సాక్షి మనీ మంత్రా: లాభాల ముగింపు.. తేరుకున్న సెన్సెక్స్‌, నిఫ్టీ | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్రా: లాభాల ముగింపు.. తేరుకున్న సెన్సెక్స్‌, నిఫ్టీ

Published Wed, Aug 9 2023 3:51 PM

today stock market closing update 9 august 2023 money mantra - Sakshi

Today Stockmarket Closing: నష్టాలతో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు తేరుకుని లాభాల బాటలోకి వచ్చాయి. బుధవారం సాయంత్రం ట్రేడింగ్‌ ముగిసే సమయానికి బాంబే స్టాక్‌ ఎక్స్చేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ 146 పాయింట్ల లాభంతో 65,993 పాయింట్ల వద్ద.. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ నిఫ్టీ 61 పాయింట్ల లాభంతో 19,632 వద్ద ముగిశాయి.

ఈరోజు ప్రధానంగా లాభపడిన కంపెనీలు జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా మోటర్స్‌, మహీంద్ర & మహీంద్ర, టెక్‌ మహీంద్ర, టాటా స్టీల్‌. ఇక టాప్‌ లూజర్స్‌ జాబితాలో బజాజ్‌ ఫినాన్స్‌, మారుతి సుజుకీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌ ఉన్నాయి.

ఇదీ చదవండి: ఈ రోజు బంగారం & వెండి ధరలు

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Advertisement
 
Advertisement
 
Advertisement