఇచ్చింది. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయి. జంఝావతి పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద 1976లో నిర్మాణ పనులను ప్రారంభించినా అంతర్రాష్ట్ర సమస్యతో జంఝావతి ప్రాజెక్టు పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. చంద్రబాబు తన పాలనలో ఏరోజు కూడా దాన్ని పూర్తిచేయడంపై దృష్టి పెట్టలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆసియాలోనే మొట్టమొదటి రబ్బర్ డ్యాంను అక్కడ నిర్మించి జాతికి అంకితం చేశారు. రెండో ప్యాకేజీ కింద కాలువ అభివృద్ధి పనులను ప్రస్తుతం రూ.3.26 కోట్లతో చేపడుతున్నారు. తారకరామతీర్థ సాగర్ ఈ ప్రాజెక్టుతో ముంపునకు గురయ్యే విజయనగరం జిల్లాలోని కోరాడపేట, ఏటీ అగ్రహారం, పడాలపేట గ్రామాల వారికి పునరావాస పనులు ప్రస్తుతం పురోగతి సాధించాయి. కొన్నేళ్లుగా సారిపల్లి గ్రామ ప్రజలు ఎదురుచూస్తున్న రూ.77 కోట్ల పునరావాస ప్యాకేజీకి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అనుమతులిచ్చింది. ప్రాజెక్టు నిర్మాణానికి 2006 నుంచి 2019 వరకూ రూ.166.80 కోట్లు.. భూసేకరణకు రూ.57.06 కోట్లు ఖర్చుచేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం 2019 నుంచి ఇప్పటివరకూ రూ.56.56 కోట్లను నిర్మాణ పనులకు, భూసేకరణకు రూ.25.33 కోట్లను ఖర్చుచేసింది. 2025 మార్చి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేసి విజయనగరం పట్టణ ప్రజలకు సమృద్ధిగా తాగునీరు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అవసరాలకు సరిపడా నీటి సరఫరా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనులు చేయిస్తోంది. తోటపల్లి ఉత్తరాంధ్రలో విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో 1,31,221 ఎకరాల ఆయకట్టుతో పాటు అదనంగా మరో 11,221 ఎకరాలను స్థిరీకరించేందుకు ఉద్దేశించిన తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు నిర్మాణానికి వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో పూర్తిస్థాయిలో నిధులు సమకూర్చారు. ఆయన మరణానంతరం చంద్రబాబు కేవలం ప్రారంభోత్సవం చేశారు. కనీసం పిల్ల కాలువల నిర్మాణాన్ని సైతం గాలికి వదిలేశారు. ఆ మిగులు పనులను ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టింది. రూ.123.21 కోట్లు మంజూరు చేసి పరిపాలనామోదాన్ని ఇచ్చింది. నేటి వరకూ 64.59 కోట్లను వెచ్చించారు. 2025 మార్చి నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గజపతినగరం బ్రాంచ్ కెనాల్ తోటపల్లి కుడి ప్రధాన కాలువ నుంచి గజపతినగరం బ్రాంచ్ కెనాల్, డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మాణానికి వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాల చిన్నచూపు ఫలితంగా పనులు పడకేశాయి. వీటిన్నింటినీ రద్దుచేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2022 ఏప్రిల్ 22న తాజా అంచనాలతో రూ.137.80 కోట్లతో మిగులు పనులు చేపట్టేందుకు పరిపాలనా అనుమతులిచ్చింది. ప్రసుత్తం భూసేకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. -
వైఎస్ తొలి సంతకానికి తొలి సాక్షి
నిలువెత్తు నిజాయితీ, నిబద్ధత, నిపు ణతకు మారు పేరుగా 32 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సేవ చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ మరణం అత్యంత విషాదకరం. ఆయన మృతి ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజ లకూ తీరని లోటు. పరిపాలనాధికారిగా ప్రజల సమస్యలు ఆయనకు కరతలామ లకం. జన చైతన్యానికీ, నాగరికతకూ, అభివృద్ధికీ ప్రజా జీవన ప్రమాణాల శీఘ్ర పురోగతికీ కేంద్రాలయిన నెల్లూరు, గుంటూరు జిల్లా లకు ఒకప్పుడు కలెక్టర్గా పనిచేసిన ఆయనఆ యా జిల్లాల పరిపాలనలో తనదైన ముద్ర వేశారు. విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిగా, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా, వ్యవ సాయ శాఖ కమిషనర్గా, ఎక్సైజ్ శాఖ కమిష నర్గా ఆయన తన అసమాన ప్రతిభను కన పర్చారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్గా పనిచేసే రోజుల్లో జిల్లాల వారిగా మద్యం వ్యాపారాన్ని రాజకీయ మాఫీయా ఏ విధంగా ప్రభావితం చేస్తున్నదో సవివరమైన నివేదికను రూపొందించి, అప్పట్లో సంచలనం సృష్టించారు. ఆయన రూపొందించిన నివేదిక అక్షర సత్యం అనేది నేటికీ రుజువవుతున్నది. వ్యవసాయ శాఖ కమిషనర్గా ఉమ్మడి రాష్ట్రంలో ఎరువుల కొరత లేకుండా ఆయన రూపొందించిన వ్యూహం సత్ఫలితాలు ఇచ్చింది. 