-
కెనడాలో భారతీయుల అరెస్ట్.. ప్రధాని ట్రూడో కీలక వ్యాఖ్యలు
అట్టావా: భారత్, కెనడా దేశాల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. తాజాగా హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారత వ్యక్తుల అరెస్ట్పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందిచారు. ఈ సందర్భంగా ట్రూడో.. తమ దేశ పౌరుల భద్రతకు కట్టుబడి ఉన్నామని కీలక వ్యాఖ్యలు చేశారు.కాగా, కెనడాలో శనివారం సిక్కు సంస్కృతి, వారసత్వాన్ని గుర్తుచేస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రూడో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రూడో మాట్లాడుతూ..‘కెనడాలో చట్టబద్దమైన పాలన కొనసాగుతోంది. దేశపౌరుల రక్షణ, భద్రతకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. దేశంలో శక్తివంతమైన, స్వతంత్రతో కూడిన న్యాయవ్యవస్థ ఉంది. నిజ్జర్ హత్య తరువాత కెనడాలోని సిక్కు మతస్తులు అభద్రతకు లోనవుతున్నారు. హింస, వివక్షకు తావులేకుండా స్వేచ్ఛగా జీవించడం ప్రతీ కెనడా పౌరుడి హక్కు’ అంటూ కామెంట్స్ చేశారు.ఇక, అంతకుముందు ముగ్గురి అరెస్ట్పై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.శంకర్ మాట్లాడుతూ..‘ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు త్వరలో ఎన్నికలు జరగనున్న కెనడాలోని అంతర్గత రాజకీయాల కారణంగా తలెత్తుతున్నవేనని పేర్కొన్నారు. ఆ విషయాల్లో భారత్కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే, ఆ ముగ్గురికి ఏదో గ్యాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై కెనడా పోలీసుల నుంచి సమాచారం కోసం వేచి చూస్తున్నాం. కానీ నేను గతంలో చెప్పినట్టు వాళ్లు కెనడాలో వ్యవస్థీకృత నేరాలను కొనసాగనిచ్చారు. అదే మాకు ఆందోళన కలిగిస్తోంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
News about Hardeep Singh Nijjar, murder and S Jaishankarభారత్లోని అఫ్గనిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్దక్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనపై వ్యక్తిగత దాడులు, నిరంతర పరువునష్టం తన రాజీనామాకు కారణమని ఆమె పేర్కొన్నారు. మహిళా ప్రతినిధిని లక్ష్యంగా చేసుకొని తనపై దాడులు జరిగాయని వార్దక్ అన్నారు.ముంబైలో ఆఫ్ఘనిస్తాన్ కాన్సుల్ జనరల్గా ఉండటంతో పాటు న్యూఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్ తాత్కాలిక రాయబారి బాధ్యతలను కూడా జకియా వార్దక్ నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆమె ముంబై విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. దాదాపు రూ 18 కోట్ల విలువైన బంగారాన్ని ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నారు.దుబాయ్ నుంచి భారత్కు తన వస్త్రాల్లో తరలించారని, ముమ్మర తనిఖీలు చేయగా ఈ స్మగ్లింగ్ వ్యవహారం బయటపడిందని అధికారులు పేర్కొన్నారు. ముంబయిలో ఏప్రిల్ 25న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు జకియా వార్ధక్ శనివారం తెలిపారు.