-
రెండోసారి మోసపోతే మనదే తప్పు
సాక్షి, నాగర్కర్నూల్: కాంగ్రెస్ ఇచ్చిన అడ్డగోలు హా మీలకు ఆశపడి మొన్నటి ఎన్నికల్లో మోసపోయామని..రెండోసారి కూడా మోసపోతే తప్పు మనదే అవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్దతుగా బుధవారం కల్వకుర్తి, అచ్చంపేట, గద్వాల పట్టణాల్లో నిర్వహించిన రోడ్షోల్లో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లు గెలిస్తే ఆరు నెలల్లోనే కేసీఆర్ తిరిగి రాష్ట్రాన్ని శాసిస్తారని.. ఆ తర్వాత గుంపుమేస్త్రీ రేవంత్రెడ్డి ఇంటికి పయనం కావడం తప్పదని చెప్పారు. కాంగ్రెస్ రాగానే కన్నీళ్లు వచ్చాయి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే రైతులకు కన్నీళ్లు వచ్చాయని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వాన్ని నడపడం పాన్డబ్బా నడిపినట్టు కాదని, అందుకు పరిపాలనాదక్షత, దమ్మూధైర్యం ఉండాలని చెప్పారు. అరచేతిలో వైకుంఠం చూపి, మోసపు డైలాగులతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.రేవంత్రెడ్డికి గ్యారంటీలు అమలు చేయడం చేతకాక కేసీఆర్పై, తిట్లు.. దేవుడిపై ఓట్లు పెడుతున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో వృద్ధులు, రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులకు రాసిచ్చిన బాండ్లు బౌన్స్ అయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కరెంటు, నీటి కష్టాలు మొదలయ్యాయని చెప్పారు. నమో అంటే నమ్మించే మోసగాడు పదేళ్లలో ప్రధాని మోదీ తెలంగాణకు చేసిందేమిట ని ప్రశ్నించారు. కృష్ణాజలాల్లో వాటా తేల్చాలని అడిగితే ఒక్క ఉత్తరానికి సమాధానం చెప్పలేదన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయహోదా ఇవ్వని మోదీకి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. రాముడి గుడి కట్టినందుకే మోదీ ఓట్లు అడిగితే.. యాదాద్రి దేవాలయంతో పాటు ఆధునిక దేవాలయాలైన కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను కట్టిన కేసీఆర్ను మనం కాపాడుకోవాలని చెప్పారు. నమో అంటే నమ్మించి మోసం చేసేవాడని అన్నారు. ఐపీఎస్ అధికారిగా ఉండి అద్భుతాలు సృష్టించిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను ఎంపీగా గెలిపించాలని కోరారు. ఇలాంటి వ్యక్తి మళ్లీ దొరకరని చెప్పారు. ప్రవీణ్కుమార్ను పార్లమెంట్కు పంపితే తెలంగాణ గొంతు అక్కడ వినిపిస్తారని, ఆయన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. తెలంగాణకు కేసీఆర్ శ్రీరామరక్ష అని, ప్రశ్నించే గొంతుకను గెలిపిస్తే అన్ని పనులు అవుతాయని పేర్కొన్నారు. ఆయా రోడ్షోల్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అచ్చంపేట, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జైపాల్యాదవ్, తదితరులు పాల్గొన్నారు. -
బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆందోళన
● ఆస్పత్రి ఎదుట బందోబస్తు చేపట్టిన పోలీసులు ● ఆదుకుంటామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ● పోస్టుమార్టం అనంతరం కుటంబ సభ్యులకు మృతదేహాల అప్పగింత కల్వకుర్తి టౌన్: ఎమ్మెల్యే కారు బైక్ను ఢీకొట్టిన ఘటనలో దుర్మరణం పాలైన మృతుల కుటుంబాలను ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులతో పాటుగా వారి బంధువులు పట్టణంలోని పాలమూరు చౌరస్తాలో మంగళవారం ధర్నా చేపట్టారు. ఆస్పత్రి వద్ద జనం భారీగా గుమ్మిగూడటంతో పోలీసులు భద్రత పెంచారు. నరేష్(28) సోమవారం రాత్రి మృతిచెందటంతో అప్పటికే కల్వకుర్తిలోని సీహెచ్సీ మార్చురీకి మృతదేహాన్ని తరలించారు. హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతున్న పరశురాములు(35) సోమవారం అర్ధరాత్రి చికిత్స పొందుతూ మృతిచెందగా.. అతడి మృతదేహాన్ని అక్కడే ఉంచారు. ఇద్దరి మృతదేహాలను ఒక దగ్గరికి తీసుకొస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందని పరశురాములు మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలోనే పోస్టుమార్టం నిర్వహించారు. నరేష్ మృతదేహాన్ని సాధారణంగా మార్చురీలో ఉంచారని, ఫ్రీజర్ లేకపోవటంతో దుర్వాసన వచ్చిందని బంధువులు, కుటుంబ సభ్యులు కొద్దిసేపు ఆందోళన చెప్పారు. వెంటనే కల్వకుర్తి సీఐ నాగార్జున కలుగజేసుకొని వెంటనే ఫ్రీజర్ను తెప్పించి, మృతదేహాన్ని ఫ్రీజర్లో పెట్టించారు. రెండు కుటుంబాలకు చెందిన మృతుల బంధువులు అందరూ ఒక్కసారిగా మధ్యాహ్నం రోడ్డుపైకి వచ్చి ధర్నా చేపట్టారు. పోలీసులు అక్కడకు చేరుకొని సంబంధిత కాంగ్రెస్ నాయకులను పిలిపించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో వారు ధర్నా విరమించారు. ఆదుకుంటాం.. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మృతుల కుటుంబాలకు అండగా ఉండటమే గాక వారిని ఆదుకుంటామని ఎమ్మెల్యే నారాయణరెడ్డి హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ నాయకులు మృతుల కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఎమ్మెల్యే తన వ్యక్తిగతంగా నరేష్ కుటుంబానికి రూ.20 లక్షలు, పరశురాములు కుటుంబానికి రూ.30 లక్షలు సాయంగా అందిస్తామని తెలియజేయటంతో పాటుగా, వెంటనే వారి కుటుంబ సభ్యులకు తక్షణ సాయంగా వాటిని కల్వకుర్తి మాజీ సర్పంచ్ ఆనంద్కుమార్ ద్వారా వాటిని అందించారు. మృతుల కుటుంబ సభ్యులకు తక్షణ సాయంతో పాటుగా, వారికి భవిష్యత్లో అండగా ఉంటానని ఎమ్మెల్యే తెలియజేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డా.మల్లురవి వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీఇచ్చారు. ఆయన వెంట కల్వకుర్తి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జ్ ఇందిరాశోభన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ప్రమాద కారకులపై చర్యలు తీసుకోవాలి కల్వకుర్తి టౌన్: రెండు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చిన రోడ్డు ప్రమాద కారకులపై చర్యలు తీసుకోవాలని నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డా.ఆర్ఎస్. ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నరేష్(28) కుటుంబాన్ని రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలిశ్రీనివాస్ రెడ్డి, స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించి విచారం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా ఉంటూ కనీసం వేగాన్ని పాటించాలని తెలియకుండా ఇలాంటి ప్రమాదాలకు కారణమైతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. వాహనాన్ని నడిపిన డ్రైవర్తో పాటుగా అందులో ప్రయాణించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కుటుంబ సభ్యులకు రూ.కోటి తక్షణ సాయంగా అందించటంతో పాటుగా, వారి కుటుంబాలకు ఎప్పటికీ అండగా ఉంటామని హామీ ఇవ్వాలన్నారు. ఆయన వెంట కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ సత్యం, కడ్తాల జెడ్పీటీసీ దశరథ్ నాయక్ తదితరులు ఉన్నారు. -
కాంగ్రెస్తోనే వికలాంగుల సంక్షేమం..