2002 – 03లో ఉమ్మడి రాష్ట్రంలో నెలకొని ఉన్న తీవ్ర దుర్భిక్షం, కరువులను కేంద్ర పరిశీలక బృందానికి అత్యంత ప్రతిభావంతంగా వివ రించి కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టగలిగారు. ఎవరికైనా జన్నత్ హుస్సేన్ పేరు స్ఫురణకు రాగానే ఆయనలోని సౌమ్యత, ముఖంలో ఉట్టిపడే సౌహార్ద్రత కళ్లల్లో మెదలు తాయి. వినయ విధేయతలకు మారు పేరు అయిన హుస్సేన్ దివంగత ముఖ్యమంత్రులు కోట్ల విజయ భాస్కర రెడ్డి, ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి మన్నన పొందారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కాగానే అధికార గణం నుంచి తొలి ఎంపికగా జన్నత్ హుస్సేన్ను తన కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా నియమించుకున్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే యావత్ రాష్ట్ర రైతులందరికీ ఉచిత విద్యుత్ వరాన్ని ప్రసాదిస్తూ జన్నత్ హుస్సేన్ రూపొందించిన ఫైల్పై తన తొలి సంతకాన్ని చేశారు. హుస్సేన్ ఉచిత విద్యు త్ను గట్టిగా సమర్థించేవారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో రైతులకు నేటికీ ఉచిత విద్యుత్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆనాడు ఉచిత విద్యుత్ ఫైల్పై వైఎస్ఆర్ తొలి సంతకం చేసే చారిత్రక సన్ని వేశానికి తొలి ప్రత్యక్ష సాక్షిగా జన్నత్ హుస్సేన్ ఎప్పటికీ చరిత్ర పుటలలో మిగిలిపోతారు. ఆయన సీనియర్ ఐఏఎస్ అధికారిగా... చిత్తశుద్ధిగా పనిచేసే యువ ఐఎఎస్ అధికార్లను ప్రొత్స హించారు. అపోహలతో వారిని బదిలీ చేసినప్పుడు వారికి అండగా నిలిచి వారి బదిలీలను నిలిపి వేశారు. ఇంధన కార్యదర్శిగా ఆరంగం అభివృద్ధికి పాటు పడ్డారు. పదవీ విరమణ అనంతరం ప్రధాన సమా చార కమిషనర్గా ప్రజలకు ఉపయోగపడే ఎన్నో తీర్పులు ఇచ్చారు. ఇలాంటి మహో న్నతమైన వ్యక్తిత్వం కల జన్నత్ హుస్సేన్తో నాకు దశాబ్దాల అనుబంధం ఉన్నందుకు గర్విస్తున్నాను. ఈ గొప్ప పాలనా దక్షుడికి అశ్రు నివాళి అర్పిస్తున్నాను. - వ్యాసకర్త ‘బీఈఈ’ మీడియా ఎడ్వైజర్, నాటి సీఎం వైఎస్ ప్రెస్ సెక్రటరీ - ఎ. చంద్రశేఖర రెడ్డి -
మూడు దారులు..! ఎన్నో గుర్తులు..!!
"నడిచి పోయిన చరిత్రను రాయడం చాలా సులభం. నడుస్తున్న చరిత్రను రాయడం చాలా కష్టం. గతకాలపు చరిత్ర ఆకారాలు కష్టపడి సంపాదించాలి. అవి దొరికితే చరిత్ర రాయడం సులభం. వాటిని అధ్యయనం చేసి, వివరించి, ఒక నిర్ణయానికి రావడం, కొన్ని సూత్రీకరణలు చేయడం సులభం. ఆచరిత్ర నిర్మాతలు మన కళ్ళముందు ఉండరు. ఆ పాత్రలు మనతో మాట్లాడవు. మనం రాసింది వాళ్ళు చూడరు. నడుస్తున్న చరిత్రకు ఆకారాలు అపారంగా దొరుకుతాయి." ఆ చరిత్ర నిర్మాతలు మనకళ్ళముందు కదలాడుతుంటారు. మనతో మాట్లాడుతుంటారు. కలిసి జీవిస్తుంటారు. ఈ చరిత్రను తెలిసిన వాళ్ళుకూడా మన చుట్టూ ఉంటారు. ఈ ఆకారాలను ఏరుకొని, అధ్యయనం చేసి, వివరించి, సూత్రీకరించడం చాలా కష్టం. చారిత్రక వాస్తవాలు ఉటంకించడం సులభం. వాటిని వ్యాఖ్యానించడం కత్తిమీద సాము వంటిది. గత చరిత్ర రాసినవాళ్ళకు ఏ ప్రశ్నలూ ఎదురుకావని కాదు. అయితే వాటికి సమాధానం చెప్పడం సులభం. నడుస్తున్న చరిత్ర రాసినవాళ్ళకు చాలా ప్రశ్నలు ఎదురౌతాయి. వాటికి సమాధానాలు సమకూర్చుకోవడం అదనపు శ్రమ. గత చరిత్రను రాయడంలో విషయలోపమున్నా, విధానంలోపమున్నా అనంతరకాలంలో సవరించుకోవచ్చు. నడుస్తున్న చరిత్ర రచనలో ఆ రెండు లోపాలు ఉంటే సమాజంలో తక్షణస్పందన రచయితను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. నడిచి పోయిన