కాగా వార్ధక్ బంగారాన్నిఅక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు విమానాశ్రయంలో సిబ్బందిని మోహరించారు. ఏప్రిల్ 25న ఆమె తన కుమారుడితో కలిసి ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ నుంచి ముంబయికి చేరుకున్నారు. విమానం దిగిన తర్వాత గ్రీన్ ఛానల్ నుంచి ఎయిర్పోర్టు బయటకు వచ్చారు. దౌత్యవేత్త కావడంతో ఆమెును తనిఖీలు చేయలేదు. అయితే, ఎయిర్పోర్టు ఎగ్జిట్ వద్ద డీఆర్ఐ అధికారులు ఆమెను అడ్డుకున్నారు. తొలుత స్మగ్లింగ్ ఆరోపణల గురించి ప్రశ్నించగా.. ఆమె వాటిని తోసిపుచ్చారు. అనంతరం ఆమెను గదిలోకి తీసుకెళ్లి మహిళా అధికారులతో తనిఖీలు చేయించగా... ఆమె దుస్తుల్లో ఏకంగా 25 బంగారు కడ్డీలు బయటపడ్డాయి. ఒక్కో కడ్డీ బరువు కేజీ వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బంగారానికి సంబంధించి సరైన పత్రాలను ఆమె సమర్పించకపోవడంతో అధికారులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు.అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. సాధారణంగా ఇలాంటి స్మగ్లింగ్ కేసుల్లో అనుమానితులను వెంటనే అరెస్టు చేస్తారు. అయితే వార్ధక్కు దౌత్యపరమైన రక్షణ ఉండటంతో ఆమెను అదుపులోకి తీసుకోలేదు.News about Hardeep Singh Nijjar, murder and S Jaishanka -
పదేళ్ల తర్వాత దక్షిణాఫ్రికాతో టెస్టు
బెంగళూరు: భారత్లో దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టు పర్యటన ఖరారైంది. వచ్చే జూన్, జూలైలో పూర్థిసాయి ద్వైపాక్షిక సిరీస్లో భాగంగా భారత్తో దక్షిణాఫ్రికా ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్లు ఆడుతుంది. ముందుగా బెంగళూరులో జూన్ 16న వన్డే సిరీస్ మొదలవుతుంది. 19న రెండో వన్డే, 23న మూడో వన్డేతో 50 ఓవర్ల ఫార్మాట్ ముగుస్తుంది. వన్డే సిరీస్ ముగిశాక ఏకైక టెస్టు పోరు జూన్ 28 నుంచి చెన్నైలో జరుగుతుంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇది కేవలం మూడో టెస్టు కానుంది. దక్షిణాఫ్రికాలోని పార్ల్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్టు 2002లో... భారత్లోని మైసూరు వేదికగా రెండో టెస్టు 2014లో జరిగాయి. ఆ తర్వాత ఈ రెండు జట్లు టెస్టు ఫార్మాట్లో మరో మ్యాచ్ ఆడలేదు. దక్షిణాఫ్రికాతో ఆడిన రెండు టెస్టుల్లోనూ భారతే నెగ్గింది. ఏకైక టెస్టు ముగిశాక బెంగళూరులో ఈ రెండు జట్ల మధ్య జూలై 5, 7, 9 తేదీల్లో మూడు టి20ల సిరీస్ జరుగుతుంది. -
నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం
ప్రతి సంవత్సరం మే-3 న ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం జరుపుకుంటారు. మానవ హక్కుల ప్రాముఖ్యత, వాటిని పరిరక్షించడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, ప్రభుత్వాలు మంచి పాలనను అందించడంలో పత్రికారంగం కీలక పాత్ర పోషిస్తోంది.1993లో ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ మే-3 వ తేదీని ప్రపంచ స్వాతంత్య్ర పత్రికా దినోత్సవంగా ప్రకటించింది. 1991లో యునెస్కో 26వ సర్వసభ్య సమావేశంలో చేసిన సిఫారసుల తర్వాత ఈ ప్రకటన వెలువడింది. 1991 విండ్ హోక్ డిక్లరేషన్ ఫలితంగా కూడా ఈ ప్రకటన వచ్చింది. ఇది పత్రికా స్వేచ్ఛ గురించి ఆఫ్రికన్ పాత్రికేయులు తయారు చేసిన ప్రకటన. యునెస్కో నిర్వహించిన ఒక సెమినార్లో సమర్పించబడి మే-3న ముగిసింది. దీంతో ఆ రోజును పత్రికా స్వేచ్ఛ దినోత్సవంగా జరుపుకుంటారు.2023వ సంవత్సరానికి సంబంధించి పత్రికా స్వేచ్ఛ సూచికలో భారత్ 161 స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 400కి పైగా టీవీ న్యూస్ చానళ్లు ఉన్నాయి. పత్రికలైతే వేలల్లో ఉన్నాయి. ప్రాంతీయ ప్రతికా స్వేచ్ఛ సూచీలో నార్వే, ఐర్లాండ్, డెన్మార్క్మొదటి మూడు స్థానాల్లో ఉండగా చివరి స్థానంలో నార్త్ కొరియా ఉంది. -
టెక్సాస్ అమెరికా రాష్ట్రమా? ఇండియా రాష్ట్రమా?
