సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు

Published Wed, Jan 24 2024 9:59 AM

today stock market sakshi money mantra - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. మంగళవారం భారీ నష్టాలతో ముగిసిన బెంచ్‌మార్క్ సూచీలు బుధవారం కూడా నష్టాలతోనే సెషన్‌ను ప్రారంభించాయి. 

ఉదయం 9:26 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 160.80 పాయింట్లు లేదా 0.23 శాతం క్షీణించి 70,370.55 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 22.60 పాయింట్లు లేదా 0.11 శాతం నష్టంతో 21,216.20 వద్ద కొనసాగుతున్నాయి.

హిందాల్కో, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, ఎస్‌బీఐ,  కోల్‌ఇండియా షేర్లు టాప్‌ గెయినర్స్‌గా, యాక్సిస్‌ బ్యాంక్‌, హీరో మోటర్‌కార్ప్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐచర్‌ మోటర్స్‌, గ్రాసిమ్‌ షేర్లు టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
 
Advertisement