చరిత్రతో చరిత్ర రచయితకు సయోధ్య లేకపోయినా చెప్పడం సులభం. నడుస్తున్న చరిత్రతో రచయితకు సయోధ్య కుదరని సందర్భాలను వ్యాఖ్యానించడం అంత సులభం కాదు. సృజనసాహిత్యంలోనైతే రచయిత కల్పనను గొప్ప ఆయుధంగా వాడుకొని గట్టెక్కవవచ్చు. చరిత్ర రచనలో కల్పనకు అవకాశమే లేదు. చరిత్రలో రచయిత చరిత్రంతా చెప్పాలి. చరిత్ర తప్ప ఇంకేమీ చెప్పకూడదు. దేవులపల్లి అమర్ గారు ఇవన్నీ తెలిసినవారు. ఆయన రాసిన "మూడు దారులు" నడుస్తున్న చరిత్ర. ఆ చరిత్రకు కారకులు మనందరికీ తెలిసినవారు. మనం చూసిన వాళ్ళు. మన ముందు ఉండినవారు, ఉన్నవారు. వాళ్ళ సమాచారం గుట్టలకొలదీ లభిస్తున్నది. అమర్ గారు ఆ సమాచారం గుట్టలు తవ్వి తాను రాయదలచుకున్న చరిత్ర రచనకు అవసరమైన అంశాలను జాగ్రత్తగా ఎన్నుకొని వాస్తవిక దృక్పథంతో ఈ రచన చేశారు. వాస్తవాల విజ్ఞానం, వాస్తవిక దృష్టి, వాస్తవాభివ్యక్తినిబద్ధత, నిస్సంకోచం ఈ గ్రంథంలోని విశేషాలు. నాలుగున్నర దశాబ్దాలలో తెలుగునాట రాజకీయరంగాన్ని నడిపిన ముగ్గురి జీవితాల వ్యాఖ్యానం ఈ గ్రంథం. చరిత్రకారులు మేధావులు. సద్దలు తిని సద్దలు విసర్జించరు. సామాజిక వాస్తవాలను జీర్ణించుకొని సామాజిక వాస్తవికతను మనకందిస్తారు. అమర్ గారు ఈ పని ఫలవంతంగా చేశారు. చరిత్రలో రచయిత ఆమోదించే అంశాలు చెప్పడం సులభం. ఆమోదం లేని అంశాలను చెప్పడానికి చిత్తశుద్ధి ఉంటే చాలదు. నిజాయితీ ఉండాలి. దానికి మించి ధైర్యం ఉండాలి. ధైర్యం ఎందుకంటే అనామోద ఆంశాలను చెప్పినప్పుడు అనేక పార్శ్వాలనుండి అనేక సవాళ్ళు ఎదురౌతాయి. వాటికి సమాధానం చెప్పడానికి, వాటిని ఎదుర్కోవడానికి ధైర్యం అవసరం. అమర్గారిలో ఈ గుణాలు ఉన్నాయి. చరిత్రలో చరిత్ర రచయిత ఆమోదించినవీ, ఆమోదించనివీ ఆ రచయిత వ్యక్తిగత అభిరుచులుగా ఉండకూడదు. వాటికి కూడా ఒక హేతుబద్ధత, ప్రామాణికత ఉండాలి. అవి సామాజిక సత్యాలని రుజువుచేసే సత్తా చరిత్రకారునికుండాలి. అమర్ గారిలో అవి ఉన్నాయి. 1978లో తెలుగు నాట రాజకీయ రంగప్రవేశం చేసిన డా. వై యస్ రాజశేఖరరెడ్డిగారు, నారా చంద్రబాబు నాయుడుగారు, వాళ్ళ తర్వాత 2004లో రాజకీయాల్లోకి వచ్చిన వైయస్ జగన్మోహన్రెడ్డిగారు.. ఈ ముగ్గురి వ్యక్తిత్వాలను, జీవితాలను, పాలనా విధానాలను మూడు దారులుగా నిర్వచించి, విస్తరించి రాశారు అమర్ గారు. రాజకీయాలలో విశ్వసనీయతా విశ్వసనీయతలు, నిబద్ధానిబద్ధతలు ఎలా ఉంటాయో రుజువు చేశారు. ప్రజాస్వామ్యయుగంలోకూడా భూస్వామ్య యుగ రాజకీయ స్వభావం, ఎత్తుగడలు ఎలా కొనసాగుతున్నాయో అమర్ గారు చక్కగా వివరించారు. సాధారణంగానే రాజకీయ చరిత్ర ఎత్తుగడలు మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఎత్తుగడలు ప్రజానుకూలంగా ఉంటే పాలన ఎలా ఉంటుందో, ప్రజావ్యతిరేకంగా ఉంటే పాలన ఎలా ఉంటుందో అమర్గారు దృష్టాంతాలుతో స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వ్యాపారబుద్ధి చొరబడితే పాలన ఎంత ప్రజాకంటకంగా ఉంటుందో, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో కూడా అమర్గారు నిరూపించారు. చరిత్రకారునికి విషయం పరిజ్ఞానం ఉండడం ఎంత ముఖ్యమో, విషయ వ్యక్తీకరణ సామర్థ్యం ఉండడం కూడా అంతే ముఖ్యం. అమర్గారిలో ఈ రెండు శక్తులు సమానస్థాయిలో ఉన్నాయి. మూడు దారులు గ్రంథం చదువుతుంటే నాలుగున్నర దశాబ్దాల తెలుగు నేల చరిత్ర మీద వచ్చిన ఒక నవలను చదువుతున్న అనుభవం, అనుభూతి కలుగుతాయి. సామాన్య పాఠకులకు కూడా వర్తమాన రాజకీయాలు ఎలా ఉన్నాయో ఈ గ్రంథం సులభంగా తెలియజేస్తుంది. – రాచపాళెం చంద్రశేఖరరెడ్డి -
వక్రీకరణల వంకరలు తీసే యత్నం