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 28వ రాష్ట్రం టెక్సాస్. దీని రాజధాని ఆస్టిన్. జనాభారీత్యా చూసినప్పుడు ఆస్టిన్ 9.58 లక్షలు. దీని కన్నా ఇదే రాష్ట్రంలోని డల్లాస్ ( 13 లక్షలు ), సాన్అంటానియో ( 14.45 లక్షలు ), హుస్టన్( 23 లక్షలు ) నగరాల్లో ఎక్కువ జనాభా. అయినా చారిత్రక ప్రాధాన్యాన్నిబట్టి రాష్ట్రం మధ్యలో ఉండడం వల్ల ఆస్టినే రాజధాని అయింది. ఆస్టిన్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, స్టేట్ లెజిస్లేచర్, గవర్నర్, మంత్రుల చాంబర్లు ఉన్నాయి. యూనివర్సిటీ అఫ్ టెక్సాస్ ఉన్నది ఆస్టిన్లోనే. తప్పక చూడాల్సింది స్పేస్ సెంటర్..ఈ నగర జనాభాలో మూడింట ఒక వంతు హిస్పానిక్స్, ఆఫ్రికన్ / ఏసియన్ అమెరికన్లు. టెక్సాస్లోని అతి పెద్ద నగరమైన హుస్టన్ సిటీలో చూడదగ్గవి ఎన్నోఉన్నాయి. హుస్టన్ సిటీలో నేను మొదటగా చూసినవి అక్వేరియం, చిల్డ్రన్స్ మ్యూజియం లాంటివి. తప్పక చూడాల్సిన సందర్శనీయ స్థలాల్లో గాల్వెస్టన్ సముద్రతీరం, నాసా (NASA) వారి స్పేస్ సెంటర్ వంటివి. ప్రపంచంలో ఏ మూలన ఉన్న విద్యార్థి అయినా.. శాస్త్ర సాంకేతికత మీద, అంతరిక్షం మీద ఆసక్తి ఉంటే.. నాసా సెంటర్ చూడాలనుకుంటారు. లిండన్ బి. జాన్సన్ స్పేస్ సెంటర్ పేరిట హ్యూస్టన్లో నిర్మించిన NASA కేంద్రాన్ని స్పేస్క్రాఫ్ట్ సెంటర్ అని పిలుస్తారు. ఇక్కడ అంతరిక్షయాన శిక్షణ, పరిశోధన కేంద్రాలున్నాయి. ఈ కేంద్రానికి ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు లిండన్ బి. జాన్సన్ పేరు పెట్టారు. తటస్థ ప్రయోగశాల అంటే..దీన్ని నవంబర్ 1961లో పూర్తి చేశారు. క్లియర్ లేక్ ఏరియాలో 1,620 ఎకరాల్లో 100 భవనాల్లో నిర్మించిన ఈ కేంద్రంలో దాదాపు 3,200 మంది పని చేస్తున్నారు. ఇక్కడ ఉన్న మిషన్ కంట్రోల్ సెంటర్.. జెమిని 4 ( అపోలో , స్కైలాబ్ , అపోలో-సోయుజ్ మరియు స్పేస్ షటిల్తో సహా ) నుంచి ప్రతి అంతరిక్ష ప్రయాణాన్ని పరిశీలిస్తుంది. అంటే ఒక స్పేస్క్రాఫ్ట్ భూమి నుంచి దాని లాంచ్ టవర్ను క్లియర్ చేసిన క్షణం నుంచి తిరిగి భూమిపైకి తిరిగి వచ్చే వరకు దాని కంట్రోల్ను ఈ కేంద్రం పర్యవేక్షిస్తుంది. ఈ కేంద్రంలో ఆసక్తి ఉన్న వారికి అర్థమయ్యేలా ఎన్నో ఆకర్షణీయ ఏర్పాట్లు ఉన్నాయి. తటస్థ ప్రయోగశాల.. అంటే అంతరిక్షంలో ఉన్నట్టుగా గాలిలో తేలే వాతావరణాన్ని ఇక్కడ స్వయంగా తెలుసుకోవచ్చు. అలాగే సుమారు 6.2 మిలియన్ యూఎస్ గ్యాలన్ల నీళ్లు ఉన్న స్విమ్మింగ్పూల్లో వ్యోమగాములు జీరో గ్రావిటీని అనుకరిస్తూ శిక్షణ పొందుతారు. సందర్శకులను స్పేస్ సెంటర్ వరకు అనుమతిస్తారు. అక్కడ ఉంటే హైదరాబాద్లో ఉన్నట్లే..