కౌంటింగ్కు కౌంట్ డౌన్
కాకినాడ సిటీ: ఓట్ల లెక్కింపునకు కౌంట్ డౌన్ మొదలైంది. మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండటంతో సంబంధిత ఏర్పాట్లలో అధికారులు తలమునకలవుతున్నారు. ఈ ప్రక్రియలో పాల్గొనే సిబ్బందిని సిద్ధం చేసుకొనే పనిలో ఉన్నారు. వచ్చే నెల 4వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. కాకినాడ లోక్సభతో పాటు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు కాకినాడ జేఎన్టీయూలో ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ హాళ్లను అధికారులు ఇప్పటికే పరిశీలించారు.
సిబ్బంది నియామకం ఇలా..
ఓట్ల లెక్కింపునకు వివిధ హోదాల్లో ఉన్న 997 మంది సిబ్బందిని నియమించారు. ప్రతి టేబుల్ వద్ద సూక్ష్మ పరిశీలకులు, కౌంటింగ్ సూపర్వైజర్లు, ఇద్దరు సహాయకులను నియమిస్తారు. నాలుగో తరగతి ఉద్యోగులు, బ్లాక్ బోర్డు వద్ద వివరాలను నమోదు చేయడానికి.. ఇలా ప్రతిచోటా వివిధ కేడర్లలో సిబ్బందిని నియమించారు. వీరు కాకుండా పోలీసు సిబ్బంది కూడా కౌంటింగ్ భద్రతా విధుల్లో ఉంటారు. దీనికోసం 110 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. సిబ్బంది ర్యాండమైజేషన్ రెండు విడతలుగా చేపట్టారు. ఇప్పటికే ఒక విడత పూర్తి చేశారు. మరో విడత ర్యాండమైజేషన్ త్వరలో చేపట్టనున్నారు. కౌంటింగ్ విధులకు కేటాయించిన సిబ్బంది వివరాలను కలెక్టరేట్ నుంచి ఇప్పటికే పంపించారు. కౌంటింగ్కు కొద్ది గంటల ముందే వారు ఎక్కడ విధులు నిర్వహించాలనేది తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొనే సిబ్బందికి రెండు విడతలుగా శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే ఒక విడత పూర్తి కాగా, వచ్చే నెల 3న మలి విడత శిక్షణ ఇస్తారని అంటున్నారు.
భారీగా బందోబస్తు
ఫ కౌంటింగ్ సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.
ఫ స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ ప్రక్రియకు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా స్ట్రాంగ్ రూములను, కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జె.నివాస్, ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ నిత్యం తనిఖీ చేస్తున్నారు.
ఫ ఎస్పీ ప్రతి రోజూ రెండు పోలీస్ స్టేషన్లను తనిఖీ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు, అనంతరం జిల్లాలో పరిస్థితులపై పోలీసు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. సమస్యాత్మక గ్రామాలపై దృష్టి సారించాలని ఆదేశించారు.
ఫ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల సమీపాన ఎక్కడా వాహనాలు నిలపడానికి అనుమతి లేదు.
ఫ కౌంటింగ్ సందర్భంగా కాకినాడ నగరంలో కూడా జిల్లాలోని వివిధ సబ్ డివిజన్లకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బందితో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసేందుకు ఎస్పీ సతీష్ కుమార్ సన్నాహాలు చేస్తున్నారు.
ఫ హోటళ్లు, లాడ్జీలు అధికంగా ఉండే ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేయనున్నారు.
ఫ నగరంలోకి వచ్చే వాహనాలను నియంత్రిస్తారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటారు.
ఫ పోలీసు వాహనాలతో పాటు నిరంతర గస్తీ ఏర్పాటు చేస్తారు.
ఫ ఊరేగింపులకు, విజయోత్సవాలకు అనుమతి లేదు. ఫ ఓట్ల లెక్కింపునకు సన్నాహాలు
ఫ కౌంటింగ్ కేంద్రాల్లో విస్తృత ఏర్పాట్లు
ఫ 997 మంది సిబ్బంది నియామకం
ఫ పటిష్టంగా భద్రతా చర్యలు రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా
పాత నేరస్తులు, రౌడీ షీటర్లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. పోలీస్ స్టేషన్ల వద్ద ముందస్తుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. వారిలో ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకోవడంతో పాటు జిల్లా నుంచి బహిష్కరిస్తామని ఎస్పీ సతీష్ కుమార్ ఇప్పటికే హెచ్చరించారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికలు, 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో నేరాలకు, తగాదాలకు పాల్పడిన వారిపై నిఘా ఉంచారు. అభ్యర్థుల గెలుపు, ఓటములపై బెట్టింగ్లు నిర్వహించేవారు, పాల్గొనే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 14 నుంచి 19 టేబుళ్ల ఏర్పాటు
ఫ ఓట్ల లెక్కింపునకు అభ్యర్థుల సంఖ్య, పోలింగ్ కేంద్రాలు, పోలైన ఓట్లు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని 14 నుంచి 19 టేబుళ్లు ఏర్పాటు చేయనున్నారు. రిటర్నింగ్ అధికారికి ఒక టేబుల్ ఉంటుంది.
ఫ లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన పోస్టల్ బ్యాలెట్, సర్వీసు ఓట్లు, ఈవీఎం ఓట్ల లెక్కింపు ఒకేసారి ప్రారంభిస్తారు. ఈవీఎం ఓట్ల లెక్కింపునకు వేరుగా, పోస్టల్ బ్యాలెట్, సర్వీసు ఓట్ల లెక్కింపునకు వేరుగా టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే మాక్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నిర్వహించారు.
ఫ కౌంటింగ్ సందర్భంగా ర్యాండమ్గా కొన్ని వీవీ ప్యాట్లలోని స్లిప్పులు తీసి లెక్కిస్తారు. వాటిని ఈవీఎంలో పోలయిన ఓట్లతో సరి చూస్తారు. ఈ రెండింటి లెక్క సరిపోవాలి. అప్పుడే ఫలితాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే మరింత సమయం పట్టే అవకాశం ఉంది. దీనివలన కొన్ని నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కొంత ఆలస్యం కావచ్చని అధికారులు అంటున్నారు.
ఫ ఎప్పటికప్పుడు ఫలితాలను ప్రజలకు తెలియజేయడానికి అన్ని ఏర్పాట్లూ చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అభ్యర్థులు, పార్టీల ట్రెండ్ తేలిపోతుందని చెబుతున్నారు.
ఫ ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొత్తం వీడియో తీయిస్తారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటున్నారు.