సాక్షి, నాగర్కర్నూల్: కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రంలోని వికలాంగుల సంక్షేమం, అభివృద్ధికి బాటలు పడుతాయని రాష్ట్ర వికలాంగ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలో వికలాంగులతో భారీ బైక్ర్యాలీ నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, గీత కార్మికులకు మొదట పెన్షన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో వికలాంగుల సంక్షేమం కోసం ఆరు అంశాలను పొందుపర్చిందని తెలియజేశారు. వికలాంగులపై వివక్ష తొలగించేందుకు ప్రత్యేక చట్టాలను రూపొందిస్తామని, చత్తీస్ఘడ్ తరహాలో స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్లు అమలుచేస్తామని అన్నారు. ప్రత్యేక శాఖగా ఉన్న వికలాంగుల శాఖను సీ్త్ర, శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసిన చరిత్ర మాజీ సీఎం కేసీఆర్దని చెప్పారు. వికలాంగుల నేషనల్ ట్రస్టుకు చైర్మన్, కమిషనర్ను నియమించకుండా బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లుగా చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవిని గెలిపించాలని ఆయన కోరారు. రాష్ట్ర వికలాంగ కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య -
ఎన్నికల విధులపై అవగాహన అవసరం
నాగర్కర్నూల్: మైక్రో అబ్జర్వర్లకు ఎన్నికల విధులపై పూర్తి అవగాహన ఉండాలని.. అప్పుడే పోలింగ్ తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తారని నాగర్కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకుడు రుచేస్ జైవన్షీ, రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఉదయ్కుమార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. పోలింగ్ రోజున మాక్ పోల్ అనంతరం చేపట్టే పోలింగ్ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ ప్రక్రియ నిర్వహించేలా చర్యలు చేపట్టడంతో పాటు ఎప్పటికప్పుడు జనరల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని.. రహస్య పోలింగ్ కంపార్ట్మెంట్ సరిగ్గా ఏర్పాటు చేశారా లేదా అన్నది పరిశీలించాలని సూచించారు. ఎక్కడైనా సాంకేతిక లోపంతో మొరాయించే ఈవీఎంల స్థానంలో కొత్త ఈవీఎంల ఏర్పాటు.. ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ ఇతర అధికారుల విధులను గమనించాలని తెలిపారు. టెండర్, చాలెంజ్ ఓటింగ్లు జరిగితే, వాటి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. కాగా, పోలింగ్ ప్రక్రియ తీరుతెన్నులను పరిశీలించడం వరకే మైక్రో అబ్జర్వర్ల బాధ్యత అని.. ఎక్కడ కూడా పోలింగ్ విధుల్లో జోక్యం చేసుకోకూడదని తెలిపారు. 18 అంశాలకు సంబంధించిన నివేదికను ఎప్పటికప్పుడు జనరల్ అబ్జర్వర్కు నేరుగా పంపాలన్నారు. ఓటింగ్ గోప్యతను కాపాడే విధంగా మైక్రో అబ్జర్వర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. 385 మంది మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ.. జిల్లాలో రిజర్వు సిబ్బందితో కలిపి మొత్తం 385 మంది మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ ఇస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఉదయ్కుమార్ తెలిపారు. పోలింగ్ ప్రక్రియను గమనించడమే మైక్రో అబ్జర్వర్ల పాత్ర అని అన్నారు. ఎక్కడ ఏ చిన్న ఘటన చోటు చేసుకున్నా నిశితంగా పరిశీలించాలని.. ఏదేని ఘట న జరిగితే మైక్రో అబ్జర్వర్ల నివేదికలే కీలకమని అన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు విధులు నిర్వహించాలని సూచించారు. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమై.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందన్నారు. పోలింగ్ నిర్వహణలో ప్రతి అంశాన్ని మైక్రో అబ్జర్వర్లు నిశితంగా పరిశీలించాలని తెలిపారు. సమస్యాత్మక కేంద్రాలలో మరింత ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు ప్రభావితం చేయకుండా నిఘా ఉంచాలన్నారు. ఎన్నికల సంఘం గుర్తింపుకార్డు కలిగిన వారు, ఎన్నికల విధులు నిర్వహించే వారు మినహా.. ఇతరులకు పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతి లేదన్నారు. మైక్రో అబ్జర్వర్లకు కేటాయించిన కేంద్రాల్లో విద్యుత్, మంచినీరు, ఫర్నిచర్, వీల్చైర్, ర్యాంప్ వంటి మౌలిక వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 17–ఏ రిజిస్టర్ నిర్వహణ, పోలింగ్ ప్రక్రియపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎన్ని కల ట్రైనింగ్ జిల్లా అధికారి గోపాల్ పాల్గొన్నారు. నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ ప్రక్రియ నిర్వహించాలి ఎన్నికల సాధారణ పరిశీలకుడు రుచేస్ జైవన్షీ, రిటర్నింగ్ అధికారిఉదయ్కుమార్ -
నేడు కేటీఆర్ రోడ్షో