ఇక టెక్సాస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మరొకటి ఉంది. టెక్సాస్లో చాలా చోట్ల తెలుగు వాళ్లు కనబడతారు. డాలస్, హ్యూస్టన్, ఆస్టిన్ ఎక్కడయినా.. చూస్తూ ఉంటే హైదరాబాద్లో ఉన్నామా అనిపిస్తుంది. హైదరాబాద్ బిర్యానీ అయితే చాలా చోట్ల కనిపిస్తుంది. ఒక్క బిర్యానీనే కాదు, సీజన్లో హాలీం కూడా దొరుకుతుంది. ఇరానీ ఛాయ్, సమోసాలు, ఇడ్లీ-దోశ సెంటర్లు.. చూస్తూ ఉంటే సరదాగా అనిపిస్తుంది. ఒక్క భోజనమే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో దొరికే ఏ వస్తువు అయినా.. టెక్సాస్లో కొనుక్కోవచ్చు. జండూబామ్ నుంచి గోధుమ పిండి వరకు, బియ్యం, నుంచి బాదాంపప్పు వరకు ఏం కావాలన్నా సులువుగా దొరుకుతాయి. కిషోర్ పబరి ఇండియా బజార్, పటేల్ బ్రదర్స్ కిరాణ మార్కెట్, సరిగమప సూపర్మార్కెట్, సబ్జీ మండీలతో పాటు బంగారు, వజ్రాల దుకాణాలు బాగానే కనిపిస్తాయి. ఇండియన్ దుస్తులు పంజాబీ డ్రెస్ నుంచి లుంగీల దాకా అన్నీ దొరుకుతాయి. చాలా చోట్ల సంగీతం, భరత నాట్యం నేర్పే వాళ్లు, యోగా క్లాసులు, తెలుగు భాష, మ్యాథ్స్ క్లాసులు దర్శనమిస్తాయి. డాలస్ ఫోర్ట్ వర్త్ ఏరియాలో మనవాళ్లే టాప్. అన్నట్టు ఇక్కడ మనవాళ్లు అప్పుడే రియల్ ఎస్టేట్ను పీక్లోకి తీసుకెళ్లారు. అలాగే ఇండియన్ ఈవెంట్స్ కూడా. డాలస్ నగరాన్ని జలవనరుల ఆధారితంగా నిర్మించారు. ట్రినిటీ నది తెల్లరాళ్ళను దాటుతున్న ప్రాంతంలో ఈ సిటీ కట్టారు. నదికి ఇరువైపులా మట్టి గోడలను కట్టి ట్రినిటీ రివర్ ప్రాజెక్ట్ను ఏర్పాటు చేశారు. పార్క్లు, రెస్టారెంట్లతో వినోద విహార కేంద్రంగా మారింది. డాలస్ మొత్తం నగరం నదీతీరం పక్కనే.. దాదాపు 20 మైళ్ళు సిటీని ఆనుకుని నదీ తీరం ఉంటుంది. ప్రశాంతంగా రాజధానిడల్లాస్ ఓ రకంగా హైదరాబాద్ వాతావరణంలా అనిపిస్తుంది. హ్యూస్టన్లా గాలిలో తేమ ఉండదు. వేసవిలో చల్లదనం, చలికాలంలో వెచ్చదనం ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు. హుస్టన్ కాలుష్య వాతావరణంతో పోల్చుకున్నప్పుడు ఆస్టిన్ నాకు ప్రశాంతంగా తోచింది. ఒక రాష్ట్ర రాజధాని ఇంత సింపుల్గా ఉండడం గొప్ప విషయమే అనిపించింది. మొత్తం మీద టెక్సాస్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలను చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నామా.? అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ సారి అమెరికా వచ్చినప్పుడు ఓ సారి ఓ లుక్కేయండి. మీరే చెబుతారు.వేముల ప్రభాకర్(చదవండి: అమెరికావాళ్ళ మర్యాదలు అతిక్రమిస్తే కష్టాలు !)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement