ప్రేమాయణంతో బయటపడ్డ నిత్యపెళ్లి కొడుకు వ్యవహారం | Sakshi
Sakshi News home page

ప్రేమాయణంతో బయటపడ్డ నిత్యపెళ్లి కొడుకు వ్యవహారం

Published Tue, Apr 23 2024 1:51 PM

Man Who Cheated Young Women In Name Of Marriage In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌: సుందరయ్య నగర్‌లో నిత్య పెళ్లి కొడుకు బాగోతం వెలుగులోకి వచ్చింది. ఒకరికి తెలియకుండా మరొకరిని మూడు వివాహాలు చేసుకున్న ఘనుడు.. మరో యువతితో తిరగడంపై మూడో పెళ్లికూతురు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

వరంగల్ నగరంలోని సుందరయ్య నగర్‌కు చెందిన రాజేష్ హైదరాబాద్‌లో కార్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఫిబ్రవరి 2022న నగరంలోని చార్ బౌలీకి చెందిన సుమన ప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత మే 2022న ఆంధ్రాకు చెందిన శ్రావణి హైదరాబాదులో రెండో పెళ్లి చేసుకున్నాడు. మూడు నెలల అనంతరం సుందరయ్య నగర్‌కు వచ్చిన రాజేష్ సుందరయ్య నగర్‌కు చెందిన సారికతో ప్రేమాయణం సాగించి 2024 ఫిబ్రవరిలో తీసుకెళ్లి హైదరాబాద్ ఆర్య సమాజంలో మూడో వివాహం చేసుకున్నాడు.

వీరి ముగ్గురిని వేరు వేరు చోట్ల అద్దెకు అద్దెకు ఉంచాడు. రాజేష్ ఇప్పుడు వీరి ముగ్గురిని కాదని కరుణ అనే యువతతో తిరుగుతుండడంతో నిన్న సుందరయ్య నగర్‌కు రావడంతో సారిక తల్లిదండ్రులు రాజేష్‌తో గొడవకు దిగడంతో వారి కళ్లు తప్పి రాజేష్ పరారయ్యాడు. సారిక తల్లిదండ్రులు డయల్ 100కు కాల్ చేయగా ఇంతే జారిగంజ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరికి విడాకులు ఇవ్వకుండా తన కూతురిని మూడో పెళ్లి చేసుకున్న రాజేష్‌పై చర్యలు తీసుకొని తన కూతురి జీవితాన్ని కాపాడాలంటూ సారిక తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Advertisement
Advertisement