అచ్చంపేట రూరల్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అచ్చంపేటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రోడ్షో నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్ధతుగా సాయంత్రం 4 గంటలకు కేటీఆర్ రోడ్షో ప్రారంభమవుతుందని తెలిపారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అంతకుముందు మండలంలోని నడింపల్లిలో ఈదురు గాలులకు ఇంటి పైకప్పు రేకులు ధ్వంసమైన బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. కాగా, గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ప్రచారాలకు వెళ్తే దాడులకు యత్నిస్తున్నారని ఆరోపించారు. దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, అమీనుద్దీన్, రవీందర్రావు, శంకర్, కుత్బుద్దీన్ ఉన్నారు. విధి నిర్వహణలోఅప్రమత్తంగా ఉండాలి ఉప్పునుంతల: విధి నిర్వహణలో వైద్యసిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త (డీసీహెచ్ఎస్) డా.ఉమేష్ చంద్ర సూచించారు. మంగళవారం ఉప్పునుంతల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆస్పత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరాతీశారు. అనంతరం సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. వచ్చేనెల మొదటి వారంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ప్రారంభించడానికి కావాల్సిన పరికరాలు, ఇతర వసతులను తెలుసుకున్నారు. ఆస్పత్రిలో సాధారణ కాన్పుల సంఖ్య పెంచాలని చెప్పారు. సీహెచ్సీలో సరిపడా డాక్టర్లు, సిబ్బందిని నియామకానికి సంబంధించి కమిషనర్కు నివేదిక పంపించనున్నట్లు తెలిపారు. ఈఏడాది ఎండలు తీవ్రంగా ఉన్నందున ఆస్పత్రిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు. సమావేశంలో వైద్యాధికారులు రమాకాంత్, శివలీల, ఫార్మసిస్టు శ్రీనివాసులు, స్టాఫ్ నర్సులు ఉఫత్, వెంకటమ్మ, సిబ్బంది నజీర్ ఉన్నారు. ‘ఇండియా కూటమిదే విజయం’ కొల్లాపూర్: పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూట మి విజయం ఖాయమని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో సీపీఐ పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించగా.. మంత్రి జూపల్లితో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.బాల్నర్సింహ్మ హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ సర్కార్ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు లోపాయికారి ఒప్పందంతో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి ప్రజాసమస్యలు తెలిసిన వ్యక్తి అని.. ఆయనను గెలిపించుకుంటే ఇక్కడి సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషిచేస్తారన్నారు. కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుందామని సీపీఐ నాయకులను కోరారు. కాగా.. కేంద్ర, రాష్ట్ర కమిటీల నిర్ణయం మేరకు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు పార్టీ శ్రేణులు పనిచేయాలని సీపీఐ నాయకులు బాల్నర్సింహ్మ, ఫయాజ్ సూచించారు. సమావేశంలో ఏసయ్య, కిరణ్కుమార్, ఇందిరమ్మ, వెంకటస్వామి, యూసూఫ్, శ్రీనివాసులు ఉన్నారు. -
కొలతల ప్రకారం‘ఉపాధి’ పనులు చేపట్టాలి
తెలకపల్లి: ఉపాధిహామీ పథకం కూలీలకు రోజు రూ.300 కూలి వచ్చేందుకుగాను కొలతల ప్రకారం పనులు చేపట్టాలని డీఆర్డీఓ చిన్నఓబులేష్ అన్నా రు. మండలంలోని అనంతసాగర్లో ఉపాధి హామీ పథకంలో చేపట్టిన ఒండ్రుమట్టి తరలింపు పనులను మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా పని ప్రదేశంలో కూలీలకు కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. అనంతరం ఓటు హక్కుపై కూలీలకు అవగాహన కల్పించారు. ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్లో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎంపీడీఓ కృష్ణయ్య, ఏపీఓ మల్లేష్, బీఎస్ నారాయణమ్మ, ఈసీ రామస్వామి పాల్గొన్నారు. -
నల్లమలలోగుప్తనిధుల వేట
లింగాల: నల్లమల అటవీ ప్రాంతంలో గుప్తనిధుల వేట సాగుతోంది. పురాతన దేవాలయాలను లక్ష్యంగా చేసుకొని తవ్వకాలు చేపడుతున్నారు. తాజాగా అప్పాయపల్లి పరిధిలోని బెళ్లంతిప్ప పరిసర ప్రాంతంలో గుప్తనిధుల కోసం జేసీబీతో తవ్వకాలు జరిపారని స్థానికులు తెలిపారు. ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు వివిధ కారణాలు చూపుతూ, నల్లమల అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు తెలిసింది. ఆధునిక యంత్రాలను ఉపయోగిస్తూ గుప్తనిధుల వేట సాగిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై ఎఫ్ఆర్ఓ వీరేశంను వివరణ కోరగా.. గుప్తనిధుల కోసం తవ్వకాల విషయం తన దృష్టికి రాలేదని తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. -
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
ప్రఽదానంగా నారాయణపేట, కొడంగల్, వనపర్తి, దేవరకద్ర, మక్తల్, మహబూబ్నగర్, అచ్చంపేట, కొల్లాపూర్, నాగర్కర్నూల్ నియోజకవర్గాలకు చెందిన వేలాది మంది ఇతర ప్రాంతాలకు ఇక్కడి నుంచి వెళ్లి ఉపాధి పొందుతున్నారు. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 20 వేల వరకు వలస ఓటర్లు ఉన్నారు. నారాయణపేట నియోజకవర్గంలోని నారాయణపేటతో పాటు ధన్వాడ, దామరగిద్ద, కోయిలకొండ ప్రాంతాల్లో వలస కార్మికుల సంఖ్య గణనీయంగా ఉంది. మహబూబ్నగర్ జిల్లాలోని గండేడ్, మహమ్మదాబాద్, హన్వాడ మండలాలకు చెందిన తండాలవాసులు భారీగానే ఉన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు, కోస్గి, బొంరాస్పేట మండలాల ప్రజలు అత్యధికంగా ఇతర రాష్ట్రాల్లో ముంబై, బెంగళూరు, పుణె వంటి చోట్ల స్థిరపడి ఉన్నారు. వీరందరి ఓట్లు, ఆధార్, రేషన్కార్డులు సొంత గ్రామాల్లోనే ఉన్నాయి. ఎన్నికలు ఏవైనా వలస ఓటర్లు తమదైన శైలిలో గెలుపోటముల్లో ప్రభావం చూపుతున్నారు. పంచాయతీ, స్థానిక సంస్థలు, శాసనసభ ఎన్నికల్లో వీరిపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టిన ప్రధాన పార్టీలు ఈసారి లోక్సభ ఎన్నికల్లో మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. -
ఓటు వేయడం అందరి బాధ్యత
నాగర్కర్నూల్: ఓటుహక్కు అందరి బాధ్యత అని.. అర్హులైన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ కె.సీతారామారావు అన్నారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాగర్కర్నూల్ ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో సోమవారం ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో వందశాతం ఓటింగ్ లక్ష్యంతో ముందుకుసాగాలని తెలిపారు. క్రీడాకారిణికి అభినందన నాగర్కర్నూల్ క్రైం: ఇటీవల దుబాయ్లో నిర్వహించిన 21వ ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ 400 మీటర్ల పరుగుపందెంలో జిల్లా కేంద్రానికి చెందిన సాయిసంగీత ప్రతిభ కనబర్చి గోల్డ్మెడల్ సాధించింది. ఈసందర్భంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో సాయి సంగీతను ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అభినందించారు. భవిష్యత్లో ఒలంపిక్స్లో పాల్గొని దేశానికి మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రామేశ్వర్, డీసీఆర్బీ డీఎస్పీ సత్యనారాయణ, శ్యాంసుందర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. నల్లమలలో ఈదురుగాలుల బీభత్సం ● విరిగిన చెట్ల కొమ్మలు.. విద్యుత్ సరఫరాలో అంతరాయం అచ్చంపేట/అచ్చంపేట రూరల్ /ఉప్పునుంతల: నల్లమలలో సోమవారం పెద్దఎత్తున ఈదురుగాలులు వీచాయి. గాలుల ధాటికి చెట్లకొమ్మలు విరగడంతో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఉప్పునుంతలకు చెందిన తాళ్ల శేఖర్ పొలంలో వేసుకున్న రేకులషెడ్ ధ్వంసమైంది. అచ్చంపేట మండలంలోని కన్యతండాలో నాలుగు ఇళ్ల పైకప్పు రేకులు కొట్టుకుపోయాయి. సుమారు రూ. 2లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లిందని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తంచేశారు. వాతావరణంలో ఏర్పడిన మార్పులు కారణంగా ఆదివారం రాత్రి అమ్రాబాద్, పదర, అచ్చంపేట మండలాల్లో చిరుజల్లులు కురిశాయి. మరోవైపు భానుడి భగభగ.. మరోవైపు భానుడు నిప్పుల సెగలు రేపుతున్నాడు. ఏప్రిల్ 15వ తేదీ వరకు ఆరెంజ్ అలర్ట్లో ఉన్న ఉష్ణోగ్రతలు.. ఈనెల 2నుంచి రెడ్ అలర్ట్ స్థాయికి చేరాయి. సోమవారం వెల్దండలో 45.8, కల్వకుర్తిలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బిజినేపల్లిలో 44.8, కోడేరు, అచ్చంపేట మండలం ఐనోలు 44.6, పెద్దకొత్తపల్లి మండలం చెన్నపురావుపల్లి 44.4, వంగూరు మండలం కిష్టంపల్లి 44.1, కల్వకుర్తి మండలం వెలికల్ 43.9, వెల్దండ మండలం బొల్లంపల్లి 43.8, తాడూరు మండలం వెంగంపల్లి, కొల్లాపూర్ 43.5, బల్మూర్ మండలం కొండారెడ్డిపల్లి, పెద్దకొత్తపల్లి, అచ్చంపేట 43.3, ఉప్పునంతల మండలం వెల్టూర్ 43.1, ఉప్పునుంతల 42.9, చారకొండ మండలం సిర్సనగండ్ల 42.8, కల్వకుర్తి మండలం తోటపల్లి 42.7, బల్మూర్ మండలం కొండనాగులు, ఊర్కొండ, పెంట్లవెల్లి మండలం జట్రపోల్ 42.6, తెలకపల్లి మండలం పెద్దూరు, పాలెం 42.4, నాగర్కర్నూల్ 42.3, లింగాల, కుమ్మెర 42.1, బిజినేపల్లి మండలం మన్ననూర్, పెద్దముద్దునూర్, తెలకపల్లి 41.9, తిమ్మాజిపేట, తూడుకుర్తి, అమ్రాబాద్ 40.4, పదర 39.9, వట్టవర్లపల్లిలో 39.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
ఉమామహేశ్వర రిజర్వాయర్ను రద్దుచేయాలి
లేనిపక్షంలో పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తామని రైతుల తీర్మానం బల్మూర్: ఉమామహేశ్వర రిజర్వాయర్ అనుమతులను వెంటనే రద్దుచేయాలని.. లేనిపక్షంలో పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తామని రైతులు తేల్చిచెప్పారు. ఈమేరకు సోమవారం బల్మూర్లో రిజర్వాయర్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. అనంతరం కలెక్టరేట్కు చేరుకొని అధికారులకు తీర్మాన పత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ ఉమామహేశ్వర రిజర్వాయర్ నిర్మాణంతో అనంతవరం, బల్మూర్, మైలారం గ్రామాలకు చెందిన రైతుల భూములు సుమారు 2 వేల ఎకరాలు ముంపునకు గురవుతాయని తెలిపారు. రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా రిజర్వాయర్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంతో పాటు నిధులు మంజూరు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రిజర్వాయర్తో రైతులు రోడ్డున పడటంతో పాటు గ్రామాల ఉనికికే ముప్పు ఉంటుందన్నారు. రిజర్వాయర్ అనుమతులను రద్దుచేస్తేనే, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేస్తామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు అనంత సీతారాంరెడ్డి, ఉపాధ్యక్షులు తిరుపతయ్య, రాసమోని మహేష్, రేణు, ప్రధానకార్యదర్శి వర్కాల రాములు, నాగయ్య, జానకీ రాములు ఖదీర్, లాల్ అహ్మద్, బాలకృష్ణ, శివశంకర్ పాల్గొన్నారు. -
ఎన్నికల నిర్వహణలో పొరపాట్లకు తావివ్వొద్దు