గమ్యం అదే అయినా గమనం ఎలా సాగింది? లక్ష్యం అదే అయినా పయనించిన దారులు ఏమిటి? చేరుకున్న తీరాలేమిటి? ఆయా నేతల వ్యక్తిత్వాలు, దృక్కోణాలు, పాటించిన విలు వలు, అవి తెలుగు జన జీవితాలపై, అభివృద్ధిపై వేసిన ముద్రలు ఏమిటి? విశాల ప్రజా హితానికి ఒనగూర్చిన ప్రయోజనాలేమిటి? చివ రకు చిట్టాలో మిగిలిందేమిటి? నిగ్గు తేలిన నిజా లేమిటి? జగమెరిగిన జర్నలిస్టు, పొలిటికల్ ఎనలిస్టు దేవులపల్లి అమర్... ఐదు దశాబ్దాల పాత్రికేయ అనుభవంతో, తెలుగు రాష్ట్రాల రాజకీయ, సామాజిక పరిణామాల ప్రత్యక్ష సాక్షిగా అనేకా నేక విషయాలను క్రోడీకరించుకుని వ్యయ ప్రయాసలతో వెలువరించిన పుస్తకం ‘మూడు దారులు’. రాజకీయ రణరంగాన భిన్న ధ్రువాలు అనేది ఉపశీర్షిక. ప్రధానంగా వైఎస్ రాజశేఖర రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాల వ్యత్యాసాలనూ, వారు అనుసరించిన రాజకీయ మార్గాన్నీ సమగ్రంగా, ఆసక్తి దాయకంగా విశ్లేషించారు. ‘ది దక్కన్ పవర్ ప్లే’ పేరిట ఇంగ్లీషులోనూ ఇదే పుస్తకాన్ని వెలువరించారు. సమకాలిక రాజకీయ చరిత్రలోని వక్రీకర ణల వంకర్లను సరిచేసి భావితరాలకూ, దేశ ప్రజానీకానికీ వాస్తవాలను అందించేందుకు ఈ పుస్తకంలో గట్టి ప్రయత్నమే చేశారు అమర్. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు 1978లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఒకే రోజు అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత వైఎస్ పూర్తిగా కాంగ్రెస్కే అంకితమై తన నాయ కత్వ సామర్థ్యంతో పార్టీని ముందుకు నడిపించి రాష్ట్ర సారథి అయ్యారు. ‘మాట తప్పడు, మడమ తిప్పడు’ అనే పేరూ పొందారు. సంక్షేమ పథకాల అమలులోనూ కొత్త పుంతలు తొక్కి ‘రాజన్న రాజ్యం’ అనే చెరగని ముద్ర వేయ గలిగారు. వై.ఎస్. చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర ఆయన ఆలోచనలనూ, వ్యవహార సరళినీ పూర్తిగా మార్చేసింది. మరోవైపు చంద్రబాబు నాయుడు రాజ కీయ జీవితం పూర్తిగా భిన్నమైనది. తనకు రాజ కీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి, మామ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి, చివరకు ఆ మామనే వెన్నుపోటు పొడిచి అధికారం హస్త గతం చేసుకున్న ఘన చరిత్ర ఆయనకే సొంతం. ఏ దశలోనూ తన బలంతో కాకుండా, పరాన్న జీవిలా ఇతర పార్టీల పొత్తులతో, జిత్తులతో నెట్టుకొస్తున్న ట్రాక్ రికార్డు చంద్రబాబుది. ఆయన ఏమిటో అమర్ ఇలా చెప్తారు: ‘జిత్తుల మారి రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరు. రాజకీయ సోపాన పటంలో పైకి పాకేందుకు ఆయన ఎంచుకున్న దారి ఇదే. తన ఎదు గుదలకు అడ్డువచ్చే వారిని సహించలేకపోవడం ఆయన బలహీనత. బంధువులైనా, స్నేహితు లైనా సామదాన భేదోపాయాలతో వారిని తన దారి నుంచి తప్పించగల రాజకీయ చతురత ఆయన సొంతం. ఆది నుంచి ఆయన అవ కాశవాద రాజకీయాల ఆసరాతోనే ఎదిగారన్నది సుస్పష్టం’. వైస్రాయ్ హోటల్ వేదికగా చంద్రబాబు నడిపిన వెన్నుపోటు కుట్రలను ఎంతో భావో ద్విగ్నంగా, ‘ఆ తొమ్మిది రోజుల్లో ఏం జరిగింది?’ అనే అధ్యాయంలో అమర్ పొందు పరిచారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ నిష్క్రియా పరత్వం, ముప్పు ముంచు కొస్తున్నా పసిగట్ట లేకపోవడం గురించి కూడా వివరంగా రాశారు. చంద్రబాబును దొడ్డిదారిన అధికారంలోకి తేవడంలో ఎంతో మంది పత్రికాధిపతులు, ఎడి టర్లు పోషించిన పాత్రను కూడా నీళ్లు నమలకుండా చెప్పారు. అప్పట్లో ‘ఆంధ్రప్రభ’లో బ్యూరో చీఫ్గా ఉన్నారు. జరిగింది జరిగినట్లుగా నివేదించేందుకు తన ఎడిటర్లను కన్విన్స్ చేయ డానికి అమర్ చేయని ప్రయత్నం లేదు. కానీ, అమర్ హిత బోధలను కీలక స్థానాల్లో ఉన్నవారు పెడచెవిన పెట్టడంతో ఉద్యోగ ధర్మంగా సర్దుకపోక తప్పని పరిస్థితులు. ఆ తదనంతర కాలంలో వైఎస్ ఆకస్మిక మరణంతో అనివార్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరికీ తలవంచక, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంతదారి నిర్మించుకున్నారు. తన తండ్రి వైఎస్ ఆశయాలూ, లక్ష్యాల బాటలోనే నడుస్తూ ప్రజా సంక్షేమం, అభివృద్ధిని జోడు గుర్రాల్లా పరు గులు తీయిస్తూ తండ్రికి మించిన తనయుడ నిపించుకుంటున్నారు. తెలుగువారి సమకాలిక రాజకీయ చరిత్ర లోని అసలు కోణాలనూ, వాస్తవాలనూ తెలుసు కోవాలన్న జిజ్ఞాస ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చదవవలసిన పుస్తకం ఇది. – గోవిందరాజు చక్రధర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
షర్మిలను నిలదీసిన వైఎస్సార్ అభిమాని
-
మూడు దారులు.. వేరు.. వేరే!
'ముగ్గురు ముఖ్యమంత్రుల్ని దగ్గరగా చూసే అవకాశం చాలా తక్కువ మందికే ఉంటుంది. అలా చూడాలంటే అయితే రాజకీయ నాయకుడైనా అయి ఉండాలి లేకపోతే పాత్రికేయుడైనా అయి ఉండాలి. దేవులపల్లి అమర్ నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న పాత్రికేయుడు కావడంతో రాజకీయాల్లో దిగ్గజాలనదగిన ముగ్గురు నాయకులను అతి సమీపంనుంచి చూసి, వారి నడతను, వ్యవహార శైలినీ, రాజకీయ పరిణతిని అంచనా వేసే అవకాశం దొరికింది.' రాసింది ముగ్గురు నేతల గురించే అయినా, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటునుంచి మొదలుపెట్టి, ఆంధ్రప్రదేశ్ అవతరణ మీదుగా సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన వరకూ తెలుగునాట చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను రచయిత విపులంగా కవర్ చేసే ప్రయత్నం చేశారు. రాజకీయాలపట్ల ఆసక్తి కనబరిచే ఈ తరానికి, ముఖ్యంగా యువతరానికి ఈ విషయాలన్నీ ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. (ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికైన టంగుటూరి ప్రకాశం పంతులు ప్రభుత్వం కాంగ్రెస్లో వేళ్లూనుకుపోయిన ముఠా సంస్కృతి కారణంగా కూలిపోయిందన్న సంగతి ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. ఇలాంటి విస్తుగొలిపే అనేక రాజకీయ పరిణామాల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది) అప్పటి పరిణామాల గురించి ఈనాటి యువతరానికి జరిగింది జరిగినట్లు చెప్పేందుకు చేసిన ఓ ప్రయత్నమే ఈ పుస్తక రచన అని రచయితే స్వయంగా పేర్కొనడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. వైఎస్ఆర్, చంద్రబాబుల గురించి విశ్లేషించే క్రమంలో వారిద్దరినీ రచయిత ఒక తాసులో ఉంచి తూచే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తుంది. ఒకప్పుడు స్నేహితులుగా, తర్వాత రాజకీయ విరోధులుగా మారిన ఇద్దరు అగ్రశ్రేణి రాజకీయ నాయకులను ఇలా తూచి తీర్పు చెప్పడం తప్పేమీ కాదు. పైగా అప్పట్లో జరిగిన అనేక రాజకీయ పరిణామాలకు రచయిత సాక్షిగా ఉన్నందువల్ల సాధికారికంగా ఇలా బేరీజు వేసే అర్హత ఆయనకు ఉంది. ‘అధికారం కోసం పార్టీ మారి, అందలం కోసం అయినవాళ్లకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు, రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చి తృటిలో తప్పిపోయినా అదే పార్టీలో కొనసాగిన వైఎస్ రాజశేఖర్రెడ్డికు ఏ విషయంలోనూ పోలిక లేదు’ అంటారు రచయిత. వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేందుకు జగన్ చేసిన ప్రయత్నాలనూ, అధిష్ఠానం తృణీకార ధోరణిని భరించలేక వేరు పార్టీ పెట్టిన వైనాన్ని కూడా పుస్తకంలో విశదంగా పొందుపరిచారు. పదహారు నెలలు జైలులో ఉండి, బయటకు వచ్చి ప్రజాభిమానంతో ఆయన ముఖ్యమంత్రి అయిన క్రమాన్ని ఆసక్తికరంగా రాశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లకు పైగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన చంద్రబాబు మీద రచయిత విమర్శనాస్త్రాలు సంధించినా వాటన్నింటినీ సహేతుకంగా, సాధికారికంగా విశ్లేషించారు. ముఖ్యంగా 1984లో నాదెండ్ల భాస్కరరావు కుట్ర, 1995లో చంద్రబాబు వెన్నుపోటు ఉదంతాలను సరిపోలుస్తూ, ఈ రెండూ సంఘటనలూ ఒకే రీతిలో జరిగినా నాదెండ్ల తిరుగుబాటు జరిగినప్పుడు ప్రజల నుంచీ, ప్రజాస్వామ్య పక్షాలనుంచీ, మీడియా నుంచీ ఎన్టీఆర్కు లభించిన మద్దతు 1995లో చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే లభించలేదంటారు. వెన్నుపోటు సంఘటనను వివరించేందుకు ‘ఆ తొమ్మిది రోజుల్లో ఏం జరిగింది?’ అంటూ రచయిత ఒక ప్రత్యేక అధ్యాయాన్నే కేటాయించారు. తొమ్మిది రోజులపాటు రోజువారీ చోటు చేసుకున్న పరిణామాల గురించి చదువుతున్నప్పుడు రచయిత మరోసారి పాత్రికేయుడిగా పరకాయప్రవేశం చేశారనిపిస్తుంది. అన్నీ తనవల్లనే జరిగాయని చంద్రబాబు చెప్పుకుంటూ ఉంటారన్న రచయిత.. అబ్దుల్ కలామ్ను రాష్ట్రపతి చేసింది తానేనని, ప్రధాని అయ్యే అవకాశం తనకు రెండుసార్లు వచ్చిందనీ, తానే ఒప్పుకోలేదని చంద్రబాబు చెప్పుకోవడాన్ని తప్పుపట్టారు. ఈ రెండూ అబద్ధాలేనంటూ తగిన సాక్ష్యాలతో నిరూపించే ప్రయత్నం చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలననూ సాధికారికంగా విశ్లేషించారు. ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలు విషయంలో జగన్ చిత్తశుద్ధిని, అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యం పాటిస్తూ, అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న జగన్ పాలనను వివరించడానికి రచయిత ఒక ప్రత్యేక చాప్టర్ను కేటాయించారు. ఫోటోల ఎంపికలో రచయితకు ఫుల్ మార్కులు పడతాయి. ఆంధ్ర రాష్ట్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల ఫోటోలు ప్రచురించడం మెచ్చుకోదగినది. ఒకప్పుడు కాంగ్రెస్లో చెట్టపట్టాలు వేసుకుని తిరిగిన వైఎస్ఆర్, చంద్రబాబు పక్కపక్కనే కూర్చుని ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఆకట్టుకుంటుంది. రాజకీయాల్లో అవినీతి, అక్రమాలపై, నీతిబాహ్యమైన చర్యలపై రచయితకు గల ధర్మాగ్రహం ఈ పుస్తకంలో ప్రతి పేజీలోనూ కనిపిస్తుంది. తప్పయితే తప్పనీ, ఒప్పయితే ఒప్పనీ బల్లగుద్ది చెబుతూ సాగే రచయిత శైలి ఆకట్టుకుంటుంది. ఇప్పటి తరానికే కాదు, భావితరాలకు కూడా తెలుగు రాజకీయ పరిణామాలపై ఈ పుస్తకం ఒక గైడ్లా ఉపయోగపడుతుంది. – బీ.ఎస్. రామకృష్ణ (బీ.ఎస్.ఆర్) ఇవి చదవండి: భారతరత్నకు ఎంపికైన ఐదుగురూ 'పంచరత్నాలు' -
షర్మిలను నిలదీసిన సామాన్యుడు
-
వ్యూహం ఫిక్స్
‘వ్యూహం’ సినిమా విడుదలకు రూట్ క్లియర్ అయింది. ఈ నెల 23న ఈ సినిమా విడుదల కానుంది. అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో రామ్గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘వ్యూహం’. దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా తొలి భాగం గత ఏడాది నవంబరు 10న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాను విడుదల చేసుకోవచ్చని సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇవ్వడంతో ఈ నెల 23న రిలీజ్ చేస్తున్నట్లు రామ్గోపాల్ వర్మ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణం తర్వాత రాజకీయ పార్టీలు ఎలాంటి వ్యూహాలు పన్నాయి? ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వంటి కథాంశంతో ‘వ్యూహం’ రూపొందింది. ఈ చిత్రంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో అజ్మల్ నటించారు. -
CBN: ఆ నవ్వు వెనుక అంత కథ ఉందా?
ఆ మధ్య చంద్రబాబు పబ్లిక్గా ఏడ్చారు. తప్పేం కాదు. మనిషి ఏడ్వొచ్చు. కానీ నాయకుడు ఏడ్వకూడదు. కనీసం ఏడ్చినట్లు కూడా కనిపించకూడదు. కానీ చంద్రబాబు తన ఏడుపును రాష్ట్ర ప్రజలంతా చూసేలా ఏడ్చారు. ఏడ్చి, ప్రజల సానుభూతి పొందాలని ప్రయత్నించారు. అభాసుపాలయ్యారు. ఆయన ఏడుపును ఎవరూ నమ్మలేదు. పైగా ‘‘హవ్వా’’ అని నవ్విపోయారు. నిజానికి చంద్రబాబు ఏడ్చే నాయకుడు కాదు. ఏడిపించే నాయకుడు కూడా. ఎన్టీఆర్ని అలాగే కదా ఏడిపించారు కదా. అసలు సిసలు చంబ్రాబును చూడాలంటే మీరు 2003 అక్టోబర్ 1వ తేదీకి వెళ్లి ఆగాలి. తిరుపతిలో అలిపిరి దగ్గర ఆరోజు ఆయనపై నక్సల్స్ దాడి జరిగింది. ఆయన దుస్తులు రక్తసిక్తం అయ్యారు. ఆయన బెదిరిపోయారు. నిజానికి అది బెదురు కాదు. ఆలోచన! ఆ ఘటనను ఎలా తనకు అనుకూలంగా మలచుకోవాలన్న ఆలోచన. గాయాల నుంచి ఇంకా కోలుకోకుండానే, తిరిగి అధికార బాధ్యతలు చేపట్టకుండానే ఆయన పన్నిన మొదటి వ్యూహం.. నక్సలైట్ల హింసాకాండను కారణంగా చూపి శాసన సభ రద్దుకు సిఫారసు చేయడం. ముందస్తు ఎన్నికలకు ప్లాన్ చేయడం! అయితే పీపుల్స్ వార్ గ్రూప్ రాజకీయాలే ప్రధాన అజెండాగా ఓటర్ల సానుభూతి కోసం ఆయన చేసిన ‘ముందస్తు’ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. తనపైన జరిగిన దాడి తెలుగుదేశం పార్టీకి సానుభూతి ఓట్లను సంపాదించి పెడుతుందని భావించిన చంద్రబాబు.. దాడి జరిగిన సరిగ్గా నెల రోజులకు నవంబరు 2న హైదరాబాద్లో ఉప ప్రధాని అద్వానీ, బీజేపీ అధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడుతో సమావేశం అయ్యారు. ముందస్తు ఎన్నికలపై మరోసారి ఆలోచించాలని కోరారు. (అప్పటికి నెల రోజులుగా ఈ ప్రతిపాదన తెస్తూనే ఉన్నారు.) కానీ ప్రధాని వాజ్పేయి ముందస్తు ఎన్నికలపై ఆసక్తి చూపకపోవటంతో అద్వానీ కూడా ఏమీ చేయలేకపోయారు. ఆ ఏడాది నవంబరు–డిసెంబరు నెలల్లో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ముందస్తు గురించి ఆలోచిద్దాం అని అద్వానీ ఆ విషయాన్ని దాటవేశారు. ఆ మర్నాడే చంద్రబాబు తన సన్నిహిత పార్టీ నేతలలో ముందస్తు గురించి చర్చించారు. టీడీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న వాస్తవం వారి చర్చల్లోకి వచ్చింది. రాష్ట్ర హోం మంత్రి దేవేందర్ గౌడ్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఎర్రన్నాయుడు, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి అశోక్ గజపతి రాజు, పార్టీ కోశాధికారి ప్రభాకర్ రెడ్డి, ఏపీ కె.రామ్మోహన్రావు చంద్రబాబు ముందస్తు ప్రతిపాదనపై ఏమీ చెప్పలేకపోయారు. చివరికి ‘దాడి’ని పక్కన పెట్టి, సంక్షేమ పథకాల ప్రచారంతోనే అసెంబ్లీ ఎన్నికలకు అది కూడా అవి జరిగినప్పుడే వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. 2004 మే నెలలో జరిగిన ఆ ఎన్నికల్లో ఏపీ ప్రజలు తమ నాయకుడిగా వై.ఎస్.రాజశేఖర్రెడ్డిని ఎన్నుకున్నారు. మొత్తం 294 స్థానాల్లో కాంగ్రెస్ 185 స్థానాల్లో విజయం సాధించింది. చంద్రబాబుకు సానుభూతి దగ్గకపోగా, ఘోర పరాజయానికి గురయ్యారు. ఆయన నాటకాలు కాంగ్రెస్కు చేదోడు అయ్యాయి తప్పితే, సైకిల్ని ముందుకు నడిపించలేకపోయాయి. చంద్రబాబు యాక్టింగ్ మామూలుగా ఉండదు. యాక్టింగ్ క్లాసులకు వెళ్లి మరీ తన యాక్టింగ్ను మెరుగు పరిచేందుకు 2004 ఎన్నికల ముందు ఆయనెంతో శ్రమ పడ్డారు. చంద్రబాబు ఎప్పుడూ నవ్వుతూ కనిపించరు. ఒకవేళ కనిపించారంటే ప్రతిపక్ష నేతల్ని ప్రజల ముందు ఎద్దేవా చేయడానికి నవ్వుతారు. 2004 ఎన్నికలకు ముందు ఆయనపై సొంత పార్టీ నాయకులే ఈ విమర్శ చేశారు. ఆయనెప్పుడూ బిగదీసుకుని ఉంటారని, ప్రజల్లోకి అది వ్యతిరేక సంకేతాలను తీసుకెళుతుందనీ! దాంతో చంద్రబాబు తనని తను మలుచుకోవాలనుకున్నారు. మలుచుకోవడమే, మార్చుకోవటం కాదు. ముఖం మీదకు నవ్వు రమ్మంటే ఊరికే వస్తుందా? యాక్టింగ్ చెయ్యాలి. చంద్రబాబు సహజ నటుడే కానీ, నవ్వును ముఖంపైకి తెప్పించడం ఆయన వల్ల కాలేదు. అందుకే ట్రైనింగ్ తీసుకున్నారు. సినీ, టీవీ రంగాల నుంచి నిపుణులను రప్పించుకున్నారు. మూడు రోజుల పాటు వారి నుంచి శిక్షణ పొందారు! ఉచ్ఛారణ, బాడీలాంగ్వేజ్, వస్త్రధారణ.. విషయంలో తనను తను మెరుగుపరుచుకున్నారు. ముఖం మీదకు నవ్వు తెప్పించుకోవటం కూడా ప్రాక్టీస్ చేశారు. 2004 సార్వత్రిక ఎన్నికల సన్నాహాలలో భాగంగా టీవీ చానెళ్లలో జరిగే చర్చగోష్ఠులలో పాల్గొన్నప్పుడు ఓటర్లను ఇంప్రెస్ చేయాలన్నదే ఆ శిక్షణ వెనుక ఉద్దేశం. అయితే ఆ ఉద్దేశం నెరవేరలేదు. ఆనాడు చంద్రబాబుకు పోస్టర్ల నాయకుడిగా కూడా పేరుండేది. అయితే ఆ ఇమేజ్ నగరాల్లో పనికొచ్చిందేమో కానీ, గ్రామాల్లోని ప్రజలు, ఓటర్లు ఈ నాటకాల నాయకుడిని తిరస్కరించారు. ప్రజలతో మమేకం అయి ఉన్న నాయకులే మనస్ఫూర్తిగా నవ్వగలరు. ఆ నవ్వు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిలో కనిపిస్తుందనే స్వయంగా టీడీపీ నాయకులే ఒప్పుకుంటారు. ఇవి చదవండి: AP: సంక్షేమం అంటే బాబుకు ‘సన్’క్షేమం : మంత్రి చెల్లుబోయిన -
18ఏళ్లు.. ఎన్నో మేళ్లు.. పథకానికి వన్నె తెచ్చిన వైఎస్సార్!
కడప సిటీ : జాతీయ మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకానికి ఫిబ్రవరి 2వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తవుతుంది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ పథకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమై అభివృద్ధిలో పరుగులు తీసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నీరు–చెట్టు పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఈ పథకాన్ని నిధులు దోచుకునేందుకు అవకాశం ఇచ్చారు. నాణ్యతకు తిలోదకాలిచ్చి.. నిధులు పక్కకు మళ్లించి.. కూలీలకు డబ్బులు సకాలంలో ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఈ పథకానికి నిధులు కేటాయిస్తుంటాయి. ఇదిలా ఉండగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ పథకంలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పనులు జియో ట్యాగ్ ద్వారా చేపట్టి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆధార్ అనుసంధానం చేసి కూలీల డబ్బులు చేతికి సక్రమంగా అందేలా డీబీటీ విధానాన్ని తీసుకొచ్చారు. 18 సంవత్సరాల కిందట ఈ పథకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది. అనంతపురం జిల్లాలో 2006 ఫిబ్రవరి 2న బండ్లపల్లెలో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభిచారు. దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన ఈ పథకం అభివృద్ధిలో పరుగులు తీసింది. తర్వాత చంద్రబాబు హయాంలో నత్తనడకన సాగింది. ఇదీ లక్ష్యం.. దేశంలోని పేద కూలీల బతుకులకు భద్రత కల్పించడంతోపాటు పస్తులు, ఆకలి చావులు, వలసలు, కరువులేని గ్రామీణ భారతం ఆవిష్కృరించేందుకు ఈ పథకం ఏర్పాటైంది. నైపుణ్యం, అవసరం లేని శారీరక శ్రమతో కూడిన పనులు చేసేందుకు ముందుకు వచ్చే వారందరికీ సంబంధిత కుటుంబానికి కనీసం ఏడాదికి 100 రోజులు పనిదినాలు కల్పించడం ప్రధాన లక్ష్యం. దీని ద్వారా నిరుపేదల్లో ఆర్థిక వృద్ధి పెరిగింది. మహిళల్లో సాధికారత, కూలీల కుటుంబాల్లో ఆత్మగౌరవం పెరిగింది. దివంగత నేత వైఎస్సార్ హయాంలో ఉపాధిహామీ పనులు పరుగులు తీసిన సందర్భాలు ఉన్నాయి. హార్టికల్చర్ ద్వారా పండ్ల తోటల పెంపకం, ఇందిర జలప్రభ ద్వారా ఎస్సీ ఎస్టీలకు చెందిన బీడు భూములను సాగుకు యోగ్యంగా మార్చారు. దీంతో వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి. నీటి సంరక్షణ, కాలువ పనులు, సాగునీటి సదుపాయాలకు అనుగుణంగా పనులు, భూమిని అభివృద్ది పర్చడం వంటి పనులు చేశారు. పనులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉపాధి హామీ అభివృద్ది పనులపై ప్రత్యేక శ్రద్ద వహించారు. ఎప్పటికప్పుడు ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం కూలీల డబ్బులు ఏ వారానికి ఆ వారం ఖాతాలో పడుతున్నాయి. ఆధార్ అనుసంధానం చేయడంతో కూలీల డబ్బులు పక్కదారి పట్టకుండా వారి చేతికి అందుతున్నాయి. డైరెక్ట్ బెనిఫిషరి ట్రాన్స్ఫర్ (డీబీటీ) విధానం వల్ల ప్రతి రూపాయి కూలీలకు చేరుతోంది. అంతేకాకుండా నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యతనిస్తున్నారు. చంద్రబాబు హయాంలో నిధులు పక్కదారి చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో ఉపాధి పథకం సక్రమంగా అమలు కాలేదన్న విమర్శలు ఉన్నాయి. నీరు–చెట్టు పేరిట టీడీపీ నాయకులకు వరంగా మారి నిధులు దోచుకునేందుకు అవకాశం కల్పించారన్న విషయంపై ప్రజలు అప్పట్లో మండిపడ్డారు. వాస్తవంగా ఈ పనుల్లో నాణ్యత లోపించి నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు.విచారణలో ఇది వాస్తవమేని నిర్ధారణ కావడం గమనార్హం. నిధులు పక్కదారి పట్టడం, కూలీలకు డబ్బులు సకాలంలో అందకపోవడంతో అప్పట్లో ఇబ్బందులు పడ్డారు. కుట్ర పూరితంగా టీడీపీ వ్యవహరిస్తోందన్న విమర్శలు కూడా వచ్చాయి. వేతనాలు భారీగా పెరుగుదల ఉపాధి ఉనికిలోకి రాకముందు ‘సీమ’, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కూలీల రోజు వేతనం రూ. 20 ఉండేది. ఈ చట్టం వచ్చాక కూలీల వేతనం గణనీయంగా పెరిగింది. కూలీలపై జరిగే ఆర్థిక దోపిడీ కనిష్ఠ స్థాయికి తగ్గిపోయింది. 2006–07లో పథకం ప్రారంభించిన సమయంలో రూ. 80 కనీస వేతనం కాగా, రూ. 77.67 వరకు వచ్చేది. 2010–11లో రూ. 121 కనీస వేతనం కాగా రూ. 91.76 వేతనం దక్కింది. 2015–16లో కనీస వేతనం రూ. 180 కాగా రూ. 131.42గా వచ్చేది. 2019–20లో కనీస వేతనం రూ. 211 కాగా, రూ. 210.10గా ఉంది. 2023–24లో ప్రస్తుతం కనీస వేతనం రూ. 272 ఉండగా, రూ.244.40గా అందుతోంది. దీన్ని బట్టి చూస్తే ప్రారంభంలో కనీస వేతనం రూ. 80 ఉండగా, ప్రస్తుతం ఈ మొత్తం రూ. 272కు చేరింది. పని అడిగిన 15 రోజుల్లోపల పని కల్పించకపోతే వారికి నిరుద్యోగ భృతి ఇవ్వాలని, పురుషులతోపాటు మహిళలకు సమాన వేతనం ఇవ్వాలని చట్టం ఉంది. అలాగే పని ప్రదేశాల్లో కూలీలకు, వారి పిల్లలకు అనేక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. కూలీలకు పనిని హక్కుగా కల్పిస్తూ ఈ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించారు. అభివృద్ధి పనులకు శ్రీకారం ఉపాధి పనుల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నాం. నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాం. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నాం.కలెక్టర్ విజయరామరాజు ఈ పథకంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఆయన సూచనల, సలహాల మేరకు ఉపాధిహామీలో మరింత అభివృద్ధి జరిగేందుకు అవకాశం ఏర్పడింది. – పి.యదుభూషణరెడ్డి, డ్వామా పీడీ, కడప -
యాత్ర-2 నుంచి ఎమోషనల్ సాంగ్ రిలీజ్
యాత్ర -2 నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ తెలుగు ప్రేక్షకుల గుండెలను తాకింది. ఆ టీజర్తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా నుంచి 'చూడు నాన్న' వీడియో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర'. ఈ సినిమాకు సీక్వెల్గా యాత్ర-2 ఫిబ్రవరి 8న విడుదల కానుంది. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2' ఉంటుంది. తాజాగా ఈ సినిమా నుంచి వీడియో సాంగ్ రిలీజ్ అయింది. 'చూడు నాన్న' అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ప్రముఖ గేయరచయిత భాస్కరభట్ల ఈ పాటకు అద్భుతమైన సాహిత్యం అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ఎమోషన్స్తో కూడిన సంగీతాన్ని అందించారు. ఈ పాటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాత్రలో జీవా తనదైన నటనతో మెప్పించారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఈపాట ఉండటంతో అందరినీ మెప్పిస్తుంది. తండ్రి మరణంతో మొదటిసారి ప్రజల్లో అడుగుపెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకే వేలాదిగా జనాలు వచ్చారు. ఆ సమయంలో జరిగిన కొన్ని ఘటనలను పాటలో చూపించారు డైరెక్టర్ మహి వి రాఘవ్.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
● జిల్లాలో వరుస చోరీలు ● తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ● ఆందోళన చెందుతున్న ప్రజలు ● నిఘా పెంచిన పోలీసులు
వసతులు కల్పించాలని హిందూవాహిని వినతి
ఏటా రెండులారీల కోడి ఎరువు
సేంద్రియ ఎరువులకు డిమాండ్
ప్యాసింజర్ రైళ్లు.. నిర్లక్ష్యం ఎన్నేళ్లు?
‘బీజేపీపై బురదజల్లే ప్రయత్నం’
జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ‘నలిమెల’
పత్తి విత్తనం.. ధరలకేదీ కళ్లెం?
రైతులకు జీలుగ విత్తనాల కష్టాలు
వామ్మో.. హోటల్ ఫుడ్
తప్పక చదవండి
- భారతీయుడు మళ్లీ వస్తున్నాడు.. అఫీషియల్ ప్రకటన
- తిరుపతి: చంద్రగిరిలో ఘోర ప్రమాదం
- మోదీని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలి: సీఎం నితీష్
- ఎవరు చంపారు..? ఎందుకీ దారుణం..?
- Lok Sabha Election 2024: ఆరో విడతలో 63.36 శాతం
- నేడు ‘హజ్ యాత్ర’ ప్రారంభం
- భారత్పే, ఫోన్పే మధ్య వివాదం పరిష్కారం
- రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
- IPL 2024: కోల్కతాకే కిరీటం
- గాలి బీభత్సం.. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం
Advertisement