కల్వకుర్తి టౌన్: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఉదయ్కుమార్ అన్నారు. పట్టణంలోని సీబీఎం కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్రూంలో ఈవీఎంల కమిషనింగ్ పక్రియను సోమవారం పరిశీలించారు. ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ వివరాలను తెలుసుకున్నారు. అనంతరం బీఈడీ కళాశాలలో పీఓ, ఏపీఓలకు ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. పోలింగ్ రోజున ఉదయం 5:30 గంటలకు మాక్పోల్ నిర్వహించి, నిర్ణీత సమయంలో పోలింగ్ ప్రారంభించాలని సూచించారు. పోలింగ్ కేంద్రా ల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 17సీ, పీఓ డైరీల నిర్వహణ, పోలింగ్ ప్రాసెస్ తదితర అంశాలను వివరించారు. ఓటరు స్లిప్పుల పంపిణీ వివరాలను ఏఆర్ఓ శ్రీనుతో తెలుసుకున్నారు. ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. పీయూలో సిలబస్ మార్పుపై సమీక్ష మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో బీఈడీ విద్యార్థులకు సిలబస్లో మార్పులు చేయడంపై సోమవారం అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పలు ప్రైవేటు బీఈడీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, బీఓఎస్లు, హెచ్ఓడీలతో పీయూ రిజిస్ట్రార్ మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సిలబస్లో మార్పులు చేపట్టిన నేపథ్యంలో అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు పలు చర్యలు తీసుకోవాలని సూచించారు. -
అసత్య ప్రచారం చేస్తే సహించం
బిజినేపల్లి: బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తనపై నిరాధర ఆరోపణలు, అసత్య ప్రచారం చేస్తే సహించనని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్రెడ్డి అన్నారు. నాగర్కర్నూల్కు నిజమైన ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అని, నకిలీ ఎమ్మెల్యే రాజేష్రెడ్డి అంటూ ఇటీవల ఆర్ఎస్పీ మాట్లాడటంపై మండిపడ్డారు. సోమవారం తిమ్మాజిపేటలో మండలస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మతితప్పి మాట్లాడుతున్నారని.. ఇదేవిధంగా ప్రవర్తిస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజలు తిరస్కరించిన వ్యక్తిని పక్కన పెట్టుకుని ఎలా తిరుగుతున్నావని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామన్నారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్కర్నూల్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ కుచుకూళ్ల దామోదర్రెడ్డి, జెడ్పీటీసీలు రోహిణి, సుమిత్ర, నాయకులు శ్రీనివాస్ బహదూర్, దానం బాలరాజ్, లక్ష్మీనారాయణ, ఉస్మాన్ రావూఫ్, దేవస్వామి, నాగసాయిలు, బెన్నీ, మనోహార్ తదితరులు ఉన్నారు. -
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
నడిగడ్డలోని బంగ్లా రాజకీయాలు అందరికీ తెలుసు. పొద్దున చెరొకవైపు ఉన్న వారు.. రాత్రయ్యే సరికి ఒకచోటికి చేరుతారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఒకటయ్యాయి. అదే బంగ్లా రాజకీయం ఈ ప్రాంతంలో నడుస్తోంది. అదే బంగ్లా రాజకీయానికి గుణపాఠం చెప్పి శాశ్వతంగా సమాధి కట్టాలి. కృష్ణా, తుంగభద్ర నది మధ్యలో ఉన్న నడిగడ్డ పౌరుషానికి, పోరాటానికి పెట్టింది పేరు. నడిగడ్డ బిడ్డలు ఎవరికై న మాట ఇస్తే తల తెగి కిందపడ్డా సరే ఆ మాట నుంచి ఒక్క అడుగు వెనుకేయరు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన మాట కోసం నిలబడతారు. 70 ఏళ్ల తర్వాత మన పాలమూరుకు తెలంగాణకు నాయక్వతం వహించే అవకాశం వచ్చింది. మన ప్రాంతంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ప్రధానంగా గట్టు, తుమ్మిళ్ల, ఆర్డీఎస్ ఆధునికీకరణ, ఎరవ్రల్లి చౌరస్తా నుంచి రాయచూరు వరకు నాలుగు లైన్లు, పాలమూరు–రంగారెడ్డి పూర్తి చేసుకోవడానికి మీరందరూ కాంగ్రెస్కు అండగా ఉండాలి. నాగర్కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవిని గెలిపించాలి. మీరందరూ డిసెంబర్లో కేసీఆర్ను ఓడించి పని అయిపోయిందని అనుకుంటున్నారు. డిసెంబర్లో జరిగిన ఎన్నికలు సెమీఫైనల్స్. ఈ నెల 13న ఫైనల్స్ తెలంగాణ వర్సెస్ గుజరాత్ మధ్య జరుగుతున్నాయి. గుజరాత్ను ఓడించి తెలంగాణను గెలిపించుకుందాం. – రేవంత్రెడ్డి, ముఖ్యమంత్రి -
No Headline
నేను భారత్ జోడోయాత్రలో నాలుగు వేల కిలోమీటర్లు నడిచాను. బీజేపీ దేశంలో మతవిద్వేషాలు రేకెత్తించింది. మనుషుల మధ్య చిచ్చుపెట్టింది. మేము విద్వేషాల బజారులో ప్రేమ దుకాణం తెరిచాం. విద్వేషాలతో ఏమీ రావు.. ప్రేమతో దేశం ముందుకెళ్తుంది. పేదల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. మోదీ ధనవంతుల కోసం సర్కారును నడుపుతాడు. దాని వల్ల దేశానికి మేలు జరగదు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలి. -
ఆశీర్వదించాలి..
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాహుల్గాంధీ ఐదు గ్యారంటీలు అందిస్తారు. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ప్రతి ఇంటికి 11 పథకాలు వస్తాయి. ప్రజలు తమ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని కేంద్రంలో పేదల ప్రభుత్వం ఎన్నుకునేలా కాంగ్రెస్ను ఆశీర్వదించాలి. – మల్లు రవి, నాగర్కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి -
కాంగ్రెస్లో జోష్..
వరుసగా కొత్తకోట, ఎర్రవల్లిలో జనజాతర సభలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/అలంపూర్: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్ అగ్రనేతల వరుస పర్యటనలతో ఆ పార్టీలో జోష్ నెలకొంది. కాంగ్రెస్ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డికి మద్దతుగా శనివారం కొత్తకోటలో రోడ్షో, కార్నర్ మీటింగ్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరైన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని గద్వాల జిల్లా ఎర్రవళ్లి చౌరస్తాలో నిర్వహించిన జనజాతర బహిరంగ సభకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతోపాటు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ క్రమంలో నేతలు పాలమూరుకు ఏం చేస్తారో వివరిస్తూనే ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించడం.. సభలకు భారీ ఎత్తున ప్రజలు తరలిరావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. ఎర్రవల్లి చౌరస్తాలో జరిగిన సభలో నాయకులు ఏమన్నారో వారి మాటల్లోనే.. ● భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు ● అగ్రనేత రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డి ప్రసంగానికి విశేష స్పందన ● పాలమూరుకు ఏం చేస్తారో వివరిస్తూనే ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు -
అంగన్వాడీల్లో విలవిల
అచ్చంపేట: రెండు నెలలుగా భానుడి భగభగ మండుతున్నాడు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి రికార్డు స్థాయిలో 46 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండలు మండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో పెద్దలే బయట తిరగలేకపోతున్నారు. పాఠశాలలకు సెలవులు ఇచ్చిన ప్రభుత్వం నిత్యం అంగన్వాడీలకు వెళ్లే చిన్నారులకు మాత్రం సెలవులు ఇవ్వకపోవడంతో ఏడాదంతా సెంటర్లు నడుపుతున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులతో పాటు వారికి సేవలు అందించే టీచర్లు, ఆయాలు, ఆరోగ్యలక్ష్మి కింద భోజనం చేయడానికి వచ్చే గర్భిణులు, బాలింతలు ఉక్కపోతతో విలవిలలాడిపోతున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కేంద్రాలు కొనసాగుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాలను ఒంటిపూట నిర్వహిస్తున్నప్పటికీ మధ్యాహ్నం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరేళ్లలోపు చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా విద్యాబోధన, పౌష్టికాహారం అందిస్తుండగా.. చిన్నారులు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఇరుకు గదులు.. కరెంటు, ఫ్యాన్లు కరువు.. జిల్లాలో 1,131 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. ఇందులో 908 ప్రధాన, 223 మినీ కేంద్రాలు ఉన్నాయి. 457 అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయి. 138 అద్దె భవనాల్లో కొనసాగుతుండగా.. 169 కమ్యూనిటీ హాళ్లు, 367 పాఠశాల ప్రాంగణాలో కొనసాగుతున్నాయి. సొంత భవనాలు ఉన్నా.. చాలా కేంద్రాల్లో కరెంటు సౌకర్యం లేదు. కరెంటు ఉన్న చోట ఫ్యాన్లు లేక ఎండ వేడిమికి చిన్నారులు తల్లడిల్లిపోతున్నారు. అద్దె భవనాలు, ఇరుకై న గదులు, వెలుతురు లేని చీకటి గదుల్లో చిన్నారులు సతమతమవుతున్నారు. కరెంటు, ఫ్యాన్లు లేని పరిస్థితుల్లో ఆరేళ్లలోపు చిన్నారులు అవస్థలు వర్ణణాతీతం. కొన్ని అంగన్వాడీ కేంద్రాలను ఒకే గదిలో నిర్వహిస్తూ.. అక్కడే వంట చేస్తుండటంతో గదుల్లో వేడి మరింత పెరుగుతోంది. తగ్గుతున్న హాజరు శాతం.. అంగన్వాడీ కేంద్రాలకు సెలువులు ఉండని కారణంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నెలలో 25 రోజులు పౌష్హికాహారం అందించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్రాలు తెరిచి ఉంచుతున్నారు. చాలా చోట్ల రోజురోజు పెరుగుతున్న ఎండలకు చిన్నారులు, గర్భిణులు, బాలింతలు కేంద్రాలకు రావడం తగ్గుతోంది. ఇంటికే పౌష్టికాహారం అందించాలనే డిమాండ్ వస్తున్న నేపథ్యంలో టీచర్లు, ఆయాలకు సమస్యగా మారింది. ఐసీడీఎస్ ప్రాజెక్టులు 05 జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు 1,131 చిన్నారులు 30,302 గర్భిణులు, బాలింతలు 10,277 ఇంటికి అందిస్తే మేలు.. వేసవి కాలంలో పాఠశాలలకు సెలవులు ఇచ్చినట్లుగా, అంగన్వాడీలకు సెలవులు ఇచ్చి, పౌష్టికాహారం ఇంటికి అందించేలా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. వేసవి ముగిసే వరకు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం ఇంటికి ఇవ్వడంతో ఇబ్బందులు తీరుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి ఇంటికి వెళ్లే వరకు నీరసించిపోతున్నారని, ఈ నెలాఖరు వరకు పౌష్టికాహారాన్ని ముందుగానే అందించాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉక్కపోతతో అల్లాడుతున్న చిన్నారులు కేంద్రాల్లో మౌలిక వసతులు కరువు ఫ్యాన్లు, కరెంట్కు నోచుకోని వైనం అధికారుల దృష్టికి తీసుకెళ్తాం.. అంగన్వాడీ కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఈ నెల నుంచి 15 రోజులు టీచర్, మరో 15 రోజులు ఆయాలు కేంద్రాల్లో అందుబాటులో ఉండి పౌష్టికాహారం అందిస్తారు. ఎండల నేపథ్యంలో సెలవులు, ఇంటికి పౌష్టికాహారం అందించే విషయం ఉన్నతాధికారులకు నివేదిస్తాం. – రాజేశ్వరీ డీడబ్ల్యూఓ నాగర్కర్నూల్ -
జనజాతర సభ సైడ్లైట్స్
● సాయంత్రం 4.42 గంటలకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక హెలీకాప్టర్లో పదో బెటాలియన్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ● 4.48 గంటలకు ప్రత్యేక కాన్వాయ్లో సభా ప్రాంగణానికి బయల్దేరారు. ● 5 గంటలకు రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డి సభావేదికపైకి చేరుకున్నారు. ● ముందుగా ఎంపీ అభ్యర్థి మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, మంత్రి జూపల్లి కృష్ణారావు, డిప్యూటి సీఎం మల్లు భట్టివిక్రమార్క, సీఎం రేవంత్రెడ్డి ప్రసంగించిన తర్వాత చివరలో రాహుల్గాంధీ మాట్లాడారు. ● రాహుల్గాంధీ ప్రసంగం 5.50 గంటలకు ముగిసింది. ● హెలీకాప్టర్లో 5.55 గంటలకు రాహుల్గాంధీ తిరిగి వెళ్లిపోయారు. ● జై కాంగ్రెస్ అని గట్టిగా నినదిస్తే బంగ్లాలో గుండెలు దద్దరిళ్లాలని సీఎం రేవంత్రెడ్డి కార్యకర్తలను ఉత్తేజపరిచారు. – అలంపూర్ /ఎర్రవల్లి చౌరస్తా/ మానవపాడు/ ఉండవెల్లి -
పక్కాగా పరిశీలన..
సాధారణంగా ఎన్నికలంటే విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి ఓటర్లను మభ్యపెడుతూ తమవైపు తిప్పుకునేందుకు నాయకులు శతవిధాల ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఈ అప్రజాస్వామ్యాన్ని అరికట్టేందుకు, ఎన్నికల్లో పారదర్శకత ఉండేందుకు ఎన్నికల కమిషన్ ఖర్చులపై నిబంధన విధించింది. ప్రతి రోజు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడెక్కడ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఎన్ని నిధులు ఖర్చు చేస్తున్నారనే దానిపై ఎప్పటికప్పుడు ఈసీ వ్యయ పరిశీలనతో పాటు కేంద్రం, రాష్ట్ర ఎన్పోర్స్మెంట్ సంస్థలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, నిఘా బృందాలు, వీడియో సర్వేలైన్స్ బందాలు సమాచారాన్ని సేకరిస్తాయి. అభ్యర్థుల ఖర్చులను పరిశీలించేందుకు ఆడిట్ బృందాలను ఏర్పాటు చేశారు. ఆయా పార్టీల అభ్యర్థులు నిర్వహించే సభలతోపాటు ర్యాలీలు, రోడ్షోలలో ఖర్చు చేసే కుర్చీల నుంచి భోజనం, టీ, కాఫీ వరకు అంతా లెక్కిస్తారు. అభ్యర్థుల ఖర్చు వివరాలపై పరిమితి ఉన్నా ప్రస్తుత ఎన్నికల్లో ఖర్చులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చేస్తున్నారా లేదా అనే విషయంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. -
‘బీజేపీ చెర నుంచి దేశాన్ని కాపాడుకుందాం’
కల్వకుర్తిరూరల్: దేశాన్ని బీజేపీ బందీఖానా నుంచి విముక్తి చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీజేపీ బందీఖానా పుస్తకాన్ని విడుదల చేశారు. బీజేపీ పాలనలో మాటలు, మూటలు తప్ప అభివృద్ధి లేదన్నారు. ఉద్యోగాలు పక్కన పెట్టి ఇంటింటికీ అయోధ్య అక్షింతలు ఇచ్చారని ఎద్దేవ చేశారు. అభివృద్ధిలో ఇతర దేశాలు పోటీ పడుతుంటే దేశంలో ధరల పేరుతో ప్రజల జీవిత విధానం అతలాకుతలంగా మారిందన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు దెబ్బతిన్నాయని నిరుద్యోగం, ధరలు పెరిగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మతోన్మాదాన్ని పెంచి ప్రజల మధ్య చిచ్చు రేపుతున్నారని నల్లధనాన్ని ఇంతవరకు వెనక్కి తీసుకురాలేదన్నారు. ఆకలిసూచిలో 111వ స్థానంలో మనం ఉండడం బీజేపీ పాలనకు నిదర్శనం అని అన్నారు. -
‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించాలి
పెద్దకొత్తపల్లి: ఉపాధిహామీ పథకం పనులు చేపట్టే కూలీలకు కనీస వసతులు కల్పించాలని డీఆర్డీఓ చిన్న ఓబులేష్ సూచించారు. శనివారం మండల కేంద్రంలో ఉపాధిహామీ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరమున్న కూలీలందరికీ పనులు కల్పించాలని ఆదేశించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని కూలీలకు పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. ఉదయం 7నుంచి 11 గంటల వరకు పనులను పూర్తిచేసుకోవాలని కూలీలకు సూచించారు. ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఉపాధిహామీ కూలీలందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు. డీఆర్డీఓ వెంట ఎంపీడీఓ నాగేంద్రం, ఏపీఓ మంజుల, మణిరాం ఉన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు నాగర్కర్నూల్ క్రైం: ఎన్నికల నిబంధనలను అతిక్రమించి నగదు, మద్యం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ రామేశ్వర్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తాలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ. 3లక్షల నగదును పట్టుకుని సీజ్ చేసినట్లు అడిషనల్ ఎస్పీ తెలిపారు. ఓటర్లు తమ ఓటుహక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేలా భరోసా కల్పించేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏఆర్ డీఎస్పీ చారి, ఆర్ఐ జగన్, ఆర్ఎస్ఐ గౌస్పాషా పాల్గొన్నారు. అడవిని నరికితే సహించం కొల్లాపూర్ రూరల్: అడవిని నరికితే సహించమని డీఎఫ్ఓ రోహిత్ గోపిడి అన్నారు. శనివారం మండలంలోని నల్లమల అడవిలో ఉన్న పవర్ గ్రిడ్ ప్రాజెక్టు ఏరియాలో నరికిన చెట్లను ఫారెస్ట్ రేంజర్ శరత్చంద్రారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా డీఎఫ్ఓ మాట్లాడుతూ అడవిని నరికిన వారిని గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రేంజర్ను ఆదేశించారు. అక్కడ కొత్తగా మొక్కలు నాటించి, పెంచాలని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డివి అసత్య ఆరోపణలు అచ్చంపేట రూరల్: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని సీఎం రేవంత్రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కట్టా సుధాకర్రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బూత్ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ మొదటి నుంచి పేదల పక్షమేనని.. ప్రజలకు ఇబ్బందులు కలిగించేవిధంగా ఎప్పుడూ వ్యవహరించ లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉన్నత పదవులతో సముచిత గౌరవం ఇచ్చినట్లు చెప్పారు. దేశ కీర్తిని అత్యున్నత శిఖరాలకు చేర్చిన నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానమంత్రిని చేయడానికి అట్టడుగు స్థాయి నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీ అత్యధిక స్థానాలలో గెలుస్తుందన్న నిజాన్ని తట్టుకోలేని సీఎం రేవంత్రెడ్డి.. అబద్దాలకు తెగబడి రిజర్వేషన్లు ఎత్తేస్తారని గగ్గోలు పెడుతున్నారని అన్నారు. సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మండికారి బాలాజీ, అసెంబ్లీ కన్వీనర్ రేణయ్య, మాహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు జానకి, గోపాల్ యాదవ్, రవీందర్, చందూలాల్, శివచంద్ర, రాజు, సునీతాచారి, మహేశ్వరి, మహేష్ ఉన్నారు. -
ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి
నాగర్కర్నూల్ క్రైం: నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈవీఎంల రెండోవిడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తిచేసినట్లు ఎన్నికల సాధారణ పరిశీలకుడు రుచేస్ జైవన్షీ, రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఉదయ్కుమార్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల సమక్షంలో ఈవీఎంల రెండోవిడత ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్స్ కేటాయించినట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తిచేసినట్లు వివరించారు. రెండోవిడత ర్యాండమైజేషన్కు సంబంధించిన హార్డ్, సాఫ్ట్ కాపీలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
మోదీ చుట్టంలాగా వస్తడు, పోతడు. పదేండ్లు ప్రధానమంత్రిగా ఉన్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్కు ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదు.. మాదిగల వర్గీకరణ చేయలేదు.. ముదిరాజ్లను ఆదుకోలేదు.. బోయలను ఎస్టీ జాబితాలో చేర్చలేదు? అరుణమ్మ గద్వాలను కదా.. బోయల గురించి ఆమెకు తెలుసుకదా ? వీళ్ల గురించి ఆమె ఎప్పుడైనా మాట్లాడిందా? తుమ్మిళ్ల, ఆర్డీఎస్ పూర్తి చేయాలని చూసిందా? జూరాల నీళ్లు రాకపోతే మాట్లాడిందా? భీమా నెట్టెంపాడు, కోయిల్సాగర్, రామన్పాడు మరమ్మతుల ఆలోచన చేసిందా? కానీ ఆమె మాత్రం బీజేపీలో జాతీయ ఉపాధ్యక్షరాలు పదవి తెచ్చుకుంది. ఆమెకు కర్ణాటకలో వ్యాపారాలకు ఇబ్బంది లేదు. ఏ రోజైనా ఈ జిల్లాకు సంబంధించి హైదరాబాద్–బెంగళూరు హైవేపై పరిశ్రమల కోసం మోదీతో మాట్లాడిందా? ఏ ప్రయత్నం చేయలేదు.. పరిశ్రమలు వస్తే వేలాది మందికి ఉద్యోగాలొచ్చేవి. ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు.. ఆలోచన చేయండి. సభలో నాగర్కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లురవి, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ జిల్లెల చిన్నారెడ్డి, ఢిల్లీలో అధికార ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, మహబూబ్నగర్ జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్రెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నె జీవన్రెడ్డి, ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి, వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజుయాదవ్ పాల్గొన్నారు. -
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
తాడూరు: కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని.. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఇంద్రకల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అన్నివర్గాల సంక్షేమం సాధ్యమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. దీనిపై ఎవరికీ ఎలాంటి సందేహం అవసరం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజ ల్లో లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక, బీఆర్ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షల వదంతులను తప్పికొట్టాలని పిలుపునిచ్చా రు. దేశ భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ రోహిణి, మల్లు రవి కుమార్తె శృతి, వల్లబ్రెడ్డి, మణెమ్మ, అనితారెడ్డి, గోవర్ధన్రెడ్డి, వెంకటయ్య, మల్లయ్య తదితరులు ఉన్నారు. -
మహిళలే నిర్ణేతలు
● మహబూబ్నగర్లో 50.53,నాగర్కర్నూల్లో 50.24శాతం మహిళా ఓటర్లు ● అభ్యర్థుల జాతకాలు తేల్చేది వీరే.. ● వారిని ప్రసన్నం చేసుకోవడానికిప్రయత్నిస్తున్న నేతలు మహబూబ్నగర్ డెస్క్: వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపోటములకు మహిళా ఓట్లే కీలకంగా మారాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్న నేపథ్యంలో ఎంపీ అభ్యర్థుల గెలుపును శాసించేది వీరే. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తాజా ఓటర్ల జాబితా ప్రకారం మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో 16,82,470 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 50.53 శాతంతో 8,50,172 మంది మహిళా ఓటర్లే ఉన్నారు. ఇక్కడ పురుషుల కంటే 17,916 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. నాగర్కర్నూల్ లోక్సభ స్థానంలో 17,38,254 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో కూడా 50.24 శాతంతో 8,73,340 మంది మహిళలు ఉన్నారు. ఇక్కడ పురుషుల కంటే 8,465 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. నాగర్కర్నూల్ లోక్సభ పరిధిలోని కొల్లాపూర్, కల్వకుర్తి సెగ్మెంట్ల పరిధిలో మినహా ఉమ్మడి జిల్లాలోని మిగిలిన 12 సెగ్మెంట్లలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్లు తేలింది.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
టీడీపీ నేతలు కలసి రాకపోవడంతో నైరాశ్యం
ఓటమి భయంతో వసంత బూతు పురాణం
సంక్షేమం వైఎస్సార్ సీపీతోనే సాధ్యం
మేనిఫెస్టో అమలు ఘనత వైఎస్ జగన్దే
వైఎస్సార్ సీపీలో కొనసాగుతున్న చేరికలు
మరోసారి సీఎం వైఎస్ జగన్ను ఆశీర్వదించండి
రూ.1000 కోట్లు దాటిన టాటా కంపెనీ లాభం
ఆఖరికి మోదీ కూడా..దిగజారుడు మాటలు ఎందుకు..?
సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబంలో సంతోషం
తప్పక చదవండి
- PK: 'పులుసు కారుతోంది'..!
- SRH: వాళ్లిద్దరు పిచ్ను మార్చేశారు.. అతడొక అద్భుతం!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- మా గురించి మాట్లాడేందుకు మీరెవరు?: వరలక్ష్మి శరత్కుమార్
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- Lok Sabha Election 2024: ఎన్నికల చరిత్రలో ఏకగ్రీవాలు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
Advertisement